ముగిసిన షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర | YS Sharmila paramarsha yatra second round completed in warangal district | Sakshi
Sakshi News home page

ముగిసిన షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర

Published Fri, Sep 11 2015 1:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

YS Sharmila paramarsha yatra second round completed in warangal district

వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర శుక్రవారంతో ముగిసిందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ నగరంలో కొండ రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండో విడతలో వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారని తెలిపారు.

ఈ నెల 21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్రను ఆమె చేపట్టనున్నారని ఆయన వివరించారు. అలాగే ఈ నెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ మరణించి ఆరు ఏళ్లు అయినా ప్రజలు ఆయన్ని మరచిపోలేకపోతున్నారన్నారు.

వరంగల్ లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీఆర్ఎస్  ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అధైర్యపడవద్దని రైతులకు ఆయన  ఈ సందర్భంగా సూచించారు. మీ పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement