పెనుభూకంపం ధాటికి నేపాల్ కకావికలం అయిపోయింది.
హైదరాబాద్: పెనుభూకంపం ధాటికి నేపాల్ కకావికలం అయిపోయింది. మొదలైన కొద్దిసేపటికే తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఖాట్మండులో 1000కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1832 దాటింది. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల్లో 249 ఎన్టీఎఫ్ బృందం, 50 మంది వైద్యులు ఉన్నారు. నేపాల్కు 43 టన్నుల మెడిసిన్స్, సహాయ సామగ్రిని భారత్ పంపింది. దరహర్ గోపురం శిథిలాల కింద దాదాపు 200కు పైగా మృతదేహాలు వెలికి తీశారు.