
సాక్షి, రాయ్గఢ్ : హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్ప్రెస్కు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్కార్( ప్రత్యేక రైలు)ను ఢీకొట్టడంతో వెనుక నున్న మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఒడిశాలోని హావ్డా నుంచి జగదల్పూర్ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే లైనులో రైలు, టవర్కార్ ఎదురెదురుగా వచ్చి ఢికొనడం వల్ల రెండు జనరల్ బోగీలు, లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇద్దరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment