Quarantine
-
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్లో ఉంచనున్నట్లు తెలిపింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు. నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా.. -
పీక్స్లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!
బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చైనా బుకింగ్ వెబ్సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. అంతమయ్యే లక్షణాలే! చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు. -
కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..
బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది. కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..
కరోనా పుట్టినిల్లు అయినా చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏళ్ల తరబడి క్వారంటైన్, లాక్డౌన్లతో మగ్గిపోయిన ప్రజలు ఆగ్రహంతో తిరబడే స్థాయికి వచ్చినా.. చైనా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మంకుపట్టు పడుతూనే ఉంది. ఇప్పుడుప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఆ మహమ్మారి నుంచి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ హాయిగా ఉంటున్నా...ఇంకా చైనా మాత్రం జీరో కోవిడ్ అంటూ కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది. ప్రజల్లో ఓపిక చచ్చి వీధల్లోకి వచ్చి నిరసనలు చేసినా... సైన్యంతో కట్టడి చేసింది. వారిని ఒక జంతువుల్లా బలవంతంగా నిర్బంధంలో ఉంచేందుకే యత్నించింది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని జిన్పింగ్ రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగానే గాక సోషల్ మీడియాల్లో సైతం నిరసన సెగలు ఊపందుకోవడంతో వెనక్కి తగ్గేంది. ఆఖరికి ప్రపంచ దేశాలు సైతం ఇంతలా కఠినా ఆంక్షలు విధించొద్దు అని సూచించినా.. తగ్గని చైనా లాక్డౌన్ ఆంక్షలను సడలించే ప్రయత్నం చేసింది. చైనా ప్రభుత్వం అనుహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న తరుణంలోనే కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభించింది. ప్రజలు ప్రయాణించేలా ఆంక్షలు సడలించిన తర్వాత కేసులు పెరగడంతో చైనా గుట్టుచప్పుడూ కాకుండా తన పాలసీని తనదైన శైలిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఏ వ్యక్తి అయినా కరోనా బారిన పడినట్లు తెలిస్తే చాలు అతని ఇంటి వద్దకు వచ్చేయడం క్యారంటైన్కి తీసుకుపోవడం వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని బలవంతంగా క్వారంటైన్కి తీసుకువెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హోం క్వారంటైన్లో ఉంటానన్న వినకుండా అదికారులు అతన్ని ఎలా బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మూడేళ్లు అయినా కరోన మహమ్మారీ కంటే అక్కడి ఆంక్షలతోనే చైనా ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్) -
క్వారంటైన్ ముగిసింది.. 24 గంటల్లోనే మట్టుపెట్టాయ్
షియోపూర్: నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తీసుకువచ్చిన చీతాలు వేట మొదలుపెట్టాయి. క్వారంటైన్ నుంచి పెద్ద ఎన్క్లోజర్లోకి విడుదల చేసిన ఫ్రెడ్డీ, ఆల్టన్ అనే రెండు మగ చీతాలు 24 గంటల్లోనే మచ్చల జింకను విజయవంతంగా వేటాడాయి. ఆదివారం రాత్రి లేదా సోమవారం వేకువ జామున వేటాడి ఉంటాయని అధికారులు చెప్పారు. అనంతరం రెండు గంటల్లోనే ఆహారాన్ని తినేశాయని చెప్పారు. వేటలోనూ ఇవి సత్తా చాటాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఉత్తమ్ కుమార్ శర్మ సోమవారం చెప్పారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి భారత్కు తీసుకు వచ్చిన 8 చీతాల మొట్టమొదటి వేట ఇదేనన్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్లను వదిలిన ఎన్క్లోజర్ విస్తీర్ణం 98 హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పారు. మిగతా వాటిని కూడా దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఎంతో ఉల్లాసంగా ఉన్నాయ్- ప్రధాని మోదీ -
జనంలోకి జిన్పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్పింగ్ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్పింగ్ మంగళవారం బీజింగ్లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర జరిగిందనీ, అధ్యక్షుడు షీ జిన్పింగ్ను నిర్బంధించారని వచ్చిన వార్తల్లో నిజానిజాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ వదంతులే కావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీవో శిఖరాగ్రం కోసం రెండేళ్ల తర్వాత దేశం దాటిన నేపథ్యంలో జిన్పింగ్ తిరిగి రాగానే క్వారంటైన్లో ఉండి ఉంటారని అంటున్నారు. 2021లోనూ జిన్పింగ్ కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇలాగే పుకార్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కాకపోతే శనివారమంతా ఇంటర్నెట్ ‘కుట్ర’ వార్తలతో హోరెత్తినా ఇలాంటి వాటిపై చురుగ్గా ఉండే చైనా సోషల్ మీడియా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు. బహుశా అక్టోబర్ 16వ తేదీన అధ్యక్ష ఎన్నిక నాటికే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఢిల్లీలో వెయ్యి కరోనా కేసులు
న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్డౌన్ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది. -
చైనాలో భయానక పరిస్థితులు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
బీజింగ్: కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. వివరాల ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా షాంఘైలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘర్షణకు దారి తీశాయి. పీపీఈ కిట్ ధరించి ఓ వీధికి వచ్చిన పోలీసులు.. అక్కడ ఉన్న నివాసితుల ఇండ్లను సరెండర్ చేయాలని కోరారు. ఆ సమయంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లలో పెట్టేందుకు పోలీసులు ముందస్తుగా కాంపౌండ్ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ.. తమ కాంపౌండ్ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించింది. దీంతో తమ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. INSANE: The CCP is cracking down hard to enforce quarantine orders in Shanghai This video is wild pic.twitter.com/EjiXm5qwO4 — Drew Hernandez (@DrewHLive) April 14, 2022 ఇదిలా ఉండగా.. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. -
చైనాలో భారత్ కొత్త రాయబారికి క్వారంటైన్
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్కుమార్ రావత్ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్లలో కూడా పనిచేశారు. (చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం) -
హోంక్వారంటైన్కు బ్రిటన్ గుడ్బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్లో కయాసన్కి కరోనా పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
తొలి వన్డే ముందు భారత్కు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం!
న్యూజిలాండ్ మహిళలతో తొలి వన్డేకు మందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్వారంటైన్ నిభంధనల కారణంగా శనివారం జరిగి తొలి వన్డేకు మంధాన దూరం కానుంది. ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న మంధాన.. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్కు దూరమైంది. ఈ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.మంధానతో పాటు పేసర్లు మేఘనా సింగ్,రేణుకా సింగ్ కూడా తొలి వన్డేకు దూరం కానున్నారు. కాగా మంధాన స్ధానంలో యస్తిక భాటియాను ఎంపిక చేశారు. కాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో షఫాలీ వర్మతో కలిసి భాటియా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే ఆ మ్యాచ్లో 26 పరుగులు చేసి యస్తిక భాటియా పర్వాలేదు అనిపించింది.ఇక న్యూజిలాండ్తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. మొత్తం ఐదు వన్డేలు క్వీన్స్టౌన్ వేదికగానే జరగనున్నాయి. చదవండి: Aus Vs Nz Cancelled: న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా? -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రజబ్బుకు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కేవలం 9.04 శాతం అంటే 434 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. 1.75 శాతం మంది అంటే 84 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మిగిలిన 89.14 శాతం అంటే 4,256 మంది వైద్యసిబ్బంది పర్యవేక్షణలో హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో సుమారు 40 మంది మాత్రమే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వీరు వయసు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు కావడం గమనార్హం. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలే ఎక్కువమందిలో ఉంటున్నాయి. రెండోదశలో మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడం వంటి సమస్యలు తక్కువమందిలో కనిపిస్తున్నాయి. దేశంలో 20వ స్థానంలో.. యాక్టివ్ కేసుల పరంగా పరిశీలిస్తే మన రాష్ట్రం.. దేశంలో 20వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనే యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. మరణాల రేటులో మన రాష్ట్రం.. దేశంలో 31వ స్థానంలో రాష్ట్రం ఉంది. నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.70 శాతం మంది మాత్రమే రాష్ట్రంలో మృత్యువాతపడ్డారు. పంజాబ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. -
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు పాజిటీవ్గా నిర్ధారణ అయ్యింది. ఈ న్యాయమూర్తులంతా గత మంగళవారం.. జస్టిస్ సుభాషన్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ తర్వాత ఆయనకు పాజిటీవ్గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తిపై సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి మొత్తం 32 జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సుప్రీంలో వారానికి మూడు రోజులు మాత్రమే వర్చువల్ మోడ్లో కేసుల విచారణ జరుగుతుంది. పార్లమెంట్లో నిర్వహించిన ర్యాండమ్ టెస్టుల్లో కూడా 400 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో సెక్రటేరియట్ స్టాఫ్తోపాటు సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదు కాగా..327 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 5 లక్షల 90 వేల 611 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పెరిగింది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3623కు చేరింది. చదవండి: ‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’ -
omicron variant: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్సర్కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ నిబంధన విధించింది. మార్గదర్శకాలివే.. ► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలి ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు. ► పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కుపంపిస్తారు. ► నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్ని సువిధ వెబ్పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మరో వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ► ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా విమానాశ్రయంలో రాండమ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ ఉండాలి ► అయిదేళ్లలోపు చిన్నారులకు పరీక్షల నుంచి మినహాయింపు. పెరిగిన ఎట్ రిస్క్ దేశాల జాబితా ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా. -
హోం క్వారంటైన్ ఇక ఏడు రోజులే
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ► ఎవరికైనా కరోనా పాజిటివ్గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. ► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. ► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్గానే వారిని పరిగణిస్తారు. ► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి. ► హెచ్ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి ► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ► క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్వర్కర్తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి. డేంజర్ బెల్స్ భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు. -
మూడు రోజుల క్వారంటైన్లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..!
Virat Kohli Yet To Begin Quarantine: డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన మూడు రోజుల క్వారంటైన్ క్యాంప్లో ఉంది. అయితే, టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడు ఈ క్వారంటైన్కు డుమ్మా కొట్టడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను ప్రకటించిన నాటి నుంచి కోహ్లి తన ఫోన్ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే కెప్టెన్సీపై తాను ఏ నిర్ణయం తీసుకోకముందే బీసీసీఐ రోహిత్కు టీమిండియా వన్డే పగ్గాలు అప్పజెప్పడం సహించకే కోహ్లి ఇలా ప్రవర్తిస్తుంటాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. జొహనెస్బర్గ్ ఫ్లయిట్ ఎక్కేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. కోహ్లి ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో బీసీసీఐ వర్గాలతో పాటు టీమిండియా అభిమానుల్లో సైతం కలవరం మొదలైంది. అయితే, కోహ్లి ఎట్టి పరిస్థితుల్లో జట్టుతో చేరతాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుతో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతోంది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా వన్డే, టీ20 సిరీస్లలో పాల్గొంటుంది. టెస్ట్ జట్టుకు కోహ్లి సారధ్యం వహించనుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చదవండి: ఆ విషయమై మెక్గ్రాత్ నన్ను విష్ కూడా చేశాడు, కానీ..! -
Omicron Variant: హోం క్వారంటైన్లోనే...ఒమిక్రాన్ తగ్గింది
సాక్షి, అమరావతి/ విజయ నగరం టౌన్/ ఎస్.కోట రూరల్: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ బారిన పడ్డ వ్యక్తి హోం క్వారంటైన్లోనే వైరస్ను జయించాడని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవన్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు అతడి నమూనాలు పంపామన్నారు. ఈ ఫలితం శనివారం రాత్రి అందిందని చెప్పారు. అయితే హోమ్ క్వారంటైన్ అనంతరం శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో అతడికి నెగెటివ్గా తేలిందన్నారు. అతడితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి రాగా వీరిలో 12,900 మందిని గుర్తించామన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను కూడా హైదరాబాద్ ల్యాబ్కు పంపామన్నారు. 10 మంది ఫలితాలు వెలువడగా కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. ఫేక్ వార్తలు నమ్మొద్దు.. డాక్టర్ హైమావతి తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్గా తేలిందని జరుగుతున్న ప్రచారాన్ని హైమావతి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం.. ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తగ్గింది ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. -
ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు
ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎయిర్పోర్టులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయగా తాజాగా మహారాష్ట్ర సర్కారు మరికొన్నింటీని వాటికి జత చేసింది. ముంబై మీదుగా హైదరాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చితే ఢిల్లీ, ముంబైల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు ముంబై, ఢిల్లీల మీదుగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలకు విమానాల్లో చేరుకుంటుంటారు. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్టులో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్వారంటైన్ తప్పనిసరి అట్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి ముంబై ఎయిర్పోర్టుకి చేరుకునే ప్రయాణికులు విధిగా ఏడు రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టులో దిగిన వెంటనే ఆ తర్వాత రెండు, నాలుగు, ఏడో రోజున ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. ఇక్కడ నెగటీవ్ వస్తే గమ్యస్థానాలకు చేరుకుని మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ఒక వేళ పరీక్షల్లో పాజిటివ్గా తేలితే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. నెగటీవ్ ఉంటేనే ఇక ముంబై నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్లే ఎన్నారైలు, విదేశీయులు సైతం ముంబై ఎయిర్పోర్టులో దిగిన వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నెగటీవ్ వస్తేనే కనెక్టింగ్ ఫ్లైట్కి అనుమతి ఇస్తారు. లేదంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి ముంబైకి వాయుమార్గంలో ప్రయాణం చేయాలన్నా ఆర్టీపీసీఆర్ టెస్టును తప్పనిసరి చేసింది మహా సర్కారు. కేంద్ర నిబంధనలు అట్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్ని కేంద్రం విధించగా మహా సర్కాను ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నిబంధన అమలు చేస్తోంది. దేశీయంగా చేసే ప్రయాణాలకు సైతం కోవిడ్ నెగటీవ్ రిపోర్టు తప్పనిసరిగా చేస్తూ నిబంధనలు రూపొందించింది. చదవండి: ఒమిక్రాన్ భయం..డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ -
కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు
బీజింగ్: ఇతర దేశాల మాదిరిగా కాకుండా ఇప్పటికీ కోవిడ్ ఆంక్షలు కొనసాగిస్తూ కోవిడ్ రహిత దేశంగా చైనా తగు జాగ్రత్తలతో ఉందని ప్రపంచవ్యాప్తంగా భావించారు. కానీ వాస్తవానికి అక్కడ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోందనే చెప్పాలి. అంతేకాదు తాజా అధ్యయనాలు సైతం చైనాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, పైగా రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నాయి. (చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!) పెకింగ్ యూనివర్శిటీ గణిత శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం జీరో కరోనా కేసుల లక్ష్యాన్ని వదిలేసి ఇతర దేశాల మాదిరి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తే చైనాలో రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడి వైద్యావ్యవస్థకు భరించలేని భారంగా తయారవుతోందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం చైనాలో 23 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని నివేదిక తెలిపింది. అయితే చైనా ఈ మహమ్మారి బారిన పడటానికి ముందు 2019 చివరిలో వ్యూహాన్లో కరోనాకి సంబంధించిన తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటివరకు చైనాలో సుమారు లక్ష కేసులు నమోదవ్వగా, 4వేల మందికి పైనే మరణించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇందులో 785 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్పినట్లుగా దక్షిణాఫ్రికా నివేదించిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉండటంవల్ల ప్రపంచదేశాలకు ఈ వైరస్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారుతుందంటూ చైనా ప్రముఖ శ్వాసకోశ నిపుణుడు జాంగ్ నాన్షాన్ హెచ్చరించారు. అయితే చైనాలో ఇప్పటివరకు 76% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైయిందని, ఈ ఏడాది చివరి కల్లా 80% లక్ష్యాన్ని చేరుకోగలందంటూ జాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పైగా చైనాలో ప్రధానంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీ అయిన సినోవాక్ బయోటెక్ కంపెనీ ఒమిక్రాన్ వైరస్పై ప్రత్యేక దృష్టి సారించడమేకాక ఆ వైరస్ ఉత్పరివర్తనలకు సంబంధించిన నమూనాలను సేకరించి పరిశోధలను చేస్తోందని అన్నారు. ఈ మేరకు భారత్తో సహా మిగతా దేశాలకు సైతం విమాన రాకపోకలను చైనా నిషేధించిందన్నారు. అంతేకాదు చైనా 23 వేలమంది భారత్ విద్యార్థులతో సహా వేలాదిమంది విదేశీ విద్యార్థులను సైతం చైనా విశ్వవిద్యాలయాలలో చదవడానికి అనుమతించలేదని చెప్పారు. పైగా చైనాకు జీరో కరోనా ఇన్ఫెక్షన్లను లక్ష్యంగా చేసుకోవడం తప్ప మరోమార్గం లేదని కూడా జాంగ్ అన్నారు. అయితే ఏది ఏమైన చైనా సమర్థవంతమైన వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం లేదా నిర్దిష్ట చికిత్స లేకుండా ఇప్పట్లో ఎటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ క్వారంటైన్ చర్యలను ఎత్తివేయడం సాధ్యం కాదని పెకింగ్ యూనివర్శిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చైనా ఈ సరికొత్త కరోనా వేరియంట్ నుంచి మరింత సురక్షితంగా బయటపడాలి అంటే అన్ని రకాలు చర్యలు తీసుకోక తప్పదంటూ పరిశోధకులు వక్కాణించారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) -
ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..!
జెరూసలేం: కోవిడ్ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కాబినెట్ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్-ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఐతే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్ లేబుల్ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుండి వచ్చే ఇజ్రాయెలీయులను కూడా క్యారంటైన్లో ఉండాలని తెల్పింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటికే కొత్తవేరియంట్ తాలూకు కేసులు యూకే, యూరోపియన్ దేశాలలో వెలుగుచూసిన సంగతి తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతిని అరికట్టడానికి అనేక దేశాలు అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అదేబాటను ఇజ్రాయెల్ దేశం కూడా అనుసరిస్తోంది. -
మరోసారి బిగ్ బాస్ హోస్ట్గా...రమ్యకృష్ణ
కమల్హాసన్ కరోనాతో క్వారంటైన్లో ఉంటున్నందున ఆయన హోస్ట్గా చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్ లిస్ట్లో కమల్ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్ బాస్’కి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్ బాస్ 3’ అప్పుడు హోస్ట్ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్ బాస్’కి హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. -
భారతీయులు సౌదీకి రావచ్చు.. కానీ ఈ రూల్ పాటించాల్సిందే?
కోవిడ్ ఆంక్షల నుంచి పలు దేశాల పౌరులకు సౌదీ అరేబియా మినహయింపు ఇచ్చింది. అయితే విదేశాల నుంచి సౌదీ అరేబియా వచ్చే పౌరులు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత్తో పాటు కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ రాజ్యంలోకి బయటి దేశాల వ్యక్తులను అనుమతించడం లేదు. అయితే ఇటీవల వ్యాక్సినేషన్ పెరగడంతో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. దీంతో భారత్ , పాకిస్తాన్, ఇండోనేషియా, ఈజిప్టు, బ్రెజిల్, వియత్నాం దేశాల పౌరులు సౌదీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. క్వారంటైన్ అనుమతి పొందిన ఆరు దేశాల నుంచి సౌదీ వచ్చే పౌరులు తప్పని సరిగా 5 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయా దేశాలలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తమ దేశంలో క్వారంటైన్లో ఉండాలని సూచించింది. డిసెంబరు 1 నుంచి తమ దేశంలోకి విదేశీ ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపింది. చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం -
ఈ సౌకర్యం ఉంటేనే విమాన టికెట్ !
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్కు వెళ్లాలనుకునే వలసకార్మికులకు క్వారంటైన్ చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడి హోటళ్లలో క్వారంటైన్కు అవసరమైన గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. ఇతర గల్ఫ్దేశాలకంటే ఖతర్కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా అక్కడకు వెళ్లిన తరువాత ఏడు రోజులపాటు క్వారంటైన్ చేయడానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. ఫలితంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఖతర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ దేశానికి వచ్చే విదేశీయులు ఎవరైనా వారంపాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ ఉండాల్సిందే. కోవిడ్–19 సెకండ్ వేవ్ తరువాత పరిస్థితి కాస్త కుదుటపడటంతో గల్ఫ్ దేశాల్లో వివిధ కంపెనీల కార్యకలాపాలు గాడినపడుతున్నాయి. 2022లో ప్రపంచ ఫుట్బాల్ క్రీడాటోర్నీకి ఖతర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఖతర్లో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇతర గల్ఫ్దేశాల కంటే ఖతర్ నుంచే వీసాలు ఎక్కువగా జారీ అవుతున్నాయి. అయితే ఖతర్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాలనుకునేవారు, కొత్తగా వెళ్లేవారు తప్పనిసరిగా వారంపాటు హోటల్ గదిలో క్వారంటైన్ ఉండాలి. శంషాబాద్ ఎయిర్పోర్టుతోపాటు మనదేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఖతర్కు షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయి. హోటల్ గదిని బుక్ చేసుకున్నట్లు రసీదు చూపితేనే విమానయాన సంస్థలు టికెట్ జారీ చేస్తున్నాయి. కానీ, ఖతర్లోని హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్లో ఉండాల్సివస్తోంది. ఒకవేళ ఖతర్ క్వారంటైన్ నిబంధన ఎత్తేస్తే సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. -
రష్యాలో కరోనా విస్ఫోటం.. ఒక్క రోజులోనే..
మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం ఒక్కరోజే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,159 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటిదాకా ఇవే అత్యధికం. వైరస్ ఉధృతిని అరికట్టడానికి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్ వర్కింగ్ పీరియడ్ (అత్యవసర విధుల్లో ఉన్నవారు మినహాయించి ఇతర ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకూడదు) ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనం నిర్లక్ష్యం వీడడం లేదు. రష్యా నుంచి ఈజిఫ్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. (చదవండి: సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!) -
భారత్ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది. -
కోవిషీల్డ్కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
యాషెస్ సిరీస్పై మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
England To Decide On Ashes Series This Week: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సిరీస్ సాధ్యాసాధ్యాలపై సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టింది. తమ ప్రధాన ఆటగాళ్లు ఉంటేనే సిరీస్ ఆడతామని ప్రకటించింది. ఈ విషయమై జట్టు సభ్యులతో సంప్రదింపులు జరిపి వారంలోగా తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ జట్టులోని కొందరు సీనియర్ సభ్యులు ఆసీస్ పర్యటనకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులను తమతో పాటు అనుమతిస్తేనే ఆస్ట్రేలియాలో అడుగుపెడతామని వారు ఈసీబీకి స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు కోవిడ్ నిబంధనలను సడలించేందుకు ఆసీస్ ప్రభుత్వం సైతం వెనక్కు తగ్గకపోవడంతో సిరీస్ సాధ్యపడడం అనుమానంగా మారింది. కాగా, ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆ దేశంలో పర్యటించేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయమై ఇరు దేశాల ప్రధానులు స్కాట్ మోరిసన్(ఆసీస్), బోరిస్ జాన్సన్(యూకే)లు జోక్యం చేసుకున్నప్పటికీ సమస్య కొలిక్కివచ్చినట్లు కనబడలేదు. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ డిసెంబర్ 18 నుంచి జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయర్ -
యూకేకు ఆంక్షలతో బదులిచ్చిన భారత్
న్యూఢిల్లీ: భారత్కు వచ్చే బ్రిటిష్ ప్రయాణికులు టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 10 రోజులు తప్పక క్వారంటైన్లో గడపాలని భారత్ నిర్ణయించింది. బ్రిటన్కు వచ్చే భారతీయులు టీకా తీసుకున్నా సరే క్వారంటైన్లో గడపాలన్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ భారత్ అందుకు ప్రతిచర్యగా ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటన్ విధించిన గడువు అక్టోబర్ 4నుంచే భారత్ ఆదేశాలు కూడా అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రిటన్ అనాలోచిత చర్యలకు భారత్ బదులిచ్చినట్లయింది. నిజానికి గడువులోపు ఈ విషయంలో బ్రిటన్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని భారత్ ఆశించింది. కానీ యూకే నుంచి తగిన స్పందన రాకపోవడంతో ప్రతిచర్య నిర్ణయం తీసుకుంది. భారత నిర్ణయంపై యూకే స్పందించాల్సి ఉంది. ఇండియాకు వచ్చే బ్రిటన్ దేశీయులు 72 గంటలకు ముందే కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని తాజా ఆదేశాల్లో భారత్ స్పష్టం చేసింది. భారత్కు వచి్చన తర్వాత వారికి మరోమారు ఈ టెస్టు చేస్తారు. ఫలితం ఎలాఉన్నా, టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 8రోజుల అనంతరం మళ్లీ టెస్టు చేస్తారు. ఈలోపు వారు తప్పనిసరి క్వారంటైన్ గడపాల్సిఉంటుంది. అక్టోబర్ 4నుంచి బ్రిటన్ కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇండియన్స్ కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్ చూపినా యూకే రాగానే హోం క్వారంటైన్లో పదిరోజులుండాలి. యత్నిస్తున్నాం: ప్రయాణ నిబంధనలపై ఇండో– యూకే మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలనివ్వలేదు. కోవిïÙల్డ్ టీకాతో సమస్య లేదని, సర్టిఫికెట్తోనే సమస్యని బ్రిటన్ అధికారులు అర్థంలేని వాదన వినిపించారు. దీంతో భారత్ తగిన ప్రతిస్పందనకు సిద్ధమైంది. భారత ప్రతిచర్యపై భారత్లో బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి స్పందించారు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, తమ ప్రయాణ పాలసీ పరిధిలోకి మరిన్నిదేశాలను తెచ్చే యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. యూకేకు చాలామంది భారతీయులు వస్తున్నారని, ఇప్పటివరకు 62,500 స్టూడెంట్ వీసాలను జారీ చేశామని, గతేడాదితో పోలిస్తే ఇవి 30 శాతం అధికమని చెప్పారు. -
Tit For Tat: ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్కు వచ్చే యూకే సిటిజన్స్కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా.. భారత్కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా.. -
బ్రిటన్కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ను రూపొందించింది. దీన్ని భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్లిస్టులో పెడతారు. అంటే భారత్లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
వ్యాక్సిన్ వేసుకున్నా పరిగణనలోకి తీసుకోరు
లండన్: భారత్ సహాకొన్ని దేశాల వారు కోవిడ్–19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్ అయినట్లుగా పరిగణించబోమని యూకే తెలిపింది. తమ దేశానికి వచ్చే ఆయా దేశాల వారు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలంటూ యూకే కొత్త ప్రయాణ నిబంధనలను తీసుకువచ్చింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంత దేశాలతోపాటు యూఏఈ, భారత్, టర్కీ, జోర్డాన్, థాయ్లాండ్, రష్యాకు చెందిన వారు తమ దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే, వారిని టీకా తీసుకున్నట్లుగా పరిగణించట్లేదని తెలిపింది. ఈ దేశాల వారు క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు దేశాలను మూడు కేటగిరీ(గ్రీన్, అంబర్, రెడ్)లుగా విభజించి యూకే ప్రయాణ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భారత్ అంబర్ కేటగిరీలో ఉంది. తాజా, నిబంధనల ప్రకారం కేవలం ఒకే కేటగిరీ–రెడ్ మాత్రమే ఉంది. ఈ నిబంధనలు అక్టోబర్ 4వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మిగతా దేశాలకు మాత్రం ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఇది జాతి వివక్షే: కాంగ్రెస్ కోవిషీల్డ్ టీకా వేసుకున్న భారతీయ ప్రయాణికులకు యూకే ప్రభుత్వం క్వారంటైన్ ఆంక్షలు విధించడం జాతి వివక్షేనని కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన టీకానే సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్గా ఉత్పత్తి చేస్తోందని, దీనినే దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో వాడుతున్న విషయాన్ని జైరాం రమేశ్ గుర్తు చేశారు. యూకే నిబంధనల కారణంగా కేంబ్రిడ్జి యూనియన్ డిబేటింగ్ సొసైటీ చర్చా కార్యక్రమంతోపాటు తన పుస్తకం ‘ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్’యూకే ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమం నుంచి వైదొలిగానని థరూర్ చెప్పారు. యూకే వెళ్లాల్సిన భారతీయులు.. ►ప్రయాణానికి మూడు రోజుల ముందుగా కోవిడ్–19 పరీక్ష చేయించుకోవాలి. ►అక్కడికి చేరుకున్న 2వ, 8వ రోజున జరిపే కోవిడ్ పరీక్షలకు ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ఇంగ్లండ్ చేరుకునేందుకు 48 గంటల ముందుగా ప్యాసింజర్ లొకేటర్ ఫాంను పూర్తి చేయాలి. ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత చేయాల్సినవి.. ►ఇంట్లో గానీ, 10 రోజులపాటు మీరు ఉండాల్సిన ప్రాంతంలో గానీ క్వారంటైన్ పాటించాలి. ►2వ రోజు ముందు, 8వ రోజుగానీ, ఆ తర్వాత గానీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ►యూకేలో రెండు డోసుల టీకా వేయించుకున్న వారు అక్కడి నుంచి బయలుదేరే ముందు టెస్ట్ చేయించుకోవాల్సిన పనిలేదు. -
క్వారంటైన్లోకి పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సన్నిహితులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. పుతిన్ ఇప్పటికే స్పుత్నిక్–వీ టీకా రెండు డోసులు తీసుకున్నారు. పుతిన్ ఆరోగ్యంతో ఉన్నారని ప్రభుత్వ అధికారి ప్రతినిధి మిట్రీ పెస్కోవ్ చెప్పారు. క్వారంటైన్లో ఉన్నాగానీ అధికారిక కార్యకలాపాలు అన్నీ చేస్తారని తెలిపారు. మరోవైపు పుతిన్ కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది.vladimir putin అయితే ఈ విషయాన్ని తొలుత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. పుతిన్ కరోనా పరీక్ష చేయించుకున్నారని, ఆరోగ్యంతో ఉన్నారని మాత్రమే వెల్లడించింది. అయితే పెస్కోవ్ను విలేకరులు పుతిన్కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిందా అని ప్రశ్నించగా ఆయన అవును అని మాత్రమే బదులిచ్చారు. అయితే పుతిన్కి సన్నిహితంగా వ్యవహరించిన వారిలో ఎవరెవరు కరోనా బారిన పడ్డారో వివరించలేదు. సోమవారం పుతిన్ ఎన్నో బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు -
దుబాయ్లో ప్రేమపక్షుల క్వారంటైన్
-
దుబాయ్లో క్వారంటైన్ను ఎంజాయ్ చేస్తున్న బుమ్రా కపుల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ సందడి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, తన భార్య, టీవీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్తో దుబాయ్లో వాలిపోయాడు. ప్రస్తుతం ఒక హోటల్ గదిలో ఈ ప్రేమ పక్షులు క్వారంటైన్ అయ్యారు. ఈ సందర్బంగా సంజన తన హోటల్ గది నుంచి కొన్ని అందమైన చిత్రాలను పోస్ట్ చేసింది. అటు ముంబై ఇండియన్స్ కూడా ఒక వీడియోను షేర్ చేసింది. Our boys in 𝔹𝕝𝕦𝕖 are back in 🇦🇪 to add some 𝔾𝕠𝕝𝕕 💙#OneFamily #MumbaiIndians #KhelTakaTak #IPL2021 @MXTakaTak MI TV pic.twitter.com/IBn9FBpp9g — Mumbai Indians (@mipaltan) September 11, 2021 -
టెస్టు ఆడలేం... ఐపీఎల్కు సిద్ధం!
మాంచెస్టర్/దుబాయ్: ఐపీఎల్ రెండో దశ పోటీ ల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్లో భాగంగా ఉండి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ కరన్ మాంచెస్టర్ నుంచి కమర్షియల్ ఫ్లయిట్ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్ పరీక్షలన్నీ ‘నెగెటివ్’గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్ గదుల్లో క్వారంటైన్లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో వీరు చేరతారు. ఏదైనా జరగవచ్చని... శుక్రవారం నుంచి ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు ‘నెగెటివ్’గా వచి్చనా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లి బృందం భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణ యించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది. విమర్శలు, ప్రతివిమర్శలు... ఐపీఎల్లో ఒక్క మ్యాచ్కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, మీడియా భారత జట్టుపై విరుచుకుపడ్డారు. రెండో కోవిడ్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని వారు ప్రశి్నంచారు. టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని వారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత అభిమానులు ‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్ను విమర్శించడంలో అర్థం లేదు’ అని ఘాటుగా స్పందించారు. సిరీస్ ఫలితం ఏమిటి? ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2–1తో సిరీస్ గెలుచుకున్నట్లే. అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ మాత్రం దానిని ప్రస్తుత సిరీస్లో భాగంగా కాకుండా ‘ఏౖకైక టెస్టు’గా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
క్వారంటైన్ ఉల్లంఘించినందుకు వియత్నంవాసికి ఐదేళ్ల జైలుశిక్ష
హనోయి: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్ నిబంధలను ఉల్లంఘించి.. బయట తిరగి వైరస్ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక పేర్కొంది. హోచి మిన్ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్ వచ్చిందని.. కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నిస్తోంది. చదవండి: కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో.. -
కేరళ నుంచి వస్తే క్వారంటైన్
యశవంతపుర: కరోనా నియంత్రణ కోసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్యా మంత్రి సుధాకర్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడుతూ కేరళ నుంచి కర్ణాటకకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా వారంపాటు క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు కూడా క్వారంటైన్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. జనం గుంపులుగా చేరటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, కాబట్టి సభలు, సమావేశాలను నిర్వహించవద్దని సూచించారు. దక్షిణకన్నడ, ఉడుపి, చామరాజనగర జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్నారు. చదవండి: US Study: ఆయుః ప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా పడిపోతోంది! కరోనా డిశ్చార్జిల్లో క్షయ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న 104 మందిలో క్షయ (టీబీ) జబ్బు బయట పడింది. ఆరోగ్యశాఖ ఆగస్ట్ 16 నుంచి 29 వరకు, డిశ్చార్జి అయిన 5.37 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈ విషయం వెల్లడైంది. కరోనా వల్ల మొత్తంగా 24,598 మంది క్షయకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ -
రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు సిఫారసు చేయలేదు. క్వారంటైన్, ఐసోలేషన్లకు సంబంధించి రాష్ట్రాలు సొంత ప్రొటోకాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కావాలని కోరుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. సెకండ్వేవ్లో దేశవ్యాప్తంగా కేసులు క్షీణిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేసే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ దేశీయ ప్రయాణాలకు ఒకే తరహా ప్రోటోకాల్ ఉండేలా దేశీయ ప్రయాణ (రైలు, బస్సు , విమానం) మార్గదర్శకాలు సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని, తద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రయాణాల్లో పాటించాల్సిన ఆరోగ్య ప్రొటోకాల్ ► ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్–19 లక్షణాలు లేనప్పుడే ప్రయాణం చేయాలి. ► ప్రయాణికులు మాస్క్, ఫేస్ కవర్, ఆరు అడుగుల భౌతికదూరం పాటిం చాలి. ► ప్రయాణ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ► ప్రయాణ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్లైతే విమాన/బస్సు/రైలు సిబ్బందికి తెలియజేయాలి. ► గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు కనిపిస్తే జిల్లా నిఘా అధికారి లేదా జాతీయ కాల్ సెంటర్ 1075కు తెలపాలి. విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/బస్ స్టేషన్లకు సూచనలు ► కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన చేయాలి ► థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ప్రయాణికులను అనుమతించాలి. వెలుపలికి పంపాలి. ► ప్రయాణ సమయంలో వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు పారవేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తరచుగా శుభ్రపరచాలి. ► లక్షణాలు లేని వారు 14 రోజులపాటు స్వీయ పరిరక్షణ హామీతో బయటకు వెళ్లడానికి అనుమతించాలి. ► ఒకవేళ లక్షణాలు బయటపడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► ప్రయాణికులకు అందుబాటులో మాస్కులు, పీపీఈకిట్లు, గ్లౌజులు ఉంచాలి. రాష్ట్రాలకు సూచనలు ► రైలు, రహదారి, విమానయానం, నీటి మార్గాల ద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ► ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని నిబంధన పెడితే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. ► రెండు డోసుల టీకా తీసుకున్నవారు, రెండో డోసు తీసుకున్నా ధ్రువపత్రం ఇంకా అందని వారు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిని ఆర్టీపీసీఆర్ పరీక్ష నుంచి మినహాయించాలి. ► ప్రయాణం తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడానికి ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ► స్థానిక ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రాలు అవసరమైతే అదనంగా ఆంక్షలు విధించొచ్చు. -
కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో..
బ్రిస్బేన్ : క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఓ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. బెడ్ షీట్లను తాడుగా చేసి, నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి జంప్ అయ్యాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి గత సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాకు వచ్చాడు. అయితే, కరోనా నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. సదరు వ్యక్తి 48 గంటల్లోగా పశ్చిమ ఆస్ట్రేలియాను వదిలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అతడ్ని హుటాహుటిన క్వారంటైన్ హోటల్కు పంపారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికి క్వారంటైన్లోనే ఉంచారు. క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఆ వ్యక్తి బయటకు వెళ్లటానికి ఓ ప్లాన్ వేసుకున్నాడు. బెడ్ షీట్ సహాయంతో ఓ తాడు తయారు చేసుకున్నాడు. తనుంటున్న నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి పారిపోయాడు. కానీ, మంగళవారం ఉదయం పోలీసులు అతడ్ని వెతికి పట్టుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చాడని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
పదేళ్లుగా ఇంట్లోనే.. బయటకు రావాలంటే సిగ్గట..!
టోక్యో: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సామాజిక దూరం, ఐసోలేషన్ మన జీవితాల్లో భాగమైంది. ఏదైనా ముఖ్యమైన పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్తే.. తిరిగి వచ్చాక స్నానం చేయడం.. రెండు, మూడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండటం తప్పనిసరిగా మారింది. అయితే మనం కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇలా ఐసోలేషన్లో ఉంటుంటే.. కొందరు మాత్రం ఎప్పటినుంచో ఈ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఏళ్ల తరబడి జనాలకు దూరంగా.. ఇంటికే పరిమితమవుతున్నారు. జపాన్కు చెందిన నిటో సౌజీ ఈ కోవకు చెందిన వ్యక్తే. గత పదేళ్లుగా ఇతడు ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం కటింగ్ చేయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. ఆ వివరాలు.. ప్రొఫెషనల్ ఇండీ గేమ్ డెవలపర్ అయిన సౌజీ 10 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన టోక్యోకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి బయటకు వెళ్లడం మానేశాడు. రెండు, మూడు నెలలకోసారి కేవలం కటింగ్ చెయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ మీద ఆధారపడతాడు. తనకు కావాల్సిన వాటిని ఆన్లైన్లో బుక్ చేసి.. డోర్ డెలివరీ చేయించుకుంటాడు. బయటకు వెళ్లడానికి చాలా సిగ్గుపడతాడు.. భయపడతాడు సౌజీ. సౌజీ ఒక యూట్యూబ్ చానెల్ని కూడా రన్ చేస్తున్నాడు. దీనిలో తన రోజువారి జీవితానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తాడు. మన జీవితం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైతే.. సౌజీ మాత్రం రాత్రి ఎనిమిద గంటలకు తన కార్యకాలపాలను ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోతాడు. మొదటి రెండు మూడు సంవత్సారాలు ఈ విధానం తనకు బాగా మేలు చేసిందని.. ఎంతో ఏకాగ్రతగా పని చేసుకునేవాడినన్నాడు. కానీ రాను రాను బయటకు వెళ్లాలంటే సిగ్గుగా, భయంగా అనిపించేది అన్నాడు సౌజీ. సౌజీ పాటించే జీవన విధానాన్ని ‘‘హికికోమోరి’’ అని పిలుస్తారు. అంటే సమాజం నుంచి పూర్తిగా వైదొలగి సామాజిక ఒంటరితనం, నిర్బంధంలో తీవ్ర స్థాయిని కోరుకోవడం. సాధారణంగా జపాన్లో సగానికి పైగా యువత, వృద్ధులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.. కానీ సౌజీ అంత కఠినంగా మాత్రం కాదు. చదవండి: Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్ -
India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ
న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు..14 రోజుల క్వారంటైన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ సమయంలో భారత బృందానికి ఆరుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహిస్తారు. ఈ టెస్ట్లన్నింటిలో నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు మాత్రమే ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేన పాటిస్తున్న నిబంధనలే ధవన్ సేనకు కూడా వర్తిస్తాయని బీసీసీఐ పేర్కొంది. ఈ 14 రోజుల క్వారంటైన్లో తొలి ఏడు రోజులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఆ తర్వాత.. బయో బుడగలో మిగిలిన ఆటగాళ్లతో కలుసుకునే వీలు ఉంటుందని, జిమ్ సెషన్లకు కూడా హాజరు కావచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, జులై 13న ప్రారంభమయ్యే లంక పర్యటనలో శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత జట్టుకు మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ కూడా ఉండనుంది. వ్యక్తిగత సెషన్ తర్వాత ఈ సెషన్ ఉండే అవకాశం ఉంది. ఇక కొలంబో చేరిన తర్వాత క్రికెటర్లు మూడు రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. టీమిండియా గత కొన్నేళ్లుగా కొలంబోలో హోటల్ తాజా సముద్రలో బస చేస్తోంది. ఇప్పుడు కూడా ఆటగాళ్లకు అదే హోటల్ కేటాయించినట్లు లంక క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: గొప్ప గౌరవంగా భావిస్తున్నాను: శిఖర్ ధవన్ -
Sri Lanka: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్
కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా వెల్లడించారు. మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్ క్రికెటర్..
కాన్బెర్రా: రెండు నెలల విరామం అనంతరం కడుపుతో ఉన్న ప్రేయసిని కలుసుకున్న ఆసీస్ స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలో 14 రోజుల కఠిన క్వారంటైన్ను ముగించుకుని సోమవారం స్వస్థలానికి చేరుకున్న కమిన్స్.. ఎయిర్ పోర్ట్లో ప్రేయసి బెక్కీ బోస్టన్ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనై ఆనంద బాష్పాలు కార్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్టింట 'వీడియో ఆఫ్ ద డే'గా ట్రెండ్ అవుతూ తెగ హల్చల్ చేస్తుంది. కాగా, కోవిడ్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడటంతో లీగ్లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లంతా రెండు వారాలు మాల్దీవుల్లో గడిపి అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆతరువాత వీరు సిడ్నీలో 14 రోజులు కఠిన క్వారంటైన్లో గడిపారు. Video of the day! After eight weeks away for the IPL, Pat Cummins finally leaves hotel quarantine and reunites with his pregnant partner Becky. All the feels! pic.twitter.com/YA3j98zJId — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) May 31, 2021 ఇదిలా ఉంటే, కమిన్స్.. కడుపుతో ఉన్న ప్రేయసితో సమయాన్ని గడిపేందుకు ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్లతో పాటు వెస్టిండీస్ పర్యటన కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సందేశాన్ని కూడా పంపాడు. కమిన్స్ బాటలోనే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా బయో బబుల్లో ఉన్న కారణంగా.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబంతో గడిపాలని ఈ క్రికెటర్లు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరి కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు కూడా విండీస్ పర్యటనతో పాటు ఐపీఎల్కు డుమ్మా కొట్టే ఉద్ధేశంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 14వ ఎడిషన్లో మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కేకేఆర్కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్ -
ఇంగ్లండ్లోనూ కఠిన క్వారంటైన్
ముంబై: స్వదేశంలో రెండు వారాల హార్డ్ క్వారంటైన్ తర్వాత ఇంగ్లండ్లో అడుగు పెట్టే భారత క్రికెట్ జట్టు అక్కడ కూడా కొన్ని రోజులు అదే తరహా వాతావరణంలో ఉండాల్సి రావచ్చు. టీమిండియా రాకకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగు పెట్టగానే నేరుగా హాంప్షైర్ మైదానం పక్కన ఉన్న హోటల్కు వెళ్లిపోతారు. వారికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తర్వాత కొన్ని ఆంక్షలు, నిబంధనలతో కూడిన ఐసోలేషన్ మొదలవుతుంది. ఐసోలేషన్ సమయంలోనూ పరీక్షలు కొనసాగుతాయి’ అని ఐసీసీ పేర్కొంది. దీనిని బట్టి చూస్తే టీమిం డియా హార్డ్ క్వారంటైన్లో గడపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎన్ని రోజులు అనే విష యంపై మాత్రం ఐసీసీ స్పష్టతనివ్వలేదు. న్యూజి లాండ్ జట్టు విషయంలో మాత్రం దీనిని మూడు రోజులకే పరిమితం చేశారు. పురుషులతోపాటు ఇంగ్లండ్కు ప్రయాణించే భారత మహిళల జట్టు విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఈ యాప్స్తో ఒత్తిడి పరార్..!
