
గీత స్మరణం
పల్లవి :
ఆమె: నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
అతడు: నాకే తెలియని
నను చూపించి నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే
॥జతగా॥
చరణం : 1
ఆ: కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా
రాలేదే... జాడైనా లేదే...
అ: రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే... పైగా తిడతావే...
ఆ: లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా
అ: నీలోకంలో నాకంటే ఇంకేదో
ఉందంటే నమ్మే మాటలా
॥జతగా॥
చరణం : 2
అ: తెలిసి తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు... ఏం చేస్తాం చెప్పు...
ఆ: తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు... నీదే ఆ తప్పు
అ: నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
ఆ: దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా
॥జతగా॥
చిత్రం: ఎవడు (2013)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, గానం: కార్తీక్, శ్రేయాఘోషల్
సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి.
ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు)
పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1,
సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034
మెయిల్: sakshi.features@gmail.com