అరికాళ్లలో కిలో బంగారం
Published Tue, Jan 31 2017 4:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరికాళ్ల కింద బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement