అంబులెన్స్‌తో ఆత్మాహుతి దాడి : 95 మంది మృతి | Kabul bomb attack Near Indian Consulate | Sakshi
Sakshi News home page

భారత ఎంబసీ సమీపంలో భారీ పేలుడు

Published Sat, Jan 27 2018 3:46 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Kabul bomb attack Near Indian Consulate - Sakshi

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌ లో శనివారం భారీ పేలుడు చోటు చేసుకుంది. భారత రాయభార కార్యాలయానికి 400 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 95 మంది మృతిచెందగా, 158మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు సార్లు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఆఫీసులు, స్వీడీష్‌ మిషన్స్‌, హై పీస్‌ కౌన్సిల్‌లు కూడా ఆత్మాహుతి దాడి జరిగిన స్థలానికి సమీపంలో ఉన్నాయి. ఆత్మాహుతి దాడికి ఓ అంబులెన్స్‌ను వాడినట్టు అఫ్గాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వహీద్‌ మజ్రూహ్‌ తెలిపారు. భారత రాయభార కార్యలయంలో పని చేస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement