paramarsha yatra
-
పరామర్శ యాత్ర సక్సెస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర విజయవంతమైంది. జుక్కల్ నియోజకవర్గంపిట్లం నుంచి గురువారం మొదలైన రెండో విడత పరామర్శ ఎల్లారెడ్డి నియోజకవర్గం పోతంగల్ కలాన్లో శుక్రవారం ముగిసింది. దీంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయినట్లు అయ్యింది. మొత్తం 55 రోజులు 8,510 కిలోమీటర్లు తిరిగిన ఆమె 310 మందిని పరామర్శించగా.. శుక్రవారం పోతంగల్ కలాన్లో మంగలి నారాయణ కుటుంబాన్ని పరామర్శించడంతో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా గురు, శుక్రవారంలు రెండు రోజులు జిల్లాలో పర్యటించిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆమె ఎదురేగి పిల్లలు, పెద్దలు, వృద్ధుల వయోబేధం లేకుండా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, సాంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. యాత్ర సాగింది ఇలా.. జిల్లాలో షర్మిల రెండు రోజుల పరామర్శ యాత్ర గురు, శుక్రవారం రెండు రోజులు సాగింది. చాలా చోట్ల రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్లో కొద్దిపాటి మార్పులు జరిగినా.. అనుకున్న ప్రకారం రెండో విడతలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నారాయణఖేడ్, నిజాంపేట్, మాసన్పల్లి మీదుగా పిట్లం వద్ద జిల్లాలోకి చేరుకున్నారు. మొదటి రోజు పిట్లం మండలం చిల్లర్గిలో బట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో మేదరి శిఖామణి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి బీర్కూరు మండలం దుర్కిలో కుర్మ విఠల్, పాతవర్నిలో ఏలూరు సాయులు కుటుంబాలను పరామర్శించిన ఆమె వర్నిలో గురువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కోటగిరి మండలం పోతంగల్కు చేరుకున్న షర్మిల, అక్కడ గౌరు నడిపి వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గాంధారి మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లి నీరడి పోచయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత చివరగా పోతంగల్ కలాన్లో మంగలి నారాయణ కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా పోతంగల్కలాన్ గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన పైలాన్కు షర్మిల శంఖుస్థాపన చేశారు. అంతకంటె ముందు రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు.. ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా.. ఎంత దూరమైనా.. ఎంత మారుమూల ఉన్నా.. ప్రతీ గడపకు వెళ్లి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్న షర్మిల ఇందూరు ప్రజల ఆదరణను మరచిపోలేనన్నారు. పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నా సంతోషం ఈ రోజు మా సొంతమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరామర్శయాత్ర ముగించిన గాంధారి మండలం పొతంగల్ కలాన్ గ్రామ శివారులో ఇడుపులపాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్ను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకరం భూమిని కొనుగోలు చేశామని, ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఇక్కడ పైలాన్ను నిర్మిస్తామని, పైలాన్పై వైఎస్సార్ కోసం మృతి చెందిన వారి పేర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పైలాన్ చుట్టూ మొక్కలను నాటి పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతవాసులకు దీవెనగా ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. పరామర్శ యాత్ర విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి భగవంత్రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ నిజ్జన విఠల్, శివారెడ్డి, సంగయ్య, శ్రీధర్గౌడ్, రాంమోహన్, నాయుడు ప్రకాష్, బల్గం రవి, గైనిగాడి విజయలక్ష్మి, రామానుజచారి, పీర్సింగ్, లక్ష్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ‘‘పరామర్శ యాత్ర విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కృతజ్ఞతలు. అందరి ఆదరాభిమానాలు మరచిపోలేను.. జగనన్నా నల్లకాల్వల వద్ద ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు సంతోషం.. వైఎస్సార్ స్మృత్యర్థం గాంధారి మండలం పొతంగల్ కలాన్లో ఇడుపుల పాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్ను నిర్మిస్తాం.. ఈ పైలాన్పై వైఎస్సార్ కోసం గుండెపగిలి చనిపోరుున వారి పేర్లు ముద్రిస్తాం..’’ - పరామర్శ యాత్ర ముగింపులో షర్మిల -
షర్మిలకు పొంగులేటి అభినందనలు
గాంధారి పోతంగల్ కలాన్(నిజామాబాద్ జిల్లా): దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి వైఎస్ జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. విజయవంతంగా పరామర్శయాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ప్రతి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారని తెలిపారు. పావురాలగుట్టలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పొంగులేటి చెప్పారు. -
సంతోషం మా సొంతం: షర్మిల
నిజామాబాద్: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా నిలబెట్టుకున్నామని చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచివుంటారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరామర్శయాత్ర ముగిసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధారి పోతంగల్ కలాన్ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే... 2009లో సెప్టెంబర్ 2న ప్రజల సమస్యలను పరిష్కరించానికి రచ్చబండకు వెళుతూ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 750 మంది ఆయన వెనకాలే మృతి చెందారు ఈ రోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నాయకుడు చనిపోతే ఇలా వందల గుండెలు ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు దీన్ని బట్టే వైఎస్ఆర్ ఎంతటి గొప్ప ప్రజానాయకుడో, ఎంత మంచి వ్యక్తో అర్థవవుతోంది తండ్రి బిడ్డల అవసరాలు తీర్చినట్టుగా ప్రజలు అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి పదవికి గొప్ప అర్థం చెప్పారు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు మన, పర తేడా లేకుండా ప్రతిఒక్క వర్గానికి మేలు చేశాడు 23 జిల్లాల ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు ఉచిత్ విద్యుత్ పండించే పంటలో, పేదలకు సంజీవనిగా మారిన ఆరోగ్యశ్రీలో, జలయజ్ఞంతో సాగులోకి తెచ్చిన 25 లక్షల పంట భూముల్లో ఇలా చెప్పుకుంటూ ఎన్నో పథకాల్లో వైఎస్ఆర్ జీవించే వుంటారు వైఎస్ఆర్ చనిపోయి ఆరేళ్లు అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలోనూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగడం మహానేత గొప్పతనానికి నిదర్శనం మహానేత మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాట ఇచ్చారు కొడుకు హోదాలో జగనన్న ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ రంగు పూసింది టీడీపీతో కలిసి జగనన్న మీద కేసులు పెట్టి, కష్టాలపాల్జేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జగనన్న సంకల్పం చెక్కు చెదరలేదు పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మడమ తిప్పకుండా మాటను నిలబెట్టుకున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతోషం ఇప్పుడు మా సొంతం అందరినీ కలిసి పరామర్శించాం. వారి అభిమానాన్ని గుర్తించాం, ధన్యవాదాలు తెలుపుకున్నాం ఓదార్పుయాత్ర, పరామర్శయాత్ర విజయవంతమవడానికి సహకరించిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు గాంధారి పోతంగల్ కలాన్ వద్ద పైలాన్ పెట్టాలని నిర్ణయించాం. ఇదొక దీవెన ఉండాలన్నది మా కోరిక -
సంతోషం మా సొంతం: షర్మిల
-
వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వర్ణిమండలం రుద్రూరులో ఆమె వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోటగిరి మండలం పాతపొట్టంగల్లో వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు. -
తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల తొలిరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. పిట్లం వద్ద షర్మిలకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు. -
గ్రేటర్ అభివృద్ధి వైఎస్సార్ చలవే
-
గ్రేటర్ అభివృద్ధి వైఎస్ చలవే..
పరామర్శ యాత్రలో షర్మిల వైఎస్ హయాంలోనే జీహెచ్ఎంసీ ఆవిర్భావం గ్రేటర్ని గ్రేట్గా చేసి చూపించారు ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ ఎక్స్ప్రెస్వే, మెట్రోరైలు.. ఇలా ఎన్నో చేశారు ఐటీలోనూ వైఎస్సే మేటి తొలిరోజు ఎనిమిది కుటుంబాలకు పరామర్శ సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ స్థాయిని పెంచింది వైఎస్సార్.. ఔటర్ రింగ్రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ ఎక్స్ప్రెస్ వే, మెట్రోరైలుకు పచ్చజెండా.. ఇలా నగరాభివృద్ధి కోసం ఎన్నో చేశారు. గ్రేటర్ని గ్రేట్గా చేసి చూపించారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి పెంచుతూ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలను విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో మహానగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలు సైతం అభివృద్ధి పట్టాలెక్కాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు షర్మిల మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ లో పరామర్శ యాత్ర చేపట్టారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల మీదుగా 80 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో షర్మిల ఎనిమిది కుటుంబాలను పరామర్శించారు. ఇంట్లో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ‘మీ కోసం మేమున్నాం..’ అంటూ భరోసానిచ్చారు. జగనన్న అందరికీ బాసటగా నిలుస్తాడని చెప్పారు. షర్మిల వెళ్లిన ప్రతిచోట ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. షాపూర్నగర్ చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోనే మేటిగా.. ప్రపంచంలోనే హైదరాబాద్ను గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలని వైఎస్ కలలు కన్నారని షర్మిల చెప్పారు. అందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేన్లతో 160 కి.మీ. ఔటర్రింగ్ రోడ్డు వేశారన్నారు. ‘‘ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పీవీ ఎక్స్ప్రెస్ హైవే పూర్తి చేశారు. మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. వైఎస్ బతికి ఉంటే దాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేవారు. వైఎస్ హయాంలోనే నగరంలో నీటి సరఫరా పరిస్థితి దశాదిశ మారింది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తీసువచ్చారు’’ అని అన్నారు. మహానగర ప్రజలకు కావాల్సిన అన్నింటినీ వైఎస్సార్ సమకూర్చితే.. కొందరు మాత్రం అంతా తామే చేశామంటారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2 శాతంగా ఉంటే.. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతులు 9 నుంచి 14 శాతం పెరిగాయన్నారు. వైఎస్ పథకాలను బతికించుకోవాలి దేశంలో అన్ని రాష్ట్రాలు 46 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తే మన రాష్ట్రంలో వైఎస్సార్ ఒక్కరే 46 లక్షలు కట్టించారని పేర్కొన్నారు. ఆయన బతికి ఉంటే ప్రతి పేదవాడికి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇళ్లు దక్కేవన్నారు. సీఎం పదవి చేపట్టగానే వైఎస్ కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుపేద రోగులకు ఆరోగ్యశ్రీ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పేదవాడిని భుజాలపై ఎత్తుకున్నారని, రైతును రాజును చేశారని, అందుకే రాజశేఖర్రెడ్డి రాజన్న అయ్యారని గుర్తుచేశారు. వైఎస్సార్ పథకాలను బతికించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. తొలుత శేరిలింగంపల్లి పరిధిలోని తారానగర్లో దిగంబరరావు కుటుం బాన్ని పరామర్శించారు. అక్కడ్నుంచి ఆల్వి న్ కాలనీలోని సన్నిధి క్రిష్ణ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులతో మాట్లాడారు. త ర్వాత కూకట్పల్లి రామాలయం సమీపంలో టీకే రణతేజ, ముసాపేట్లో నోముల రాజ య్య, కుత్బుల్లాపూర్లో సీహెచ్ వెంకటరామరాజు, షాపూర్నగర్ ఎన్ఎల్బీనగర్కు చెందిన దామా నాగేశ్వర్రావు, దూలపల్లిలో సుర కంటి రమేశ్, మౌలాలిలోని ఉల్ఫత్నగర్లో అబ్దుల్ రెహ్మాన్ కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్ రెడ్డి, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, జి.ధనలక్ష్మి, బీష్వ రవీందర్, ఎన్.షర్మిల సంపత్, జయశ్రీ, విష్ణుప్రియ, ఎం.వరలక్ష్మి, బనగాని రఘురామిరెడ్డి, జె.అమర్నాథ్ రెడ్డి, బి.సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 18 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని అన్నారు. మంగళవారం నాడు 8 కుటుంబాలు, బుధవారం 6వ తేదీన 8 కుటుంబాలు, శుక్రవారం 7వ తేదీన 2 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. 6వ తేదీన సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. 7వ తేదీన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర ఉంటుంది. మెదక్ జిల్లాలో సోమవారంతో పరామర్శ యాత్ర పూర్తవుతుందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు. -
నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర
-
నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. మెదక్ జిల్లాలో పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో తొలిరోజు ఆదివారం షర్మిల మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. సోమ, మంగళవారాల్లో మెదక్ జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులు ఉంటారు. -
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
-
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ఆదివారం ఉదయం మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు మధ్యాహ్నానికి మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వర్గల్ మండలం అంబర్ పేటలో జయమ్మ, తొగుట మండలం వేములగట్టులో బాలవ్వ, కానగల్లో బలరాం కుటుంబాలను షర్మిల పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొత్తం జిల్లాలో 13 బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. ఒక్క పటాన్చెరు నియోజకవర్గం మినహాయించి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది. -
పరామర్శయాత్రకు బయలుదేరిన షర్మిల
-
3 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
* మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో నాలుగురోజుల పాటు యాత్ర * వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ * యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపు * గ్రేటర్ ఎన్నికలయ్యాక హైదరాబాద్లోనూ యాత్ర: శివకుమార్ సాక్షి, హైదరాబాద్: జన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆయన తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనవరి 3 నుంచి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆమె పరామర్శ యాత్ర షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ గురువారం వెల్లడించారు. మరో ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్తో కలిసి లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాలో యాత్ర జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగుతుందని తెలిపారు. ‘‘గజ్వేల్లో యాత్ర ప్రారంభించి జిల్లాలో 13 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. పటాన్చెరు మినహా మెదక్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 5వ తేదీ నారాయణఖేడ్లో పెద్ద బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం యాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జుక్కల్ నియోజకవర్గం పిట్లంతో మొదలుపెట్టి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. జనవరి 6 సాయంత్రం తిరిగి లోటస్పాండ్ చేరుకుంటారు’’ అని వివరించారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా, నిజామాబాద్లో కొంతమేరకు షర్మిల పరామర్శ యాత్ర ఇప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా,ప్రజలకిచ్చిన మాట మేరకు వైఎస్ జగన్ ఇప్పటికే కోస్తా, రాయలసీమల్లో ఓదార్పు యాత్ర చేశారని, తెలంగాణలోనూ ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తి చేశారని నల్లా గుర్తు చేశారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుం బాలకు ‘మేమున్నాం’ అనే భరోసా కల్పించేందుకే షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారని శివకుమార్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్లో కూడా షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని తెలిపారు. షర్మిల యాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గసభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, శ్రేణులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి, పార్టీ జాయింట్ సెక్రటరీ సంజీవరావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరిరెడ్డి, నేతలు సిద్దిపేట జగదీశ్వర్ గుప్తా, శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర
-
నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన పరామర్శయాత్ర
-
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'
కరీంనగర్ : ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు అందేదని, పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని అన్నారు. అలాగే రైతులకు 9గంటల కరెంట్ వచ్చేదని వైఎస్ షర్మిల అన్నారు. -
'ఆయన బతికుంటే ఆశావర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారు'
ప్రతి ఒక్కరికీ మేలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవాడి గుండెల్లో రాజన్నగా సజీవంగా ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ మాత్రమేనని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు నీరు, పేదవాడికి ఇల్లు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేవని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను బతికించుకుందామని, చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని, ఆయన బతికుంటే ఆశా వర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారని వైఎస్ షర్మిల చెప్పారు. వ్యవసాయం దండగ అని కొందరు నాయకులు అన్న రోజుల్లో దాన్ని పండుగలా చేసిన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారని ఆయన అన్నారు. రాజన్న కలలు సాకారం కావాలంటే మనమంతా ఐక్యం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు. -
ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం
-
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం
హుజురాబాద్: రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. హుజురాబాద్లోని గాంధీ చిత్రపటానికి వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. హుజురాబాద్, మానకొండూరు నియోజవర్గాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. -
రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఈ రోజు హుజురాబాద్, మానకొండూరు నియోజక వర్గాల్లో పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. హుజురాబాద్ లో యాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండలంలోని సిర్సపల్లి, రాంపూర్, జమ్మికుంట మండలం ధర్మారం, గండ్రపల్లిలో ఎడ్ల వెంకటనర్సు, సంచు తిరుపతి, పసుపుల మొగిలి, గాదె ఉప్పలయ్య, కుటుంబాలను కలుస్తారు. ఆ తర్వాత కేశవపట్నం, లక్ష్మీపూర్, బంజేరుపల్లిలో కాసరాజుల లక్ష్మయ్య, ఎడ్ల శ్రీనివాస్, రేణికుంట కొమురయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. -
తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ
-
కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...
