ధర్మసాగర్ సర్పంచ్కు పీఎంఓ లేఖ
Published Sat, Aug 13 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
ధర్మసాగర్ : ‘మా ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహకరించండి’ అంటూ ధర్మసాగర్ సర్పంచ్ కొలిపాక రజిత ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి ఈ–మెయిల్ పంపించారు. దీనికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి బదులు లభించిందని సర్పం చ్ రజిత శనివారం తెలిపారు. ధర్మసాగర్ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ పీఎంఓ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందిందన్నారు. జవాబుదారీగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు ప్రజాప్రతినిధులపై నమ్మకం పెరుగుతుందన్నారు.
Advertisement
Advertisement