డిజిటల్ వరల్డ్ ఐసోలేషన్లు, అంబులెన్స్ చప్పుళ్లు... స్ట్రెస్గా ఫీలవుతున్నారా? జోష్ మిస్సయిందా?అల్లావుద్దీన్ అద్భుతదీపంలాంటి ‘యాప్స్’ మీ దగ్గరే ఉన్నాయి. మీ మనసులో మాట చెప్పండి చాలు...‘జీ హుజూరు’ అని ఒత్తిడిని మాయం చేస్తాయి. మాయాతివాచీ మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకొని రాగాల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. రంగులతో బొమ్మలు వేయిస్తాయి. సవాల్ దూసే ఆటలకు సై అనేలా చేస్తాయి. టోటల్గా జోష్ను టన్నుల కొద్దీ ఇస్తాయి... జోరుగా....హాయి హాయిగా! ‘కరెంటు తీగలా ఎనర్జిటిక్గా ఉండేవాడివి...అదేంటి బ్రో ఇలా కనిపిస్తున్నావు!’ అనే పలకరింపుకు అటు నుంచి ఒక నవ్వు అయితే వినిపించిందిగానీ అది జీవం లేని నవ్వు. జోష్లేని జీరో నవ్వు! పైకి ఎంత గంభీరంగా కనిపించినా ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, నిద్రలేమి...మొదలైన సమస్యలతో డీలా పడిపోతున్న కుర్రకారు సంఖ్య తక్కువేమీ లేదు. డీలా పడిపోకుండా సమస్యను ఢీ కొట్టాడానికి అందుబాటులో ఉన్న ఫీల్గుడ్ యాప్స్లో ఒకటి ‘ఎన్స్మైల్స్’ ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న కనిపించే, కనిపించని మానసిక సమస్యలపై కత్తిదూసే సెల్ఫ్–హెల్ప్ టూల్స్ ఇందులో ఉన్నాయి. నిద్ర లేమి నుంచి కెరీర్ మెనేజ్మెంట్ వరకు నిపుణుల సలహాలు, సూచనలు ఇందులో కనిపిస్తాయి. ‘ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల కార్ఖానా’ అంటారు కదా! ఈ సమయంలో మెదడుకు ఎంత పని కలిపిస్తే అంత మంచిది. దీనికి కొత్త భాష నేర్చుకుంటే మరీ మంచిది. మోస్ట్ పాప్లర్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్గా పేరున్న ‘డ్యుయో లింగో’లో స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్....మొదలైన భాషలు నేర్చుకోవచ్చు. అకాడమిక్ పాఠాల మాదిరిగా కాకుండా గేమ్–లైక్ ట్రిక్స్తో కొత్త భాష నేర్చుకోవచ్చు. అలా కళ్లు మూసుకొని, రిలాక్స్ అవుతూ పుస్తకం చదవాలని...సారీ వినాలని ఉందా? అందుకు ‘ఆడిబుల్’ యాప్ ఉంది. అమెజాన్ వారి ఈ ఆడియోబుక్ సర్వీస్లో ఎన్నో పుస్తకాలు వినవచ్చు. కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటారా? అయితే ఇదే కంపెనీ వారి ‘ఆడిబుల్ సునో’ ఉంది. బాలీవుడ్ నుంచి టీవి సెలబ్రిటీల వరకు ఎన్నో గొంతులు వినొచ్చు. కామెడీతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆసక్తి కలిగించే సినిమా, ఆటల కబుర్లు హాయిగా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో హైయెస్ట్–రేటెడ్ యాప్లలో ఒకటైన ‘కలర్ఫై’ రిలాక్స్ కావడానికి ఉపకరించే యాప్. మనల్ని వేలు పట్టుకొని బాల్యంలోకి తీసుకువెళుతుంది. పూలతోటలు, జంతుజాలం, ప్రముఖ చిత్రాలు, ప్రముఖుల చిత్రాలకు రకరకాల రంగులు వేయవచ్చు. స్ట్రెస్, అకారణ ఆందోళల నుంచి బయటపడడానికి కలరింగ్ యాప్స్ బెస్ట్ అని సూచిస్తున్నారు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సోషల్ గేమింగ్ యాప్లలో ‘హగో’ ఒకటి. మనదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. ‘ప్లే విత్ ఫ్రెండ్స్ అండ్ మేక్ ఫ్రెండ్స్’ అని ఆహ్వానిస్తోంది. బ్రెయిన్ క్విజ్ (బ్రెయిన్ పవర్ను చెక్ చేసుకునే గేమ్) మొదలు క్రేజీ ట్యాక్సీలాంటి మైండ్ బ్లోయింగ్ గేమ్స్ వరకు ఎన్నో గేమ్స్ ఇందులో ఉన్నాయి. పాత గేమ్స్నే పదేపదే ఆడనక్కర్లేదు. ప్రతిరోజూ కొత్త గేమ్స్ లైబ్రరీలో చేరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీలాగే గేమ్స్ ఆడేవారితో కనెక్ట్ కావచ్చు. బొమ్మలు వేయాలని ఎవరికి మాత్రం ఉండదు! మీ ఐఫోన్నే కాన్వాస్గా చేసుకొని ఆయిల్ పెయింటింగ్ నుంచి డిజిటల్ ఆర్ట్ వరకు కుంచెలను కదిలించడానికి ‘ఇన్స్పైర్ ప్రో’ ఉంది. ఉదాహరణ కోసం గ్యాలరీలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. ఎయిర్ బ్రషెస్ నుంచి గ్రాఫిటీ పెన్సిల్స్ వరకు ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఇక ఇల్లే చిత్రశాల అవుతుంది. లాక్డౌన్, ఐసోలేషన్లతో బాహ్య ప్రపంచం దూరమైపోయిందని బాధ అక్కర్లేదు. యాప్ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒకటి కాదు ఎన్నో ప్రపంచాలు స్వాగతం పలుకుతాయి. నిరుత్తేజ క్షణాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. -
రోజురోజుకు రాటుదేలుతున్నారు..
ముంబై: ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఎనిమిది రోజుల కఠిన క్వారంటైన్ నిమిత్తం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు జిమ్ లో కఠోరంగా శ్రమిస్తున్నారు. అవుట్ డోర్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఎక్కువ సమయం జిమ్ లోనే కసరత్తులు చేస్తూ, రోజురోజుకు రాటుదేలుతున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లంతా శారీరకంగా ధృడంగా మారుతున్నారు. ఇషాంత్ శర్మ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రహానే, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్ తదితరులు జిమ్లో గంటల కొద్దీ చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Getting stronger each day! 💪💪#TeamIndia pic.twitter.com/0bZFml1gxL — BCCI (@BCCI) May 26, 2021 కాగా, క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ కు బయల్దేరనున్న కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది కూడా బయో బబుల్లోకి అడుగుపెట్టారు. వారు కూడా ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జూన్ 2న భారత బృందం ప్రత్యేక విమానంలో లండన్ కు బయల్దేరుతుంది. ఈ టూర్లో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత జట్టు తలపడుతుంది. జూన్ 8న డబ్ల్యూటీసీ ఫైనల్, ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు.. -
క్వారంటైన్: చెట్టుకింద కరోనా రోగి..
జయపురం: కరోనా పాజిటివ్ నమోదైన ఓ బాధితుడు నవరంగపూర్ జిల్లా చందాహండి సమితి గంభారిగుడ పంచాయతీ మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమితికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో హోం క్వారెంటైన్లో ఉండమని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తికి హోం క్వారంటైన్ అవకాశం లేకపోవడంతో మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందాడు. దీంతో మెడిగాం గ్రామస్తులు వణికిపోతున్నారు. వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ నమోదైన వారిని గాలికి వదిలేస్తున్నారని హోం క్వారంటైన్లో ఉండే అవకాశం లేని వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ గాలికి వదిలేయకూయడదని మండిపడుతున్నారు. కరోనా రోగులు చెట్ల కింద ఉంటే ఇతరులకూ కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమితిలోని హలదిగ్రామంలో 100 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్, పనాబెడ డిగ్రీ కళాశాల, సాలెబిడి ఆశ్రమంలో రెండు టీఎంసీ (తాత్కాలిక వైద్య కేంద్రం) లు ఉన్నా తమ గ్రామంలో చెట్టు కింద కరోనా రోగి ఉండడానికి కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయం చేస్తున్న గ్రామ యువత చెట్టు కింద ఉంటున్న కరోనా రోగికి తిండి, మందులు ఎవరూ సమకూర్చడం లేదు. ఆ రోగి పరిస్థితి చూసి చలించిన మెడిగాం గ్రామానికి చెందిన యువకులు తినేందుకు, తాగేందుకు సమకూర్చారు. అలాగే రోగికి దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన మందులు తెచ్చి ఇస్తున్నారు. -
BCCI Success: టీమిండియాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ రోజుల్ని కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఒప్పుకుంది. పదిరోజులను మూడు రోజులకు కుదిస్తున్నట్లు బీసీసీఐకి అంగీకారం తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్ 2న ఇంగ్లాండ్కు ఒకే విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే పదిరోజుల కఠిన క్వారంటైన్కు రెడీగా ఉండాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ముందు కండిషన్ పెట్టింది. ఈ మేరకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈసీబీతో సంప్రదింపులు జరిపింది. చివరికి బీసీసీఐ రిక్వెస్ట్తో కొవిడ్ ప్రొటోకాల్స్ను ఇంగ్లాండ్ బోర్డు సవరించింది. ఈ నిర్ణయంతో నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లో భాగంగా జూన్ 18న న్యూజిలాండ్తో కోహ్లీ సేన తలపడనుంది. ఇక ఉమెన్ టీం.. జూన్ 16న ఇంగ్లాండ్తో బ్రిస్టల్లో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు -
రెండు వారాలు ముంబైలో... పది రోజులు సౌతాంప్టన్లో...
ముంబై: మూడున్నర నెలల ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణం మొదటి మజిలీ ముంబైకి చేరుకుంది. జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టూర్లో భాగంగా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతుంది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్తో తలపడుతుంది. రెండు ప్రత్యేక విమానాల్లో... టీమిండియా జట్టు సభ్యులు సురక్షితంగా ముంబైకి చేరుకునేందుకు బీసీసీఐ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ, చెన్నైల నుంచి ఈ విమానాలు బయలుదేరాయి. ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరారు. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎక్కగా... రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిన మయాంక్ అగర్వాల్ కూడా వీరితో జత కలిశాడు. ఇదే ఫ్లయిట్ హైదరాబాద్కు వెళ్లింది. మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిలతోపాటు సిరాజ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దీంట్లో ప్రయాణించి ముంబై చేరారు. ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు పుజారా, జడేజా, అక్షర్, షమీ మాత్రం తమ ‘నెగెటివ్ రిపోర్ట్’లతో కమర్షియల్ ఫ్లయిట్ల ద్వారా విడిగా ముంబై చేరారు. అలా అయితే ఎలా... తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫెనల్కు సంబంధించిన నిబంధనలపై ఐసీసీ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. టెస్టులో ఇరు జట్ల ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాని సమయంలో వర్షం కారణంగా ఆట రద్దయిపోతే ఎలా... మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఎలా... వీటిపై ఇంకా ఐసీసీ మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు 4 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది. వారికి కాస్త సడలింపు... ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు. మరోవైపు ఐపీఎల్లోనే కరోనా పాజిటివ్గా తేలిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా కోలుకున్నాడు. స్టేడియం పక్కనే... లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్కు వెళ్లిపోతుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ కొనసాగుతుండగానే టీమిం డియా క్వారంటైన్ మొదలవుతుంది. అయితే మ్యాచ్ జరిగే ఏజియస్ బౌల్ మైదానానికి ఆనుకునే ఉన్న హోటల్లోనే ఉండాల్సి రావడం కొంత వెసులుబాటు. ఇక్కడ భారత్ 10 రోజుల పాటు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది. -
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
కోవిడ్తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు
పెదకూరపాడు: కరోనా రక్కసి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రిలో చేరగా, ఇదే అదునుగా భావించిన దొంగలు.. వారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు కథనం ప్రకారం.. పాటిబండ్ల గ్రామస్తుడు గార్లపాటి పూర్ణచంద్రరావు తన ఇంట్లో చిల్లర కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల రెండో తేదీన పూర్ణచంద్రరావు కోవిడ్తో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య నాగచంద్రిక, వారి ఇద్దరు కుమార్తెలు, తల్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈనెల 6న గుంటూరులోని అడవితక్కెళ్లపాడు క్వారంటైన్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్గా తేలడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా, చోరీ జరిగిన విషయం వెల్లడైంది. బీరువాను ఇనుప బద్దతో తెరిచి, అందులోని 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. గార్లపాటి నాగచంద్రిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ బారినపడి కుటుంబ పెద్దను కోల్పోయి, తల్లడిల్లుతున్న తమకు ఈ చోరీతో ఆర్థికంగానూ తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు
సాక్షి, మండ్య: కరోనా వైరస్ సెకండ్ వేవ్తో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఉల్లాసం నింపడానికి డాక్టర్లు, నర్సులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని ఆడి పాడారు. మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్ కేంద్రంలో కోవిడ్ రోగుల కోసం సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వేదిక మీద సరదాగా చిందులేశారు. స్వతహాగా జానపద గాయకుడు, కళాకారుడు అయిన అన్నదాని మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో రోగులు ఉల్లాసంగా ఉండాలని తెలిపారు. -
నెగెటివ్ వస్తేనే క్వారంటైన్కు...
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు ఇంగ్లండ్కు బయలుదేరే భారత జట్టుకు బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్లో టీమిండియా 14 రోజుల కఠిన క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు వీరంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. అందులో ప్రతీసారి నెగెటివ్ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్కు అనుమతి లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్వారంటైన్ పూర్తయ్యాక జూన్ 2న ఇంగ్లండ్కు భారత జట్టు పయనం కానుంది. ఈ పర్యటనలో పాల్గొనే భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే కోవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోగా... రెండో డోస్ను ఇంగ్లండ్లో తీసుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. సాహా, ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితేంటి? ఐపీఎల్ బయో బబుల్లో ఉంటూ కరోనా పాజిటివ్గా తేలిన సన్రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, తన ఇంటికి చేరుకున్నాక వైరస్ బారిన పడ్డ ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితి అయోమయంగా ఉంది. అందుకు కారణం వారికి ఇంకా నెగెటివ్ రిపోర్టు రాకపోవడమే. సాహా రెండో వికెట్ కీపర్గా ఇంగ్లండ్కు వెళ్లే జట్టులో స్థానం పొందగా... స్టాండ్ బై బౌలర్గా ప్రసిధ్ ఎంపికయ్యాడు. తాజాగా సాహాకు నిర్వహించిన రెండు కరోనా పరీక్షల్లో ఒక దాంట్లో నెగెటివ్ అని మరో దాంట్లో పాజిటివ్ అని తేలింది. దాంతో అతను క్వారంటైన్లోనే మరికొన్ని రోజులు ఉండాల్సి ఉంది. ప్రసి«ధ్ కూడా ఇంకా తన క్వారంటైన్ను పూర్తి చేయలేదు. మే 25లోపు వీరిద్దరూ ముంబైలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. లేకపోతే ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడ్డారు ఐపీఎల్కు సంబంధించిన మరో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్పై అపో హలతో పలువురు భారత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారని సమాచారం. సీజన్ ఆరంభానికంటే ముందుగా పలు ఫ్రాంచైజీలు వ్యాక్సిన్ డోస్లను ఏర్పాటు చేస్తామని తమ ఆటగాళ్లకు తెలియజేసినా... వాటిని వేయించుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందనే భావనలో కొందరు... బయో బబుల్లో ఉండగా వ్యాక్సిన్ ఎందుకని మరి కొందరు వాటికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ప్లేయర్లు వ్యాక్సిన్పై అయిష్టతతో ఉండటంతో... తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వారిపై ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేయలేకపోయాయని సమాచారం. మైక్ హస్సీకి ఊరట... కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి ఊరట లభించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దాంతో హస్సీ ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. -
విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కోవిడ్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్ గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కోవిడ్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలి. మిగిలిన వారు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు -
WTC FInal: భారత్కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు సరైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు భారత జట్టుకు తగినంత సమయం లభించడం లేదు. ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత ఉండే క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షలే అందుకు కారణం. అయితే ఇది మరీ పెద్ద సమస్య ఏమీ కాదని జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. మన ఆటగాళ్లకు ఉన్న అనుభవంతో దానిని అధిగమించవచ్చని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత హార్డ్ క్వారంటైన్ ఎన్ని రోజులు? సాఫ్ట్ క్వారంటైన్ ఎన్ని రోజులు? ఇలా అన్ని అంశాలు చూసిన తర్వాతే సన్నద్ధతపై స్పష్టత రావచ్చు. అయితే మాకు ఎంత సమయం దొరికినా దానిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎన్ని సెషన్లు ప్రాక్టీస్కు అవకాశం లభిస్తుందో చెప్పలేం. ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే మన జట్టులో ఆటగాళ్లంతా అనుభవజ్ఞులే. ఇలాంటి స్థితిలో అదే అవసరం. వారంతా పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. వారంతా న్యూజిలాండ్లోనూ ఇంగ్లండ్లోనూ కూడా ఆడారు’ అని శ్రీధర్ విశ్లేషించాడు. అయితే ఎక్కువగా సన్నద్ధం కాకపోవడం కూడా కొన్నిసార్లు మేలు చేస్తుందని శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని అతను చెప్పాడు. వారికి కొంత అనుకూలత: భరత్ అరుణ్ భారత్తో డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తలపడనుండటం న్యూజిలాండ్కు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉండాలని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్లోని పరిస్థితులకు అలవాటు పడతారు కాబట్టి కచ్చితంగా వారికి కొంత అనుకూలత ఉంటుంది. షెడ్యూల్ అలా ఉంది కాబట్టి మనమేమీ చేయలేం. దాని ప్రకారమే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంగ్లండ్తో సిరీస్లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుందో చూడటం ఎంతో అవసరం. దానిని బట్టే మన వ్యూహాలు తయారు చేసుకోవాల్సి ఉంది’ అని అరుణ్ వ్యాఖ్యానించాడు. చదవండి: WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్దే గెలుపు! -
సకుటుంబ సమేతంగా...
ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు జూన్ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘హార్డ్ క్వారంటైన్’లో ఉంటారు. ఇంగ్లండ్ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్ క్వారంటైన్’కు అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా చర్చలు కొనసాగిస్తోంది. హార్డ్ క్వారంటైన్లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు. సాఫ్ట్ క్వారంటైన్లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్ తరహాలో) అవకాశం ఉంటుంది. ‘భారత్లోనే మనవాళ్లు హార్డ్ క్వారంటైన్లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్లోంచి మరో బబుల్లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక అయిన ఏజియన్ బౌల్లో భాగంగానే హోటల్ హిల్టన్ ఉంది కాబట్టి సమస్య లేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. క్వారంటైన్ ముగిసిన తర్వాతే జూన్ 13 నుంచి క్రికెటర్లు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్ 18 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందునుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం కూడా ఉంది. శ్రీలంకలో అవకాశం ఉందా? ఐపీఎల్ను తమ దేశంలో నిర్వహించేందుకు గత ఏడాది కూడా తీవ్రంగా ప్రయత్నించి శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలమైంది. ఈసారైనా మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని ఆసక్తిగా ఉంది. అధికారికంగా బీసీసీఐకి ఇంకా ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా... బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ అర్జున డిసిల్వా మాత్రం తాము సెప్టెంబర్లో నిర్వహించగలమని నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో లీగ్ టోర్నీ నిర్వహణకు అవసరమైన ఫ్లడ్లైటింగ్తో నాలుగు మైదానాలు (ఖెట్టరమా, పల్లెకెలె, సూర్యవేవా, దంబుల్లా) అందుబాటులో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవలే లంకలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూలాంశం. నెలరోజుల క్రితం అక్కడ రోజుకు 300 కేసులు రాగా... ఇప్పుడు రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇంగ్లండ్లో నిర్వహించండి: పీటర్సన్ ఐపీఎల్–2021లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించడంకంటే ఇంగ్లండ్ సరైన వేదిక అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘సెప్టెంబర్ చివర్లో ఐపీఎల్ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్హామ్, లార్డ్స్, ఓవల్ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్ సిరీస్ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా’ అని పీటర్సన్ విశ్లేషించాడు. -
ఇక్కడే బబుల్ ఏర్పాటు చేద్దాం: బీసీసీఐ
ముంబై: ఇంగ్లండ్లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్లో ఉండాల్సిందే. దీని ప్రకారం ఎవరూ సహచర ఆటగాళ్లను కూడా కలవరాదు. అయితే ఈ విషయంలో ఏదైనా సడలింపులు కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీలో టీమిండియా సభ్యులు క్వారంటైన్లో ఉన్నా కలిసి ఆడుకునేందుకు అనుమతినిచ్చారు. ఇంగ్లండ్లో ఒక వారం మాత్రమే క్వారంటైన్ ఉండేలా అనుమతించాలని బోర్డు కోరనుంది. దానికంటే ముందు భారత్లోనే ఒక వారం రోజుల పాటు ‘ప్రత్యేక బయో బబుల్’ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఎలాగూ విమానాలు లేవు కాబట్టి క్రికెటర్లంతా ప్రత్యేక విమానంలోనే వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక్కడి బబుల్ నుంచి మరో బబుల్లోకి మారడం సులువవుతుంది. ఆటగాళ్లకు దీనివల్ల కొంత అదనపు సమయం లభిస్తుందని బీసీసీఐ చెబుతోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండటంతో పాటు ఐపీఎల్ బబుల్ బద్దలైన తీరు చూస్తే బీసీసీఐకి అంత సులువుగా అనుమతి లభించకపోవచ్చు. -
Hyderabad: కరోనా రోగుల ఇంటి వద్దకే ఫ్రీ ఫుడ్ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మొదటివేవ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పోలీసులు, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత సరఫరా చేపట్టారు. సేవా ఆహార్ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగించనున్నారు. దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు ముందుకు వస్తే త్వరలోరాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. కరోనా బారినపడి ఇంటికే పరిమితమై, బయటికి రాలేని వారికోసం ఈ సేవలు అందిస్తున్నారు. రెండు విధాలుగా ఆర్డర్ ఈ సేవా ఆహార్ పథకంలో రెండు రకాలుగా ఉచిత ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు. మొదటిది 7799616163 ఫోన్ నంబర్కు వాట్సాప్లో ఉదయం 7 గంటల్లోగా ఆర్డర్ చేయాలి. ఏడింటి తరువాత చేస్తే దాన్ని మరుసటి రోజు ఆర్డర్ కింద పరిగణిస్తారు. సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? తదితర వివరాలను పంపాలి. వీరికి ఐదురోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తారు. ఇలా రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందులో వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తారు. గతేడాది డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరుకులు, ఆహారం అందజేశారు.కాగా సేవా ఆహార్ కార్యక్రమాన్ని సత్యసాయిసేవా సంస్థతో పాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. -
యుగానికి ఒక్కడు హీరోయిన్కు కరోనా
కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
భార్యను కలిసేందుకు క్వారంటైన్ నుంచి పరార్.. చివరికి!
ముంబై: కరోనా మొదటి దశ కంటే రెండో దశ తీవ్రంగా హడలెత్తిస్తోంది. దేశంలోని పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు చూస్తుంటే మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమందైతే క్వారంటైన్ సెంటర్ లేదా ఇళ్లల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి భార్యను కలుసుకునేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన షాబుల్లా ఖాన్ అనే వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్నిబొరివలిలోని సాయినగర్ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల్లో తాను దిగ్బంధం కేంద్రం నుంచి తప్పించుకుంటామని నిందితులు పోలీసులను సవాలు చేశారు. అన్నట్టుగానే క్వారంటైన్ సెంటర్లో వైర్లు కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కండివాలి పోలీసులు 24 గంట్లోనే నిందితుడిని ముంబైలోని ఒషివర ప్రాంతంలో అరెస్ట్ చేశారు. భార్యను కలుసుకునేందుకే తాను పారిపోయానని నిందితుడు చెప్పుకొచ్చాడు. ఇక నిందితుడిపై ఫార్మసీల నుంచి రెమిడిసివిర్ మందులను చోరీ చేశాడనే ఆరోపణలున్నాయి. చదవండి: కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్ -
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్లో భాగంగా ఫామ్హౌస్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు రాపిడ్ టెస్ట్లో ముఖ్యమంత్రికి కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఫామ్హౌస్లో ఐసోలేషన్లో ఉన్న కేసీఆర్కు బుధవారం ఎంవీ రావు అధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేశారు. ఈ క్రమంలో రాపిడ్ టెస్ట్లో కోవిడ్ నెగిటివ్గా రిపోర్టు వచ్చినట్లు వైద్యం బృందం వెల్లడించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నట్లు తెలిపారు. చదవండి: కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్ -
క్వారంటైన్లో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్
హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు హీరో మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్. ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు. అయితే కోవిడ్ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు మహేశ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్చరణ్లు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మొన్నటివరకు ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ మేకప్మ్యాన్కు కూడా కరోనా పాజిటివ్. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్నారు. రామ్చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్చరణ్ కూడా క్వారంటైన్లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్ హీరోలు హోమ్ క్వారంటైన్లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. -
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
-
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం: ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్ 26 వరకు ఢిల్లీలో లాక్డౌన్ విధించింది అక్కడి ఆప్ సర్కార్. అయితే ఢిల్లీలో కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా స్వీయం నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే కేజ్రీవాల్ సతీమణి సునీత తాజాగా కోవిడ్-19బారిన పడ్డారు. దీంతో ఢిల్లీ సీఎం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో వారం రోజులు లాక్డౌన్ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీసీఎ ప్రకటించారు. గత ఏడాది జూన్లో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. -
తల్లి రొయ్యలకూ.. ఓ క్వారంటైన్ సెంటర్
సాక్షి, అమరావతి: రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ కోసం రంగం సిద్దమైంది. 2023 నాటికి ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రొయ్యల సాగు చేపట్టాలంటే నాణ్యమైన సీడ్ (రొయ్య పిల్ల) చాలా ముఖ్యం. నాణ్యమైన సీడ్ కావాలంటే జన్యుపరమైన సమస్యలు, రోగాల్లేని బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) అవసరం. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు బ్రూడర్స్ ద్వారా వాటి సంతతికి సంక్రమించవని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ అని వస్తేనే బ్రూడర్స్ను సీడ్ ఉత్పత్తికి అనుమతిస్తారు. దేశం మొత్తం చెన్నైకి క్యూ యానిమల్ ఇంపోర్ట్ యాక్ట్–1898 ప్రకారం విదేశాల నుంచి ఏ రకం లైవ్ స్టాక్ (జీవాల)ను దిగుమతి చేసుకున్నా.. వాటిద్వారా వాటి సంతతికి, మానవాళి సహా ఇతర జీవ రాశులకు ఎలాంటి రోగాలు సోకవని నిర్ధారించుకునేందుకు వాటిని క్వారంటైన్ చేయాల్సిందే. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలను కూడా క్వారంటైన్లో ఉంచి పరీక్షిస్తారు. ఇలా పరీక్షించేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చెన్నైలో మాత్రమే ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీన్ని మెరైన్ ప్రోడక్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా), రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చరిక్స్ (ఆర్జీసీఏ) నిర్వహిస్తున్నాయి. ఏపీతో సహా దేశంలోని ఆక్వా హేచరీలన్నీ ఈ కేంద్రానికి క్యూ కట్టాల్సిందే. ఇక్కడ 400 తల్లి రొయ్యలను ఒక క్యారంటైన్ క్యూబికల్లో ఉంచి ఐదారురోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక క్వారంటైన్ క్యూబికల్కి డిమాండ్ను బట్టి రూ.95 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేస్తారు. ఏటా 1.50 లక్షల బ్రూడర్స్ దిగుమతి రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీలు దేశవ్యాప్తంగా మొత్తం 560 ఉంటే.. వాటిలో 389 హేచరీలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏటా 65 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ఏటా సింగపూర్, హవాయ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల నుంచి 1.50 లక్షల బ్రూడర్స్ను హేచరీలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని క్వారంటైన్ చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు. దేశం మొత్తమ్మీద ఒకే ఒక్క క్యారంటైన్ కేంద్రం ఉండటంతో సకాలంలో క్వారంటైన్ పూర్తికాక, సీజన్కు నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అదును దాటిపోతుందన్న ఆందోళనతో నాసిరకం సీడ్పై ఆధారపడి ఆక్వా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 30 ఎకరాలను సేకరించారు. దీని నిర్మాణానికి రూ.36.55 కోట్లను కేటాయించి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు. దీనిని 2023 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తే లక్ష్యం నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఇది రెండో క్వారంటైన్ కేంద్రం. ఏడాదికి 1,23,750 బ్రూడర్స్ను పరీక్షించే సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ఒకేసారి 625 తల్లి రొయ్యలను పరీక్షించవచ్చు. వీటిద్వారా 10 బిలియన్ల సీడ్ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్వా సాగు విస్తరణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
హోమ్ క్వారంటైన్కు పవన్కల్యాణ్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్తగా డాక్టర్ల సూచనలతో ఆయన హోమ్ క్వారంటైన్కు వెళ్లినట్టు ఆ పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని, రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని వివరించింది. -
కరీంనగర్లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని. దాంతో మార్కెట్ యార్డ్లో తలదాచుకున్నది. ఈ విషయం తెలిసిన మార్కెట్ యార్డు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆదిరించేవారు లేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. రోడ్డుపై ఉన్న తోపుడు బండిపై సేదతీరే దుస్థితి ఏర్పడింది. ఈ విషాధకర ఘటన వివరాలు.. జమ్మికుంట అంబేడ్కర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయించి జీవనం సాగించే మహిళ కరోనా బారిన పడింది. విషయం తెలిసిన ఇంటి యజమాని ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో స్థానిక మార్కెట్ యార్డులో రాత్రంతా జాగరణ చేసింది. సదరు మహిళ కోవిడ్ బాధితురాలు అని తేలడంతో మార్కెట్ అధికారులు ఆమెను ఉదయం అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఇక ఉండటానికి స్థలం లేక పాత అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో సులబ్ కాంప్లెక్స్ ముందు తోపుడు బండి మీద నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. బాధితురాలి గురించి తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు దిలీప్ ఆమె గురించి వైద్యాధికారులకు సమాచారం అందించడంతో.. వైద్య సిబ్బంది అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. రెండు రోజులుగా రోడ్డుపై అవస్థ పడిన మహిళను చూసి చలించిపోయిన స్థానికులు, స్థానికంగా ఐసోలేషన్ హోం క్వారంటైన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్ -
క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా..
ముంబై: విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో అలరించాడు. క్వారంటైన్ పూర్తైన ఆనందంలో అతను మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ 'మూన్ వాక్' సాంగ్కు డ్యాన్స్ చేశాడు. యూనివర్సల్ బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్విటర్లో షేర్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారింది. కాగా, గేల్.. క్వారంటైన్ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు. Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite - Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021 అతను క్వారంటైన్ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్లేస్తూ, జిమ్లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. గతేడాది ఐపీఎల్లో లేట్గా బరిలోకి దిగినా సూపర్ ఫామ్ను కనబర్చిన గేల్.. 7 మ్యాచ్ల్లో 137.14 స్ట్రయిక్ రేట్తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. చదవండి: వివో బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా కెప్టెన్.. -
పడిక్కల్కు పాజిటివ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్పై కరోనా వైరస్ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు వరుసగా కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్ రిపోర్టులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్మన్ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే అతన్ని బయో బబుల్లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సీబీ మెడికల్ టీమ్ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్ నేపథ్యంలో పడిక్కల్ ఈ నెల 9న జరిగే సీజన్ తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తలపడుతుంది. లీగ్ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్ రాణా (కోల్కతా నైట్రైడర్స్) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐసోలేషన్లో ఉన్నాడు. ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్ శుక్లా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు. -
స్మిత్ వచ్చేశాడు...
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శనివారం ముంబై చేరుకున్నాడు. ప్రొటోకాల్ ప్రకారం ‘బయో బబుల్’లో అడుగు పెట్టిన అతడు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను ముగించుకోవాల్సి ఉంది. అనంతరం స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుతో చేరతాడు. ‘డీసీ కుటుంబంలోకి స్మిత్కు స్వాగతం’ అంటూ స్మిత్ ఉన్న ఫోటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో డీసీ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. 2020 ఐపీఎల్ ముగిసిన అనంతరం 31 ఏళ్ల స్మిత్ను రాజస్తాన్ రాయల్స్ విడుదల చేయగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని రూ. 2.2 కోట్లకు డీసీ దక్కించుకుంది. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తమ తొలి మ్యాచ్తో డీసీ ఐపీఎల్ టైటిల్ వేటను ఆరంభించనుంది. -
రెండుసార్లు క్వారంటైన్కు వెళ్లిన స్టార్ హీరోయిన్
డబుల్ హోమ్ క్వారంటైన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు హీరోయిన్ ఆలియా భట్. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్లో దర్శకుడు సంజయ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఇలా హోమ్ క్వారంటైన్ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. ‘ ‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. నేను కోలుకోవాలని ఆశిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఆలియా. ఇలా డబుల్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు ఆలియా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆలియా ప్రియుడు రణ్బీర్ కపూర్కు కూడా ఆ మధ్య కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇటీవలే రణ్బీర్కు నెగటివ్ వచ్చింది. చదవండి : మలైకాకు కోవిడ్ వ్యాక్సిన్ -
వాద్రాకు పాజిటివ్.. క్వారంటైన్లో కుటుంబం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తామిద్దరు ఢిల్లీలోని వారి నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నామని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అంతకు ముందు తనకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు వాద్రా. ఆ తర్వాత ప్రియాంక తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘నా భర్తకు కరోనా పాజిటివ్గా తేలింది. నేను కూడా టెస్ట్లు చేయించుకున్నాను. నాకు నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం హోం క్వారంటైన్లో ఉంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్టా నేను అస్సాం, తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రియాంక వీడియోలో తెలిపారు. हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021 ‘‘పిల్లలు కూడా గత కొద్ది కాలంగా మాతోనే ఉంటున్నారు.. అదృష్టం కొద్ది ప్రియాంకకు, పిల్లలకు నెగిటివ్గా తేలింది’’ అని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ఇక ప్రియాంక మంగళవారం కేరళలో రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రచారం చేశారు. చదవండి: క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ... -
క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...
ముంబై: గత రెండేళ్లుగా ఇద్దరు భారత టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు పలుమార్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానుల మధ్య చాలాసార్లు రచ్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరు అంగీకరించడం కానీ ఖండించడం గానీ ఎప్పుడూ చేయలేదు. మైదానంలో, జట్టు కోసం ఆడుతున్న సమయంలో కూడా అలాంటిది ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. వ్యక్తిగత అంశాల గురించి ఆలోచనే రాకుండా టీమ్ గెలుపు కోసం పరస్పర గౌరవంతోనే ఆడుతూ వచ్చారు. అయితే ‘విభేదాలు’ వాస్తవమేనని తేలింది. పైగా హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకొని దీనిని చక్కబెట్టినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా కరోనా కాలంలో క్వారంటైన్లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో కోహ్లి, రోహిత్ శర్మ పరస్పరం పలు అంశాలపై మాట్లాడుకునేందుకు తగినంత తీరిక దొరిగింది. తమ మధ్య పెరుగుతున్న అంతరానికి కారణమైన వేర్వేరు విషయాలపై వీరిద్దరు చర్చించుకున్నారని... ఈ విషయంలో రవిశాస్త్రిదే కీలకపాత్ర అని సమాచారం. ‘రెండు పెద్ద సిరీస్లలో విజయం సాధించడంతోపాటు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కు సంబంధించి మరో మేలు జరిగింది. కొన్ని వారాలుగా కోహ్లి, రోహిత్ మధ్య వ్యక్తిగత బంధం దృఢంగా మారింది. జట్టు గురించి, తమ బాధ్యతలు, రాబోయే సవాళ్ల గురించి వారు బాగా చర్చించుకున్నారు. తామిద్దరం పరస్పరం సమన్వయంతో కలిసి పని చేస్తే జట్టుకు ఎలాంటి మంచి జరుగుతుందో వారికి అర్థమైంది. గత నాలుగు నెలల్లో జట్టుకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. తామిద్దరి గురించి బయట ప్రచారం ఉన్న పలు విషయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. చదవండి: (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) జట్టులో నేను ఎవరికంటే తక్కువ కాదు అనే భావనతో ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే మిగతావారు దానిని దుర్వినియోగం చేయడం ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్లో ఉన్నదే. ఒకేచోట పని చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. అవి అభిప్రాయభేదాలు మాత్రమే. అయితే ఇంతకాలం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని వారు అనుకోలేదు. ఇప్పుడు ఇద్దరికీ చాలా స్పష్టత వచ్చింది. ఇటీవల జరిగిన మ్యాచ్లు చూస్తే వీరి మధ్య బంధం బలపడినట్లు మనందరికీ అర్థమవుతుంది. బయో బబుల్ చేసిన మేలు ఇది’ అని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు ఈ పరిణామాలను వెల్లడించారు. -
క్వారంటైన్లోకి ఎమ్మెల్సీ కవిత కుటుంబం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్వారంటైన్లోకి వెళ్లారు. తన భర్త అనిల్ కోవిడ్–19 బారిన పడటంతో తమ కుటుంబం కూడా క్వారంటైన్లోకి వెళ్లినట్లు బుధవారం కవిత ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు కవిత చెప్పారు. My husband Anil garu has tested positive for #COVID19. He is under home quarentine and is doing well. My family and I have quarantined ourselves and would not be making any public or personal appearances. My office will reschedule all the meetings to avoid inconvenience. — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 24, 2021 దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతుంది. రోజురోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా కేసులు, 251 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేసిన సంగతి తెలిసిందే. చదవండి: తెలంగాణలో ఇదే తొలిసారి -
ఈ ప్రయాణికులను క్వారంటైన్ నుంచి మినహాయించారు
ముంబై : దేశంలో కోవిడ్ మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్ను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయంలో మహరాష్ట్ర ప్రభుత్వం కొంత మంది ప్రయాణికులకు మాత్రం క్వారెంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ జాబితాలో యూరప్, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు రెండు మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇందులో 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, గర్భంతో ఉన్న మహిళలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నపిల్లల తల్లిదండ్రులను చేర్చింది . వీరితో పాటు క్యాన్సర్, తీవ్రమైన శారీరక వైకల్యం, మానసిక అనారోగ్యం వంటి తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే ప్రయాణీకులకు ఆ వెసలుబాటుని కల్పించింది, కాకపోతే వారు మెడికల్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. అత్యవసర శస్త్ర చికిత్సలు చేయడం కోసం ప్రయాణించాలనుకునే వైద్యులను కూడా మినహాయించారు. వీరు శస్త్రచికిత్స చేయటానికి వెళ్తున్నట్లు సంబంధిత ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో లేని ప్రయాణికులకు క్వారంటైన్ను తప్పనిసరి చేసింది. వివిధ దేశాల నుంచి మహరాష్ట్రకు వచ్చే ప్రయాణీకుల నెగిటివ్ రిపోర్ట్ తో సంబంధం లేకుండా వారిని 7 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో క్వారంటైన్లో ఉంచనుంది. దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ( చదవండి : వ్యోమగాములకు తప్పని క్వారంటైన్ ) -
వ్యోమగాములకు తప్పని క్వారంటైన్
వాషింగ్టన్: కోవిడ్ -19 దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మానవ జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. కోవిడ్ -19 పుణ్యమా ... క్వారంటైన్, సోషల్ డిస్టన్స్, లాక్డౌన్, వంటి పదాలు మన జీవితంతో భాగమయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కచ్చితంగా క్వారంటైన్ చేయాల్సి వచ్చేది. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారినే క్వారంటైన్ చేశారనుకుంటే మీరు పొరపడినట్లే..! చంద్రునిపై 1969లో మొదటిసారిగా కాలుమోపిన ఆస్ట్రోనాట్స్ కూడా క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖగోళయాత్ర చేసి తిరిగి భూమి పైకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ బజ్ అల్ర్ర్డిన్ వ్యోమగాములను 21 రోజులపాటు క్యారంటైన్లో ఉంచారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన ముప్పైతొమ్మిదో పుట్టినరోజు వేడుకలను కుటుంబానికి దూరంగా ఉండి జరుపుకున్నాడు. క్వారంటైన్ మనకు కొత్తగా ఉన్న , వ్యోమగాములకు మాత్రం సాధారణమే. క్వారంటైన్ ఎందుకు ఉండాల్సివచ్చిందంటే... అపోలో-11 మిషన్ వ్యోమగాములు చంద్రునిపై ఉన్న వాతావరణం, లూనార్ పదార్థాలతో మొదటిసారిగా గడిపారు.వ్యోమగాములను చంద్రునిపై ఉన్న హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ వారు అక్కడి వాతావరణానికి బహిర్గతమైతే అది భూమిపై ఉన్న మానవాళికి విపత్తుగా మారుతుంది.దీంతో ఖగోళయాత్ర అనంతరం ముగ్గురు వ్యోమగాములను క్వారంటైన్లో ఉంచారు. వారిని వైద్యులు నిశితంగా పరిశీలించారు.మరొక బృందం అపోలో-11 మిషన్ తీసుకొచ్చిన రాళ్లు, ధూళిని పరీక్షించి అధ్యయనం చేశారు. చంద్రునిపై తెలియని అంశాలు , హానికరమైన బ్యాక్టీరియాను పక్కన పెడితే, వ్యోమగాములు చంద్ర నమూనాలను సేకరించినప్పుడు వారికి తెలియకుండానే తీసుకువచ్చే అంశాలు వారి జీవితాన్ని భంగం కలిగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అపోలో -12 , అపోలో -14 మిషన్లకు మూన్ ల్యాండింగ్ తరువాత తిరిగివచ్చే వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగింది. కొన్నిరోజుల తరువాత అపోలో ప్రోగ్రాం తదుపరి మిషన్ల వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగలేదు ఎందుకంటే అంతరిక్షంలో ప్రమాదకరమైన అంశాలు లేవని పరిశోధకులు భరోసా ఇచ్చిన వెంటనే క్వారంటైన్ను నిలిపివేశారు.‘అపోలో 11: క్వారంటైన్’ అనే డాక్యుమెంటరీ మార్చి 6 న ప్రముఖ ఆంగ్ల చానల్లో ప్రసారమయ్యింది. -
యూకేకు ప్రయాణం మరింత కఠినం
లండన్: కోవిడ్ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన తాజా ఆంక్షలతో హైరిస్క్ రెడ్ లిస్ట్లో ఉన్న 33 దేశాల నుంచి ఇంగ్లండ్కు తిరిగి వచ్చిన యూకే, ఐర్లాండ్కు చెందిన ప్రయాణీకులు హోటల్లో క్వారంటైన్లో గడపాలి. ఈ జాబితాలో భారత్ లేదు. ఇంగ్లండ్కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లు(రూ.1,76,581)ను ముందుగా చెల్లించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది. రెడ్ లిస్ట్లో లేని భారత్ వంటి దేశాలకు వెళ్లని యూకే, ఐర్లాండ్ నివాసితులు 10 రోజులపాటు తమ ఇళ్లలో క్వారంటైన్లో గడపాలి. ఇంగ్లండ్కు చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. ‘కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో తాజా చర్యలు తీసుకున్నాం. కొత్త వేరియంట్లను సరిహద్దులు దాటి లోపలికి రానివ్వరాదన్నదే మా లక్ష్యం’అని యూకే ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించింది. యూకే రెడ్లిస్ట్లో చేర్చిన 33 దేశాల్లో వివిధ కోవిడ్–19 వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు యూకేలోకి ప్రవేశించిన ఏ ప్రాంతం వారైనా ప్రయాణానికి మూడు రోజులు ముందుగా చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ పరీక్ష రిపోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అదేవిధంగా, రెడ్ లిస్ట్లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్ రెసిడెంట్లపై బ్రిటన్లో ప్రవేశించరాదనే నిబంధన కూడా ఉంది. యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన లాక్డౌన్ నిబంధనలతో అత్యవసరం కాని ప్రయాణాలపై నిషేధం ఉంది. యూకే నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు మరిన్ని అధికారాలు తాజా నిబంధనల ప్రకారం సరిహద్దు భద్రతా బలగాలకు, పోలీసులకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, అనుమానిత ప్రయాణీకులను గుర్తించి మూడు గంటలపాటు నిర్బంధంలో ఉంచేందుకు వారికి అధికారాలిచ్చారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించారు. క్వారంటైన్ కోసం ప్రభుత్వం 4,963 గదులున్న 16 హోటళ్లను గుర్తించింది. మరో 58 వేల రూంలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణీకులు ఇంగ్లండ్కు చేరుకోవడానికి ముందుగానే తమ క్వారంటైన్ రూంలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటైంది. హీత్రూ ఎయిర్పోర్టు, గాట్విక్, లండన్ సిటీ, బర్మింగ్హామ్, ఫార్న్బరోల్లో హోటళ్లను క్వారంటైన్ కోసం సిద్ధంగా ఉంచారు. -
ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్లు వాయిదా
మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్బోర్న్లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఓ కార్మికుడికి కోవిడ్–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. -
మనోళ్లు మైదానంలోకి...
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగబోయే టెస్టు సిరీస్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభ విఘ్నాన్ని అధిగమించారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల్లో క్రికెటర్లంతా నెగెటివ్గా తేలారు. ఆరు రోజులుగా ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. సోమవారంతో ఇది ముగిసింది. ఈ ఆరు రోజుల కాలంలో ఒక్కో ఆటగాడికి మూడుసార్లు చొప్పున కరోనా టెస్టులు జరిపారు. అన్నింటిలోనూ నెగెటివ్ ఫలితం రావడంతో ఎలాంటి సమస్య లేకుండా టెస్టు సిరీస్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. తొలి టెస్టు మ్యాచ్కు ముందు ఇరు జట్లకు మూడు రోజుల పూర్తి స్థాయి నెట్ ప్రాక్టీస్కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు సాధన చేసేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కొందరు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగి అవుట్డోర్ సాధనకు ఉపక్రమించారని బీసీసీఐ వెల్లడించగా... నేడు ఆటగాళ్లంతా నెట్స్లోకి వస్తారని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన బెన్ స్టోక్స్, ఆర్చర్, బర్న్స్ క్వారంటైన్ పూర్తి చేసుకొని గత రెండు రోజులుగా సాధన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు చెన్నైలో జరగనుండగా... తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన అద్భుత విజయంతో టీమిండియా అమితోత్సాహంతో బరిలోకి దిగుతుండగా... శ్రీలంకపై 2–0తో గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది. -
సెరెనా ‘జూ’కు... జొకోవిచ్ పార్క్కు...
అడిలైడ్: 14 రోజుల క్వారంటైన్... మరో చోట అయితే మామూలుగా గడిచిపోయేదేమో! కానీ కఠిన ఆంక్షలు ఉన్న ఆస్ట్రేలియాలో అదంత సులువు కాదు. ఇక ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆటగాళ్ల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చి క్వారంటైన్లో ఉన్న టెన్నిస్ స్టార్లు తమ రెండు వారాల క్వారంటైన్ ముగియడంతో ఒక్కసారిగా స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు. మాజీ నంబర్వన్ సెరెనా విలియమ్స్ తన మూడేళ్లు కూతురు ఒలింపియాతో కలిసి ‘జూ’కు వెళ్లి సరదాగా గడిపింది. ‘ఒక్క గదిలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా కష్టం. అయితే పాపతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. ఇప్పుడు బయటకు రావడం సంతోషంగా ఉంది. అందుకే క్వారంటైన్ ముగియగానే జూకు వెళ్లొచ్చాం’ అని సెరెనా చెప్పింది. వరల్డ్ నంబర్వన్ జొకోవిచ్ క్వారంటైన్ ముగియగానే స్థానిక పార్క్లో చెప్పులు లేకుండా నడిచి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ‘ఇన్ని రోజులుగా నాకు అవకాశం రాని పని చేయాలననుకున్నా. ఇప్పుడు ఇలా పచ్చగడ్డిపై పాదాలు పెట్టగానే హాయిగా అనిపించింది’ అని జొకోవిచ్ అన్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లలో నయోమి ఒసాకాపై సెరెనా విలియమ్స్, యాష్లే బార్టీపై సిమోనా హలెప్, డొమినిక్ థీమ్పై రాఫెల్ నాదల్ విజయం సాధించారు. జన్నిక్ సిన్నర్తో జరిగిన మ్యాచ్లో తొలి సెట్లో ఫిలిప్ క్రనోవిక్ తలపడగా... రెండో సెట్లో క్రనోవిక్ స్థానంలో జొకోవిచ్ వచ్చి ఆడటం విశేషం. ఈ మ్యాచ్లో క్రనోవిక్–జొకోవిచ్ గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్లో ఫిబ్రవరి 8న మొదలవుతుంది. -
గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్బోర్న్కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రాక్టీస్కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్గా మార్చుకుంది. బీరువాకు బంతి కొడుతూ షాట్లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
క్వారంటైన్కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
ఆంక్షల్లో సడలింపులివ్వండి
న్యూఢిల్లీ: భారత్–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో చర్చనీయాంశంగా నిలుస్తోన్న బ్రిస్బేన్ టెస్టు క్వారంటైన్ నిబంధనల్ని సడలించాలని పేర్కొంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు లేఖ రాసింది. పర్యటన ప్రారంభంలోనే టీమిండియా కఠిన ఐసోలేషన్ను పూర్తి చేసుకున్నందున మళ్లీ నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్లో నిర్బంధంలో ఉండటం కష్టమని లేఖలో స్పష్టం చేసింది. సిరీస్ కోసం ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ రెండు వేర్వేరు నగరాల్లో భారత జట్టు రెండుసార్లు కఠిన ఐసోలేషన్ పాటిస్తుందని ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది. ఈనెల 15నుంచి బ్రిస్బేన్లో నాలుగో టెస్టు జరగనుంది. బ్రిస్బేన్ ఉన్న క్వీన్స్లాండ్ రాష్ట్రం కరోనా కట్టడి నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం కేవలం వారి గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే యూఏఈలో ఐపీఎల్ ముగించుకొని ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు అప్పుడే సిడ్నీలో ఈ తరహా కఠిన క్వారంటైన్ను పాటించింది. మళ్లీ బ్రిస్బేన్లో గదులకే పరిమితం అవ్వడాన్ని ఇబ్బందిగా భావిస్తోన్న భారత క్రీడాకారులు... హోటల్లోని బయోబబుల్లో సహచరులతో కలిసి భోజనం చేసేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు పేర్కొన్న ప్రకారం ఒకే అంతస్థులో ఉండే ఆటగాళ్లు కలుసుకోవచ్చు, కానీ వేరే అంతస్థులో ఉంటోన్న సహచరులతో దూరం పాటించాలి. ఇలాంటి నిబంధనలనే సడలించాలని లేఖలో కోరిన బీసీసీఐ, ఆటగాళ్లు ఐపీఎల్ తరహా బయోబబుల్ నిబంధనల్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సైతం బయటంతా మామూలుగా ఉన్నప్పుడు కేవలం హోటల్ గదులకే పరిమితం కావడం సవాలుతో కూడుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
రోహిత్ నేడు జట్టుతో...
మెల్బోర్న్: ఎట్టకేలకు రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు. క్వారంటైన్ అనంతరం నేడు అతను మెల్బోర్న్లో భారత జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్లో గాయమైన నాటినుంచి పలు మలుపులు, వివాదాలు, డ్రామా, ఫిట్నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. బుధవారం సహచరులతో కలిసిన తర్వాత అతను సాధన ప్రారంభించే అవకాశం ఉంది. తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడేంచే విషయం నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్ అగర్వాల్ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్తరకం కరోనా వైరస్: మహారాష్ట్రలో కర్ఫ్యూ!
ముంబై : యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్తో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. రేపటి(ఈనెల 22) నుంచి జనవరి 5వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. వారికి ఐదు లేదా ఏడవరోజు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ అని తేలితేనే రాష్ట్రంలోకి అనుమతించనుంది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే ఆంక్షలు విధించింది. కోవిడ్ వ్యాప్తి నివారణకు సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కొత్త కరోనా వైరస్.. బ్రిటన్ నుంచి విమానాలు రద్దు..) కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలందరూ కోవిడ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూకేలో బయటపడ్డ కొత్తరకం వైరస్తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా, హాంకాంగ్, సౌదీ అరేబియాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మనదేశంలోనూ రేపు అర్థరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు యూకేకు నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. (కరోనా నిబంధనలు బ్రేక్..నెటిజన్ల ట్రోల్స్ ) -
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు కరోనా
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్గా తేలిందని అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్ధారణ కాగానే మాక్రాన్ ఏడు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. క్వారంటైన్లో ఉంటూనే ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.ఇటీవల మాక్రాన్ చాలా మంది ప్రపంచ నేతల్ని కలుసుకున్నారు. ఈయూ సదస్సుకు సైతం హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడిని కలుసుకున్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్ష భవనం ప్రతినిధులు సూచించారు. ఇటీవల ఫ్రాన్స్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్డౌన్ కూడా విధించారు. ఈ నెల 27 నుంచి ఫ్రాన్స్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ తర కరోనా బారిన పడి కోలుకున్నారు. -
ఈ కష్టాన్ని దాటేస్తా!
‘‘కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను. గృహనిర్భందంలో ఉంటున్నాను’’ అన్నారు కృతీ సనన్. ఇటీవల ఓ హిందీ చిత్రం షూటింగ్ ముగించుకుని చండీగఢ్ నుంచి ముంబై చేరుకున్నాక కృతీ సనన్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ అనే వార్త వచ్చినప్పటికీ మొదట ఆమె స్పందించలేదు. అయితే, కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పష్టం చేశారు. ‘‘ఈ కష్టాన్ని దాటేస్తాను. బాగా విశ్రాంతి తీసుకుని, త్వరలో మళ్లీ నా పనులు మొదలుపెడతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మహమ్మారి (కరోనా) ఇంకా మనతోనే ఉంది’’ అన్నారు కృతీ సనన్. -
అడుగు బయటపెట్టారు
కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో అందరూ దాదాపు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్వీయ సవాల్ విసురుకున్నారు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా ఎన్ని రోజులు ఉండగలనన్నది ఆ చాలెంజ్. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కొన్ని రోజుల క్రితం పంచుకున్నారు. ‘ఇప్పటికే నాన్న ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 150 రోజులయింది’ అని పేర్కొన్నారు దుల్కర్. దాదాపు తొమ్మిది నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు మమ్ముట్టి. సుమారు 275 రోజులు ఇల్లు కదల్లేదు ఆయన. తాజాగా స్వీయ నిర్భంధాన్ని బ్రేక్ చేశారు. శుక్రవారం ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు మమ్ముట్టి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. త్వరలోనే సినిమా షూటింగ్స్లోనూ పాల్గొననున్నారట మమ్ముట్టి. -
క్వారంటైన్లో ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నేతలు, కార్యకర్తలంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలంతా పెద్ద సంఖ్యలో వచ్చారని, వారంతా లక్షణాలున్నా లేకున్నా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అనుమానం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ రమేశ్రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరి ధిలో 10 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో వేలాది మంది పాల్గొన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అందుకే నేతలంతా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైద్యపరంగా అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. అంతర్జాతీయంగా, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మొదలైందని పేర్కొన్నారు. అందుకే రోజుకు రాష్ట్రంలో 65 వేల పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,090 కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు జరుగుతుండగా, వాటికి అదనంగా మరో 50 కేంద్రాల్లో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో 25, రంగారెడ్డిలో మరో 25 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి తోడు మరో 300 మొబైల్ వాహనాల ద్వారా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్యా వృద్ధాశ్రమాలు, చైల్డ్ హోమ్స్, అనాథ శరణాలయాల్లో ప్రతి పది రోజులకోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి మరింత సమాచారం కోసం 104కు కాల్ చేయాలని, ఒకవేళ అది కలవకుంటే ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040–24651119కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. పెళ్లిళ్ల వల్ల భారీగా కేసులు.. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్ల వల్ల కూడా కొన్నిచోట్ల కేసులు ఆకస్మికంగా పెరుగుతున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లకు వందలాది మంది హాజరుకావడం వల్ల జగిత్యాలలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ రాకుండా చూసే బాధ్యత మన చేతుల్లోనే ఉందన్నారు. మొదటి దశలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశామన్నారు. టీకా మొదటి డోసు ఇచ్చిన 3 వారాల తర్వాత మళ్లీ ఇంకో డోసు ఇవ్వాలని, అది ఇచ్చిన తర్వాత 9 నెలల పాటు దాని ప్రభావం ఉంటుందన్నారు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందరికీ అందించడానికి సమయం పడుతుందన్నారు. వాక్సిన్ సాఫ్ట్వేర్ డ్రై రన్కు రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోని బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర బృందం డ్రై రన్ నిర్వహిస్తోందని తెలిపారు. గత నాలుగు నెలలుగా కరోనా వ్యాప్తి రేటు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 70–80 లక్షల మందికి మొదటి దశలో కరోనా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అందరికీ టీకాలివ్వడం సాధ్యం కాదని కేంద్రం రాష్ట్రాలకు తెలిపిందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రారంభానికి చర్యలు.. టీకా వచ్చిన తర్వాత వైద్య సిబ్బందికే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నర్సులు పరిధి దాటి ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారంటైన్ సెలవులను రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, అదే పాటిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సోకిన వారు 3 నెలల నుంచి ఏడాది పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. అన్ని శస్త్ర చికిత్సలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. -
కోహ్లి ట్వీట్పై నెట్ఫ్లిక్స్ సంబరం
సిడ్నీ:నచ్చిన వ్యక్తితో ఫోటో దిగితే మనకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అసలు ఆ రోజ నిద్ర పడితే ఒట్టు..! అలాంటి గొప్ప అనుభూతి నెట్ఫ్లిక్స్కు శనివారం ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ .. ‘ క్వారంటైన్ డైరీస్.. ఇస్త్రీ చేయని టీ షర్ట్, సౌకర్యవంతమైన సోఫా, చూడటానికి మంచి సిరీస్’ అంటూ వెబ్ సిరీస్ చూస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెట్ఫ్లిక్స్ ఇండియా విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే కల నిజమైందంటూ ట్విటర్లో పేర్కొంది. ఈ ట్వీట్కు మూడు వేలకు పైగా లైక్లు వచ్చాయి. ఇక నెట్ఫ్లిక్స్లో అదిరిపోయే వెబ్ సీరిస్లు ఉన్నాయంటూ కోహ్లి అభిమానులు చెప్తున్నారు. మీర్జాపూర్ , డార్క్ , వంటి వెబ్ సిరీస్లు చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. Quarantine diaries. Un-ironed T-shirt, comfortable couch and a good series to watch. 👌 pic.twitter.com/Yr26mHYCOL — Virat Kohli (@imVkohli) November 17, 2020 -
బ్రిటన్ ప్రధానికి మళ్లీ కరోనా
లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్ పాజిటివ్గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్కు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి. అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు. బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో బ్రిటన్ ప్రధాని తొలిసారి కోవిడ్–19 బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోవిడ్–19 నియంత్రణకు జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద 6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది. దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామంది. -
హలో ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత క్రికెట్ బృందం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ప్రత్యేక విమానంలో దుబాయ్నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. టీమిండియా సభ్యులతో పాటు ఐపీఎల్లో ఆడిన ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, కమిన్స్ తదితరులు కూడా గురువారమే స్వదేశం చేరారు. వీరందరిని స్థానిక అధికారులు సిడ్నీ ఒలింపిక్ పార్క్ ప్రాంతానికి పంపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటీన్ కోసం వీరంతా అక్కడి పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఉన్న ‘పుల్మ్యాన్’ హోటల్లో బస చేశారు. క్రికెటర్ల కోసమే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక రగ్బీ టీమ్ న్యూసౌత్వేల్స్ బ్లూస్ జట్టును అక్కడినుంచి తరలించారు. హోటల్లో ఆటగాళ్లను మినహా ఎలాంటి అతిథులను అనుమతించడం లేదు. ‘పుల్మ్యాన్’ హోటల్లో విరాట్ కోహ్లి కోసం ప్రత్యేక పెంట్ హౌస్ సూట్ను కేటాయించారు. క్వారంటీన్ సమయంలోనే జట్టు ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రం అధికారులు అనుమతినిచ్చారు. ఆటగాళ్లు సాధన చేయాల్సిన బ్లాక్టౌన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ పార్క్ను కూడా బయో బబుల్ సెక్యూరిటీలో సిద్ధం చేశారు. ప్రాక్టీస్ కోసం మాత్రమే క్రికెటర్లు తమ హోటల్ గదులు వీడి బయటకు రావాల్సి ఉంటుంది. టీమిండియా సభ్యులలో కొందరి కోసం పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు వచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. రహానే, అశ్విన్ తమ కుటుంబాలతో అక్కడికి వెళ్లారు. కొత్త జెర్సీలతో... ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్ల కోసం భారత జట్టు పాత రోజులను గుర్తుకు తెచ్చే (రెట్రో) రంగు జెర్సీలతో బరిలోకి దిగనుందని సమాచారం. ఇది 1992 వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు ధరించిన కిట్ను పోలి ఉంది. -
కలిసి...మెలిసి... అతిక్రమించారు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు కరోనా వైరస్ ప్రొటోకాల్ను విస్మరించారు. క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు. ఇవన్నీ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్ బోర్డుకు పంపించామని కివీస్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆష్లే బ్లూమ్ఫీల్డ్ తెలిపారు. -
పాజిటివ్... కానీ లక్షణాలు లేవు
కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతోంది. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పలువురు కరోనా బారిన పడి కోలుకోగా, మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా హీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి జాయిన్ కావాల్సి ఉంది. షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా ముందస్తుగా చేయించుకున్న కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత నాలుగైదు రోజుల్లో నన్ను కలిసినవారందరూ కూడా కోవిట్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. -
క్వారంటైన్లో డబ్ల్యూహెచ్వో చీఫ్
జెనీవా: కరోనా సోకిన వ్యక్తిని కలిసిన కారణంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం తాను క్వారంటైన్లో ఉంటున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని టెడ్రోస్ తెలిపారు. టెడ్రోస్ కలిసిన కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరో ఆయన వెల్లడించలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూహెచ్వో జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఐదు లక్షల జనాభా గలిగిన జెనీవాలో రోజుకి 1000 కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. జెనీవాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కోవిడ్ని కట్టడి చేసే కర్తవ్యనిర్వహణలో టెడ్రోస్ ముందుభాగాన ఉండి పోరాడుతున్నారు. రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్వో నియమాల ప్రకారం ఇంటి నుంచే పనిచేస్తానని టెడ్రోస్ వెల్లడించారు. కోవిడ్ని దాచిన బ్రిటన్ యువరాజు బ్రిటన్ యువరాజు విలియమ్స్కు ఏప్రిల్లో కరోనా సోకినప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచారని, అప్పటికే ఆయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ కోవిడ్తో క్వారంటైన్లో ఉన్నారని, అందుకే సన్నిహితులెవ్వరూ బాధపడకూడదని ఎవ్వరికీ చెప్పలేదన్న విషయాన్ని బ్రిటన్ మీడియా బయటపెట్టింది. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించే వరుసలో రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ విలియమ్స్కి కోవిడ్ సోకడంతో ప్రభుత్వ నియమాలను అనుసరించి, ప్యాలెస్లోని వైద్యులు తూర్పు ఇంగ్లాండ్లోని నార్ఫోల్క్లోని సొంత ఇంటిలో క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించినట్లు మీడియా పేర్కొంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏప్రిల్లో దాదాపు 14 టెలిఫోన్ కాల్స్, వీడియో కాల్స్ని యువరాజు మాట్లాడారని, బర్టన్లోని క్వీన్స్ ఆసుపత్రికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ వర్కర్స్తో మాట్లాడారని ఆ కథనం పేర్కొంది. యువరాజు కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితం అయ్యారని లండన్లోని ఇంటికే పరిమితమయ్యారని ఆ కథనం పేర్కొంది. భారత్లో కొత్త కేసులు 45 వేలు దేశంలో గత 24 గంటల్లో 45,231 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,29,313కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,607కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 75,44,798కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,61,908 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 6.83 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 91.68 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 113 మంది మరణించారు. ఈ నెల 1 వరకూ 11,07,43,103 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 8,55,800 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్ను తాకాయి. వైరస్ బారిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, కరోనా వైరస్కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. అయినా కానీ డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటూ, ఇంటినుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నానని చెప్పారు. కాగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 68 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డాడు. 12 లక్షల మందికి పైగా మరణించారు. దేశంలో గత 24 గంటల్లో 46964 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లతో భారతదేశంలో మొత్తం కేసులు 81,84083 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,22,111 కు పెరిగిన సంగతి తెలిసిందే. I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home. — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020 -
కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది. ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్ క్రికెటర్లు... ఆసీస్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ వచ్చేసరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. -
సెకండ్ వేవ్ టెన్షన్.. 200 రోజులుగా ఒక్క కేసు లేదు
తైపీ: ప్రపంచవవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా ఉధృతి ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. ఈ సమస్యలు ఇలా ఉండగనే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక ప్రారంభంలో కంటే కూడా సెకండ్ వేవ్లో భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ చిన్న దేశం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం 23 మిలియన్ల జనాభాలో కేవలం 553 మందికే వైరస్ సోకడం.. ఏడుగురు మాత్రమే చనిపోవడం వంటి విషయాలు అగ్రదేశాలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంటంటే గత 200 రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం. ఏప్రిల్ 12న చివరి కోవిడ్ కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వరకు స్థానికంగా (201 రోజులు) ఒక్క కేసు కూడా నమోదు లేదు. ఇంతకు ఆ దేశం పేరు చెప్పలేదు కదా.. అదే తైవాన్. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచే తైవాన్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రయాణాలు బంద్ చేసింది. చాలా పక్కగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడమే కాక మాస్క్ ధరించడం విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. గతంలో సార్స్తో పోరాడిన అనుభవం కూడా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం తైవాన్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అసలే లేదని అంటు వ్యాధి వైద్యుడు మరియు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పీటర్ కొల్లిగ్నాన్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచంలోనే తైవాన్ ఉత్తమంగా నిలిచిందని అన్నారు. ఆస్ట్రేలియాతో సమానమైన జనాభా కలిగిన ఆర్థిక వ్యవస్థకు "ఇది మరింత ఆకట్టుకుంటుంది" అన్నారు ఇక్కడ చాలా మంది అపార్ట్మెంట్లలలో ఒకరితో ఒకరు కలిసి చాలా దగ్గర దగ్గరగా ఉంటారు. (చదండి:ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్కు 600 మంది..) మరింత తీవ్రంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరితం ప్రమాదకరంగా ఉంటుందని ఇప్పటికే రుజువు అవుతోంది. అమెరికాలో గురువారం నమోదయిన కేసులతో కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. ఒక్క రోజులో 86,000 కేసులతో అగ్రస్థానంలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మిన్నెసోటాలో కేసులు చాలా పెరిగాయి, టెక్సాస్లో వ్యాప్తి వేగవంతమైంది. శుక్రవారం నుంచి తిరిగి లాక్డౌన్లోకి వెళ్లేందుకు ఫ్రాన్స్ సిద్ధమయయ్యింది. ఆర్థిక కార్యకలాపాలను 15 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్ తెలిపారు. జర్మనీలో కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్థికంగా కూడా ఈ ఏడాది అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా తైవాన్ మాత్రం ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉంది. ఇక 2020 లో స్థూల జాతీయోత్పత్తిలో 1.56 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ఆగస్టులో ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో తైవాన్ ఈ ఏడాది పురోగతి సాధించిన అతి కొద్ది ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండనుంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) బయట నుంచి వచ్చిన వారిలోనే కరోనా స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికి బయటి దేశాల నుంచి వస్తున్న వారిలో కోవిడ్ బాధితులు ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఫిలిప్పీన్స్, అమెరికా, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో మూడు కేసులను గుర్తించింది. గత రెండు వారాల్లో ఇలాంటి కేసులు 20 కి పైగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తైవాన్ మాజీ వైస్ పప్రెసిడెంట్, ఎపిడెమియాలజిస్ట్ చెన్ చియెన్-జెన్ ఒక ఇంటర్వ్యూలో ‘పాజిటివ్ వచ్చిన న వ్యక్తులను గుర్తించకుండా.. వారిని నిర్బంధించకుండా ఈ విజయాన్ని సాధించలేము’ అన్నారు. అలాగే ప్రజలను క్వారంటైన్లో ఉంచడం అంత సులభం కానందున భోజనం, కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 35 వేల అమెరికన్ డాలర్లను జరిమానాగా విధించింది. ఈ క్రమంలో అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ఒక ట్వీట్లో తైవాన్ విజయాన్ని ప్రస్తావిస్తూ "వారు దీన్ని ఎలా సాధించారు.. వారు సైన్స్ను నమ్ముతారు" అంటూ ట్వీట్ చేశారు. ఇక తైవాన్ ఈ విజయంలో సాధించడంలో కీలక పాత్ర పోయించిన అంశాలు ఏంటంటే.. సరిహద్దు నియంత్రణ జనవరిలో మహమ్మారి వ్యాప్తి మొదలైన ప్రారంభంలోనే కొద్దిసేపటికే తైవాన్ సరిహద్దులను మూసివేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి దాని సరిహద్దులపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. బార్డర్ కంట్రోల్ని కఠినంగా అమలు చేయడం వల్ల తైవాన్ నిరంతరం విజయం సాధిస్తుందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పాలసీ, ఔట్కమ్స్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జాసన్ వాంగ్ తెలిపారు. ప్రయాణికులు విమానాలు ఎక్కడానికి ముందు టెస్ట్ చేస్తారు. తేడా వస్తే వారిని క్వారంటైన్లో ఉంచుతారు. సెల్యులార్ సిగ్నల్స్ ద్వారా డిజిటల్ ట్రాకింగ్ చేస్తూ 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయాలి. (చదవండి: 9 లక్షల వైరస్లు మానవులపై దాడి!) మాస్క్ల పంపిణీ ఫేస్ మాస్క్ల నిల్వ, విస్తృత పంపిణీని కలిగి ఉండాలనే నిర్ణయం తైవాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మహమ్మారి ప్రారంభంలో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఫేస్ మాస్క్లన్నింటినీ నిల్వ చేసి, ఎగుమతిని నిషేధించింది. నాలుగు నెలల్లో, కంపెనీలు రోజుకు 2 మిలియన్ల నుండి 20 మిలియన్ యూనిట్లకు ఉత్పత్తిని పెంచాయి. ఇక ఇక్కడ జనాలకు రేషన్లో మాస్క్లు సరఫరా చేస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ తైవాన్ ప్రపంచ స్థాయి కాంటాక్ట్ ట్రేసింగ్ను కలిగి ఉంది - సగటున, ధృవీకరించబడిన ప్రతి కేసుకు 20 నుంచి 30 మందిని పరీక్షించింది. వైరస్ బారిన పడిన తైపీ సిటీ హోస్టెస్ క్లబ్లోని కార్మికుడి వంటి తీవ్రమైన కేసులల్లో, ప్రభుత్వం 150 మందికి టెస్ట్లు చేసింది. వారందరికి నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారిని రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉంచింది. ఇప్పటివరకు, సుమారు 340,000 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. క్వారంటైన్ నియమాలు ఉల్లఘించిన వారి సంఖ్య కేవలం 1000 మాత్రమే. అంటే 99.7శాతం మంది ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెన్ తెలిపారు. "23 మిలియన్ల మందిసాధారణ జీవితాలకు బదులుగా 3, 40,000 మంది జీవితాల్లోని ఓ 14 రోజులు త్యాగం చేశాము" అన్నారు చెన్. (చదవండి: కరోనా రోగులకు మరో షాక్?!) సార్స్ అనుభవం గత అంటువ్యాధులు మిగిల్చిన అనుభవాలు కోవిడ్పై పోరాడడంలో తైవాన్ విజయానికి మార్గం సుగమం చేశాయి.2003 లో సార్స్ విజృంభణతో వందలాది మంది అనారోగ్యానికి గురై, కనీసం 73 మంది మరణించారు. ఈ క్రమంలో సార్స్ సంక్రమణ రేటులో ప్రపంచంలో తైవాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ అనుభవం తరువాత, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు అత్యవసర-ప్రతిస్పందన నెట్వర్క్ను నిర్మించడం ప్రారంభించింది. ఆ తరువాత బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లూయెంజా హెచ్ 1 ఎన్ 1 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. దాంతో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడుక్కొవడం వంటి వాటిని తప్పక పాటిస్తారు. -
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
నవంబర్ 27న తొలి పోరు
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై పోయింది. బయో బబుల్లో ఐపీఎల్ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 మ్యాచ్లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్లో భారత్–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి. మెల్బోర్న్లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి! నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు అడిలైడ్ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ కావడం విశేషం. భారత్ తమ ఏకైక డే–నైట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించగా... ఆసీస్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్ నైట్ ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 14 రోజుల క్వారంటైన్... బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్ 10న దుబాయ్లో ఐపీఎల్ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్ ముందుగా బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్ పార్క్కు దగ్గరిలోనే ఒక హోటల్లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్ను ఇతర అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్ 12 నుంచి హోటల్లోనే 14 రోజుల క్వారంటైన్ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్టౌన్లో టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది. క్వారంటైన్ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
వన్డేలతో మొదలు...
మెల్బోర్న్: కంగారూ గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిరీస్కు గురువారం పచ్చజెండా ఊపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేదీలతో సహా తుది షెడ్యూల్ను ప్రకటించింది. దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదించడం లాంఛనమే. అయితే ఈ పూర్తి స్థాయి పర్యటనలో చిన్న మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ ద్వైపాక్షిక సమరంలో ఇన్నాళ్లు ముందుగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్లు జరుగుతాయన్న సీఏ ఇప్పుడు మార్చింది. తొలుత వన్డేలు... ఆ తర్వాతే టి20 జరుగుతాయని ప్రకటించింది. కంగారూ గడ్డపై అడుగుపెట్టగానే సిడ్నీలో భారత ఆటగాళ్లు క్వారంటైన్ అవుతారు. ఇదీ షెడ్యూల్... సిడ్నీలో కరోనా ప్రొటోకాల్ ముగిశాక... అక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోనే వచ్చే నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆఖరి వన్డే కాన్బెర్రాలోని మనుక ఓవల్ మైదానంలో డిసెంబర్ 1న జరుగుతుంది. ఇదే వేదికపై 4న తొలి టి20 నిర్వహిస్తారు. మిగతా రెండు పొట్టి మ్యాచ్ల్ని మళ్లీ సిడ్నీలో నిర్వహిస్తారు. 6, 8 తేదీల్లో ఎస్సీజీలో రెండు, మూడో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. ఇక నాలుగు టెస్టుల సిరీస్ పింక్బాల్తో మొదలవుతుంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్లో తొలి డేనైట్ టెస్టు జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు 26 నుంచి 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. అప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విక్టోరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘బాక్సింగ్ డే’ టెస్టు వేదికను అడిలైడ్ ఓవల్కు మారుస్తారు. ఇది బ్యాకప్ వేదికైనా డేనైట్ టెస్టు కాదు. మూడో టెస్టు జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్లో జరుగుతాయి. -
హృతిక్ తల్లికి కరోనా
దర్శక–నిర్మాత రాకేష్ రోషన్, హీరో హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయం గురించి పింకీ రోషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతీ 20 రోజులకు ఓసారి మా కుటుంబ సభ్యులందరం, అలాగే మా స్టాఫ్ అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. ఇటీవల చేసిన టెస్ట్లో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ లక్షణాలూ లేవు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. క్రమశిక్షణగా యోగా చేయడం, వ్యాయామం వల్ల మీ మీద కోవిడ్ అంత ప్రభావం చూపించలేకపోయింది అని మా డాక్టర్లు అన్నారు. ఇంకో వారంలో మళ్లీ టెస్ట్ చేయించుకుంటాను. కచ్చితంగా నెగటివ్ వస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు. -
ఆసీస్కు భారత్ జంబో బృందం!
ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు. యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది. ‘జంబో సేన’ ఎందుకంటే... ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్ కావాల్సిందే. దీంతో టూర్ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్ ఫ్లయిట్) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్ పరీక్ష చేస్తారు. ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్ సెలక్షన్ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో మాత్రం భార్య, గర్ల్ఫ్రెండ్స్పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే. ముందుగా పొట్టి మ్యాచ్లు... కంగారూ గడ్డపై ముందుగా భారత్ మూడు పొట్టి మ్యాచ్లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్ ప్రాక్టీస్ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది. సిడ్నీలో క్వారంటైన్? భారత జట్టు బ్రిస్బేన్లో అడుగు పెట్టినా... క్వారంటై న్ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్లాండ్ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్బెర్రాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్వేల్స్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
క్వారంటైన్ సెంటర్లో గర్భా డ్యాన్స్
ముంబై : దసరా శరనవరాత్రి ఉత్సవాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అంగరంగ వైభవంగా జరిగేవి. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఆ సందడి కోలాహలమే లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెంటర్లో నర్సులతో పాటు రోగులు సైతం పీపీఈ కిట్లు ధరించి గర్భా నృత్యం చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబై గోరేగావ్లోని నెస్కో కోవిడ్ సెంటర్ ఇందుకు వేదికైంది. సంప్రదాయ నృత్యం దాండియాకు బదులుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని మహారాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. నవరాత్రి వేడుకలకు అన్ని జాగ్రత్తల నడుమ కోవిడ్ బాధితులకు దగ్గర చేస్తూ వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకుంది. అంతకుముందు అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ ధరించి 'వార్' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్ ఫైజన్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కరోనా కాలంలో నెగిటివిటీని దరిచేరనీయకుండా.. మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండటమే మంచిదని పలువురు కామెంట్ చేస్తున్నారు. (వైరల్: పీపీఈ కిట్లో డాక్టర్ అదిరిపోయే స్టెప్పులు) #WATCH Maharashtra: Patients perform 'Garba' with health workers at the Nesco #COVID19 Center in Goregaon, Mumbai. (19.10.20) pic.twitter.com/14AkyeBzpX — ANI (@ANI) October 19, 2020 -
వచ్చే వారంలో ఆసీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!
ముంబై: మరో మూడు వారాల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ పూర్తిస్థాయి సిరీస్లలో పాల్గొననుంది. కానీ జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. వచ్చే వారం ఆయా జట్లను ప్రకటించే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ మాట్లాడుతూ తేదీలు మినహా వేదికలు, మ్యాచ్లు ఖరారయ్యాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో క్వీన్స్లాండ్ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్ను తేదీలతోసహా సీఏ ప్రకటిస్తుంది. రెండున్నర నెలల పాటుసాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 12న అక్కడికి బయల్దేరనుంది. అనంతరం 14 రోజుల క్వారంటైన్ ముగిశాక కసరత్తు ప్రారంభిస్తుంది. ఐపీఎల్ వర్క్లోడ్, ఆటగాళ్ల గాయాలను దృష్టిలో పెట్టుకొని త్వరలో జట్టును ఎంపిక చేసే అవకాశముంది. ఇప్పటికే భువనేశ్వర్, ఇషాంత్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు గాయపడి లీగ్కు దూరమైన సంగతి తెలిసిందే. -
బీసీసీఐకి తలనొప్పిగా ఆసీస్ పర్యటన
ముంబై: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్ నవంబర్లో ఆసీస్కు పయనం కావాల్సి ఉంటుంది. ఆటగాళ్ల ఆసీస్ ప్రయాణానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో చార్టెర్డ్ విమానాల ఏర్పాటు, క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ, పర్యటనకు తీసుకెళ్లాల్సిన ఆటగాళ్ల సంఖ్య ఇలా ప్రతీ విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనలు ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా తలపట్టుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటే... మరో చోట ఈ నిబంధన ఏడు రోజులుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టులకు వేర్వేరు వేదికలు ఉండటంతో పాటు... వన్డే, టి20 ఫార్మాట్లు కూడా ఆడాల్సి రావడంతో ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ విధించాలనే అంశంపై సీఏ ఇంకా అస్పష్టతతోనే ఉంది. దీంతో కేవలం ఒక ఫార్మాట్తోనే సిరీస్ను ముగించాలా? లేక రెండే వేదికల్లో మ్యాచ్లన్నీ ముగించాలా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనిచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే. -
‘క్వారంటీన్ నిబంధనలు మారవు’
సిడ్నీ: ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో కోవిడ్–19కు సంబంధించిన ఆంక్షల్లో తమకు కొన్ని సడలింపులు ఇవ్వాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని క్రికెట్ ఆస్ట్రేలియా తిరస్కరించింది. ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం విదేశాలనుంచి ఎవరు వచ్చినా సరే...కనీసం రెండు వారాల పాటు హోటల్ క్వారంటీన్లో ఉండాల్సిందే. అయితే ఇది తమ ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తుందని, దానికి బదులుగా బయో సెక్యూర్ బబుల్లో సాధన చేసేందుకు అవకాశం ఇవ్వాలని భారత బోర్డు కోరింది. భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ముందుగా బ్రిస్బేన్లో అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అక్కడి క్వీన్స్లాండ్ ప్రభుత్వం మాత్రం కరోనా నిబంధనల్లో ఏమాత్రం సడలింపులు ఇవ్వమని తేల్చేసింది. భారత క్రికెట్ జట్టయినా సరే, ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత బృందం ఆస్ట్రేలియాకు వెళుతుంది. -
మహిళా క్రికెటర్లకు పిలుపు!
న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత మహిళా క్రికెటర్లను ఈనెల 13న ముంబైకి రావాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. మొత్తం 30 మంది క్రికెటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ‘క్రికెటర్లకు సమాచారమిచ్చాం. వాట్సప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. అండర్–19 ప్లేయర్లు కొందర్ని ఎంపిక చేశాం’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. పలుమార్లు కోవిడ్–19 పరీక్షల అనంతరం అక్టోబర్ 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరి వెళ్లనున్నారు. మరో వారం రోజుల క్వారంటైన్ అనంతరం బయో బబుల్లో అడుగుపెడతారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకుండానే టోర్నీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ అంశంపైనే ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్ల ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. -
‘క్వారంటైన్’లోకి ఇటలీ, స్వీడన్, జర్మనీ
సాక్షి, న్యూఢిల్లీ : యూరప్లో ప్రాణాంతక కరోనా వైరస్ కేసులు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాలను ‘క్వారంటైన్’ జాబితాలో చేర్చింది. అదే సమయంలో 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్ను 8 రోజులకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 8 రోజులపాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజున కరోనా పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తే స్వీయ నిర్బంధం ముగిసినట్లే. కరోనా పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరో వారం రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పొడిగిస్తారు. బ్రిటన్లో కరోనా కేసులను కట్టడి చేయడంలో భాగంగా రాత్రి పది గంటలకే అన్ని బార్లు, పబ్బులు, క్లబ్బులను మూసివేయాలంటూ తాజా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ దేశంలోనయితే మరోసారి 15 రోజుల లాక్డౌన్ను అమలు చేయాలంటూ అక్కడి వైద్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇక 5,15,571 పాజిటివ్ కేసులతో యునైటెడ్ కింగ్డమ్ 12 స్థానంలో కొనసాగుతోంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. యూకే కరోనా బారినపడి ఇప్పటివరకు 42,369 మంది మరణించారు. (చదవండి: ట్రంప్పై నెటిజన్లు ఫైర్, బాధ్యతలేకుండా...) -
భారత టెస్టు స్పెషలిస్ట్లు దుబాయ్కి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టు స్పెషలిస్ట్లు, కోచింగ్ బృందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్లో ఆడని చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలతోపాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందిని నేరుగా ఆస్ట్రేలియా పంపించకుండా సహచరులతో కలిసి దుబాయ్ నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వీరందరినీ బోర్డు ఈ నెలాఖరులో దుబాయ్కు పంపించనుంది. యూఏఈ నిబంధనల ప్రకారం వీరంతా అక్కడే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. వారంలో మొదటి, మూడో, ఆరో రోజున కోవిడ్–19 పరీక్షలకు హాజరవుతారు. అంతా ఓకే అనుకుంటే బయో బబుల్లో అక్కడే ఉన్న భారత జట్టు ఆటగాళ్లతో కలుస్తారు. వీరంతా ఒకే చార్టెర్డ్ ఫ్లయిట్లో ఆస్ట్రేలియా బయల్దేరతారు. ఆస్ట్రేలియా సిరీస్ పూర్తిగా బయో బబుల్ వాతావరణంలో జరగనున్న నేపథ్యంలో భారత బృందమంతా ఒకే తరహా వాతావరణం నుంచి వెళితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఒక బయో బబుల్ రక్షణ కవచం నుంచి మరో బయో బబుల్ (ఆస్ట్రేలియాలో)లోకి వెళ్లడం సులువవుతుందని, అందుకే అందరూ కలిసి వెళ్లడం మంచిదని తాము భావించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో భారత జట్టు నేరుగా ఏ నగరానికి వెళుతుందో, ఎక్కడ మ్యాచ్లు ఆడుతుందో ఇంకా ఖరారు కాలేదు. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో ఉండే కరోనా పరిస్థితిని బట్టి మార్పులు జరగవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రెండు వారాలు క్వారంటీన్ కావాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటి వర కు ఇంకా ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. -
ట్రంప్కు కరోనా!
విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్ బారిన పడటం ట్రంప్నకు షాక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్తో డిబేట్లో పాల్గొన్న బైడెన్కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్ ఆరంభిస్తున్నామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్హౌస్లోనే వారి క్వారంటైన్ జరుగుతుందని చెప్పారు. వైట్హౌస్ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. హోప్కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ప్రెసిడెంట్తో కలిసి హోప్ ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయా ణం చేసింది. ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతున్న తరుణంలో ట్రంప్నకు కరోనా సోకడం ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కరోనా సోకడంతో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనేకమంది తోటి అమెరికన్లు కరోనా బారిన పడ్డట్లే తామూ కరోనా బారినపడ్డామని, ఇద్దరం కలిసి దీన్ని జయిస్తామని మెలానియా ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు వైట్హౌస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు యూఎస్లో కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి. వయోభారం, భారీ కాయం.. అమెరికా అధ్యక్షుల్లో దశాబ్దాల కాలంలో ఎవరూ ఎదుర్కోని సీరియస్ ఆరోగ్యసమస్యను ట్రంప్ ఎదుర్కొంటున్నారని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల వయసు, ఒబేసిటీతో ఆయన కరోనా బాధితుల్లో అత్యధిక రిస్కు జోన్లో ఉన్నారని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ కరోనా బాధితుల్లో రిస్కు పెరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్లైన్స్ చెబుతున్నాయి. ఉదాహరణకు 50ల్లో ఉన్న వారికి 40ల్లో ఉన్నవారితో పోలిస్తే తీవ్ర అస్వస్థతకు గురయ్యే చాన్స్ అధికమని, అదేవిధంగా 60, 70ల్లో ఉన్నవాళ్లకు మరింత రిస్కని తెలిపింది. ట్రంప్ ఆరోగ్యం గానే ఉన్నా, అధిక బరువు ఉన్నందున కరోనా సోకితే ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీనికితోడు ట్రంప్ మాస్కు వాడకానికి వ్యతిరేకి. కానీ, ర్యాలీల అనంతరం ప్రతిసారీ ట్రంప్ కోవిడ్ పరీక్ష చేయించుకునేవారు. త్వరలో ఈ సమస్య సమసిపోతుందని చెప్పేవారు. అనూహ్యంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. ప్రముఖుల పరామర్శ అగ్రరాజ్యాధిపతికి కరోనా రావడంపై వివిధ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, ఆయన భార్య తొందరగా రికవరీ కావాలి, మంచి ఆర్యోగంతో ఉండాలి’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అమెరికన్లతో పాటు తాను కూడా ట్రంప్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. ఈ కష్టకాలంలో ట్రంప్నకు తన పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ట్రంప్ వేగంగా రికవరీ కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆస్ట్రేలియా వ్యవసాయ మంత్రి, టోక్యో గవర్నర్, ప్రపంచ మీడియా సంస్థలు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించాయి. కరోనాపై ట్రంప్ మొదటినుంచీ విరుచుకుపడుతున్నా చైనా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చైనా సోషల్ మీడియోలో మాత్రం ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు కనిపించాయి. ట్రంప్ పూర్తిగా కోలుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గ్యుటెర్రస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆకాంక్షించారు. కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మాస్కు ధరించడం ఇష్టపడని ట్రంప్ను కరోనా ఇష్టపడిందంటూ కొందరు వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శించే ట్రంప్ ఎట్టకేలకు ఒక విషయాన్ని ‘పాజిటివ్’గా ట్వీట్ చేశారని ఓ చైనీయుడు జోక్ చేశారు. కోవిడ్ బాధితులకు క్రిమిసంహారక(డిస్ఇన్ఫెక్టెంట్) మందులు ఇంజెక్షన్ చేయాలని ట్రంప్ గతంలో అన్నారు కనుక ఇప్పుడు వాటిని తీసుకునే సమయం ట్రంప్నకు వచ్చిందని జపాన్ ఇంటర్నెట్ వ్యాపారి హిరోయుకి నిషిమురా వ్యాఖ్యానించారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే! కరోనా విపత్తు ఆరంభం నుంచి ట్రంప్ నిర్లక్ష్య వైఖరినే చూపుతూ వచ్చారు. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, మాస్కు అవసరం లేదని, ఎకానమీని షట్డౌన్ చేయక్కర్లేదని చెప్పడమే కాకుండా కరోనాపై జాగ్రత్తలు చెప్పినవాళ్లను ఎగతాళి చేశారు. కానీ చివరకు తానే దాని బారిన పడ్డారు. ప్రజలు ఎక్కువగా భయపడకుండా ఉండేందుకే తాను కరోనాను తక్కువ చేసి చూపానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 21న యూఎస్లో తొలి కరోనా కేసు నమోదయింది. అప్పటి నుంచి కరోనాపై ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు.. జనవరి: కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారదు. అమెరికాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి: ఏప్రిల్ కల్లా వేసవి ఆరంభం కాగానే కరోనా మాయమవుతుంది. కరోనా మహ్మమారి తాత్కాలికమే. ఒక్కమారుగా మాయమవుతుంది. మార్చి: అమెరికన్లకు కరోనా రిస్కు చాలా తక్కువ. జాతీయ ఎమర్జెన్సీ అనవసరం. కానీ విధించక తప్పట్లేదు. ఏప్రిల్: కరోనా వైరస్ సోకినవారు డిస్ఇన్ఫెక్టెంట్ను ఇంజెక్షన్గా తీసుకుంటే చాలా వేగంగా మళ్లీ ఆరోగ్యవంతులుగా మారడం ఖాయం మే: పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువ. షట్డౌన్ కొనసాగిస్తే కోవిడ్ మరణాల కంటే ఇతర కారణాలతో∙ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. జూన్: కరోనా మరణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. కరోనా కేసుల్లో 99% ప్రమాదరహితాలు. జూలై: ప్రపంచంలో అమెరికాలోనే కరోనా మరణాలు తక్కువ. సెప్టెంబర్: మాస్కు పెట్టుకొని దేశాధినేతలను కలవడం అమర్యాద. అధ్యక్ష పోటీదారు బైడెన్లాగా నేను మాస్కు ధరించను. పెన్స్ చేతికి పగ్గాలు?? ప్రస్తుత అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో అమెరికా రాజకీయరంగంలో మార్పులు జరగవచ్చని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలైతే యూఎస్ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు. వైస్ప్రెసిడెంట్ కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితులుంటే, స్పీకర్ ఆఫ్ హౌస్ తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. అయితే, ఒకపక్క అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది, కీలక పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతల బదిలీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. అధ్యక్ష అభ్యర్ధులు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వస్తే పార్టీలకు సైతం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. కొత్తగా మరో అభ్యర్థిని ఎంచుకొని, వారితో ప్రచారం నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కలగలసి అమెరికా రాజకీయ యవనికపై పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని, పరిస్థితి అంతదూరం రాకపోవచ్చని ఎక్కువమంది అంచనా. ట్రంప్ వేగంగా కోలుకోకపోతే మాత్రం పెన్స్ చేతికి పగ్గాలు తాత్కాలికంగానైనా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగానికి జరిపిన 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తాను బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటిస్తే ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. తిరిగి అధ్యక్షుడు తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పేవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష వ్యవహారాలు చూస్తాడు. గతంలో ఎప్పుడు? ► 1985లో రొనాల్డ్ రీగన్ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జార్జ్ డబ్లు్య బుష్ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. ► 2002, 2007లో కొలనొస్కోపి చేయించుకోవాల్సిన సమయంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ తన బాధ్యతలు, అధికారాలను డిక్ చెనీకి తాత్కాలికంగా బదలాయించారు. రెండో ఆప్షన్ అధ్యక్షుడు తన బాధ్యతలు, అధికారాలు స్వయంగా తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదలాయించడం కాకుండా కేబినెట్లో మెజార్టీ సభ్యులు, ఉపాధ్యక్షుడు తమకు తామే ఇలాంటి బదలాయింపును ప్రకటించవచ్చని యూఎస్ రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేడని భావించిన పక్షంలో కేబినెట్లో అధికులు, ఉపాధ్యక్షుడు కలిసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యూఎస్లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగించాలంటే పెన్స్తో సహా కేబినెట్లోని సీనియర్స్ 15 మందిలో 8మంది ట్రంప్ బాధ్యతలు నిర్వహించలేరని భావించాల్సిఉంటుంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అంగీకరించకున్నా సెనేట్, హౌస్లు ఆమోదిస్తే వాస్తవ రూపం దాలుస్తుంది. పెన్స్ యత్నాలను ట్రంప్ ముందే గమనిస్తే ట్రంప్ తనను ముందే డిస్మిస్ చేయవచ్చు. మరోవైపు ట్రంప్ అనారోగ్యంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటింగ్ ఆరంభమైనందున వాయిదా సాధ్యం కాదని ఎక్కువమంది అంచనా. రాజ్యాంగంలో ఎన్నికల తేదీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలంటే అటు సెనేట్, ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపాల్సిఉంటుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ట్రంప్ పదవీ కాలం వచ్చే జనవరి 20తో ముగియనుంది. బైడెన్కు నెగెటివ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్కు, ఆయన భార్య జిల్ ట్రేసీ జాకొబ్ బైడెన్కు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్కు వెళ్లనున్నారు. -
బయటకొచ్చేశా
‘‘కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా. -
6 రోజులు కాదు...36 గంటలే!
దుబాయ్: ఐపీఎల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లను తొలి మ్యాచ్నుంచి ఆడించాలనుకున్న ఫ్రాంచైజీలను సంతోషపెట్టే వార్త ఇది. యూఏఈకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రతీ ఒక్కరు కనీసం ఆరు రోజులు క్వారంటీన్లో ఉండాల్సిందే. ఇదే జరిగితే అన్ని జట్లు ఆరంభ మ్యాచ్లలో ఆయా క్రికెటర్ల సేవలు కోల్పోయేవి. అయితే టి20, వన్డే సిరీస్ కోసం తాము ఇప్పటికే బయో బబుల్లో ఉన్నాం కాబట్టి క్వారంటీన్ సమయాన్ని కనీసం మూడు రోజులకు తగ్గించాలంటూ ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు వారంతా 36 గంటలు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటే చాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ‘క్రికెటర్ల ఐసోలేషన్ సమయానికి సంబంధించిన సమస్య పరిష్కృతమైంది. వారంతా 6 రోజులు కాకుండా 36 గంటలు విడిగా తమ హోటల్ గదుల్లో గడిపితే చాలు. ప్రతీ జట్టు తొలి మ్యాచ్లోనే తమ స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇది మంచి అవకాశం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూఏఈలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ప్రొటోకాల్ ప్రకారం వారికి వరుసగా కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లనుంచి కలిపి 21 మంది క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొంటున్నారు. అయితే వీరిలో కమిన్స్, మోర్గాన్, బాంటన్ (ముగ్గురూ కోల్కతా) మాత్రం ఆరు రోజుల క్వారంటీన్లో ఉండాల్సి ఉంది. ఈ ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో గురువారం దుబాయ్ చేరుకున్నారు. -
మంత్రి ముత్తంశెట్టికి కరోనా పాజిటివ్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని ‘సాక్షి’తో చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఫోన్లో అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారుడు వెంకట శివసాయినందీష్కు కూడా పాజిటివ్గా తేలడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్లోనే చికిత్స తీసుకుంటున్నారు. (పోలీసులకు సహకరించని నూతన్నాయుడు) -
‘ఆ సమయంలో నా బలం, ధైర్యం మీరే’
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిన నటి మలైకా అరోరా ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు అర్హాన్, పెంపుడు కుక్క కాస్పర్ ఫోటోను షేర్ చేస్తూ.. క్వారంటైన్లో వారిని మిస్సవుతున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యారు. గోడకు అవతలవైపు నుంచి అర్హాన్, కాస్పర్ మలైకాను చూస్తున్న ఈ ఫొటోను సోమవారం ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. కష్టకాలంలో నాకు ధైర్యం, శక్తిని ఇచ్చేది తన ఇద్దరూ పిల్లలు వీరేనని పేర్కొన్నారు. ‘ప్రేమకు హద్దులు లేవు. ఈ భౌతిక దూరం, స్వీయ నిర్బంధంలో మేము ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాము. నా పిల్లలను ఇంకా కొన్ని రోజులు కౌగిలించుకోలేనన్న ఆలోచన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మీరే నా ధైర్యం, బలం’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. (చదవండి: లవ్ బర్డ్స్కి కరోనాలవ్ బర్డ్స్కి కరోనా) అయితే బాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరొందిన హీరో అర్జున్ కపూర్, మలైకా ఆరోరాలు ఇటీవల కరోనా బారిన పడినట్లు గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తనలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లాలని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆమె తన పోస్టులో కోరారు. (చదవండి: మలైకాకు కరోనా పాజిటివ్: సోదరి అసహనం!) View this post on Instagram "Love knows no boundaries". With our social distancing and self quarantine in place, we still find a way to check on eachother, see eachother and talk. While my heart breaks to not be able to hug my two babies for another few days, just looking at their sweet faces gives me so much courage and energy to power through.... #thistooshallpass🙏 A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Sep 14, 2020 at 12:20am PDT -
చదివేస్తున్నారానందంగా...
హీరోయిన్లంటే తీరిక లేనంత బిజీ. పలు భాషల్లో సినిమాలు చేస్తుంటారు. షూటింగ్లు, ప్రమోషన్స్తో సగం సమయం గడిచిపోతుంది. హాబీలకు సమయం కేటాయించేంత వీలు ఎక్కువగా దొరకదు. కొందరికి బుక్స్ చదవడం ఓ హాబీ. కరోనా వల్ల పని ఒత్తిడి తగ్గి, పుస్తకాలు చేతిలో తీసుకునే ఛాన్స్ దొరికింది. ఆలస్యం చేయకుండా షెల్ఫ్లో ఉన్న పుస్తకాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. అక్షరాలన్నీ నమిలేసే పుస్తకాల పురుగులయ్యారు. ఈ లాక్డౌన్లో నచ్చిన పుస్తకాల్ని ‘చదివేస్తున్నారానందంగా’. మరి బుక్స్ పట్టిన భామల గురించి చదివేద్దామా? ‘‘ఈ క్వారంటైన్లో యోగా, పుస్తకాలు బిజీగా ఉంచాయి’’ అంటూ తాను చదివిన పుస్తకాల వివరాలను ఇన్స్టాగ్రామ్లో తెలిపారు శ్రియ. అనార్కీ, ఉమెన్ హూ రన్ దిత్ ది ఉల్వ్స్, లైవ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్, విపాసన యోగాకు సంబంధించిన పుస్తకాలు.. ఇంకా చాలా చదివానని తెలిపారామె. అంతే కాదు.. మంచి పుస్తకాలేమైనా ఉంటే నాకు సూచించరూ అని విన్నవించుకున్నారు శ్రియ. పుస్తకాల పురుగు రాశీ ఖన్నా ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకం ‘ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్’. ఈ లాక్డౌన్లో చదవడం మొదలెట్టారట. ‘‘ఈ పుస్తకం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. కొంచెం నెమ్మదస్తురాలిని కూడా అయ్యాను’’ అన్నారు రాశీ ఖన్నా. దక్షిణాదిన క్రేజీ హీరోయిన్గా దూసుకెళుతోన్న రష్మికా మందన్నాకు కూడా పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఇటీవల చదివిన ‘ది లిటిల్ బిగ్ థింగ్స్’ చాలా బాగుందని పేర్కొన్నారామె. ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులార్టీ తెచ్చుకున్న నభా నటేశ్ కూడా లాక్డౌన్ సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించారు. మరో తార ఆండ్రియా ‘‘జీవితాన్ని హ్యాండిల్ చేయలేనట్టుగా అనిపిస్తే పుస్తకాల్లోకి వెళ్లిపోతాను. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి ఎస్కేప్ అయి పేజీల మధ్యలో సంతోషాన్ని వెతుక్కోవడం నాకు భలే ఇష్టం’’ అంటారు. ‘మీరు పుస్తకాలు ఎందుకు చదువుతుంటారు’ అని అడిగితే ఈ బ్యూటీ ఇలా చెబుతారు. అది మాత్రమే కాదు.. ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం కూడా రాశారామె. ఇందులో కవితలు ఉంటాయి. గతంలో ఒక పెళ్లయిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారామె. అతడు ఆండ్రియాని మానసికంగా, శారీరకంగా వేధించాడట. అతన్నుంచి విడిపోయి, మానసికంగా చాలా కుంగిపోయారామె. తన వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు ఆండ్రియా. ఇక ఆమె చదివిన పుస్తకాల విషయానికొస్తే.. ‘ది లేజీ జీనియస్ వే’, ‘హామిల్టన్: ది రివల్యూషన్’, ‘ఇంటిమేషన్స్’.. ఇంకా చాలా ఉన్నాయి. ‘‘జీవితం ఏమో చిన్నది. చదవాల్సిన పుస్తకాలేమో చాలా!’’ అంటున్నారు శోభితా ధూళిపాళ్ల. క్వారంటైన్ సమయంలో అక్షరాల్ని నమిలేశారు ఈ తెలుగమ్మాయి. లియోనార్డ్ కోహెన్ రాసిన నవలలు, కవితలంటే చాలా ఇష్టం అంటున్నారు శోభితా. జ్ఞానం పెంచుకోవడానికి, సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా చదవడానికి, బాధ నుంచి బయటపడటానికి, టైమ్పాస్ కోసం... ఇలా ఏదైనాసరే మనకోసం ఒక పుస్తకం ఉంటుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అవుతుంది. -
లవ్ బర్డ్స్కి కరోనా
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్కు, నటి మలైకా అరోరాకు కరోనా సోకింది. తనకు కరోనా వచ్చిందనే విషయాన్ని అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కరోనా సోకిందనే విషయం అందరికీ తెలియజేయడం నా బాధ్యత. నేను బాగానే ఉన్నాను. నాకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. వైద్యుల సూచన మేరకు మా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాను. View this post on Instagram 🙏😷 A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Sep 6, 2020 at 10:54pm PDT నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. మనందరం ఈ వైరస్ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతాం అని నమ్ముతున్నాను’’ అన్నారు అర్జున్ కపూర్. అలాగే మలైకా అరోరాకు కరోనా వచ్చినట్లు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేశారు. అర్జున్, మలైకా కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్లో కూడా ఉన్నారని బాలీవుడ్ టాక్. View this post on Instagram 🙏🏽 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 6, 2020 at 1:33am PDT -
మంత్రి హరీశ్కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం స్వయంగా వెల్లడించారు. హోం క్వారంటైన్కు వెళ్లినట్లు తెలిపారు. ‘కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. గత కొద్ది రోజులుగా నాతో కలసి తిరిగిన వారు మీకు మీరుగా ఐసోలేషన్కు వెళ్లడంతోపాటు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని మంత్రి హరీశ్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తనను కలసుకోవడానికి రావద్దని అభిమానులు, కార్యకర్తలను కోరారు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైద్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికి కానీ, నన్ను కలసుకోవడానికి కానీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా మీతో పంచుకుంటాను’ అని హరీశ్రావు పేర్కొన్నారు. త్వరగా కోలుకో బావా: కేటీఆర్ ట్వీట్ కరోనా బారిన పడిన మంత్రి హరీశ్రావు త్వరగా కోలుకోవాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘త్వరగా కోలుకో బావా.. ఇతరుల కంటే నీవు త్వరగా కోలుకుంటావని నేను గట్టిగా నమ్ముతున్నా’అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (కరోనా తీవ్రత పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తం) అసెంబ్లీలో కరోనా పరీక్షలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేయడంతో శనివారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ లాబీతో పాటు శాసన మండలిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రాలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చారు. మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, రేగా కాంతారావు, సీఎల్పీనేత భట్టి విక్రమార్క తదితరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కరోనా పరీక్షలు నిర్వహించేలా శాసనసభ, మండలిలో ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉంటే సభ్యులు సభకు హాజరు కావద్దంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్; వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. నాలుగు రోజుల్లోపు తిరుగు ప్రయాణ టికెట్లతో వ్యాపార నిమిత్తం వచ్చే వారు తమ ప్రయాణానికి 96 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉంటే చాలని తెలిపారు. అలాగే గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు హోమ్ క్వారంటైన్లో ఉండవచ్చు. నెగెటివ్ రిపోర్టు లేని వాళ్లు మాత్రం కచ్చితంగా 7 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు రెగ్యులర్ విమానాలు (ఎయిర్ ట్రాఫిక్ బబుల్ ఒప్పందం మేరకు) రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి వందే భారత్ మిషన్ కింద చార్టర్డ్ విమానాలు, ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 55 వేల మంది నగరానికి చేరుకున్నారు. -
క్వారంటైన్ నిబంధనలు: టీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పేర్కొన్న నిబంధనలకు లోబడి ఇప్పుడు సరాసరి తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులకు పలు సడలింపులు ఇచ్చారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇచ్చిన సడలింపులు 4 రోజుల్లోపు రిటర్న్ టిక్కెట్లతో వ్యాపానిమిత్తం తెలంగాణకు వచ్చే ప్రయాణీకులు, వారు బయలుదేరడానికి ముందు 96 గంటలలోపు నిర్వహించిన నెగటివ్ RT-PCR పరీక్ష నివేదికను చూపిస్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు. బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉండాలి. నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తూ, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులలోని కొన్ని విభాగాలకు సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వీరు కేవలం 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండాలి. వీరిలో గర్భిణులు, 10 లేదా అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణిస్తున్న వాళ్లు లేదా వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) మిగతా ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 7 రోజుల సంస్థాగత క్వారంటైన్, దాని తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ‘ఎయిర్ బబుల్ ఒప్పందాల’ ద్వారా యూకే, యూఏఈ దేశాలతో కనెక్ట్ అయి ఉంది. బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్, లండన్ల మధ్య వారానికి నాలుగు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్- యూఏఈల మధ్య నడిచే ఇతర ఎయిర్లైన్స్– ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్లు కూడా త్వరలో తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి ‘వందే భారత్ మిషన్’ కింద ఛార్టర్ విమానాలు (వీటిలో ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి), ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా (నిబంధనలకు లోబడి) వస్తున్నాయి. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మందికి పైగా భారతీయులు నగరానికి రాగా, 10,000 మందికి పైగా వివిధ దేశాలకు చెందిన వారు హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ను పూర్తిగా శానిటైజ్ చేసి, అక్కడ థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారు. విమానం దిగే ప్రయాణికులు, వైమానిక సిబ్బందిని విమానం నుంచి 20-25 మందిని ఒక బృందంగా తీసుకువస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం, ప్రతి ప్రయాణికుడు/వైమానిక సిబ్బందిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎయిరోబ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ చేస్తున్నారు. ప్రతి ఇమిగ్రేషన్ కౌంటరు వద్ద ప్రయాణికులు, ఇమిగ్రేషన్ అధికారులు ఒకరినొకరు తాకకుండా ఉండేందుకు గాజు అద్దాలను బిగిందారు. ప్రతి బ్యాగేజీని బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానం చేసిన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పూర్తిగా శానిటైజ్ చేసిన ట్రాలీలను ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉంచారు. -
తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్కు నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం అమ్మానాన్న చికిత్స తీసుకుంటున్నారు. దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో వాళ్లు తొందరగా కోలుకుంటారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మీ తల్లిదండ్రులు త్వరగా కోలుకుంటారు’’ అని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు తమన్నాకు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. -
క్వారంటైన్ సెంటర్ నుంచి కిడ్నాప్కు యత్నం
తిరువనంతపురం : క్వారంటైన్ సెంటర్ నుంచి యువకుడి కిడ్నాప్కు ప్రయత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బిన్షాద్ అనే యువకుడు కొన్ని రోజులు క్రితం దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కూతుపరంబులోని క్వారంటైన్ కేంద్రంలో వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఇటీవలె క్వారంటైన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఓ బృందం సభ్యులు వచ్చి అతన్ని బలవంతంగా బయటకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అతని స్నేహితులకు వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎంపై ప్రతిపక్షాల దాడి) విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిన్షాద్ సరైన సమయానికి బంగారాన్ని డెలివరీ చేయనందుకే ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండు గ్రూపులకు చెందిన ఆరుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? ) -
అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు
మధురవాడ(విశాఖ): విశాఖపట్నంలోని ఓ క్వారంటైన్ సెంటర్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. మధురవాడ సమీపంలోని కొమ్మాది చైతన్య కళాశాల వాల్మీకి క్యాంపస్లో 170 గదులు ఉండగా 145 గదుల్లో క్వారంటైన్ సెంటర్ నడుపుతున్నారు. రెండో అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో మంటలు రేగాయి. దీంతో సుమారు 20 కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన సిబ్బంది, అధికారులు అప్రమత్తమై.. పక్కనే ఉన్న మరో క్వారంటైన్ సెంటర్లోకి 64 మంది పాజిటివ్ రోగులను 10 నిమిషాల్లోనే తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ నార్త్ జోన్ ఏసీపీ రవిశంకరరెడ్డి, జేసీ గోవిందరాజు, విశాఖ రూరల్ మండల తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తి కోవిడ్ సెంటర్ ఇన్చార్జ్ తదితరులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. -
షార్ట్ సర్క్యూట్: తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్దం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది. తాజా ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్కు తరలిస్తున్నారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశామని నిముషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
అయామ్ సో లక్కీ: ఏంజెలీనా జోలీ
ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ప్రాణం. భర్త బ్రాడ్ పిట్ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేశారు. జోలీకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్). మాడెక్స్–19 కొ, పాక్స్–16 కొ, జహారా–15 కూ.. దత్తత తెచ్చుకున్నవాళ్లు. షిలా–14 కూ, నాక్స్–12 కొ, వివియన్–12 కూ.. జోలీకి, బ్రాడ్ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్ ఏంజెలిస్లోని తమ సొంత లాస్ ఫెలిజ్ భవంతిలో క్వారెంటైన్లో ఉంటున్నారు. మాడెక్స్ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్. ఇప్పుడిక ఆన్లైన్ లోనే చదువు కొనసాగుతోంది. (ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్ను తొలగించండి) మిగతా ఐదుగురివీ యూఎస్ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు కాసుకుని ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ విడుదలైంది. ఆ ప్రమోషన్ ఈవెంట్లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్ అండ్ ఓన్లీ ఇవాన్’ కూడా పిల్లల సినిమానే. యానిమేటెడ్. అందులో ఒక పాత్రకు వాయిస్ ఇచ్చారు ఏంజెలీనా జోలీ. చదవండి: (అవుట్సైడర్స్కి ప్లస్ అదే!) -
లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లక్షణాలైన జ్వరం, దగ్గు వంటివి లేకపోయినప్పటికీ అత్యధిక శాతం మందికి పాజిటివ్ వస్తోంది. సీరో సర్వైలెన్స్ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సీరోసర్వైలెన్స్ సర్వేను వైద్యఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ నాలుగు జిల్లాల్లో నమోదైన కేసుల్లో లక్షణాలు కనిపించకుండా అత్యధిక శాతం మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే కృష్ణా జిల్లాలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కోవిడ్–19 తెలియకుండానే వచ్చి వెళ్లిపోయింది. అంటే ఆ 22.3 శాతం మందిలో కోవిడ్–19 యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడైంది. లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్ ‘‘ఎటువంటి లక్షణాలు లేకుండా కోవిడ్–19 పాజిటివ్ వచ్చిన వారిని పది రోజుల పాటు హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నాం. పది రోజుల్లో తీవ్రత ఆధారంగా జ్వరంగానీ, దగ్గుగానీ వస్తే వాటికి మందులు వాడతారు. లేదంటే బలవర్థకమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. పదకొండవ రోజు నుంచి వారు బయట తిరగవచ్చు. ఇక వారి నుంచి వ్యాధి విస్తృతి ఉండదు. వారికి మళ్లీ కోవిడ్–19 పరీక్ష కూడా అవసరం లేదు. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్లో ఉంటారు’’ అని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు. -
అడవుల్లో క్వారంటైన్
హీరోయిన్లు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఒక సెట్ నుంచి మరో సెట్కు వెళ్తూ సినిమాలు త్వరగా పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి వెళ్లడం అంటే కొంచెం రిస్కే. అందుకే ఒక సినిమా యూనిట్ నుంచి మరో యూనిట్లో జాయిన్ అయ్యే మధ్యలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు అదా శర్మ. తన స్టాఫ్ మొత్తాన్ని కూడా క్వారంటైన్లో ఉంచుతున్నారామె. ఇటీవలే రెండు తెలుగు సినిమాలు అంగీకరించారు అదా. ఆల్రెడీ ఈ సినిమాల చిత్రీకరణ ప్రారంభం అయింది. ఒక సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ను హైదరాబాద్లో పూర్తి చేశారు. మరో సినిమా చిత్రీకరణ నీలగిరి అడవుల్లో జరగనుంది. ఈ అడవుల్లోనే ఓ మేన్షన్లో ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు అదా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నీలగిరి అడవులు భలే అందంగా ఉన్నాయి. మేం ఉండే బంగ్లా అడవి మధ్యలో ఉంది. ఇది భయంకరమైన ప్రదేశమని చాలా మంది చెప్పారు. కానీ చాలా అందంగా ఉంది. ఒక యూనిట్ నుంచి మరో యూనిట్తో కలసి పని చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సెట్లో భౌతిక దూరం పాటించడం కొంచెం కష్టం. కానీ ముందే ఇలా క్వారంటైన్లో ఉండి చిత్రీకరణ ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని మా అభిప్రాయం’’ అన్నారు అదా. ఈ రెండు సినిమాలే కాకుండా ‘కమాండో 4, మ్యాన్ టూ మ్యాన్’ అనే హిందీ సినిమాల్లో అదా కనిపించనున్నారు. -
ఐపీఎల్ క్వారంటైన్: బాల్కనీలో బాతాఖానీ!