- హుస్నాబాద్లో తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ - ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే... - పంటల్లేక, అప్పులపాలై బోరున విలపించిన వైనం - అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పిన షర్మిల - వైఎస్ తనయను అక్కున చేర్చుకున్న కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరువు సీమగా పేరొందిన హుస్నాబాద్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తొలి రోజు పరామర్శ యాత్ర ఉద్విగ్నభరితంగా సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఎనిమిది మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక సాగిన యాత్రలో ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అయినవారు చనిపోయారనే బాధతో బతుకీడుస్తున్న వారిపై రెండేళ్లుగా కరువు పగబట్టింది. కుటుంబ పెద్దను కోల్పోయి బతుకు బండి నడపలేక సతమతమవుతున్నది కొందరైతే, కన్నపేగును కోల్పోయి దిక్కులేని పక్షులైన వారు మరికొందరు. అందరివీ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే. పంటలెండి, అప్పులపాలై, వాటిని తీర్చే మార్గంలేక దుర్భరంగా బతుకీడుస్తున్నామని వారంతా షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దంటూ వారందరినీ ఆమె ఓదార్చారు. ‘‘మంచి రోజులొస్తాయి. మీకు అండగా మేముంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన షర్మిలకు కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్రావు స్వగ్రామం తోటపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రేణుల డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలతో ఘన స్వాగతం లభించింది. అక్కడినుంచి ఆమె కోహెడ మండలం వరుకోలులో పెంటపర్తి సాహితి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆస్తిపాస్తులేమీ లేని సాహితి తండ్రి రమణారెడ్డి, కూతురిని కోల్పోయి అనాథలా బతుకుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. సాహితి కుమార్తెలిద్దరిని పలకరించిన షర్మిల, ఏం చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అక్కడినుంచి కదిలారు. కూరెల్లలో ల్యాగల లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కోహెడలో మధ్యాహ్న భోజనం తర్వాత ధర్మసాగర్, నందారం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో శ్రీనివాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతి కుటుంబంతో అరగంటకు పైగా గ డిపారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు అంతా సకాలంలో వానల్లేక పంట ఎండిందని, బతుకు దెరువు కోసం వలస పోతున్నామని, ఆర్థికంగా ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి 9 గంటలకు పరామర్శ యాత్ర ముగించి హుజూరాబాద్లో షర్మిల బస చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్రెడ్డి, కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కినపల్లి కుమార్ , వేముల శేఖర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సెగ్గెం రాజేశ్, రాష్ట్ర యువజన కార్యద ర్శులు గోవర్దనశాస్త్రి, మంద వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు ముసుకు వెంకటరెడ్డి, డి.వేణుమాధవరావు, పి.వేణుగోపాల్రెడ్డి, సింగిరెడ్డి ఇందిరా భాస్కర్రెడ్డి, జీడికంటి శివ, సొల్లు అజయ్వర్మ, శంకర్, కాసారపు కిరణ్, గండి శ్యామ్, రాజమణి, పద్మ, వరంగల్ జిల్లా నాయకులు ఎం.కల్యాణ్రాజ్, ఎ.మహిపాల్రెడ్డి, సుమిత్ గుప్తా, రాజ, మెదక్ జిల్లా నాయకులు తడాకా జగదీశ్వర్గుప్తా, వీరరాజు, గురునాథ్, హైదరాబాద్ నగర నాయకులు ఎండీ.మజీద్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లా షర్మిల పరామర్శయాత్ర ఖరారు
-
అక్టోబర్ 1 నుంచి రెండో విడత పరామర్శయాత్ర
-
అక్టోబర్లో కరీంనగర్ రెండో విడత యాత్ర
-
అక్టోబర్లో కరీంనగర్ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తరఫున పరామర్శిస్తున్న ఆయన సోదరి షర్మిల... అక్టోబర్ 1వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేస్తారని ఆ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలి పారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కరీం నగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ మండలం వర్కోలులో ఈ యాత్ర ప్రారంభమవుతుందని... 3న మధ్యాహ్నం సమయానికి 18 కుటుంబాలను కలుసుకుంటారని చెప్పారు. 3న సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలోకి షర్మిల అడుగుపెడతారని చెప్పారు. ఆ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గం దిలావార్పూర్లో యాత్ర ప్రారంభించి 5వ తేదీ వరకు కొనసాగిస్తారని, పది కుటుంబాలను కలుసుకుంటారని వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి 6వ తేదీ వరకు 19 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. షర్మిల ఇప్పటివరకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 169 కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పిం చారని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5,114 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు. -
రైతు బంధు వైఎస్సార్
కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల * ఆ మహానేత బతికి ఉంటే ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా? * అన్నదాత అప్పులపాలు కావొద్దని వైఎస్ వేల కోట్ల రుణమాఫీ చేశారు * ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించి మద్దతు ధర పెంచారు * వ్యవసాయాన్ని పండుగలా మార్చారు * జిల్లాలో ముగిసిన తొలి దశ యాత్ర సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ఆ వేళ మహా నాయకుడు తిరిగి వస్తారని లక్షలాది హృదయాలు ఆశగా ఎదురు చూశాయి. కానీ మన దురదృష్టం.. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆ ఒక్క నాయకుడు బతికి వస్తే ఈరోజు ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని వేల కోట్ల పంట రుణాలను వైఎస్ ఒకేసారి మాఫీ చేశారని గుర్తు చేశారు. వైఎస్ మరణంతో గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలసి షర్మిల గురువారం కరీంనగర్ జిల్లాలో మూడోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శించారు. రామభద్రునిపల్లెలో కాచి బీరయ్య, గుంజపడుగులో తూర్పాటి రాజయ్య, చిన్నాపూర్లో కోరెపు నర్సయ్య, కోనాపూర్లో పంచాల బుచ్చమ్మ, మల్లాపూర్లో తుకారాం గౌడ్ కుటుంబాలను పరామర్శించారు. పెగడపల్లి మండలం నామాపూర్, మల్లాపూర్ మండలం ముత్యంపేటలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఇక్కడకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి రైతుకు అండగా నిలబడి భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని, అప్పుల ఊబిలో ఉన్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఉచిత కరెంటు ఇచ్చారని, రైతులు బకాయి పడిన విద్యుత్ రుణాలను, పంట రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు. రైతన్నకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలనే ఆలోచనతో ఎరువులు, విత్తనాల ధరలు తగ్గిం చి, రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. 371 కి.మీ... 12 కుటుంబాలు వరంగల్ జిల్లాలో యాత్రను ముగించుకొని కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల.. ఇక్కడ తొలిదశ యాత్రను ముగించారు. మూడు రోజుల పాటు జిల్లాలో 371 కిలోమీటర్లు పర్యటించిన షర్మిల 12 కుటుంబాలను ఓదార్చారు. పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, రాష్ట్ర నాయకులు బీష్వ రవీందర్, డాక్టర్ నగేష్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర, ప్రపుల్లారెడ్డి, బ్రహ్మానందారెడ్డి, షర్మిలా సంపత్, విలియం మునిగాల, ఎల్లాల సంతోష్రెడ్డి, జూలి, కట్ట శివ, సంధ్యారాణి, ఎస్.అజయ్ వర్మ, అయిలూరి వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ గుప్తా, ఇమామ్ హుస్సేన్, లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, శ్రీనివాస్, ఎస్కే ముస్తాక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
'రుణమాఫీ ఒకేదశలో చేసిన నేత వైఎస్సార్'
కరీంనగర్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన తొలివిడత పరామర్శయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా 6 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి 12 కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలోని మల్లాపూర్ లో తుకారంగౌడ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణమొత్తాలను ఒకేదశలో మాఫీ చేసిన ఘనత వైఎస్సార్దేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహానేత పెద్దపీట వేశారని, ప్రతి ఎకరాకు నీరిచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా చేసేందుకు వైఎస్సార్ కృషిచేశారని షర్మిల గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాలనలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. వైఎస్సార్ బతికుంటే ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, ఉచిత విద్య, రైతులకు 9 గంటలు కరెంట్ అందేదని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చుకునేందుకు చేయిచేయి కలిపి రాజన్న రాజ్యాన్ని సాధించుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. మల్లాపూర్లో వెంకటేశం కుటుంబాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, రూ. 5వేల ఆర్ధిక సాయం అందించారు. -
1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అక్టోబర్ 1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేపట్టనున్నారు. 1, 2, 3 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తారని.. 18 కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ తెలంగాణ నేత శివకుమార్ తెలిపారు. అక్టోబర్ 3 సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా నుంచి పరామర్శయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. 3, 4, 5 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో 10 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అక్టోబర్ 5 సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారని ఆరోజు, తర్వాత రోజు ఇక్కడ పరామర్శయాత్ర సాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో169 కుటుంబాలను షర్మిల పరామర్శించారని, 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తయిందని శివకుమార్ వెల్లడించారు. -
వైఎస్సార్ ఎవరెస్టు
కరీంనగర్ పరామర్శ యాత్రలో షర్మిల * తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో వైఎస్ * వైఎస్ ఆశయ సాధనకు చేయి చేయి కలుపుదాం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు శిఖరంలాంటి వారని, ఆయనకు మరణం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజల గుండెలపై వైఎస్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలసి బుధవారం షర్మిల కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు. ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలికి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన నిలబడ్డారని, అందుకే వారి గుండెల్లో రాజన్నగా బతికి ఉన్నారన్నారు. ‘‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు పథకంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని రుణమాఫీ చేసి ఆదుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలబడ్డారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు. అందుకే వైఎస్సార్ మరణించి ఇంతకాలమైనా ప్రజ లు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను, ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నల కోటలో.. కాటారం, మహాదేవపూర్, కమాన్పూర్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వరంగల్ జిల్లా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అటవీ ప్రాంతంలోని కుటుంబాలను ఒకే చోటకు పిలిచి పరామర్శించాలని వరంగల్ డీఐజీ చేసిన సూచనను షర్మిల సున్నితంగా తిరస్కరించారు. అలా చేస్తే పరామర్శకు అర్థం ఏముంటుందన్నా అంటూ యాత్రకు పయనమయ్యారు. దట్టమైన అటవీ మార్గం మీదుగా కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మడక సుశీల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే మండలం విలాసాగర్లోని మంచినీళ్ల కొమురమ్మ కుటుంబీకులను కలిశారు. తర్వాత కమాన్పూర్ మండలం కేకే నగర్లో చిలకాని హన్మంతు, సుల్తానాబాద్ మండలం చిన కల్వల గ్రామంలో కుంభం వెంకటలక్ష్మి, చొప్పదండి మండలం వెదురుగట్టులో మడ్డి రామస్వామి, ధర్మారం మండలం నర్సింహులపల్లిలో కునుకుంట్ల రాయమల్లు కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ నగేష్, బీష్వ రవీందర్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర, జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, ఎస్కే ముస్తాక్, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు. అమ్మా... మీ ఇల్లే నా తల్లిగారిల్లు! తల్లిదండ్రులు లేని ఆ ఆడబిడ్డకు వైఎస్ కుటుంబమే తల్లిగారి ఇల్లు అయింది. ఏ తోడు లేని ఆ నిరుపేదకు వైఎస్ ఇల్లు కట్టిస్తే... పెళ్లీడుకొచ్చిన ఆ యువతికి జగన్ డబ్బు పంపి పెళ్లి చేయించారు. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఇంటికి షర్మిల వెళ్లారు. కాటారం మండలం విలాసాగర్కు చెందిన మంచినీళ్ల కొమురమ్మ కూతురు కొమురమ్మ. ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ దశలో ఉండగా.. వైఎస్ హఠాన్మరణంతో తల్లి కొమురమ్మ గుండెపోటుతో చనిపోయారు. ఇంటి నిర్మాణం ఆగిపోయింది. మరోవైపు ఆమె కూతురు పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి కష్టమనుకున్న సమయంలో జగన్ రూ.లక్ష చెక్కు పంపారు. ఈ డబ్బుతోనే ఊరివాళ్లంతా కలిసి ఆమెకు పెళ్లి చేశారు. ఇంటికి రేకులు తెచ్చి పైకప్పు వేశారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి. తమ ఇంటికి వచ్చి షర్మిల కొంత డబ్బు చేతిలో పెట్టగానే కొమురమ్మ ఉద్వేగానికి గురైంది. ‘‘అమ్మా.. మా నాయిన నాకు ఏమీయ్యలే.. మీ నాయినే నాకు ఇల్లు కట్టిచ్చిండు, పెళ్లి కాదనుకున్న నాకు జగనన్న డబ్బు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు మీరు నా ఇంటికొచ్చి కాన్పుకు సాయమైనరు. తల్లిదండ్రులు లేని నాకు మీ ఇల్లే.. నా తల్లిగారిల్లమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. -
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఒక్కరికి పక్కాఇల్లు'
కరీంనగర్ : వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర రెండో రోజు ముగిసింది. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మారం నియోజకవర్గాల్లో ఆరు కుంటుంబాలను షర్మిల పరామర్శించారు. యాత్రలో భాగంగా ధర్మారంలో అడుగుపెట్టిన షర్మిలకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడ ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఆరోగ్య శ్రీ, 108 ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందించిన నేత వైఎస్సార్ అని షర్మిలా గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికుంటే ప్రతిఒక్కరికి పక్కా ఇల్లు, ఎకరానికి నీరు, పేదవాడికి ఉచిత విద్య అందేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరామర్శయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్రావు, గట్టు శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు. -
ఫహీయుద్దీన్ కుటుంబానికి పరామర్శ
వరంగల్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలోకొనసాగుతోంది. చివరి విడత పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం పాలంపేటలో ఫహీయుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. -
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
-
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: పేద ప్రజల పెన్నిధి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆయన పథకాల ప్రస్తావనే. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర సందర్భంగా ఏ పల్లెను చూసినా, ఎవరి నోట విన్నా వైఎస్సార్ గొప్పతనం ప్రస్తావనే. ‘మాకు రేషన్ కార్డు వైఎస్సే ఇచ్చిండు.. మా ఇల్లు అప్పుడు కట్టినం.. నాకు పింఛను ఇచ్చిన దేవుడు.. నా గుండెకు ఆపరేషన్ చేయించిండు.. అప్పుడు రైతుల పరిస్థితి బాగుండె.. ఉచిత కరెంటు ఇచ్చిండు, లోన్లు మాఫీ జేసిండు. మా అబ్బాయి ఉట్టిగ ఎంబీఏ చదివిండు...’ ఇలా ప్రజలంతా వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరిస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ యాత్రలో పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఆయా గ్రామాల్లో ఎక్కడ విన్నా వైఎస్ పాలన గురించే చెప్పుకోవడం కనిపించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి విషయంలో అప్పటి, ఇప్పటి పరిస్థితి పోల్చిచూసుకోవడం వినిపించింది. షర్మిల వెళ్లిన ప్రతి చోటా వైఎస్ తనయ వచ్చిందన్న సంతోషం... వైఎస్ను, తమవారిని గుర్తు చేసుకున్న ఉద్వేగం కలగలిసి కనిపించింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 77 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇక్కడ 73 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని ఓదార్చేందుకు పరామర్శయాత్ర చేపట్టిన షర్మిల.. ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటిదశలో 32 కుటుంబాలను, సెప్టెంబరు 7 నుంచి 11 వరకు జరిపిన రెండో దశలో మరో 30 కుటుంబాలను ఓదార్చారు. రెండోదశ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలో శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. పేరుపేరునా పలకరిస్తూ.. పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను అందరూ ఆత్మీయతతో ఆదరించారు. రెండు చేతులతో నమస్కరించి పేరుపేరునా షర్మిల పలకరించినప్పుడు వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబంలో ఒకరిగా కలసిపోయి షర్మిల మాట్లాడుతున్నప్పుడు... ‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఆమె మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే..’’అని వారంతా ఆనందించారు. షర్మిల ప్రతిచోటా ఆయా కుటుంబాల బాధలు, సమస్యలు తెలుసుకుని ఓదార్చారు. వారందరికీ వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఐదో రోజు నాలుగు కుటుంబాలకు.. వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శయాత్ర చివరి రోజు శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పరకాల మండలం మల్లక్కపేటలో రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని ఓదార్చి... తిరుపతి తండ్రి బుచ్చయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మండలం నాగారంలో కాంబత్తుల శ్రీహరి భార్య శ్రీదేవిని పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత లక్ష్మీపురం గ్రామంలో చెల్పూరి ఉప్పలయ్య కుటుంబాన్ని కలుసుకుని ఆయన భార్య లక్ష్మికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. చివరగా మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రాజయ్య భార్య కమలమ్మను ఓదార్చారు. మంచి రోజులు మళ్లీ వస్తాయని చెప్పారు. ఇసిపేటలో పరామర్శ ముగిసిన తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్కు వెళ్లారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఎన్.భిక్షపతి, జార్జ్ హెర్బర్ట్, షర్మిల సంపత్, కె.నగేశ్, ఎం.శంకర్, టి.నాగరావు, డి.శ్వేత, ఎ.సంతోష్రెడ్డి, జి.శివకుమార్, వనజ పాల్గొన్నారు. -
సర్కారు నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు: పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తోందని తెలిపారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఇక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేరనే వార్తను తట్టుకోలేక అత్యధికులు వరంగల్ జిల్లాలోనే చనిపోయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పరామర్శ యాత్రలో ఉండేందుకు ఆరు అడుగుల ఇళ్లు కూడా లేనివారిని షర్మిల చూశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేదప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్ అన్నదాతలకు కూడా అండగా నిలిచారని, ఆనాడు రైతు ఆత్మహత్యలు చాలా తక్కువగా ఉండేవని ఆయన అన్నారు. -
ముగిసిన షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర శుక్రవారంతో ముగిసిందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ నగరంలో కొండ రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండో విడతలో వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారని తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్రను ఆమె చేపట్టనున్నారని ఆయన వివరించారు. అలాగే ఈ నెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ మరణించి ఆరు ఏళ్లు అయినా ప్రజలు ఆయన్ని మరచిపోలేకపోతున్నారన్నారు. వరంగల్ లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అధైర్యపడవద్దని రైతులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. మీ పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. -
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
-
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. పరకాల నియోజక వర్గం నుంచి యాత్ర ప్రారంభించిన షర్మిల మొదటగా మండలంలోని మల్కక్కపేటలోని రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని నాగారంలో కాంబత్తుల శ్రీహరి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలోని చెల్పూరి ఉప్పలయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు. చివరగా మొగళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. శుక్రవారం 25 కిలోమీటర్లు పరామర్శయాత్ర కొనసాగుతుంది. కాగా, జిల్లాలో చేపట్టిన రెండో దశ యాత్ర నేటితో ముగియనుంది. -
షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు
-
మంచి రోజులు మళ్లీ వస్తాయి
ఓరుగల్లు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా * నాలుగో రోజు ఏడు కుటుంబాలకు ఓదార్పు * షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు * నేడు ముగియనున్న రెండో దశ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి’’ - అంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఆమె రెండో దశ పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన ఏడుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, శాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది. వైఎస్ తనయ, జగన్మోహన్రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తోందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆదరించారు. తమ ఇంటి మనిషే తిరిగొచ్చినట్టుగా ఆనందపడ్డారు. వైఎస్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ ఆత్మీయుడయ్యాడాయన. ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబసభ్యులు అన్నారు. ‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరవమమ్మా’ అని ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరమ్మ కుటుంబసభ్యులు అన్నారు. డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశ వర్కర్లు ఆత్మకూరు, రేగొండ మండల కేంద్రాల్లో షర్మిల దగ్గరికి వచ్చి కలిశారు. తమ డిమాండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించేలా చూడాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగియనుంది. అన్నం పెట్టిన మహానేత నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ ఇంటికి షర్మిల వెళ్లారు. కొమురమ్మ మనుమరాలు అంకిళ్ల జ్యోతిని పరామర్శించారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలోని వేల్పుల వీరాస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిని నర్సయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త’ అని నర్సయ్య భార్య పోచమ్మతో అన్నారు. షర్మిల తమ ఇంటికి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్పూర్లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాలను ఓదార్చారు. ‘ధైర్యంగా ఉండండి. మీకు అండగా ఉంటా’నంటూ వెంకట్రాజం భార్య రాధక్కకు భరోసా ఇచ్చారు. అనంతరం కనిపర్తిలోని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? నాతో వస్తావా’ అని ఓదెలు భార్య సారమ్మను అడిగారు. రాజన్న బిడ్డ తన ఇంటికొచ్చిందంటే నమ్మలేకపోతున్నానంటూ సారమ్మ ఆనందపడ్డారు. తర్వాత పరకాల మండలం కామారెడ్డిపల్లెలో రాజమౌళి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నపరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, భీమయ్యగౌడ్, ఎస్.భాస్కర్రెడ్డి, బి.శ్రీనివాస్రావు, ఎ.కుమార్, ఎం.శంకర్, టి.నాగారావు, ఎ.సంతోష్రెడ్డి, ఎస్.భిక్షపతి పాల్గొన్నారు. -
నాలుగోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
కొమురమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర నాల్గో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్పూర్లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది. -
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
-
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ మూడోరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. -
ఐలయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా లో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బుధవారం ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటగా నెక్కొంట మండలం మండలం వెంకటాపురంలోని కూరం ఐలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం దీక్షకుంట చేరుకుని అక్కడ బేతం చంద్రయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి చెన్నారావు పేట మండలం జీజీఆర్ పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. మూడో రోజు యాత్రలో చివరగా ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. -
ముగిసిన రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని నెల్లికుదురు, మహబూబాబాద్, గూడురు మండలాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ రోజు 93 కిలో మీటర్ల మేర పర్యటించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని, చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని, మహబూబాబాద్లో కర్రెయ్య కుటుంబాన్ని, గాంధీపురంలో షేక్ బికారి కుటుంబాన్ని, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని, చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
కర్రెయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్లో కర్రెయ్య కుటుంబాన్ని, తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తార్సింగ్ బాయితండాలోని గుగులోత్ బబ్బి కుటుంబాన్ని కలుసుకుంటారు. అక్కడ నుంచి చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మహబూబాబాద్ చేరుకుని పట్టణంలోని కరయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం అదే మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన షేక్ బికారి కుటుంబానికి భరోసా ఇచ్చి, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మంగళవారం పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల 119.5 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. -
ప్రజల బాధను గుండెలో పెట్టుకున్నారు
* అందుకే వైఎస్సార్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు * వరంగల్ జిల్లా రెండోదశ పరామర్శయాత్రలో షర్మిల సాక్షి ప్రతినిధి, వరంగల్: ఒక నాయకుడి మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోవడం దేశచరిత్రలోనే లేదని.. అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి ఆయన వెంట వెళ్లిపోయారన్నారు. ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైఎస్ పాలన సాగించారని.. ఆయన ఆశయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిల... పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. రాయపర్తి మండల కేంద్రంలో తనకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్సార్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఒక నాయకుడు చనిపోతే ఆ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె ఆగి చనిపోవడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అంతగొప్పగా వైఎస్సాఆర్ పాలన సాగించారు. ప్రజల బాధను వైఎస్సాఆర్ తన గుండెలో పెట్టుకుని ఆలోచించేవారు. ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల కష్టాలను తొలగించేందుకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. రుణాలు మాఫీ చేశారు. నష్టపరిహారం పెంచారు. మహిళలను లక్షాధికారులను చేశారు. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్నారు. వైఎస్ పాలనా సమయంలో దేశం మొత్తం మీద ప్రభుత్వాలు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే... వైఎస్సార్ ప్రభుత్వం ఇక్కడ ఒక్క రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించింది. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎందరో పేదలు పెద్ద చదువులు చదివారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం అందించారు. అందుకే ప్రజలు వైఎస్సాఆర్ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో రాజన్నగా జీవించే ఉంటారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను, పథకాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం అందరం చేయిచేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. వైఎస్సార్పై అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా...’’ అని షర్మిల పేర్కొన్నారు. తొలి రోజు.. ఆరు కుటుంబాలకు.. వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శయాత్ర సోమవారం మొదలైంది. ఆమె హైదరాబాద్లోని లోటస్పాండ్ నుంచి జనగామ మీదుగా కొడకండ్ల మండలం గండ్లకుంటకు చేరుకుని తొలుత ఏడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇదే మండలం రేగులలో కొత్తగట్టు శాంతమ్మ కుటుంబానికి భరోసా కల్పించారు. తర్వాత రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబసభ్యులను ఓదార్చిన ఆమె... రాయపర్తి మండల కేంద్రంలో ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని, నాంచారి మడూరులోని గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఈ కుటుంబాల వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు. సోమవారం పరామర్శ యాత్రలో ఆమె 217 కిలో మీటర్లు ప్రయాణించారు. యాత్రలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, జార్జ్ హెర్బర్ట్, సయ్యద్ ముజతబ్ అహ్మద్, ఎం.సందీప్, బి.శ్రీనివాసరావు, ఎస్.భాస్కర్రెడ్డి, జి.సురేశ్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ఎ.గోపాలరావు, ఎం.భగవంత్రెడ్డి, బి.శ్రీనివాస్, ఎ.కుమార్, షర్మిల సంపత్, బి.బ్రహ్మానందరెడ్డి, సెగ్గం రాజేశ్, జి.జైపాల్రెడ్డి, జి.శివకుమార్, జె.అమరనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ పథకాలకు గండికొడుతున్నారు: పొంగులేటి సాక్షి, హన్మకొండ: అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా రాయపర్తిలో పొంగులేటి ప్రసంగించారు. ‘‘ప్రజల మనసు తెలుసుకుని వారికి అవసరమైన పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. రాజకీయాలకు అతీతంగా వాటిని అమలు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పథకాలను మార్చాలని చూస్తోంది. వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను వైఎస్సార్సీపీ సహించదు. ప్రభుత్వం ఇలా చేయవద్దని డిమాండ్ చేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి అందరం కలసి కష్టపడదామని పిలుపునిచ్చారు. -
తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సోమవారం రోజు పరామర్శయాత్రలో భాగంగా 63కిలోమీటర్లు పర్యటించారు. ఈ పరామర్శయాత్రలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. -
వెంకటయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
-
నేటి నుంచి షర్మిల రెండోదశ పరామర్శ యాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
వరంగల్ జిల్లాలో రెండోదశ * పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభం * 11వ తేదీ వరకు కొనసాగనున్న యాత్ర * 31 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల * ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, వరంగల్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను తమ కుటుంబంగా భావించి వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర సాగనుంది. ఐదు రోజుల యాత్రలో భాగంగా 31 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో వైఎస్ తనయ పర్యటిస్తారు. అన్నదాతలు, మహిళలు, పేదలు... అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. ఈ ఘోరాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో చాలా మంది చనిపోయారు. ఇలా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానంటూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను ఆచరణలో చూపేందుకు వైఎస్సార్ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటి దశ పరామర్శ యాత్ర చేపట్టారు. ఐదు రోజులపాటు జిల్లాలోని 32 కుటుంబాలను ఓదార్చారు. వరంగల్ జిల్లాలో ఇంకా 43 కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది. పరామర్శ యాత్ర రెండోదశలో భాగంగా షర్మిల తొలి రోజు సోమవారం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గండ్లకుంటలోని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ యాత్ర కోసం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు ఇలా... హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరుతారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. పరామర్శ టూర్ షెడ్యూల్ ఇది... * సెప్టెంబర్ 7న పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు... * 8న మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు... * 9న నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలకు, ములుగు నియోజకవర్గంలోని ఒక కుటుంబానికి.. * 10న నర్సంపేట, నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు, పరకాల నియోజకవర్గంలో ఒక కుటుంబానికి, భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు... * 11న పరకాల నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు పరామర్శ. -
రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈనెల 9,10 తేదీల్లో నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నారు. పరామర్శయాత్రలో భాగంగా నర్సంపేటలో వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించనున్నట్లు పార్టీ నేత గోవర్థన్ రెడ్డి తెలిపారు. -
ఇచ్చిన మాట కోసమే..
షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు.. * 31 కుటుంబాలకు పరామర్శ * వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తొర్రూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని నల్లకాల్వలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట కోసమే ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు. శనివారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాల పరామర్శ కోసం వరంగల్ జిల్లాలో రెండో విడత యాత్ర ఈ నెల 7న పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని గంట్లకుంట గ్రామంలో ప్రారంభమై, 11న భూపాలపల్లి మండలంలోని ఇసిపేటలో ముగుస్తుందన్నారు. పరామర్శ యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి.. షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మునిగాల విలియమ్స్, గుడూరు జయపాల్రెడ్డి, నాడెం శాంతికుమార్, జిడిమేట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి వరంగల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈ యాత్ర షెడ్యూలును కొండా రాఘవరెడ్డి, బీష్మా రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులు శనివారం వరంగల్ జిల్లాలోని తొర్రూరులో విడుదల చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 31 మంది కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. -
జనం గుండెల్లో వైఎస్..
వరంగల్ జిల్లాలో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎవరిని కదిపినా ఆ మహానేత జ్ఞాపకాలే.. ఎవరిని పలకరించినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మాటే.. మాకు పింఛన్ వచ్చిందని ఒకరంటే.. మాకు ఉచిత కరెంటిచ్చాడని మరొకరు.. మా అప్పులు మాఫీ జేశారని ఒకరంటే.. నాకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించాడని ఇంకొకరు! వైఎస్సార్ తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్రలో భాగంగా ఆమె వెళ్లిన ప్రతీచోట జనం వైఎస్ పాలననే గుర్తుకుతెచ్చుకున్నారు. శుక్రవారం ఐదోరోజు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారం వద్ద ఈ యాత్ర తొలిదశ ముగిసింది. మొత్తంగా జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని 32 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెళ్లిన ప్రతీచోట ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ వైఎస్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంట్లో మనిషిలా.. పరామర్శ కోసం వెళ్లిన చోట షర్మిలపై ఆయా కుటుంబాలు ఎంతో ఆప్యాయత చూపాయి. రెండు చేతులతో నమస్కరిస్తూ.. అందరినీ పేరుపేరునా పలకరించిన ఆమెను ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. ‘‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఆ బిడ్డ మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే. రాజన్న కూతురు మా గడపలో అడుగుపెట్టింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను చూశాంగానీ.. మా కష్టసుఖాలు తెలుసుకుని.. మాతో మాట్లాడటం కోసమే వచ్చిన మొదటి నాయకురాలు షర్మిల’’ అని పలువురు పేర్కొన్నారు. ఐదోరోజు 4 కుటుంబాలకు పరామర్శలు.. పరామర్శ యాత్రలో శుక్రవారం షర్మిల నాలుగు కుటుంబాలను పరామర్శించారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ ఇంటికి వెళ్లి బొల్లు సమ్మయ్యతో మాట్లాడారు. ‘ఏం పనులు చేస్తున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది’ అని తెలుసుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ‘‘రాజన్న ఉన్నప్పుడు వర్షాలు పడ్డారుు. ఈరోజు మీరొచ్చారు. మళ్లీ వర్షం కురిసింది. వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు వరలక్ష్మిలా వచ్చావు. రేపు రాఖీ.. మా ఇంటికి పండగలా వచ్చావు’’ అని చంద్రకళ కుటుంబ సభ్యులు షర్మిలతో ఆనందం పంచుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం కేంద్రంలోని పల్లూరి కొమురమ్మ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు(ఎమ్మెల్యే), గట్టు శ్రీకాం త్రెడ్డి, రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్కుమార్, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, ఆకుల మూర్తి, కె.కుసుమకుమార్రెడ్డి, జి.శ్రీధర్రెడ్డి, ఎం.భగవంత్రెడ్డి, కె.వెంకట్రెడ్డి, ఎం.శంకర్, షర్మిల సం పత్, సాదు రమేశ్రెడ్డి, జార్జ్ హెర్బర్ట్, జి.శివకుమార్, ఎ.సంతోష్రెడ్డి, వనజ పాల్గొన్నారు. వైఎస్ తరహా పాలన కోరుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని వైఎస్సార్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాల స్ఫూర్తిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నీరుగార్చాయని అన్నారు. వరంగల్ జిల్లాలో షర్మిల తొలిదశ పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా తొర్రూరు మండలం సోమారంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతోనే వైఎస్ ప్రజానేత అయ్యారన్నారు. షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. రాజన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర నిర్వహించ నున్నట్లు తెలిపారు. -
ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
-
రాజన్న బిడ్డ రాక..కొండత ధైర్యాన్ని ఇచ్చింది
-
వరంగల్ జిల్లాలో ముగిసిన తొలి విడత పరామర్శయాత్ర
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. -
కొమరమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
బొల్లు ఎల్లమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ముందుగా పరకాల నియోజక వర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వర్థన్న పేట నియోజక వర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుండ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యులను కలుస్తారు. శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలోమీటర్లు సాగనుంది. వరంగల్ జిల్లాలో మొదటి విడతగా వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగియనుంది. -
నాలుగో రోజు ముగిసిన పరామర్శయాత్ర
-
నాలుగో రోజు ముగిసిన పరామర్శయాత్ర
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాలుగురోజు హన్మకొండ, వరంగల్, గీసుకొండ మండల్లాలోని 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆమె 68 కిలోమీటర్లు ప్రయాణించారు. ఊకల హవేలీలో ఓదెల స్వామి కుమారులిద్దరికీ షర్మిల రాఖీ కట్టారు. పరామర్శయాత్రలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, బీశ్వ రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం 4 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. -
రాజ్యలక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సుదర్శన్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
తీగల చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డ లోని తీగల చిరంజీవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది. -
మాటిస్తున్నా.. అండగా ఉంటాం!