దుబాయ్: గతంలో క్రికెట్ ఆడేందుకు ఎక్కడికెళ్లినా... ఓ పూట విశ్రాంతి తీసుకొని కాసేపు కసరత్తు చేసి ఎంచక్కా ఈతకొలనులో సేద తీరేవారు. అంతా కలిసి ఇష్టమైన రుచుల్ని ఆస్వాదించేవారు. అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇచ్చేవారు. కానీ కరోనా కాలం కదా... అవన్నీ మారిపోయాయి. కలిసి తిరిగే పరిస్థితి కాదు కదా... కాలు బయటపెట్టే పరిస్థితి కూడా లేదాయే! ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన క్రికెటర్లు అక్కడ హోటల్లో రాజస్తాన్, పంజాబ్ జట్లు ఆటగాళ్లు క్వారంటైన్ అయ్యారు. అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్ గదులకే పరిమితమైన ఆటగాళ్లు... అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఇక ఫిట్నెస్ ట్రెయినర్ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేశారు. కోల్కతా నైట్రైడర్స్ మాత్రం అబుదాబీలోని హోటల్లో బసచేసింది. (ఐపీఎల్ సందడి సందడి షురూ...) -
కరోనా బారిన పడ్డ మరో కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యుల అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరోకరు చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. ‘కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లాను. కరోనా టెస్ట్ చేయించాను. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. గత వారం రోజుల నుంచి నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి. హోం ఐసోలేషన్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ గజేంద్ర సింగ్ షేకావత్ హిందీలో ట్వీట్ చేశారు. अस्वस्थता के कुछ लक्षण दिखने पर मैंने कोरोना टेस्ट करवाया और मेरी रिपोर्ट पॉजिटिव आई है। डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि गत दिनों में मेरे संपर्क में जो लोग आये हैं वह स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं। आप सभी स्वस्थ रहें और अपना ध्यान रखें। — Gajendra Singh Shekhawat (@gssjodhpur) August 20, 2020 ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది. -
కోళీకోడ్ ఘటన: హోం క్వారంటైన్లోకి సీఎం
తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మలప్పురం జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. వీరిలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డట్లు తెలిసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్తో పాటు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. (కోళీకోడ్ ఘటన: 22 మంది అధికారులకు కరోనా) Kerala CM Pinarayi Vijayan & others who visited Kozhikode plane crash site are going into self-quarantine. Co-operation & Devaswom Minister Kadakampally Surendran will hoist national flag at Independence Day function to be held in Thiruvananthapuram tomorrow: Kerala CMO #COVID — ANI (@ANI) August 14, 2020 ముఖ్యమంత్రి విజయన్తో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది మరణించారు. -
‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్లోనే క్వారంటైన్లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించింది. అయితే జూన్ 7 ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్లో క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) తాజాగా హోటల్ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్ పేరుతో హోటల్కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్లో క్వారంటైన్లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్కు అనుమతించండి అంటూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్) ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్లో భాగంగా హైదరాబాద్కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. -
ఆ ఐదుగురు ఆసుపత్రికే...
బెంగళూరు : కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఐదుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో మంగళవారం భారత పురుషుల హాకీ జట్టు కీలక ఆటగాడు మన్దీప్ సింగ్ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎస్ఎస్ స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మన్దీప్ చికిత్స పొందుతుండగా... ఇదే ఆసుపత్రిలో కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, డిఫెండర్లు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్కీపర్ కృషన్ బహదూర్ పాఠక్లను చేర్చారు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో జాతీయ హాకీ శిక్షణ శిబిరం మొదలవుతుంది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్గా వచ్చింది. -
రాజమౌళికి నెగటివ్
ప్రముఖ దర్శకుడు యస్.యస్. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో జూలై 29 నుంచి హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘‘రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తయింది. ఈ సందర్భంగా నాకు, నా కుటుంబ సభ్యులకు బుధవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. రెండు వారాల క్వారంటైన్ అనంతరం మాలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు’’ అని రాజమౌళి పేర్కొన్నారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు. -
అగ్నిప్రమాదం: జేసీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
సాక్షి, విజయవాడ: ఏలూరు రోడ్డులోని స్వర్ణప్యాలెస్లో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) నేతృత్వంలో కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 10 మంది మరణానికి, 18 మంది క్షతగాత్రులైన సంఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసేందుకు జేసీ ఎల్ శివశంకర్ నేతృత్వంలో విజయవాడ సబ్కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి.గీతాబాయ్, వీఎంసీకి చెందిన ఆర్ఎఫ్వో టి ఉదయకుమార్, సీపీడీసీఎల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడిన కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిస్థితులతో పాటు భద్రతా నిబంధనలు, ఆసుపత్రి నిర్వహణ లోపాలు, వసూలు చేసిన అధిక ఫీజుల ఆరోపణలపై దృష్టి సారించాలని కమిటీని ఆదేశించారు. విచారణ పూర్తి చేసి కమిటీ తన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు..
సాక్షి, విజయవాడ : అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...‘జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం రెండు కమిటీలు నియమించింది. ఒక కమిటీ హోంశాఖ , మరొక కమిటీ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కమిటీలు 48 గంటల్లో నివేదిక ఇస్తాయి. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. విజయవాడలో 15 ప్రయివేట్ కోవిడ్ సెంటర్లు ఉన్నాయి, వాటన్నింటినీ తనిఖీ చేస్తాం. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాథమికంగా ఆస్పత్రి వైఫ్యలం ఉన్నట్లు గుర్తించాం. (చదవండి : మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా) ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగింది. 5 గంటల 9 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. 5.13 గంటలకు ప్రమాదం జరిగిన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 31మంది పేషెంట్లు ఉన్న ఆ సెంటర్లో 10మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై రెండు కమిటీలు వేశాం. 48 గంటల్లో నివేదిక ఇస్తుంది. ముఖ్యమంత్రి మానవత్వంతో చనిపోయిన ఒక్కొక్క మృతుల కుటుంబానికి 50 లక్షల రూపాయిలు పరిహారం ప్రకటించారు.’ అని తెలిపారు. (అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు ) ప్రమాదం ఉదయం 4.30 లకు జరిగింది.. అగ్నిప్రమాదంపై ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్ మాట్లాడుతూ ప్రమాద సమాచారం అందిన 4 నిమిషాల్లోనే 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాం. ప్రమాదంలో పదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.వారిలో ఏడుగురు ఊపిరి ఆడక చనిపోయారు. మృతులను ఇప్పటికే గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు. -
క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలు క్వారంటైన్ సెంటర్ నుంచి పరారై వచ్చారు. కాలనీలోకి వచ్చిన భార్యాభర్తలిద్దరూ రోడ్డు మీద సంచరించడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలోనూ వీరు ఇదే విధంగా పారిపోయి వచ్చారని గుర్తించి వారిని ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు. రెండురోజుల క్రితం గుండిమెడ క్వారంటైన్ నుంచి పారిపోయి రాగా తాడేపల్లి మున్సిపల్ అధికారులు, వైద్యులు డాక్టర్ కిరణ్కుమార్ భార్యాభర్తలిద్దరినీ గుంటూరులోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. తిరిగి మరలా వారు పారిపోయి రావడంతో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంచి, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని తిరిగి మరలా క్వారంటైన్కు తరలిస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. -
స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం
సాక్షి, తిరుపతి: స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్తో చనిపోయిన వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు నిలువు దోపిడీ చేసి మానవత్వానికి మచ్చ తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) రిటైడ్ అధికారికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన పద్మావతి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న బంగారం, పర్సులో నగదు, ఖరీదైన సెల్ఫోన్ను దొంగలించారు. దీనిపై కుటుంబ సభ్యులు బుధవారం స్విమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. స్పందించిన స్విమ్స్ అధికారులు మృతుడి కుటుంబీకులకు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే అందచేశారు. నగదు, మొబైల్ మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో కోవిడ్ బాదితులకు వైద్యం అందిస్తుంటే కొంతమంది ఇలా దారుణానికి పాల్పడటం బాద కలిగిస్తోందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మంత్రి బాలినేని శ్రీనివాస్కు కరోనా..) -
సెల్ఫ్ ఐసోలేషన్లో త్రిపుర ముఖ్యమంత్రి
అగర్తలా: తమ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా సోకడంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ తెలిపారు. తనకు నిర్వహించిన కరోనా పరీక్షా ఫలితాలు ఇంకా వెలువడలేదని దీంతో ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్లోకి వెళుతున్నట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొన్న విప్లవ్ దేవ్.. కుటుంబసభ్యుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 1742కు చేరింది. పలువురు రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నిర్దారణ అయ్యింది. నూతన విద్యా విధానంపై చర్చించడానికి గతవారం జరిగిన సమావేశానికి షా హాజరయ్యారు. దీంతో పలువురు మంత్రులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. (18 లక్షల పైమాటే) ఇక కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుమార్తెలకు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం యడియూరప్ప ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దేశంలో ఇప్పటిదాకా మొత్తం కరోనా కేసులు 18,03,695, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్పై రెండు, మూడో దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది. Two of my family members found COVID19 POSITIVE.Other family members found NEGATIVE I have undergone COVID19 test, result is yet to come I am following self isolation at my residence & all precautionary measures have been taken Praying for the speedy recovery of family members — Biplab Kumar Deb (@BjpBiplab) August 3, 2020 -
ఐపీఎస్ బలవంతపు క్వారంటైన్పై సీఎం స్పందన
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును విచారించడానికి వెళ్లిన బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని క్వారంటైన్లో ఉండాలని ముంబాయి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఆదేశించడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. కేసును విచారించడానికి వెళ్లిన పోలీసు అధికారిని ఇలా బలవంతంగా క్వారంటైన్లో ఉంచడం సరైనది కాదని అన్నారు. బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్లో ఉంచారు అని ట్వీట్ చేసిన అనంతరం నితీశ్ కుమార్ స్పందించారు. ఆదివారం సుశాంత్ కేసు విచారణలో బిహార్, ముంబై పోలీసులకు మధ్యలో వాగ్వాదం జరిగింది. డీజీపీ ఈ విషయం పై ముంబై పోలీసులతో మాట్లాడారు. వినయ్ విషయంలో జరిగింది సరైనది కాదు అని వారికి తెలిపారు అని నితీశ్ కుమార్ చెప్పారు. ఇది రాజకీయ విషయం కాదని, న్యాయానికి సంబంధించింది అని బిహార్ పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు అని పేర్కొన్నారు. తివారీ చేతి మీద క్వారంటైన్ స్టాంప్ వేసిన 40 నిమిషాల నిడివిగల వీడియోను బిహార్ పోలీసులు షేర్ చేశారు. ముంబైలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన వారందరికి క్వారంటైన్ విధిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. రేఖా చక్రవర్తి, ఆమెకుటుంబ సభ్యులపై సుశాంత్ రాజ్పుత్ నాన్న ఫిర్యాదు చేసిన తరువాత నుంచి ముంబై పోలీసులతో పాటు పట్నాకు చెందిన నలుగురు పోలీసుల బృందం కూడా విచారణ మొదలు పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన ప్లాట్లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఆయన ఆత్మహత్యకు సంబంధించి చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. చదవండి: సుశాంత్ సూసైడ్: సీఎం వ్యాఖ్యలు కలకలం -
సుశాంత్ కేసు : మరో వివాదం
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే రాజకీయ టర్న్ తీసుకున్న సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ముంబై వచ్చిన బిహార్ సీనియర్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు. నిబంధనలు పేరుతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్ చేయడం చర్చకు దారి తీసింది. (సుశాంత్ మృతి: రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం) సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీస్ అధికారి వినయ్ తివారీనీ బీఎంసీ అధికారులు ఆదివారం రాత్రి బలవంతంగా క్వారంటైన్ చేశారంటూ బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేశారు. తివారీకి వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ ఆరోపించారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్ ) కాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కోల్డ్ వార్ కి దారితీసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇప్పటివరకు రియా చక్రవర్తితోపాటు దాదాపు 40 మంది వాంగ్మూలాలను రికార్డు చేశారు. ముఖ్యంగా రాజ్పుత్ కుటుంబ సభ్యులు, అతని కుక్, చిత్రనిర్మాత మహేష్ భట్, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్, దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారు. IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE — IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020 -
విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు.. ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్ ఇన్సిట్యూషనల్ క్వారంటైన్లో, 7 రోజులు హోం క్వారంటైన్లోఉంటామని అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్కు మూడు రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి. ► అంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఎలాంటి కోవిడ్–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్కు అనుమతిస్తారు. ► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ► ప్రయాణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి. ► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్/షిప్ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. -
హోం క్వారంటైన్లో నాగాలాండ్ సీఎం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రితోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. కార్యాలయన్ని శానిటైజ్ చేసి 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లో ఉన్న సీఎం ఇంటినుంచే పనిచేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు కార్యాలయంలోని సిబ్బంది, అధికారులు సహా మొత్తం 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ర్టంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1566కు చేరిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎస్ పంగ్న్యు వెల్లడించారు. ఇప్పటికే 625 మంది కోవిడ్ నుంచి కోలుకొనగా ప్రస్తుతం 936 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 39.9 శాతంగా ఉందన్న మంత్రి కిఫిరే జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. (ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం) Few persons in the Chief Minister’s Residential Complex have tested positive for COVID-19. All SOPs are being implemented. The complex is being sanitized and the residential office closed for 48hrs. The normal functioning of the CMO is continuing following all guidelines. — CMO Nagaland (@CmoNagaland) July 30, 2020 -
ఆతిథ్యం తీరు మారింది
సాక్షి,హైదరాబాద్ : గ్రేటర్లో హోటల్ క్వారంటైన్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతుండటంతో నగరంలో ప్రస్తుతం పలు త్రీస్టార్, ఫైవ్స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగా మారడం విశేషం. ప్రస్తుతానికి గ్రేటర్ పరిధిలో సుమారు 50 హోటళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఆయా హోటళ్ల యాజమాన్యాలు పలు ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అత్యవసర వైద్య సేవలందించేందుకు నేరుగా వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేయడం విశేషం. హోటల్ క్వారంటైన్ ఇలా.. సికింద్రాబాద్,బేగంపేట్,కొండాపూర్,గచ్చిబౌలి,హైటెక్సిటీ,సోమాజిగూడా,నాంపల్లి,మాదాపూర్,లింగంపల్లి,సోమాజిగూడ,కోకాపేట్ తదితర ప్రాంతాల్లోని సుమారు 50 హోటళ్లలో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటుచేసి ఆస్పత్రిలో ఉండేరీతిలో వసతులు కల్పిస్తున్నారు. ఆయా హోటల్ గదుల్లో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్ రోగులు బసచేసినట్లు సమాచారం. నిత్యం ఒక్కో రూమ్కు రూ.7 నుంచి రూ.10 వేల వరకు ఆయా హోటళ్ల యాజమాన్యాలు అద్దె వసూలు చేస్తున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని నేరుగా ఆస్పత్రిలో చేర్పించి వారికి బెడ్ ఏర్పాటు చేసేందుకు సైతం ఆయా హోటళ్ల యాజమాన్యాలు నగరంలోని ప్రధాన ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ప్రస్తుతం నగరంలో సుమారు మూడువేల మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఆయా హోటళ్లలో మకాం వేసినట్లు హోటల్రంగ నిపుణులు చెబుతున్నారు. హోటళ్లలో కల్పిస్తున్న సదుపాయాలివీ.. కోవిడ్ రోగులు, కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి బస చేసేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్న పలు హోటళ్లు అందుకు తగినట్లుగా పలు వసతులు కల్పిస్తున్నాయి. నిత్యం డాక్టర్తో చెకప్ సదుపాయం. ► ఆన్లైన్లో అవసరమైన సమయంలో నర్సుల ద్వారా సలహాలు,సూచనలు అందజేయడం ► ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్ల సలహాలు,సూచనలు అందించడం. ► ఫింగర్ పల్స్ ఆక్సీమీటర్,స్పైరోమీటర్,డిజిటల్ థర్మామీటర్ ద్వారా వైద్యసేవలు. ► గది వద్దకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో లంచ్, డిన్నర్ అందజేయడం. ► బీసేఫ్ యాప్ ద్వారా రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీచేసి వారి పరిస్థితిని అంచనా వేయడం. ► అత్యవసర సమయంలో తమ హోటల్లో బసచేసిన రోగిని ఆస్పత్రికి తరలించి కచ్చితంగా బెడ్సదుపాయం కల్పించడం.