వరంగల్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల * ఏ ఆపదొచ్చినా ఒక్క పిలుపు చాలు.. మీ కష్టాలు మా కష్టాలతో సమానం * మీరంతా మా కుటుంబంలోని సభ్యులే.. మూడో రోజు 7 కుటుంబాలకు పరామర్శ * హన్మకొండలో అమరవీరుల కీర్తి స్థూపానికి, వైఎస్ చిత్రపటానికి నివాళులు సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘ఏ కష్టమొచ్చినా మేమున్నాం. వైఎస్సార్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏ ఆపదలోనైనా మీకు ఆసరాగా ఉంటాం. మీ కష్టాలు మా కష్టాలతో సమానం. అవసరం వచ్చినప్పుడు మాకు చెప్పండి. మీరూ మా కుటుంబంలో సభ్యులే...’’ అంటూ వైఎస్సార్ తనయ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసానిచ్చారు. వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం మూడోరోజు స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటిచ్చారు. కుటుంబాల్లోని సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. మడికొండ గ్రామంలో మద్దెల గట్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఉదయం స్టేషన్ఘన్పూర్ మండలం మల్కాపూర్ నుంచి బయలుదేరారు. పీచర, మల్లికుదురు, మడికొండ, సింగారం, మామునూరులో కుటుంబాలను పరామర్శించారు. 82.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో దారిపొడవునా ప్రజలు షర్మిలకు అభివాదం చేస్తూ స్వాగతం పలికారు. సింగారంలోని మహిళలు బోనాలతో షర్మిలను తమ ఊరికి ఆహ్వానించారు. హన్మకొండలోని వరంగల్ జిల్లా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపానికి, అక్కడే ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి షర్మిల, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నివాళులర్పించారు. గురువారం వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. అన్నా.. అమ్మను బాగా చూసుకో! వైఎస్ మృతిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఎడపెల్లి వెంకటయ్య కుటుంబా న్ని పరామర్శించేందుకు షర్మిల ధర్మసాగర్ మండలం పీచరకు వెళ్లారు. వెంకటయ్య భార్య రాజమ్మ, కుమారుడు రవీందర్, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారింట్లో గంటసేపు గడిపారు. ‘‘బోర్లలో నీళ్లు ఉన్నాయా? వ్యవసాయం ఎలా ఉంది’’ అని వారిని అడిగారు. వ్యవసాయం లాభసాటిగా లేదని, కుటుంబం గడవటం చాలా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రాజమ్మ విలపించడంతో షర్మిల ఆమెను దగ్గరకు తీసుకుని.. ‘‘అమ్మా.. ఇక్కడ కష్టంగా ఉంటే నాతో వస్తావా? తీసుకెళ్తా.. గుం డె ధైర్యంతో ఉండాలమ్మా..’’ అంటూ ఓదార్చా రు. ‘‘అన్నా.. అమ్మను బాగా చూసుకొండ న్నా.. మీకు రాజన్న కుటుంబం అండగా నిలుస్తుంది’’ అని రవీందర్కు చెప్పారు. ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చే యాలని సూచించారు. కుటుంబం ఎలా గడుస్తోంది.. ధర్మసాగర్ మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘‘కుటుంబం ఎలా గడుస్తోంది? గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా? వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి’’ అని షర్మిల వారిని అడిగారు. తమది నిరుపేద కుటుంబమని వైఎస్ దయతోనే ప్రస్తుత ఇంటిని నిర్మించుకున్నామని మర్రి ఐలయ్య తెలిపారు. తర్వాత మడికొండలోని మద్దెల గట్టయ్య కుటుంబాన్ని కలిశారు. గట్టయ్య భార్య వరలక్ష్మి, కూతురు కోమల, కుమారులు కుమారస్వామి, అశోక్కుమార్ వారి కుటుంబీకులను పేరుపేరునా పలకరించారు. ఇదే ఊరిలో దోమ లింగయ్య ఇంటికి షర్మిల వెళ్లారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మడికొండకే చెందిన వస్కుల సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పలకరించారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు ఏ కష్టమొచ్చినా నా వద్దకు రండి. అండగా ఉంటాను..’ అని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జె.అనిల్కుమార్, షర్మిల సంపత్, జి.శివకుమార్, జె.నాగరావు, కె.నాగభూషణం, అంకసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చదివిస్తా.. వైద్యం చేయిస్తా.. హన్మకొండ మండలం మామునూరులోని ఎర్ర భాస్కర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది. ఏం పని చేస్తున్నారు’ అని భాస్కర్ భార్య లతను ఆప్యాయంగా పలకరించారు. ‘‘పెద్ద కొడుకుకు పోలియో వచ్చింది. చిన్న కొడుకు ఎల్కేజీ చదువుతున్నాడు. కూలీ పనిచేసుకుంటూ వాళ్లను సాకుతున్న. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన పదో రోజు ఆ బాధతో ఆయన ఉరివేసుకున్నడు..’’ అని లత కన్నీరు పెట్టుకుంది. దీంతో చలించిన షర్మిల.. ‘‘నీ చిన్న కొడుకు మంచిగా చదువుకుంటే డాక్టర్ అయ్యే వరకు ఖర్చులన్నీ భరిస్తా. నీ పెద్ద కొడుకుకు వైద్యం చేయిస్తా. నీకు పని కల్పిస్తా..’’ అని ఆమెకు హామీ ఇచ్చారు. భాస్కర్ సోదరుడికి ఆటో కోసం సాయం చేస్తానని, భాస్కర్ రెండో సోదరుడు వినయ్ చదువులో రాణిస్తే ఉద్యోగం వచ్చేలా మాట సాయం చేస్తానని చెప్పారు. లత పెద్ద కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డికి సూచించారు. బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో దోమ లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల -
కాకర్ల రాజయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం సింగారంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. మహానేత మరణం తట్టుకోలేక మరణించిన కాకర్ల రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని రాజయ్య కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. -
మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్లి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్ కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తర్వాత వర్ధన్నపేట మండలం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. మూడో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో 82.5 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగనుంది. -
లచ్చవ్వ, యాదగిరి కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం జనగామ నియోజక వర్గంలో షర్మిల యాత్ర మొదలైంది. యాత్రలో భాగంగా ఈరోజు ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, ఆలువాల యాదగిరి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి కుటుంబానికి ఆమె భరోసా ఇచ్చారు. వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇదే మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి, తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. రెండో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల 78 కిలో మీటర్ల దూరం మేర యాత్ర సాగనుంది. -
లచ్చవ్వ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
ప్రజ్ఞాపూర్లో షర్మిలకు ఘనస్వాగతం
గజ్వేల్ (మెదక్ జిల్లా) : వైఎస్సార్సీపీ నాయకురాలు వై.ఎస్.షర్మిలకు సోమవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, నినాదాలతో చౌరస్తా ప్రాంగణం హోరెత్తింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్రకు బయలుదేరిన సందర్భంగా మార్గమధ్యంలోని ప్రజ్ఞాపూర్లో కొద్దిసేపు ఆగిన షర్మిల చౌరస్తాలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాజన్న కూతుర్ని చూడటానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారు. చౌరస్తా వద్ద తన కోసం వేచి వున్న మహిళలను షర్మిల ఆత్మీయంగా పలకరించారు. అందరినీ 'బాగున్నారామ్మా...?' అంటూ అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. షర్మిలను చూస్తుంటే దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి వచ్చిన రోజులు గుర్తుకువస్తున్నాయని వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి రేణుక, పోతగల్ల పోశమ్మ, నర్సమ్మ తదితరులు 'సాక్షి'తో పేర్కొన్నారు. రాజశేఖర్రెడ్డిని చూసినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. పేదల కోసమే వైఎస్ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వారు కొనియడారు. తరలివచ్చిన జిల్లా నేతలు ప్రజ్ఞాపూర్లో షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మెర వెంకట్రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాన్ని పూలతో అలంకరించారు. షర్మిల రాగానే వైఎస్ విగ్రహానికి పూలమాలుల వేసి కొద్దిసేపు ప్రార్ధించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న పరామర్శయాత్రకు తరలివెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్రావు, సాయికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నర్రా బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, అజహర్, మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
శోభారాణి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
యాదగిరి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
చేర్యాల: వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం చేర్యాల మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆమె చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన యాదగిరి తల్లిదండ్రులు బాలనర్సయ్య, లక్ష్మిలను ఓదార్చారు. యాదగిరి తమ్ముడు కృష్ణ, చెల్లెలు లలితలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మద్దూర్ మండలంలోకి ప్రవేశించారు. ఆమె వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డితోపాటు మహేందర్రెడ్డి, లింగారెడ్డి, చంద్రాచారి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఉదయం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో షర్మలకు పార్టీ నేతలు , కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ బయల్దేరి వెళ్లారు. -
యాదగిరి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
24నుండి వరంగల్లో షర్మిళ పరామర్శయాత్ర
-
వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం
-
వైఎస్ జగన్ పరామర్శ యాత్ర ప్రారంభం
అప్పుల బాధలు తాళలేక.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత పరామర్శ యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. పరశురాంపురం వద్ద ఆయనకు అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరి కొద్దిసేపట్లో శెట్టూరులో బహిరంగ సభ ప్రారంభం కానుంది. -
పేదల గుండెచప్పుడు వైఎస్
ఆరేళ్లయినా ప్రజల మనస్సుల్లో సజీవంగా రాజన్న: షర్మిల * పేదల పక్షపాతిగా పనిచేసినందునే మహానేత అయ్యారు * రంగారెడ్డి జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర * 15 కుటుంబాలకు పరామర్శ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరణించి ఆరేళ్లయినా.. వైఎస్ను ప్రజలు తమ గుండెల్లో సజీవంగా పెట్టుకోవడం గర్వంగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రాజన్న జ్ఞాపకార్థం ఇప్పటికీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా పనిచేసినందునే వైఎస్ మహానేత అయ్యారన్నారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా షర్మిల నిర్వహించిన పరామర్శ యాత్ర గురువారం ముగిసింది. జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 15 కుటుంబాలవారిని ఆమె పరామర్శించారు. ‘రాజన్న బిడ్డగా నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. గురువారం తాండూరు మండలం అడ్కిచర్ల, తట్టేపల్లిలో వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించిన షర్మిల.. అనంతరం మర్పల్లి, మోమిన్పేట, ఎన్కతలలో మూడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత మర్పల్లి మండల కేంద్రంలోని కమ్మరి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి దీపం ఆరడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డానని నారాయణ భార్య నీరజ విలపించడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘నాన్న గారి కోసం ఆత్మత్యాగం చేసిన మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. ఏ కష్టమొచ్చినా నాకు ఫోన్ చేయండి’ అని భరోసా ఇచ్చారు. అక్కడ్నుంచి మోమిన్పేటలోని అరిగే యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఉపాధి లేని యాదయ్య కుమారుడికి ఆసరా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్కతలలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని కలిశారు. ‘నాన్న లేరని దిగులు పడకు.. ఆయన ఆత్మశాంతించేలా బాగా చదువు. నీ ఉన్నత చదవులకు ఎలాంటి సాయమైనా చేస్తా’ అని ఆయన కూతురు కృష్ణవేణికి భరోసా ఇచ్చారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్రెడ్డి, నల్లా సూర్య ప్రకాశ్, ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్రెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, కార్యదర్శులు అమృతాసాగర్, ప్రభుకుమార్, సూర్యనారాయణరెడ్డి, విలయం మునగాల, రఘురాంరెడ్డి, ఐ.వెంకటేశ్వర్రెడ్డి, జి.రాంభూపాల్రెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, భగవంతరెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్కుమార్, షర్మిల సంపత్, భీమయ్యగౌడ్, సంజీవరావు, బంగి లక్ష్మణ్, వరలక్ష్మి, గూడూరి జైపాల్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సెగ్గెం రాజేశ్, ఎం.రవీందర్రెడ్డి, సంతోష్రెడ్డి, జస్వంత్రెడ్డి, నర్సింహరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, సయ్యద్ ముజతబా, నర్రా భిక్షపతి, ప్రపుల్లారెడ్డి, జార్జ్ హెర్బట్, వెల్లాల రామ్మోహన్, మెరుగు శ్రీనివాస్రెడ్డి, జిల్లాల అధ్యక్షులు శ్యాంసుందర్రెడ్డి, మహేందర్రెడ్డి, బి.అనిల్కుమార్, రాష్ట్ర నాయకులు జె.అమరనాథ్రెడ్డి, కె.నరేందర్రెడ్డి, వాసుదేవరెడ్డి, విజయ్కుమార్రెడ్డి, గోపాల్రావు, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు అవినాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీది మేకపోతు గాంభీర్యం: పొంగులేటి ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి విషయంలో టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ముగిసిన అనంతరం మోమిన్పేటలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్కు రంగారెడ్డి జిల్లా అన్నా.. ఇక్కడి ప్రజలకు వైఎస్ కుటుంబమన్నా ప్రత్యేకాభిమానం ఉందని, అది పరామర్శ యాత్రలోనూ కనిపించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో పరామర్శయాత్ర ముగిసిందని, ఈ నెలాఖరులో మరో జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపడతారని చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అద్భుత పథకాలను ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ మాటలతో మభ్యపెట్టడం తప్ప.. ఇప్పటికీ ఒక్క పథకం కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. పండు వృద్ధులకు సైతం పింఛన్ రావడంలేదని విమర్శించారు. -
వైఎస్ షర్మిల నాల్గో రోజు పరామర్శ యాత్ర
-
ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
వైఎస్ షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర
-
రంగారెడ్డి జిల్లాలో 3వరోజు షర్మిళ పరామర్శయాత్ర
-
మూడోరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డి జిల్లాలో మూడో రోజు ముగిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబ సభ్యులను బుధవారం షర్మిల ఓదార్చారు. ఈ రోజు ఉదయం మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. సుగుణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రంగాపూర్లో కే కృష్ణారెడ్డి కుటుంబాన్ని, పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని, గొట్టిగఖుర్డులో అవుసల లక్ష్మణయ్య చారి కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. పరామర్శయాత్రలో తెలంగాణ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు భీష్మరవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిగిలో షర్మిలకు ఘనస్వాగతం
పరిగి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డిలో జిల్లాలో కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మూడో రోజు బుధవారం పరిగి వచ్చిన వైఎస్ షర్మిలకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తున్నారు. ఈ రోజు ఉదయం మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల ఓదార్చురు. సుగుణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శయాత్రలో తెలంగాణ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు భీష్మరవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రంగారెడ్డి జిల్లాలో షర్మిల మూడోరోజు పరామర్శయాత్ర
-
రంగారెడ్డిలో షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. షర్మిల ఈ రోజు ఎన్కేపల్లి, రంగాపూర్, పరిగి, గొట్టిగఖుర్దు ప్రాంతాల్లో పరామర్శ యాత్ర చేయనున్నారు. ఎన్కేపల్లిలోఈడిగ సుగుణ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే రంగాపూర్లో కె. కృష్ణారెడ్డి కుటుంబాన్ని... పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని... గొట్టిగఖుర్దులో అవుసల లక్ష్మణయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. మహానేత తనయ షర్మిల పరామర్శ యాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఈ పరామర్శ యాత్ర గురువారంతో ముగియనుంది. -
మీ భవిష్యత్తుకు నాది భరోసా!
► వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలతో షర్మిల ► ఇంటికి పెద్దదిక్కు లేకుంటే ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు ► ఏ కష్టమొచ్చినా ఫోన్ చేయండి.. ఆదుకుంటాం ► బాధలో ఉన్నవారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది ► ర ంగారెడ్డి జిల్లాలో రెండోరోజు కొనసాగిన పరామర్శ యాత్ర సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు.. పిల్లల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరం చేసుకోండి.. ఏ కష్టమొచ్చినా నాకు ఫోన్ చేయండి..’ అంటూ వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు. ‘బాధ్యత ఒకరిచ్చేది కాదు.. తమకు తామే తీసుకోవాలి.. బాధలో ఉన్న కుటుంబానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని అన్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక రంగారెడ్డి జిల్లాలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల మంగళవారం రెండోరోజు కండ్లకోయ, మేడ్చల్, కేశవరం, ల క్ష్మాపూర్, మూడు చింతలపల్లిలో 5 కుటుంబాలను కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ కుటుంబీకులు చనిపోయిన సంఘటనను గుర్తుచేసుకుని విలపించడంతో షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ‘వైఎస్సార్ మరణంతో నా కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు..’ అని కేశవపురంలో వెంకటేశ్ తండ్రి యాదయ్య కన్నీరుమున్నీరవడం చూసి షర్మిల చలించిపోయారు. ‘పెద్దయ్యా.. ధైర్యంగా ఉండు.. వైఎస్ కుటుంబం మీకు అండగా ఉంటుంది’ అంటూ కళ్లు చెమర్చారు. ఏ సహాయం కావాల్సినా ఫోన్ చేయాలని ఓదార్చారు. ఉద్వేగ క్షణాలు.. ఆత్మీయ పలకరింపులు.. పరామర్శ యాత్రలో భాగంగా తొలుత కండ్లకోయ గ్రామానికి వెళ్లిన షర్మిల.. సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. కుటుంబ పెద్ద ఆకాల మరణంతో ముగ్గురు ఆడపిల్లలను సాకలేకపోతున్నానని, చనిపోవడానికి కూడా ప్రయత్నించానని సాయిబాబా గౌడ్ భార్య అరుణజ్యోతి చెప్పడంతో షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ‘పిల్లలను బాగా చదివించు. ఉద్యోగాలు వస్తాయి. జీవితంలో స్థిరపడితే అన్నీ సమస్యలు తొలిగిపోతాయి’ అని ఆమెకు గుండె ధైర్యం చెప్పారు. పిల్లల ఉన్నత చ దువులకు ఆసరాగా నిలుస్తామని చెప్పారు. అనంతరం లక్ష్మాపూర్లో నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడంటూ విలపించిన మహేశ్ తల్లి సావిత్రిని అక్కునచేర్చుకున్నారు. ‘ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. 108 సర్వీసులు నిలిచిపోయాయి. నాన్నగారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు కోత పెట్టారు’ అని లక్ష్మాపూర్ సర్పంచ్ శ్యామల..షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో వైఎస్ ఆకస్మిక మరణానికి తట్టుకోలేక మరణించిన కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. భర్త మరణంతో తామంతా అనాథలుగా మారమంటూ కన్నీరు పెట్టుకున్న ముత్యాలు భార్య యాదమ్మకు ధైర్యం చెప్పారు. తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ చేయాలని సూచించారు. తర్వాత మూడు చింతలపల్లిలో జామ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ప్రతి కుటుంబానికి మేమున్నాం: పొంగులే టి వైఎస్ మరణంతో చనిపోయినవారి ప్రతి కుటుంబానికీ ఆసరాగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వైఎస్ మరణించి ఆరేళ్లయినా.. అభిమానం చెక్కుచెదరలేదంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. షర్మిల వెంట పార్టీ ప్రధాన కార్యద ర్శులు శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్రెడ్డి, మతిన్ ముజాద్ అలీ, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్రెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు భాస్కర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు భీష్వ రవీందర్, సయ్యద్ ముజతబా అహ్మద్, జార్జ్ హెర్బత్, ప్రఫుల్లారెడ్డి, ఎం.జయరాజ్, సందీప్కుమార్, రామ్మోహన్, శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్రెడ్డి, బి.రఘురామరెడ్డి, సామ యాదిరెడ్డి, జి.రాంభూపాల్రెడ్డి, అమృతాసాగర్, సూర్యనారాయణ రెడ్డి, భగవంతరెడ్డి, శ్రీధర్రెడ్డి, కె.వెంకట్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, నేతలు మేరీ, షర్మిల సంపత్, బ్రహ్మానందరెడ్డి, సుభాన్గౌడ్, విజయ్కుమార్రెడ్డి, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. -
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
వైఎస్ షర్మిల రెండవ రోజు పరామర్శ యాత్ర
-
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర ముగిసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం మేడ్చల్లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజుల పరామర్శ యాత్రను షర్మిల సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ప్రజల గుండెల్లో వైఎస్
పరామర్శ యాత్రలో షర్మిల * అభిమాన నేత మరణించి ఆరేళ్లయినా అదే ఆత్మీయత * జనం బాధను తన బాధగా భావించినందునే వారి హృదయాల్లో నిలిచిపోయారు * రైతే రాజని, వ్యవసాయం పండుగ అని చేతల్లో చూపారు * తొలిరోజు రంగారెడ్డి జిల్లాల్లో మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జనం బాధను తన బాధగా భావించినందునే ప్రజల గుండెల్లో వైఎస్ రాజ శేఖర్రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. నాన్న మరణించి ఆరేళ్లయినా.. అదే ఆప్యాయత కనబరుస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన ఆమె.. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మూడు కుటుంబాలను పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల.. నేరుగా హైదరాబాద్ శివారుల్లోని మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకున్నారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా అభిమానులు నీరాజనాలు పలికారు. చౌరస్తాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల.. అక్కడ్నుంచి నేరుగా జిల్లెల గూడా గ్రామానికి చేరుకొని వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బి.అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంటపాటు వారితో గడిపిన షర్మిల.. అందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అక్కడ్నుంచి పరామర్శ యాత్ర రంగారెడ్డి జిల్లా మంఖాల్కు చేరుకుంది. ఈ గ్రామంలోని ఎంగల జోసఫ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రైతుల హృదయాల్లో చెరగని ముద్ర దండుమైలారంలో వైఎస్సార్ తనయ షర్మిలకు ఘన స్వాగతం దక్కింది. ఊరంతా కలసిరాగా..డప్పువాయిద్యాల మధ్య ఆమె ప్రజలతో కలసిసాగారు. ఈ గ్రామంలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన పోకల్కార్ మహేశ్వర్జీ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. తర్వాత ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘రైతేరాజనీ.. వ్యవసాయం పండగని చేతల్లో చూపిన మహానేత రాజన్న. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధరలు కల్పించడంతో రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లక్షలు ఖర్చయ్యే విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ఫీజుల పథకం ప్రవేశపెట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎంతోమందికి పునర్జన్మనిచ్చింది. 108 సేవలు వైఎస్ గుండె చప్పుడు’ అని షర్మిల అన్నారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 46 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే.. ఒక్క రాష్ర్టంలోనే వైఎస్ 46 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. వాగ్దానాలు నెరవేర్చిన మహానేత.. ప్రజలకిచ్చిన వాగ్దానాలను తూ.చ తప్పకుండా నెరవేర్చిన మహా నాయకుడు వైఎస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. దళితులు, మైనార్టీల సంక్షేమం వైఎస్ పాలనలోనే సాగిందని, అందుకే ఇప్పటికీ వైఎస్ కుటుంబంపై వారు అభిమానం చూపుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ ఎంతో మంది రైతు కుటుంబాల్లో సంతోషం నింపింద న్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, రుక్మారెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, ఏనుగు మహిపాల్రెడ్డి, అమృతాసాగర్, గోపాల్రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కుసుమకుమార్రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెబట్, వెల్లాల రాంమోహన్, ఐటీ విభాగం అధ్యక్షుడు సందీప్ కుమార్, మెరుగు శ్రీనివాస్రెడ్డి, మామిడి శ్యాంసుందర్రెడ్డి, బి.రఘురాంరెడ్డి, రాంభూపాల్రెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, ఎం.భగవంత్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, షర్మిలా సంపత్, రమా ఓబుల్రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, ఎండీ సలీం, డోరెపల్లి శ్వేత, ప్రచార కమిటీ విభాగం కార్యదర్శి డి.అమరనాథ్రెడ్డి, జి.వెంకట్రెడ్డి, ఆర్.సంతోష్రెడ్డి, ఆర్. సతీష్రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, మామిడి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. బాబు బాధ్యత నాదే.. మంఖాల్ గ్రామంలో పోలియోతో బాధపడుతున్న ఎంగల జోసఫ్ మనవడు సృజన్ను చూసి షర్మిల చలించిపోయారు. కాళ్లు, చేతి కీళ్లలో చలనం తగ్గడంతో బాలుడు పడుతున్న ఇబ్బందిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. భోజనం చేసేందుకు కూడా చేతులు సకహరించవని, చికిత్స చేయిస్తే ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యులు వివరించారు. కానీ ఇందుకు భారీగా ఖర్చవుతుందని, ఆర్థిక స్తోమత లేనందునే చికిత్స చేయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో షర్మిల.. సృజన్ చికిత్స బాధ్యత తనదేనని ప్రకటించారు. -
అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
జిల్లెలగూడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన జిల్లెల్లగూడకు చెందిన బి అంజయ్య కుటుంబీకులను వైఎస్ షర్మిల సోమవారం సాయంత్రం పరామర్శించారు. నాలుగు రోజుల రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జిల్లెలగూడ చేరుకున్నషర్మిల.. తొలుత అక్కడ మందలమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంజయ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ రోజు మరో రెండు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మహేశ్వరం మండలం మంఖాల్లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్కార్ మహేశ్జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారు. -
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ విడుదల
చేవేళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి జులై 2 వరకు 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం చేవేళ్లలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పొల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకె వర్గాల్లో 15 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి షర్మిల పరామర్శ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్ ఓదార్పు పూర్తికాగా, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్రను చేపట్టనున్నారు. -
ప్రతిష్టాత్మకంగా షర్మిల పరామర్శ యాత్ర
29న కర్మన్ఘాట్లో.. జూలై1న చేవెళ్లలో బహిరంగ సభలు * వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ * పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యకర్తలతో సమీక్షా సమావేశం * పరామర్శ యాత్ర తెలంగాణలో పార్టీకి దిక్సూచి కావాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్, రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం షర్మిల స్వయంగా వారిని కలుసుకుని ధైర్యం చెపుతారన్నారు. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారన్నారు. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ చౌరస్తాలోని మంద మల్లమ్మ ఫంక్షన్హాల్ దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగసభ నిర్వహిస్తారని చెప్పారు. అలాగే జూలై 1న ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరామర్శ యాత్రను జయప్రదం చేయడానికి ఏడు నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను ఏర్పాటు చేశావున్నారు. షర్మిల పరామర్శయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడిక్కడ బ్రహ్మరథం పట్టాలని, ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయాలని, బస్తీల్లో వాల్పోస్టర్లు అంటించాలన్నారు. మహానేత వైఎస్సార్ 116 సార్లు ఇక్కడి నుంచే తన కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. ఈ పరామర్శ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి దిక్సూచి కావాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్రెడ్డి మాట్లాడుతూ పరామర్శ జరిగే ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, రంగారెడ్డి జిల్లా మహిళా నేత అమృతసాగర్, పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్తబ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి జి. ధనలక్ష్మి, ఐటీ విభాగం అధ్యక్షుడు ఎం.సందీప్ కుమార్, హైదరాబాద్ నగర యువజన విభాగం అధ్యక్షుడు అవినాష్గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు బండారి సుధాకర్, పార్టీ ప్రొగ్రాం కో-ఆర్డినేటర్ పి. సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
29 నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర
* నాలుగు రోజులపాటు ఏడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన * 15 కుటుంబాలకు పలకరింపు * షెడ్యూల్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి జూలై 2 వరకు 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రను నిర్వహించనున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి షర్మిల పరామర్శ యాత్రను చేపడుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్ ఓదార్పు పూర్తికాగా, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేశారని, తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేపడతారని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కె.శివకుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డితో కలసి రంగారెడ్డి జిల్లా పరామర్శ యాత్ర షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు. ఇదీ షెడ్యూల్... 29న ఉదయం హైదరాబాద్ లోటస్పాండ్లోని తమ నివాసం నుంచి షర్మిల బయలుదేరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ గ్రామంలో అంజయ్య కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి మంకాళ్ గ్రామంలో ఎంగల జోసెఫ్ కుటుంబాన్ని కలుసుకుంటారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండుమైలారం గ్రామంలో పోకల్కార్ మేహ ష్జీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 30న మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయ గ్రామంలో సుముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, ఆ తర్వాత మేడ్చల్ గ్రామంలో కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఇదే నియోజకవర్గంలోని కేసారం గ్రామంలో చెన్నూరి వెంకటేష్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లి గ్రామంలోని జామా కృష్ణయ్య కుటుంబాన్ని, లక్ష్మాపూర్లో నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని ఆమె కలుసుకుంటారు. జూలై ఒకటిన చేవెళ్ల నియోజకవర్గం ఎన్కెపల్లికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని, పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్కు చెందిన కల్ప కృష్ణారెడ్డి కుటుం బాన్ని, పరిగిలోని బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుం బాన్ని, తాండూరు నియోజకవర్గంలోని గొట్టిగఖుర్దుకి చెందిన ఆవునల లక్ష్మణయ్య చారి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. 2న వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లిలో కమ్మరి నారాయణ కుటుంబాన్ని, మోమిన్పేట్లో అరిగె యాదయ్య కుటుంబా న్ని, ఎన్కెతలలో ఆలంపల్లి వెంకటేశ్ కుటుం బాన్ని కలుసుకుని పరామర్శ యాత్రను ముగిస్తారు. ఏర్పాట్లపై రేపు సమీక్ష షర్మిల రంగారెడ్డి జిల్లా పరామర్శ యాత్ర ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించేందుకు పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. -
29నుంచి రంగారెడ్డిలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
ఈ నెలాఖరున షర్మిల పరామర్శ యాత్ర
పరిగి/ తాండూరు : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ తనయ షర్మిల ఈ నెలాఖరున జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి, తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ తదితర నియోజకవర్గాల్లో మీదుగా పరామర్శ యాత్ర కొనసాగనుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు ఆయా నియోజకవర్గాల్లో రూట్మ్యాప్ను పరిశీలించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్రెడ్డి తదితర నాయకులు పరిగితోపాటు మండల పరిధిలోని రంగాపూర్ గ్రామాలను సందర్శించారు. రంగాపూర్, పరిగిలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. రంగాపూర్లో కృష్ణారెడ్డి, పరిగిలో శ్రీనివాస్ కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారని పార్టీ నాయకులు తెలిపారు. రూట్మ్యాప్ను పరిశీలించిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి అజీజ్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి రాజేందర్, పరిగి మండల మైనార్టీ సెల్ కార్యదర్శి జాకబ్, నాయకులు శ్రీనివాస్, సురేష్, రాములు నరేందర్ పాల్గొన్నారు. తాండూరులో పరామర్శ యాత్ర ఏర్పాట్లపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, నాయకులు అఖిల్, అమ్జద్, డప్పు రాజు, శ్రీకాంత్గౌడ్ తదితరులతో రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. -
ముగిసిన షర్మిల మలివిడత పరామర్శ యాత్ర
-
జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
నల్లగొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో బి.వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని.. కష్టాల్లో అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఈ నెల 9న నల్లగొండ జిల్లాలో మలివిడత యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది. -
జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
నల్లగొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో బి.వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని.. కష్టాల్లో అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఈ నెల 9న నల్లగొండ జిల్లాలో మలివిడత యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది. -
వైఎస్ షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర
-
నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల
-
అస్తర్బీ, నర్సింహ కుటుంబాలకు షర్మిల పరామర్శ
నల్గొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల నల్గొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతుంది. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ముందుగా నాంపల్లికి చెందిన అస్తర్బీ కుటుంబాన్ని వైఎస్ షర్మిల గురువారం ఉదయం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. గుంటి వెంకటేశం కుటుంబం, ఇదే నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, అదే విధంగా నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం, మర్రిగూడెం మండలం తాన్దార్పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబంతో పాటు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబ సభ్యులను షర్మిల కలిసి మేమున్నామంటూ భరోసా ఇవ్వనున్నారు. -
నల్గొండలో షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల భరోసా ♦ రెండోరోజు ఆరు కుటుంబాలను కలసిన వైఎస్ కుమార్తె ♦ ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటన ♦ సిరిపురం చేనేత సొసైటీని సందర్శించిన జగన్ సోదరి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని.. కష్టాల్లో అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు. ఏమాత్రం అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. నల్లగొండ జిల్లాలో రెండోరోజు బుధవారం ఆమె ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలం పొడిచేడుకు వెళ్లిన షర్మిల.. అక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాం తాచారికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నివాళులు అర్పించారు. రామన్నపేట మండలం సిరిపురంలో చేనేత సొసైటీని సందర్శిం చి.. చేనేత ఉత్పత్తులు, కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆ గ్రామానికి వైఎస్సార్ వచ్చిన సందర్భాన్ని గ్రామస్తులు షర్మిలకు గుర్తుచేశారు. రెండోరోజు యాత్ర సందర్భంగా షర్మిల వెళ్లిన ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆయా కుటుంబాలను పరామర్శిస్తున్నంత సేపు చాలా మంది ప్రజలు వేచి ఉండి.. షర్మిలను కలసి కరచాలనం చేశారు. ఆలేరు నుంచి మొదలై.. రెండోరోజు పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఆలేరు మండలం శారాజీపేటకు చేరుకున్న షర్మిల.. అక్కడ ఎదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆయన తల్లి పెద్దమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడి నుంచి మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో దీతి గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే గౌర మ్మ ఇల్లు శిథిలావస్థలో ఉన్న కారణంగా.. ఇం టిబయటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా షర్మిల అంగీకరించలేదు. ఆ ఇంట్లోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లి.. వారితో మాట్లాడారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన షర్మిల.. అక్కడపున్న వీరయ్య కుటుం బాన్ని పరామర్శించారు. షర్మిలను చూడగానే వీర య్య భార్య బాలనర్సమ్మ జ్ఞాపకాలను తలచుకుని బోరున విలపించగా.. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. తర్వాత స్థానికుల కోరిక మేరకు గ్రామంలోని చేనేత సొసైటీ కార్యాలయాన్ని షర్మిల సందర్శించారు. అక్కడి నుంచి బయలుదేరిన షర్మిల కట్టంగూరుకు వెళ్లే మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత కట్టంగూరుకు చేరుకుని గాదగోని రాములు కుటుంబాన్ని, నకిరేకల్ మండలం మర్రూరు గ్రామంలో పి.సైదులు కుటుంబాన్ని పరామర్శించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నకిరేకల్ మీదుగా కేతేపల్లి మండలం బీమారానికి చేరుకుని నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్నారు. తర్వాత నకిరేకల్కు వెళ్లి అక్కడ రాత్రి బస చేశారు. నాన్న ప్రారంభించిన చేనేత సొసైటీలోకి రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన షర్మిలను అక్కడి చేనేత సొసైటీ కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా.. చేనేత సొసైటీ అధ్యక్షుడు రామేశ్వరం, సిరిపురం సర్పంచ్ భర్త నర్సింహ, ఎంపీటీసీ పున్న వెంకటేశం తదితరులు కోరారు. దీంతో షర్మిల సొసైటీ కార్యాలయానికి వెళ్లి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. సొసైటీ, నేత కార్మికుల పరిస్థితిని పరిశీలించారు. 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి తమ గ్రామానికి వచ్చారని, ఈ సొసైటీని సందర్శించారని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక చేనేత రుణాలను మాఫీ చేశారని.. దాని కారణంగానే తాము కొంత నిలదొక్కుకోగలిగామని వివరించారు. రెండోరోజు యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్రెడ్డి, జి.సురేశ్రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెర్బర్ట్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు వేముల శేఖర్రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, జి.రాంభూపాల్రెడ్డి, కుసుమకుమార్రెడ్డి, ఎం.భగవంత్రెడ్డి, అమృతాసాగర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సెగ్గం రాజేశ్, బి.బ్రహ్మానందరెడ్డి, ఇరుగు సునీల్కుమార్, ఎండీ.సలీం, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జూలీ తదితరులు ఉన్నారు. -
ఆత్మీయానుబంధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబ సభ్యులను పలకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర జిల్లాలో రెండో రోజు కొనసాగింది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడిన షర్మిల వారితో ఆత్మీయంగా గడిపి ఆత్మస్థైర్యాన్ని నింపారు. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలు తమ కుటుంబంతో సమానమని, ఆయా కుటుంబాల సభ్యులకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి స్వగ్రామమైన మోత్కూరు మండలం పొడిచేడు వెళ్లిన షర్మిల తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు నియోజకవర్గాలు..ఆరు కుటుంబాలు రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సాగింది. తొలుత ఆలేరు మండల కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్ర అదే మండలంలోని శారాజీపేట గ్రామానికి చేరుకుంది. అక్కడ ఎదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల కలిసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనివాస్ తల్లి పెద్దమ్మ ఆరోగ్యాన్ని గురించి వాకబు చేసిన షర్మిల ఆమెను క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. పెద్దమ్మ మనుమడు దుర్గాప్రసాద్ను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వైఎస్ పాలనను కీర్తిస్తున్న సందర్భంలో షర్మిల మాట్లాడుతూ చెట్టంత మనిషి పోతే ఎవరికైనా బాధగానే ఉంటుందని, మనకూ మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. షర్మిల బయటకు వచ్చిన సమయంలో ఓ చిన్నారి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకుందని ఆమె తల్లిదండ్రులు షర్మిలకు చూపించారు. ఆ తర్వాత మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి వెళ్లి అక్కడ బీతి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలిశారు. గౌరమ్మ ఇల్లు శిథిలావస్థ చేరుకుని ఉన్నప్పటికీ అదే ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. అంతకు ముందు పొడిచేడులో రహదారిపై ఉన్న తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వయంగా నినాదాలిచ్చారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు... జోహార్ శ్రీకాంత్చారి అంటూ ఆయన నినాదాలివ్వడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆయనతో గొంతు కలిపారు. అక్కడి నుంచి రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో అమ్మనబోలు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సిరిపురం గ్రామానికి వెళ్లి పున్న వీరయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ షర్మిలను చూడగానే వీరయ్య భార్య బాలనర్సమ్మ బోరున విలపించింది. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన షర్మిలను చూసిన ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎవరూ అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. బాలనర్సమ్మను బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పి ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆ తర్వాత సిరిపురం చేనేత సొసైటీని సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా కట్టంగూరు మండల కేంద్రానికి బయలుదేరి మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. కట్టంగూరులో గాదగోని రాములు కుటుంబాన్ని కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా రాములు భార్య సైదమ్మ షర్మిల చేతిలో చేయి వేసి తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల అక్కడి నుంచి న కిరేకల్ మండలం మరూరు గ్రామానికి వెళ్లి అక్కడ పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకున్నారు. సైదులు మనుమరాలు కావ్యను దగ్గరకు తీసుకుని ఏం చదువుతున్నావని ప్రశ్నించారు. స్కూల్లో అన్నం పెడుతున్నారా అని షర్మిల అడిగినప్పుడు ‘మధ్యాహ్నం 12 గంటలకు అన్నం పెడతారు.’ అని బదులిచ్చింది. అక్కడ సైదమ్మ కుటుంబ సభ్యుడయిన ఓ వ్యక్తికి భార్యా పిల్లలను బాగా చూసుకోవాలని, ఏవైనా అలవాట్లు ఉంటే మానుకుని కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత షెడ్యూల్లో లేకున్నా కేతేపల్లి మం డలం బీమారం గ్రామానికి వెళ్లి నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ తండ్రి, భార్యాపిల్లలతో మాట్లాడారు. అనంతరం రెండోరోజు యాత్రను ముగించుకుని నకిరేకల్లో రాత్రి బస చేశారు. 1000 మగ్గాలు... 500 అయ్యాయి షర్మిల రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన సందర్భంగా ఆమెను చేనేత సొసైటీకి రావాలని స్థానికులు ఆహ్వానించారు. వెంటనే అంగీకరించిన ఆమె సొసైటీకి వెళ్లి అక్కడి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు షర్మిలతో మాట్లాడుతుండగా, నెలకు ఎంత ఆదాయం వస్తుందని షర్మిల ప్రశ్నించారు. కష్టపడి పనిచేస్తే నెలకు 3వేల రూపాయలు వస్తాయని చెప్పడంతో మరి ఎలా నెట్టుకొస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. అందుకే ఇబ్బందిగా ఉందని, గతంలో 1000 మగ్గాలున్న గ్రామం 500 మగ్గాలకు చేరుకుందని, చాలా మంది వేరే వృత్తులను ఎంచుకుంటున్నారని, కొందరు వలస వెళుతున్నారని, లేదంటే ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పారు. గతంలో వైఎస్సార్ కూడా ఈ గ్రామానికి వచ్చి సొసైటీని సందర్శించారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదాలో 2003లో వచ్చిన ఆయన చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేశారన్నారు. ఆయన చేసిన చేనేత రుణమాఫీ తమకు ఎంతో మేలు చేసిందని, ఆరోజున వైఎస్ వచ్చినప్పుడు గ్రామంలో భారీ వర్షం వచ్చిందని షర్మిలకు వారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా షర్మిలకు సొసైటీ సభ్యులు దుప్పటిని బహూకరించారు. ఆత్మీయ స్వాగతం షర్మిల పరామర్శకు వెళ్లిన సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు పెద్దఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. గ్రామగ్రామాన డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర నుంచే ర్యాలీగా ఆమెను గ్రామంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లి తమ ఆప్యాయతను చాటుకున్నారు. షర్మిల పరామర్శకు వెళ్లినప్పుడు ఆమె పరామర్శను పూర్తి చేసుకుని బయటకు వచ్చేంతవరకు ఓపికతో ఉండి ఆమెను కలిసి మురిసిపోయారు. తమతో కరచాలనం చేయాలని పోటీలు పడ్డారు. షర్మిలను తమ కెమెరాల్లో బంధించారు. రాజన్న బిడ్డ వచ్చిందంట అంటూ ఉరుకుల పరుగుల మీద ఆమె వద్దకు వచ్చి కలుసుకున్నారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్న గౌడ్, కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం, వేముల శేఖర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్కుమార్, ఎండి.సలీం, ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలెంల మధు, బీసీ సెల్ అధ్యక్షుడు ముశం రామానుజం, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి పరామర్శ యాత్ర షెడ్యూల్ నల్లగొండ : పరామర్శ యాత్ర మూడో రోజు గురువారం జిల్లాలో కొనసాగుతుంది. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుం టి వెంకటేశం కుటుంబం, తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, అదే విధంగా నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం, మర్రిగూడెం మండలం తాన్దార్పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం, నాంపల్లికి చెందిన అస్తర్బీ, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. -
రాములు కుటుంబానికి షర్మిల పరామర్శ
నల్గొండ: నల్గొండ జిల్లా కట్టంగూరులోని గద్దగోని రాములు కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామంటూ రాములు కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. అయితే షర్మిల అంతకుముందు ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపీ గౌరమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్గొండ జిల్లాలో మలి విడత పరామర్శ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం రెండో రోజుకు చేరుకుంది. -
అందరి ఆత్మబంధువు వైఎస్సార్
నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ♦ ప్రజలందరినీ ఆయన కన్నబిడ్డల్లా చూసుకున్నారు ♦ పేదల కోసం ఎన్నో అద్భుత పథకాలను అమలు చేశారు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి మరణిస్తే.. దానిని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు వదిలారు. దేశచరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా, ఎవరి విషయంలో జరగనిది ఒక్క వైఎస్సార్ విషయంలో జరిగింది. అందుకు కారణం ఒక్కటే. కోట్ల మంది తెలుగు ప్రజలకు వైఎస్సార్ ఆత్మబంధువు అయ్యారు. ప్రజల హృదయాల్లో ప్రజల మనిషిగా నిలిచిపోయారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానన్న జగన్మోహన్రెడ్డి హామీ మేరకు ఆయన తరఫున షర్మిల తెలంగాణలో పరామర్శయాత్ర చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నుంచి నల్లగొండ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర ప్రారంభించిన షర్మిల... వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి, వారి కష్టసుఖాలను, స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలం పులిగిళ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల పక్షాన పోరాడారని.. వారి బాగుకోసం కృషి చేశారని చెప్పారు. పేదలకు ఎంత చేసినా, ఏం చేసినా తక్కువేనన్న ఆలోచనతో పనిచేశారని, ఎన్నో అద్భుత పథకాలను అమలుచేశారని పేర్కొన్నారు. ఆయన మరణించి ఇన్నేళ్లవుతున్నా ప్రజలు తలచుకుంటూనే ఉన్నారని చెప్పారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఉచిత విద్యుత్, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది చదువుకుని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని.. ‘ఆరోగ్యశ్రీ’తో పేదలు కూడా తలెత్తుకుని కార్పొరేట్ వైద్యం చేయించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ చేసిన నిమిషాల్లోనే చేరుకుని వైద్య సహాయం అందిస్తూ 108 వాహనాలు లక్షలాది మందికి పునర్జన్మను ఇచ్చాయని షర్మిల వెల్లడించారు. ఇలా వైఎస్సార్ ఏ ఆలోచన చేసినా పేదల గురించేనని, పేదలను గుండెల్లో పెట్టుకుని పాలించారని చెప్పారు. ‘‘వైఎస్సార్ రాజన్న అయ్యాడు. కోట్ల మంది తెలుగు ప్రజలకు ఆత్మబంధువు అయ్యాడు. మా కుటుంబంపై మీరు చూపుతున్న అభిమానానికి మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా..’’ అని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి.. నల్లగొండ జిల్లా మలివిడత పరామర్శయాత్రలో భాగంగా షర్మిల తొలిరోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శించారు. బీబీనగర్ మండల కేంద్రానికి సమీపంలోని గూడూరు టోల్ప్లాజా వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. తొలుత వెంకిర్యాల గ్రామంలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. తర్వాత వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, అనంతరం భువనగిరి మండలం ముస్త్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. తర్వాత ఆలేరు నియోజకవర్గం దాతరుపల్లిలో సుంచు చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఇక బుధవారం రెండోరోజు యాత్ర ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ యాత్రలో షర్మిల వెంట ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం. ఏనుగు మహిపాల్రెడ్డి, అమృతాసాగర్, రాంభూపాల్రెడ్డి, బి.శ్రీనివాస్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, విలియం మునగాల, ఎం.భగవంత్రెడ్డి, వేముల శేఖర్రెడ్డి, అక్కినపల్లి కుమార్, బి.రఘురామరెడ్డి, కుసుమకుమార్రెడ్డి, కుమార్యాదవ్, సామ యాదిరెడ్డి, జి.వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పార్టీ అధ్యక్షులు మామిడి శ్యాంసుందర్రెడ్డి, బి.అనిల్ కుమార్, సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, జి.సురేశ్రెడ్డి, జె.మహేందర్రెడ్డి, స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నేతలు ఉన్నారు. -
తొలిరోజు..ఆప్యాయంగా
►మలివిడత పరామర్శ యాత్రలో ఐదు కుటుంబాలకు పరామర్శ ►భువనగిరిలో 3, ఆలేరులో 2 కుటుంబాలను కలిసిన షర్మిల ► బీబీనగర్ టోల్ప్లాజా వద్ద వైఎస్ విగ్రహానికి నివాళి ► వెంకిర్యాల, కంచనపల్లి, ముస్త్యాలపల్లి, దాతరుపల్లి, ►యాదగిరిపల్లిలో పర్యటన ► ఐదు కుటుంబాల సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన జగన్ సోదరి ► తమ వంతు అనురాగాన్ని చూపెట్టిన ఆయా కుటుంబాల సభ్యులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో తలపెట్టిన మలి విడత పరామర్శ యాత్ర తొలిరోజు ఆప్యాయంగా సాగింది. ఉదయం 11:20 నిమిషాల సమయంలో జిల్లాకు చేరుకున్న షర్మిల నిర్విరామంగా దాదాపు 9 గంటలపాటు పర్యటించి ఐదు కుటుంబాలను పరామర్శించారు. బీబీనగర్ టోల్ప్లాజా వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించి యాత్రను ప్రారంభించిన షర్మిల భువనగిరి నియోజకవర్గం పరిధిలో మూడు, ఆలేరు నియోజకవర్గంలో రెండు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆమె వారి కష్టసుఖాలను వాకబు చేశారు. వారి సమస్యలను ప్రేమతో ఆలకించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శ సాగిందిలా..... తొలిరోజు షర్మిల పరామర్శ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఆమె జిల్లాకు చేరుకోగానే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, భువనగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్, రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ గూడూరు జైపాల్రెడ్డిల నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో ఆమెను స్వాగతించారు. ఈ సందర్శంగా జై జగన్... జోహార్ వైఎస్సార్ నినాదాలు మిన్నంటాయి. తొలుత గూడూరు టోల్ప్లాజా సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడినుంచి బయలుదేరి నేరుగా మండలంలోని వెంకిర్యాల గ్రామానికి వెళ్లారు. అక్కడ చెరుకు కృష్ణగౌడ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులను ‘నమస్తే అమ్మా.. బాగున్నారా’ అంటూ ఆప్యాయంగా పలకరించిన షర్మిల వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఎలా జీవనం సాగిస్తుంది... కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు బాగా చదువుకుంటున్నారా.. తమ సొంత కుటుంబం మాదిరి అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఆమెకు కృష్ణగౌడ్ కుటుంబ సభ్యులు చల్లటి మజ్జిగన్నం తినిపించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఆ తర్వాత వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. వారిని కూడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఆమె వారి పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. అంజయ్య మనుమడు కౌశిక్ (ఏడాది వయసు)తో కాసేపు ఆడుకున్నారు. తన ఒడిలో కూర్చోబెట్టుకుని కౌశిక్కు స్వీటు తినిపించారు. అక్కడ కూడా అంజయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన షర్మిల అక్కడినుంచి భువనగిరి మం డలం ముస్త్యాలపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో పులిగిళ్ల గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. అక్కడినుంచి ముస్త్యాలపల్లికి వెళ్లిన ఆమె కల్లెం నర్సయ్య కుటుంబాన్ని కలిశారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆప్యాయంగా పంచుకున్నారు. ఆ తర్వాత నే రుగా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లికి వెళ్లి అక్కడ సుంచు చంద్రమ్మ కుటుం బాన్ని, అక్కడినుంచి అదే మండలంలోని యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుం బాన్ని కలిసి వారితో మాట్లాడారు. కృష్ణ కుమార్తెను దగ్గరకు తీసుకున్నారు. షర్మిల కలుసుకున్న ఐదు కుటుంబాల సభ్యులు ఇన్నేళ్ల తర్వాతయినా తమను గుర్తుపెట్టుకుని షర్మిల రావ డం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. పరామర్శయాత్రలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం, వేము ల శేఖర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్రెడ్డి, ఇరుగు సునీల్కుమార్, పిట్ట రాం రెడ్డి, ఎండి.సలీం, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్, జిల్లా పార్టీ కోశాధికారి మరియదాస్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫయాజ్, నేతలు పడాల శ్రీకాంత్, చల్లగురుగుల రఘుబాబు, మలుగు రాములు, మోడెపు జీవన్గౌడ్, కానుకుంట్ల యాదగిరి, బండ్రు ఆంజనేయులు, భట్టు, చెన్న రాజేశ్, బొబ్బూరి నరేశ్గౌడ్, ముద్రబోయిన వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి నాయకుడు లేడు భువనగిరి : పరామర్శ యాత్రలో భాగంగా పలు కుటుంబాలను షర్మిల కలిసినప్పుడు వారి కళ్లలో ఆనందం కన్పించింది. నమస్తే అమ్మ బాగున్నారా అంటూ షర్మిల పలుకరింపే వారికి మనోస్థైర్యాన్ని నింపింది. ఓ వైపు కన్నీళ్లు, మరోవైపు ఆనంద భాష్పాలు నిండిన చెమర్చిన కళ్లతోనే షర్మిల, ఆయా కుటుంబాల సభ్యులు తమ ఆప్యాయతలను పంచుకున్నారు. వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆయన కుమారుడు బాలరాజుగౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ లాంటి నాయకుడు లేడని మళ్లీ అలాంటి నాయకుడే వస్తే మీ కుటుంబం నుంచే రావాలని ఆకాంక్షించారు. ఆరోగ్య శ్రీ లాంటి ఎన్నో మర్చిపోలేని పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ కూతురు తమ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఐదేళ్ల తర్వాత కూడా తమను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు కృతజ్ఞతలని చెప్పారు. బాలరాజుగౌడ్, ఆయన సోదరుడి కుమార్తెలు, కుమారులను పేరు పేరున పలకరించిన షర్మిల పిల్లలందరూ బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలోస్తే జీవితంలో సుఖపడతారని తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజుగౌడ్ కుటుంబ సభ్యులు షర్మిలకు చల్లని మజ్జిగ అన్నం తినిపించారు. ఊరి సంప్రాదాయం మేరకు ఆ గ్రామ పూజారి చీర, గాజులు, కుంకుమ బహూకరించారు. ఆ తర్వాత కంచనపల్లిలో అంజయ్య కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల అంజయ్య మనువడు కౌశిక్ను ముద్దాడారు. తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్వీట్ తినిపించి లాలించారు. ఆ సమయంలో అంజయ్య కుమారుడు బాల మల్లేష్, భవాని దంపతులు మురిసిపోయారు. దైర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల అక్కడి నుంచి ముస్త్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య ఇంటికి వెళ్లారు. మీరేం చేస్తారు, పిల్లలు బాగున్నారా, ఏరి ఎక్కడ ఉన్నారూ ఎంటీ నాన్న బాగున్నావా? ఎం చదువుకుంటున్నావ్? ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఆ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు షర్మిల. ఈ సందర్భంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలని తాము ప్రతి రోజూ ప్రార్థన చేస్తున్నామని నర్సయ్య కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి మన ప్రభుత్వం వస్తే మంచిరోజులు వస్తాయని షర్మిల చెప్పారు. ఇక యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామంలో చంద్రమ్మ మనువరాలు కవిత తీవ్ర ఉద్వేగానికి లోనైంది. షర్మిలను చూడగానే బోరున విలపించిన ఆమె షర్మిల చేతిలో చేయి వేసి తన సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల కవితతో చాలా సేపు మాట్లాడారు. ఆ తర్వాత యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబ సభ్యులు కూడా షర్మిలకు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. -
నేటి పరామర్శ యాత్ర షెడ్యూల్
భువనగిరి : పరామర్శ యాత్ర రెండోరోజు బుధవారం జిల్లాలో కొనసాగుతుంది. ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం ఆలేరు మండలంలోని శారాజిపేటలో గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపి గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో పున్న వీరయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నకిరేకల్ మండలంలోని మర్రూరు గ్రామంలో పుట్ట సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. -
వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
బలరాం గౌడ్ కుటుంబానికి పరామర్శ
నల్లగొండ: తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో బలరాం గౌడ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అలాగే, వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెలిమి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముత్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో చింత కృష్ణ కుటుంబాన్ని, దాతురపల్లిలో చంద్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల రెండో దఫా పరామర్శ యాత్ర మంగళవారం మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె ఈ యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 18 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడులలో ఆమె పరామర్శ యాత్ర కొనసాగనుంది. -
నల్లగొండలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
'పరామర్శ యాత్ర'కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు
-
శర్ల రాములు కుటుంబానికి షర్మిల పరామర్శ
-
లక్ష్మి కుటుంబానికి షర్మిల పరామర్శ
-
లునావత్ లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
జన‘పురి’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పరామర్శయాత్రలో భాగంగా ఆరో రోజు సోమవారం షర్మిల సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని అనంతారం, హున్యానాయక్ తండా, నశింపేట, ముక్కుడుదేవులపల్లి, కందగట్ల, ఏనుబాముల గ్రామాల్లో పర్యటించిన ఆమె తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతకంటే ముందు ఉదయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా షర్మిల సూర్యాపేటలోని ఆన ంద విద్యామందిర్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జెండావందనం చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఆ తర్వాత పెన్పహాడ్ మండలం అనంతారం వెళ్లే మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలోనూ ఆమె గ్రామస్తుల కోరిక మేరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. షర్మిల యాత్ర సందర్భంగా ప్రజలు రోడ్లపై నిలబడి ఆమెకు స్వాగతం పలికారు. పరామర్శ చేస్తున్న ఇళ్ల వద్దకు పెద్దఎత్తున ప్రజలు వచ్చి షర్మిలను కలిసి మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు వేచి చూశారు. ఆరో రోజు యాత్ర సాగిందిలా... ఆరో రోజు ఉదయం షర్మిల వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు రాహుల్రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని అక్కడినుంచి ఏవీఎం పాఠశాలకు వెళ్లారు. గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలో జాతీయపతాకావిష్కరణ చేశారు. ఆ తర్వాత అనంతారం వెళ్లిన ఆమె దామెర్ల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య తల్లిదండ్రులు సైదులు, సావిత్రిలు వారి కుటుంబ స్థితిగతులను వివ రించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి చివ్వెంల మండలం హున్యానాయక్ తండాకు వెళ్లి బాణోతు ముకుంద కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అక్కడ ముకుంద భార్య లాలి షర్మిలను చూడగానే ఉద్వేగాన్ని తట్టుకోలేక భోరున ఏడ్చారు. లాలితో పాటు ముకుంద కుమారులు భిక్షం, గోపీలు, మనుమడు సైదులు తమ కుటుంబం గురించి షర్మిలకు తెలియజేశారు. ఆ తర్వాత ఆత్మకూరు(ఎస్) మండలం నశింపేటకు వెళ్లి నర్రా లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల. అక్కడ ఆయన భార్య లక్ష్మమ్మ, కూతురు కమలమ్మ తమ కుటుంబ స్థితి గురించి షర్మిలకు వివరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన షర్మిల అక్కడినుంచి నెమ్మికల్ సమీపంలో భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత అదే మండలంలోని ముక్కుడుదేవుడుపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కుంచం ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లమ్మ కోడలు ఎల్లమ్మ, మనుమలు మైసయ్య, శ్రీనివాస్లు షర్మిలతో మాట్లాడారు. ఆ తర్వాత కందగట్ల గ్రామానికి షర్మిల బయల్దేరారు. మార్గమధ్యలో బండమీద ఉన్న పురాతన మల్లన్న దేవుడి గుడి పునర్మిర్నాణం చేయగా, దానిని గ్రామస్తులు, శివమాలధారులైన భక్తుల కోరిక మేరకు ఆలయాన్ని షర్మిల ప్రారంభించారు. ఆ తర్వాత కందగట్లకు వెళ్లి కుశనపల్లి రాములు కుటుంబంతో మాట్లాడారు. అక్కడ రాములు భార్య రాములమ్మ, కుమారుడు రాజులతో షర్మిల మాట్లాడారు. ఈ సందర్భంగా రాజుతో షర్మిల కాసేపు సరదాగా నవ్వించారు. అంతకుముందు అదే గ్రామంలో 23 రోజుల చిన్నారికి విజయ అని ఆమె నామకరణం చేశారు. కందగట్ల నుంచి ఏనుబాముల వెళ్లిన షర్మిల అక్కడ వర్రె వెంకులు కుటుంబాన్ని సందర్శించారు. వెంకులు భార్య కౌసల్య, కుమారుడు కృష్ణయ్య, మురళి, పెద్దకోడలు కవితలు వారి కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. వారికి భరోసానిచ్చి ధైర్యం చెప్పిన షర్మిల ఆరోరోజు పరామర్శయాత్రను ముగించారు. నువ్వు ఆయన కొడుకువైతే... నేను ఈయన కూతుర్ని.. కందగట్లలో కుశనపల్లి రాములు కుటుంబాన్ని సందర్శించిన సందర్భంగా షర్మిల రాములు కుమారుడు రాజుతో కాసేపు ముచ్చటించారు. ‘నేనె వరో తెలుసా’ అని రాజును షర్మిల అడగగా, రాజు ‘షర్మిల’ అని పేరు చెప్పాడు. అప్పుడు షర్మిల అక్కడే ఉన్న వైఎస్సార్, రాములు చిత్రపటాలను చూపిస్తూ నువ్వు ఆయన కొడుకువైతే, నేను ఈయన కూతుర్ని అని రాజుకు చెప్పారు. ‘నీకేమి ఇష్టం’ అని రాజును అడగ్గా.. తనకు చాక్లెట్లు అంటే ఇష్టమని అతను బదులిచ్చాడు. నాకు కూడా చాక్లెట్లంటే చాలా ఇష్టమని చెప్పిన షర్మిల పక్కనే ఉన్న దుకాణం నుంచి చాక్లెట్లు తెప్పించి రాజుకు ఇచ్చారు. బాగా చదువుకోవాలని, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, నువ్వు నవ్వితే అమ్మ కూడా నవ్వుతుందని రాజుకు షర్మిల చెప్పారు. అంతకుముందు కందగట్లలో డప్పు చప్పుళ్లతో షర్మిలను స్వాగతించిన గ్రామస్తులు దారిపొడవునా రంగు రంగుల రంగవల్లులు వేసి మంగళహారతులిచ్చి, నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏనుబాములలోనూ ప్రజలు పెద్ద ఎత్తున షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల అనంతారం వెళ్లినప్పుడు లింగయ్య రాజశేఖర్రెడ్డిపై పాటలు కట్టి పాడేవాడని కుటుంబ సభ్యులు షర్మిలకు చెప్పారు. ముక్కుడుదేవులపల్లిలో కుంచం ఎల్లమ్మ మనుమడు మైసయ్య మాట్లాడుతూ వర్షాలు పడడం లేదని, పంటలు పండే పరిస్థితి లేక వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షర్మిలకు వివరించారు. షర్మిల కూడా కుటుంబాలను కలిసినప్పుడు రేషన్ వస్తుందా... పింఛన్ వస్తుందా? ఆరోగ్యం బాగుందా? అని పెద్దలను ప్రశ్నిస్తూ బాగా చదువుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పిల్లలకు సూచనలిచ్చారు. నేటితో 30 కుటుంబాలు పూర్తి.. షర్మిల పరామర్శయాత్ర మొదటి విడత మంగళవారంతో పూర్తి కానుంది. వాల్యాతండ, దుబ్బతండా, కుడకుడ గ్రామాల్లో మూడు కుటుంబాలను ఆమె నేడు పరామర్శించనున్నారు. దీంతో ఈ విడతలో ఆమె జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో 30 కుటుంబాలను పరామర్శ పూర్తి కానుంది. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, గున్నం నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ కార్యదర్శులుజి. రాంభూపాల్రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, కొమురం వెంకటరెడ్డి, సహాయకార్యదర్శులు ఇరుగు సునీల్, షర్మిలా సంపత్, బంగి లక్ష్మణ్, యువజన విభాగం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గ నేతలు దొంతిరెడ్డి సైదిరెడ్డి, పిట్ట రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లు రవీందర్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వేణుయాదవ్ ఉన్నారు. -
నల్గొండలో 6వ రోజు షర్మిల పరామర్శ యాత్ర
-
బానోతు ముకుంద కుటుంబానికి షర్మిల పరామర్శ
-
అందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్
నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ఐదో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ తెలంగాణ తల్లి విగ్రహానికిపూలమాల వేసిన షర్మిల సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘తన, పర భేదం లేకుండా.. ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని చూడకుండా ప్రతి వర్గానికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు చేశారు. తెలుగు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నారు.. ప్రతి పేదవాడినీ మనస్ఫూర్తిగా గౌరవించారు. అందుకే ఆయన రాజన్న అయ్యారు.. ఇన్నాళ్ల తర్వాత కూడా కోట్లాది మంది ప్రజలు వైఎస్ను తమ గుండెల్లో పెట్టుకున్నారంటే కారణం అదే..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. ఐదోరోజు పరామర్శయాత్రలో భాగంగా ఆమె ఆదివారం నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరు కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ కుటుంబం వారికి అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. యాత్ర మార్గమధ్యంలో చిలుకూరు, బేత వోలు గ్రామాల్లో వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించి... అక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలోనే ఎన్నో పథకాలు: వైఎస్సార్ అందరి గుండెల్లో బతికే ఉన్నాడని, ఆయనకు మరణం లేదని షర్మిల పేర్కొన్నారు. రాజన్న చేసిన మంచి పనులు, ఆయన మంచి మనసు కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయాయని.. అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నారని ఆమె చెప్పారు. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలందరికీ మేలు చేసే కార్యక్రమాలు వైఎస్ చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో అద్భుత పథకాలను అమలుచేసి చూపించారు. ఇన్ని చేసినా ఏ ఒక్కరోజూ ఎలాంటి పన్నులు, చార్జీలు పెంచలేదు. ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు, ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఏ పన్ను పెంచినా తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లపై భారం పడుతుందనే ఆలోచనతోనే పేదలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలూ ఆయనను విమర్శించలేవు..’’ అని షర్మిల పేర్కొన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న తపనతో అప్పటివరకు మహిళా సంఘాలకు రుణాలపై ఉన్న రూపాయి పావలా వడ్డీని పావలా వడ్డీకి తగ్గించారని, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. వైఎస్ పాలనలోని అన్ని పథకాలను, రాజన్న ఆశయాలను కొనసాగించుకునేందుకు, కాపాడుకునేందుకు చేయిచేయి కలిపి ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు. ఐదోరోజు ఆరు కుటుంబాలకు పరామర్శ యాత్ర ఐదోరోజైన ఆదివారం షర్మిల కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను కలిశారు. తొలుత కోదాడ మండలం తొగర్రాయికి వెళ్లి మందా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కోదాడలో సురభి శ్రీనివాస్, వల్లంశెట్ల రాంప్రసాద్ కుటుంబాలను కలిశారు. అనంతరం భోజన విరామం తీసుకున్నాక చిలుకూరు మండలం ఆచార్యులగూడెంలో అలవాల ముత్తయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. షర్మిల తమ ఇంటికి వచ్చిందన్న ఉద్వేగంతో ముత్తయ్య భార్య నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మునగాల మండలం గణపవరంలో సారెడ్డి జితేంద ర్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి.. మునగాల మండలం వెంకట్రాంపురంలో మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని కలిసి.. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల.. పరామర్శ యాత్రలో భాగంగా కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి షర్మిల పూలమాల వేశారు. అంతకు ముందు పలు చోట్ల ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్రెడ్డి, యెర్నేని వెంకటరత్నంబాబు, గున్నం నాగిరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, కార్యదర్శి షర్మిలా సంపత్, సహాయ కార్యదర్శి ఇరుగు సునీల్, మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైఎస్ షర్మిల ఐదో రోజు పరామర్శ యాత్ర
-
నల్లగొండ జిల్లాలో పరామర్శయాత్ర నాల్గవ రోజు
-
రాంప్రసాద్ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
శ్రీనివాస్ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
మంద ప్రసాద్ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
అభిమానానికి జీ హుజూర్
దిర్శించర్ల.. బ్రహ్మరథం పట్టగా.. కాల్వపల్లి.. ఎదురేగి స్వాగతం పలకగా..సుందర్నగర్.. స్వాగత సుమాంజలులు తెలపగా.. హరిజన కాలనీ.. అక్కున చేర్చుకుంది..కందిబండ.. అండగా నిలిచింది.. వైఎస్ తనయ షర్మిలకు జీ‘హుజూర్’ అంటూ అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శనివారం హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు కుటుంబాలను ఓదార్చారు..వారి బాధలను పంచుకున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జననీరాజనం... ఆత్మీయ స్వాగతం.. మేళతాళాలు, మంగళహారతులు... నుదుట తిలకాలు, కరచాలనానికి పోటాపోటీలు... ఏ గ్రామానికి వెళ్లినా జనమే జనం... జై జగన్, వైఎస్సార్ అమర్హ్రే నినాదాలు... నాట్లు వేసే కూలీలు, ఇటుక బట్టీల్లో పనిచేసే మహిళలు పరుగున వచ్చి వైఎస్సార్ తనయకు బ్రహ్మరథం.. స్థూలంగా ఇదీ షర్మిల హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పరామర్శయాత్ర. పరామర్శ యాత్రలో భాగంగా శనివారం నాలుగోరోజు షర్మిల హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని దిర్శించర్ల, కాల్వపల్లి, హుజూర్నగర్, మేళ్లచెరువు, కందిబండ గ్రామాలకు వెళ్లి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు చెందిన వారితో ఆత్మీయంగా మాట్లాడిన షర్మిల వారిని పేరుపేరునా పలకరించారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, తమ కుటుంబ పెద్దను కోల్పోయి ఐదేళ్లు దాటిన తర్వాత కూడా తమపై అభిమానంతో తమను చూసేందుకు షర్మిల రావడం పట్ల వృుతుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇచ్చిన మాట మీద నిలబడే కుటుంబంగా వైఎస్ కుటుంబం తన పేరు నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమ వద్దకు వచ్చి తమ స్థితిగతులను విచారించిన షర్మిలకు, ఆమె సోదరుడు జగన్మోహన్రెడ్డి, తల్లి విజయమ్మలకు కృృతజ్ఞతలు తెలిపారు. శనివారం పర్యటనలో భాగంగా షర్మిల గరిడేపల్లి కీతవారిగూడెంలో ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాలుగోరోజు పర్యటన సాగిందిలా... పరామర్శ యాత్రలో భాగంగా శనివారం ఉదయం నేరేడుచర్ల సమీపంలోని సిటీసెంట్రల్ స్కూల్ నుంచి షర్మిల బయలుదేరారు. అక్కడే ఉన్న స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో ఆమె కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కరచాలనం చేసి వారిని ‘హాయ్’ అంటూ పలకరించారు. అనంతరం విద్యార్థులే ప్రపంచానికి వెలుగుదివ్వెలని, చిమ్మచీకట్లు ఉన్నా చిన్న వెలుగు ఎంత కాంతినిస్తుందో అంతటి శక్తిమంతులని చెప్పారు. అక్కడి నుంచి విద్యార్థుల వీడ్కోలు తీసుకుని నేరుగా మండలంలోని దిర్శించర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ తురక లింగయ్య కుటుంబాన్ని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. లింగయ్య భార్య వెంకటమ్మ షర్మిలకు తన కష్టసుఖాలను చెప్పుకున్నారు. ఆ కుటుంబానికి భరోసానిచ్చిన షర్మిల అక్కడి నుంచి గరిడేపల్లి మండలం కాల్వపల్లికి బయల్దేరారు. మధ్యలో నేరేడుచర్లలో ప్రజలనుద్దేశిం చి ప్రసంగించారు. అక్కడి నుంచి మార్గమధ్యంలో గ్రామగ్రామాన ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. జననీరాజనం మధ్య షర్మిల కీతవారిగూడెంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేశారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి కాల్వపల్లికి వెళ్లారు. అక్కడ వెంకటగిరి జయమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జయమ్మ భర్త సత్యనారాయణ, కూతుళ్లతో మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. అక్కడి నుంచి హుజూర్నగర్ బయల్దేరిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. షర్మిల హుజూర్నగర్కు చేరుకునే సరికి ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. స్థానిక ఇందిరాసెంటర్లో తన కోసం వేచి ఉన్న ప్రజలకు అభివాదం ప్రసంగించిన తర్వాత అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి స్థానిక సుందరయ్య నగర్లో లింగంపాండు కుటుంబాన్ని పరామర్శించారు. పాండు భార్య నాగమ్మను అడిగి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న షర్మిల ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హుజూర్నగర్ గ్రామశివారులో సాయంత్రం 4:45 గంటల సమయంలో ఆమె భోజనం చేశారు. అక్కడినుంచి బయలుదేరి మేళ్లచెరువులో చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య భార్య అరుణ షర్మిలకు తన కుటుంబ పరిస్థితులను వివరించారు. అనంతరం షర్మిల అక్కడి నుంచి కందిబండకు వెళ్లి పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య భార్య శంభమ్మ షర్మిలతో మాట్లాడి తన కుటుంబ స్థితిగతులను చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన షర్మిల అక్కడి నుంచి కోదాడ నియోజకవర్గంలోనికి వెళ్లిపోయారు. జన‘జాతర’.. ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిల పర్యటన సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో జనజాతర నెలకొంది. ఉదయం పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి ముగిసేంతవరకు ఆమె వెంట జనమే జనం. వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడు గ్రామగ్రామాన స్థానికులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలంలోని చింతకుంట్ల సమీపం నుంచి బయలుదేరిన షర్మిలకు రాంనగర్, నేరేడుచర్ల, నర్సయ్యగూడెం, దిర్శించర్లలలో ఘనస్వాగతం లభించింది. దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఊరుఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. నేరేడుచర్ల మీదుగా గరిడేపల్లి మండలం కాల్వపల్లికి వస్తున్న సందర్భంగా ఎల్బీనగర్, అప్పన్నపేట, గరిడేపల్లి, కీతవారిగూడెం, రాయినిగూడెం, కాల్వపల్లి, గోపాలపురంలలో జనం ప్రభంజనమై కదిలారు. ఇక, హుజూర్నగర్ ఇందిరాసెంటర్ అయితే జనసంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి భోజనం ముగించుకుని వెళుతున్న షర్మిలకు వేపలసింగారం, మిట్టగూడెంలలో ప్రజలు ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు. వేపలసింగారంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మేళ్లచెరువు వెళ్లిన షర్మిలకు జనహారతులు పట్టారు. మేళ్లచెరువు సెంటర్ జనంతో నిండిపోయింది. అక్కడినుంచి కందిబండకు వెళ్లిన షర్మిలకు అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. మొత్తంమీద నాలుగోరోజు పరామర్శయాత్ర హుజూర్నగర్ నియోజకవర్గంలో జననీరాజనం నడుమ ప్రభంజనంలా సాగింది. మేళ్లచెరువు కాదు... జన చెరువు నాలుగోరోజు యాత్రలో మేళ్లచెరువులో జరిగిన బహిరంగ సభ హైలెట్గా నిలిచింది. షర్మిలకు హుజూర్నగర్ నుంచే ఘనస్వాగతం పలికిన మండల ప్రజలు మేళ్లచెరువులో వైఎస్ కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే మేళ్లచెరువు ఊరంతా రోడ్డెక్కింది. పెట్రోల్బంకు నుంచి మేళ్లచెరువు మెయిన్సెంటర్ జనసంద్రమైంది. షర్మిలను చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. పిల్లాపాపలను ఎత్తుకున్న తల్లుల నుంచి పండు ముదుసలి వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు, విద్యార్థులు షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తెతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా మేళ్లచెరువులో షర్మిల చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పరామర్శయాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్.గట్టు శ్రీకాంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్దార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్కుమార్, మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్రెడ్డి, జిల్లా నేతలు ముదిరెడ్డి గవాస్కర్రెడ్డి, మల్లురవీందర్రెడ్డి, పిట్ట రాంరెడ్డి, వేముల శేఖర్రెడ్డి, అయిల వెంకన్నగౌడ్, పిచ్చిరెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, మట్టారెడ్డి, ఆదెళ్ల శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి తిరుపతి వెంకయ్య, పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యువజన నాయకుడు కె. నరేందర్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు దామెర్ల రేవతి, వరంగల్ సేవాదళ్ అధ్యక్షుడు ఎం. కల్యాణ్, జిల్లా నేత మహిపాల్రెడ్డి, వనపర్తి నేత జశ్వంత్రెడ్డి, కొల్లాపూర్ నేత వరదారెడ్డి, దేవరకొండ నేత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంపై ఈ ప్రేమకు కృతజ్ఞతలు... వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇన్నేళ్లైనా, ఎన్నాళ్లైనా.. వైఎస్ కుటుంబంపై ప్రేమ చూపిన హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. వైఎస్ కుటుంబంపై ప్రేమ చెరుపుకుంటే చెరిగేది కాదన్నారు. రాజన్న కలలుగన్న విధంగా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. -
కోట్లాది గుండెల్లో వైఎస్సార్..
* నల్లగొండ జిల్లా ‘పరామర్శయాత్ర’లో షర్మిల * ఒక నాయకుడి కోసం వందల గుండెలు ఆగిన చరిత్ర లేదు * ఆయనకు ముందు ఏ సీఎం పేదవాడి గురించి ఆలోచించలేదు * ఏ ముఖ్యమంత్రీ విద్యార్థుల గురించి పట్టించుకోలేదు * వైఎస్సార్ పేదవాడిని భుజాన మోశారు.. రైతును రాజును చేశారు * ఆశయాల కోసం చేయికలుపుదామని వైఎస్ జగన్ సోదరి పిలుపు * నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగి పోయిన చరిత్ర ఎప్పుడూ లేదని... అది ఒక్క వైఎస్సార్ విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ పేద ప్రజల కోసమే బతికారని, పేదలకు మేలు చేయడం కోసమే ఆయన పోరాడారని చెప్పారు. పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశా డు కాబట్టే కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువుదీరారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల నాలుగో రోజు శనివారం హుజూర్నగర్ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్తో పాటు మేళ్లచెరువులో తనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్ కంటే ముందు ఏ ముఖ్యమంత్రి కూడా పేద విద్యార్థుల గురించి ఆలోచించలేదు.. పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. వైఎస్ మాత్రమే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చి, రైతును దేశానికి వెన్నెముకగా చేయాలనుకున్నారు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డలుగా ప్రేమించారు. ఏ అవసరమున్నా మీకు తోడుగా ఉంటానంటూ ప్రజల పక్షాన నిలబడ్డారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా.. తన పార్టీనా, వేరే పార్టీనా అనేది చూడకుండా ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేశారు. అందుకే వైఎస్కు మరణం లేదు. తెలుగు జాతి బతికున్నంత వరకు వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు’’ అని షర్మిల పేర్కొన్నారు. కోట్లాది మందికి మేలు చేశారు..: దేశంలో, రాష్ట్రంలో ఎందరో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేసినా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒక్కడికే కోట్లాది మంది ప్రజలు తమ గుండెల్లో చోటిచ్చారని షర్మిల పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మేలు కోసమే ఆయన పాటుపడ్డారన్నారు. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని షర్మిల తెలిపారు. ఇన్ని చేసినా ఏ ఒక్క రోజు ఏ ఒక్క చార్జీ, ఏ ఒక్క పన్ను పెంచలేదని... పన్నులు, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన రికార్డు ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని షర్మిల తెలిపారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని... అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల కోరారు. మేళ్లచెర్వు జన సంద్రం..: పరామర్శయాత్రలో భాగంగా షర్మిల మేళ్లచెర్వు మండల కేంద్రానికి చేరుకునే సరికి సాయంత్రం ఆరున్నర గంటలైంది. ఆ ఊరి బయట పెట్రోల్బంక్ వద్ద నుంచే ప్రజలు షర్మిలను చూడడానికి బారులు తీరారు. అక్కడి నుంచి రేవూరు రోడ్డు వరకు దారి పొడవునా భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, అన్నివర్గాల ప్రజలు ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఎక్కడచూసినా జనమే కనిపిం చారు. ఇక గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇన్నేళ్లయినా వైఎస్ను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆ గ్రామ ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్ధార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, జార్జ్హెర్బర్ట్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్కుమార్, మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్రెడ్డి, ఎన్.భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి మీరే వెలుగులు.. హుజూర్నగర్ నియోజకవర్గంలో పరామర్శయాత్ర ప్రారంభించడానికి ముందు నేరేడుచర్ల సమీపంలోని సిటీ సెంట్రల్ స్కూల్ విద్యార్థులతో షర్మిల కొంతసేపు ముచ్చటించారు. ఆ పాఠశాలకు వెళ్లిన షర్మిలను చూడగానే పిల్లలు కేరింతలు కొట్టారు. వారందరితో కరచాలనం చేసిన షర్మిల కాసేపు మాట్లాడారు. వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులే సమాజంలో మార్పు తీసుకురాగలరని.. ఈ ప్రపంచానికి మీరే వెలుగు దివ్వెలని చెప్పారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి బాధ్యత చాలా ఉందన్నారు. రానున్నవి మంచి రోజులు..: పొంగులేటి రానున్నవి మంచిరోజులేనని.. వైఎస్సార్ కలలుగన్న సమాజాన్ని నిర్మించుకునేందుకు అందరం చేయి కలిపి పనిచేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మేళ్లచెరువు, హుజూర్నగర్, నేరేడుచర్లలలో ప్రసంగించారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ లేదనే రాజకీయ పార్టీలు ఒక్కసారి హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపుతున్న ప్రేమను చూడాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ అధికారంలోనికి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైఎస్లాంటి పాలన అందించాలని, మంచి ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఐదు కుటుంబాలకు పరామర్శ.. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్లో లింగం పాండు కుటుంబాలను ఆమె పరామర్శించారు. భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లా పూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి, అదే మండలంలోని కందిబండలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. -
వైఎస్సారే ఉండి ఉంటే...
-
లింగం పాండు కుటుంబానికి షర్మిల పరామర్శ
-
జయమ్మ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
షర్మిల నాలుగో రోజు పరామర్శ యాత్ర
-
సావిత్రమ్మ కుటుంబానికి షర్మిళ పరామర్శ
-
సుందర్ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర