Kabul
-
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..
కాబూల్: ఆగస్టు 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం బాలికలు హైస్కూళ్ళు, విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవలే అక్కడ మహిళలు బ్యూటీ పార్లర్లు నడపడంపై నిషేధాన్ని విధించింది. దీంతో బ్యూటీ పార్లర్ నడుపుకునే మహిళలు అఫ్గాన్ ప్రభుత్వంతో తమ గోడును చెప్పుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేతులు మారి తాలిబాన్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కాలేజీల్లోనూ, హై స్కూళ్లలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ విద్యార్థినులకు ప్రవేశాన్ని నిషేధించింది. పార్కులకు, ఆటవిడుపు ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జిమ్ వంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలని హుకుం జారీ చేసింది. వీటికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం. నిరవధికంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలు తమ గోడు వినకపోవడం దారుణమని.. ఇంతవరకు ఎవ్వరూ తమతో చర్చలు నిర్వహించే ప్రయత్నమైనా చేయలేదని నిరసనకారులు వాపోతున్నారు. ఉన్నట్టుండి మా పొట్ట కొట్టడం సరికాదని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ తమ జీవనభృతిని కాపాడాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా బ్యూటీ పార్లర్ల సంప్రదాయం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, చాలామంది అందాన్ని పెంచుకుని ఆకాశానికి నిచ్చెన వేసే క్రమంలో నిరుపేదలుగా మారుతున్నారని, సెలూన్ లో కొన్ని ట్రీట్మెంట్లు అయితే మన సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉందన్నది ప్రభుత్వం అభిప్రాయం. ఇది కూడా చదవండి: అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
బలపడుతున్న భారత్–నాటో బంధం?
భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, మన సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ధోరణి అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అన్యోన్యతను కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దొంగతనాల (పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం స్పష్టంగా ఉంది. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు భారత అధికారులు నాటో అధికారులతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) వార్షిక శిఖరాగ్ర సమావేశం లిథువేనియా రాజధాని విల్నియస్లో జరుగుతోంది (జూలై 11–12). ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల పరస్పర రక్షణ కూటమిగా 1949 నుండి ఉంటూ వస్తున్న నాటోను ఇటీవలి వరకు చాలామంది ప్రచ్ఛన్న యుద్ధ అవశేషంగానే భావించారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ అయితే 2019లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాటో బ్రెయిన్ డెత్ గురించి ప్రముఖంగా ప్రకటించారు కూడా.) కానీ ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం నాటో కూటమిలో సరికొత్త ప్రయోజనాత్మక లక్ష్యాన్ని నింపింది. గత సంవత్సరంలో ఫిన్లాండ్ను నాటోలో చేర్చుకున్నారు. సభ్యులందరి ఆమోదానికి లోబడి స్వీడన్ కూడా కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. దీంతో నాటో సభ్యత్వం 32 దేశాలకు పెరగనుంది. పైగా, మంగోలియా, పాకిస్తాన్ వంటి విభిన్న దేశాలతో సహా 39 దేశాలతో నాటో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వాటిలో మూడు (రష్యా, బెలారస్, అఫ్గానిస్తాన్) దేశాల సభ్యత్వాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. ఇవి పార్లమెంటరీ వ్యవహారాల నుండి సాంకేతిక సహకారం వరకు వివిధ స్థాయుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని నాటో భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... రష్యాకు వ్యతిరేకంగా సమన్వయం విషయంలో మరింత సన్నిహితంగా ఉన్నాయి. నాటో 2022 వ్యూహాత్మక భావన అనేది రష్యాపై దృష్టిని తిరిగి కేంద్రీకరించడం, కూటమి సభ్యత్వ విస్తరణను చేపట్టడంతో సహా చైనా ప్రజా రిపబ్లిక్కు (పీఆర్సీ) కొంత ప్రాధాన్యమిచ్చింది. బీజింగ్ ‘ప్రకటిత ఆశయాలు, దాని బలవంతపు విధానాలు, మన ఆసక్తులను, భద్రతను, విలువలను సవాలు చేస్తున్నాయి’ అని ప్రకటించింది. ‘యూరో–అట్లాంటిక్ భద్రతకు పీఆర్సీ ద్వారా ఎదురయ్యే దైహిక సవాళ్లను పరిష్కరిస్తా’మని ఈ డాక్యుమెంట్ ప్రతినబూనింది. నాటో ఆందోళన చెందుతున్న అంశాల్లో చైనాను కూడా చేర్చడం వల్ల భారత్తో ఈ కూటమి చర్చలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండో–పసిఫిక్ దేశాలతో నిమగ్నమవ్వడానికి జపాన్లో నాటో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా దాని వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఉంటున్నాయి. భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, భారతదేశ సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ మౌనం కొంతవరకు అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అధికారిక అన్యోన్యతను కలిగి ఉంది. భారత్, నాటో మధ్య ప్రారంభ వ్యవహారాలు... ఆయుధాల నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక సమస్యలతో నడిచాయి. వాటి మొదటి అధికారిక ఒడంబడిక 2005లో జరిగింది. తరువాతి రెండేళ్లలో, అంటే 2006, 2007లో ఇండియా తరఫున ప్రణబ్ ముఖర్జీ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇరు హోదాల్లో నాటో సెక్రటరీ జనరల్తో సమావేశమయ్యారు. నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ 2007లో భారత్ను సందర్శించారు. 2019లో నాటో–భారత్ మధ్య జరిగిన రాజకీయ చర్చల్లో చైనా, తీవ్రవాదం, పాకిస్తాన్ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల తరువాత, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ న్యూఢిల్లీలో యేటా జరిగే ‘రైజీనా డైలాగ్’ని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ మహాసముద్రంలో దొంగతనాల(పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం చాలా స్పష్టంగా ఉంది. 2009, 2011 మధ్య, బీజింగ్లో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆతిథ్య భేటీలోనూ, బ్రస్సెల్స్లో నాటో నిర్వహించిన సమావేశంలోనూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో పైరసీ వ్యతిరేక ప్రయత్నాలను సమన్వయం చేయడంలో భారత్, నాటో అధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళం వాలెన్సియాలోని నాటో ర్యాపిడ్ డిప్లాయబుల్ కోర్తో కూడా పరిచయాలను ఏర్పరచుకుంది. ఈ దశలు కొన్ని కచ్చితమైన ఫలితాలను అందించాయి. ఉదాహరణకు, 2011 మే నెలలో, అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడిని అడ్డుకోవడానికి భారత నౌకాదళం నాటో పెట్రోలింగ్ నౌకలతో సమన్వయం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నాటో నౌకాదళ వాహనాలు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో 14 మంది భారతీయ నావికులను రక్షించడంలో సహాయపడ్డాయి. నాటో, భారత్ మధ్య కాలానుగుణమైన అధికారిక వ్యవహారాలు అఫ్గానిస్తాన్, సైనిక విద్య, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైబర్ భద్రత వంటి ఇతర రంగాలకు విస్తరించాయి. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు, భారత అధికారులు అక్కడి అంతర్జాతీయ భద్రతా సహాయ దళం (ఐఎస్ఏఎఫ్)లో పాల్గొన్న నాటో అధికారులతోనూ, సైనిక కమాండర్లతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. తర్వాత 2008లో ఉత్తర సముద్రంలో నాటో కసరత్తులకు భారత అధికారులను పరిశీలకులుగా ఆహ్వానించారు. ఇటీవల, కమాండెంట్ నేతృత్వంలోని భారత జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం, నాటో మారిటైమ్ ఇంటర్డిక్షన్ ఆపరేషనల్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించింది. బ్రస్సెల్స్ సదస్సు దృక్పథం నుండి అఫ్గానిస్తాన్ ఇప్పుడు వెనక్కిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది న్యూఢిల్లీకి అధిక ప్రాధాన్యంకలిగిన అంశమే. ఏదేమైనా, అతి వ్యాప్తి చెందుతున్న వారి ఎజెండాల స్వరూపాలు నేడు మరింత సులభంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఇండో–పసిఫిక్లో రాజకీయ పరిణామాలు, వృత్తిపరమైన సైనిక విద్య, వాతావరణ మార్పులు, బహుశా ఆయుధాల నియంత్రణతోపాటు అణు ఎస్కలేటరీ డైనమిక్స్ ఇందులో ఉన్నాయి. సహజంగానే, వేర్వేరు ప్రయోజనాలు, ఆసక్తులు, తరచుగా భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా... భారత్, నాటోలు రష్యాతో పరస్పర చర్చలకు భిన్నమైన విధానాలను కొనసాగిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్మేనియా, కజకిస్తాన్, సెర్బియా వంటి రష్యాతో సన్నిహితంగా ఉన్న అనేక భాగస్వామ్యదేశాలతో నాటో తలపడుతోంది. అంతే కాకుండా, ఇటీవలి వరకు అది న్యూఢిల్లీతో కంటే బీజింగ్, మాస్కోలతో మరింత విస్తృతమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు నాటోతో విద్యా శిక్షణా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2021 వరకు, మాస్కోలో నాటో తన కార్యాలయం కూడా కలిగి ఉంది. వాటి మధ్య విభిన్న అనుకూలతలు ఉన్నప్పటికీ... ఇండో–పసిఫిక్లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని నాటో అంగీకరించడం అనేది భారతదేశంతో విస్తృతమైన, లోతైన సంభాషణకు తలుపులు తెరుస్తుంది. – ధ్రువ జైశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా; అమ్మార్ నైనార్, జూనియర్ ఫెలో, ఓఆర్ఎఫ్ అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అఫ్గనిస్తాన్: ఫారిన్ మినిస్ట్రీ వద్ద భారీ పేలుడు.. 20 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో విదేశాంగ శాఖ కార్యాలయం సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్ ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద పేలుడు. ఈ ఘటనలో 20 మందికిపైగా జనం మృతి చెందారు. అయితే, పేలుడుకు పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. కానీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)కు అనుబంధ సంఘమైన ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రావిన్స్’ 2021 ఆగస్టులో తాలిబాన్ పాలన మొదలయ్యాక అఫ్గాన్లో వరుసగా దాడులకు పాల్పడుతోంది. -
మా అమ్మ, సోదరికి చదువు లేనప్పుడూ..మాకు వద్దు అంటూ సర్టిఫికేట్లను..
అఫ్గాన్లో మహిళలకు యూనివర్సిటీల్లో ప్రవేశం లేదని తాలిబన్లు హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తిన తాలిబన్లు లెక్కచేయకుండా నిరంకుశత్వ ధోరణితో మహిళలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో కాబూల్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ అప్గాన్ మహిళలపై యూనివర్సిటీ నిషేధానికి వ్యతిరేకంగా తన డిప్లొమా సర్టిఫికేట్లను చించేస్తూ నిరసన తెలిపారు. నా సోదరి, మా అమ్మ చదుకుకోలేనప్పుడూ నాకు ఈ విద్య వద్దు అంటే ఆ సర్టిఫికేట్లను లైవ్ టీవీ ఇంటర్వ్యూలో చించేశారు. ఈ రోజు నుంచి నాకు ఈ చదుకు అవసరం లేదు. అయినా ఈ దేశం విద్యకు తగిన స్థలం కాదు అంటూ మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మహిళలు, మైనారిటీల హక్కులకు సంబంధించి మరి మితవాద పాలనను మొదట్లో వాగ్దానం చేసినప్పటికీ.. తాలిబాన్లు అఫ్గాన్ మహిళలకు విశ్వవిద్యాలయంలో చదువుకోనివ్వకుండా నిర్వధిక నిషేధాన్ని విధించారు. బాలికలను మిడిల్ స్కూల్స్కే పరిమితం చేసి, హైస్కూల్కి హాజరు కాకుండా నిషేధించారు. అంతేగాదు మహిళలను చాలా ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే బహిరంగంగా తల నుంచి కాలి వరకు దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఖరికి మహిళలు మగ బంధువులు లేకుండా ప్రయాణించేందుకు కూడా వీలు లేదు. (చదవండి: యూనివర్సిటీల్లో అమ్మాయిలపై నిషేధం.. క్లాస్లు బాయ్కాట్ చేసి అబ్బాయిల నిరసన..) -
ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం..
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లో ఘోర ప్రమాదం సంభించింది. ఓ టన్నెల్ నుంచి వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ నిప్పంటుకుని పేలిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంకర్కు నిప్పెలా అంటుకుందనే విషయం తెలియరాలేదు. కాబుల్కు ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఈ టన్నెల్ ఉంది. 1960 నుంచి 1964 వరకు దీన్ని నిర్మించారు. ఉత్తర, దక్షిణానికి మధ్య వారధిగా ఉంటోంది. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
Taliban: ఎట్టకేలకు ఆ సమాధి వెలుగులోకి!
ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో.. జబుల్ ప్రావిన్స్లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు. కాందహార్లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది. -
'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది. కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు. Kabul Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc — Rashid Khan (@rashidkhan_19) September 30, 2022 💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv — Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022 -
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. అఫ్గానిస్తాన్ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9 — BILAL SARWARY (@bsarwary) September 30, 2022 చదవండి: టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క -
అల్ఖైదా అగ్రనేత జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: అల్ఖైదా అగ్రనాయకుడు అమాన్ అల్-జవహరీ మృతిపై తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా అల్ఖైదా అధినేత అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అప్గానిస్థాన్ రాజధాని కాబుల్లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్ 11న (9/11 హైజాక్) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్లాడెన్ను హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. కాబూల్లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్ల పరస్పర విభిన్న ప్రకటనలతో అల్ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది కూడా చదవండి: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్లాడెన్ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్బీఐ సైఫ్ అల్ అడెల్ను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
కాబూల్లో అల్ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్ఖైదా చీఫ్ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?
కాబూల్: అల్ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్నాయి అమెరికా బలగాలు. ఎట్టకేలకు అతడు కాబూల్లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే ఈ ఆపరేషన్కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ ఆపరేషన్కు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగిందో వివరించారు. 2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు. అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికిరాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మకాం మార్చినట్లు తెలిసి అయితే ఈ ఏడాది ఏప్రిల్లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. అనంతరం జులై1న బైడెన్తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్కు బైడెన్కు వివరించారు. అల్ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు. ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు. క్షిపణులతో భీకర దాడి జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38గంటల సమయంలో ఈ ఎటాక్ జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబసభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్దేనని సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఆయన కాబూల్లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు తెలుసన్నారు. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు. చదవండి: అల్ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా -
అల్ఖైదా అగ్రనేతను మట్టుబెట్టిన అమెరికా
కాబూల్: అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు. 2001లో అమెరికా ట్విన్ టవర్లపై ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్తో పాటు అల్ జవహరి కూడా ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టు బెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్ఖైదా చీఫ్ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు. చదవండి: షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్! -
అఫ్గనిస్తాన్లో మళ్లీ భూకంపం: ఇంకా శవాల దిబ్బలుగానే..
అఫ్గనిస్తాన్ భూకంపం.. సుమారు వెయ్యి మందికిపైనే పొట్టన పెట్టుకుంది. రాళ్లు, బురదతో కట్టుకున్న ఇళ్లు నేల మట్టం కావడంతో.. శిథిలాల కింద ఎంత మంది కూరుకుపోయారన్నది తెలియరావడం లేదు. తూర్పు ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా.. మరణాల సంఖ్య భారీగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి.. ప్రభుత్వానికి ప్రకృతి విలయం పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతింది. అలాగే పాక్టికా ప్రావిన్స్లోని బర్మలా, జిరుక్, నాకా, గియాన్ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లే దెబ్బతినగా.. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం సైతం అఫ్గనిస్థాన్లో భూకంపం సంభించింది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో.. ఫజ్యాబాద్కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు అందాల్సి ఉంది. ప్లీజ్.. సాయం చేయండి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వం.. భూకంప నష్టం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. వర్షం కారణంగా శిథిలాల తొలగింపు కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తరపున షెల్టర్, ఆహార సదుపాయాలు నిరాశ్రయులకు అందడం మొదలైంది. నేపాల్లోనూ భూకంపం గురువారం ఉదయం నేపాల్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1, 4.9 తీవ్రతతో మధ్య నేపాల్ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కస్కీ జిల్లాలో ప్రజలు భయంతో రాత్రిపూట బయటకు పరుగులు తీశారు. -
అఫ్గాన్లో భారీ భూకంపం
కాబూల్: అఫ్గానిస్తాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడ్డ ఈ ఉత్పాతంలో ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు అప్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్ల్లోనూ భూ ప్రకం పనలు సంభవించాయని యూరోపియన్ సిస్మలాజికల్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలాహుద్దీన్ అయూబీ చెప్పారు. మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్లి సహాయం అందించడానికి మరింత సమయం పడుతుందన్నారు. సవాలుగా సహాయ కార్యక్రమాలు అఫ్గానిస్తాన్లో 10 నెలల కింద ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వ పనితీరుకి ఈ భూకంపం సవాలుగా మారింది. అధికార యంత్రాంగం హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించింది. కొండ ప్రాంతాల్లో బాధితుల సహాయానికి హెలికాఫ్టర్లు పంపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. హెలికాప్టర్ల కొరత, కొండ ప్రాంతాలకు వెళ్లడం దుర్లభం కావడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. అంతర్జాతీయ సాయం కోరిన తాలిబన్లు అఫ్గాన్ ప్రజలు తీవ్రమైన విషాదంలో ఉన్నారని ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయపడాలని తాలిబన్ సుప్రీం నాయకుడు హైబతుల్లా అఖూన్జాదా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మహమ్మద్ హసన్ అఖుండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. 1998లో అఫ్గాన్ను కుదిపేసిన భారీ భూకంపంలో 4,500 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత అతి పెద్ద భూకంపం ఇదేనని భక్తర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాసిరకం నిర్మాణాలతో భారీగా ప్రాణనష్టం మారుమూల కొండల్లో ఉన్న గ్రామాల్లో నాసి రకం నిర్మాణాలు కావడం, , కొండ చరియ లు విరిగిపడే ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో భూకంప ధాటికి అపారమైన నష్టం జరిగింది. రాళ్లు, మట్టితో నిర్మిం చిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న వారి బతుకులు శిథిలాల కింద పడి తెల్లారిపోయాయి. ఫక్తూన్ క్వా ప్రావిన్స్లో అత్యధిక మరణాలు సంభవించినట్టు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ భక్తర్ వెల్లడించింది. అక్కడ మీడియాలో వస్తున్న భూకంప విధ్వంస దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. రాళ్ల మధ్య నలిగిపోయిన మృతదేహాలు, ప్రాణాలతో ఉన్న వారు శిథిలాల నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు హృదయవిదారకంగా మారాయి. JUST IN 🚨 Afghanistan state-run news agency reports more than 150 people killed in #earthquake in country's eastern province. pic.twitter.com/QIQFGtQanf — Insider Paper (@TheInsiderPaper) June 22, 2022 -
అఫ్గాన్ గురుద్వారాలో పేలుళ్లు
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని కర్తే పర్వాన్ గురుద్వారా వద్ద శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, మరొకరు భద్రతా సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో గురుద్వారా గేటుపైకి దుండగులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక అఫ్గాన్ సిక్కుతోపాటు భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయారు. అనంతరం దుండుగులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గురుద్వారా వైపు వస్తుండగా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు బలగాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. దాడి ఘటనకు తామే బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, అఫ్గాన్లోని మైనారిటీలపై తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. అఫ్గాన్లోని గురుద్వారాపై దాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. Kabul Update: Sikh Sangat (approx 10-15 in number) stuck in Gurdwara Karte Parwan in Kabul which was attacked by terrorists today morning. One person has been reported dead in this attack.#GurdwaraKarteParwan #Kabul @ANI @PTI_News @TimesNow @punjabkesari @republic pic.twitter.com/XLjSikVPYs — Manjinder Singh Sirsa (@mssirsa) June 18, 2022 ఇది కూడా చదవండి: రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్లో పుతిన్! -
కాబుల్లో బాంబు పేలుడు.. ఆరుగురి మృతి
కాబుల్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. పశ్చిమ కాబూల్లోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘన్ పోలీసు అధికారులు వెల్లడించారు. మరణించిన, గాయపడినవారు షియా హజారా కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరు తరచు ఇస్లామిక్ స్టేట్, సున్నీ తీవ్రవాద గ్రూపులచే టార్గెట్ అవుతున్నారు. పేలుడు మూడు చోట్ల జరిగిందని, షియా ప్రజలు కొంత మంది ప్రాణాలు కోల్పోయారని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
హిజాబ్ కాకున్నా చద్దర్తో అయినా కప్పుకోండి!
భారత్లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది. అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్లైన్స్ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
ఐరాస సిబ్బందిని నిర్బంధించి వదిలేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులతో పాటు పలువురు ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్హెచ్సీఆర్) సిబ్బందిని రాజధాని కాబూల్లో తాలిబన్లు కొద్ది గంటల పాటు నిర్బంధించారు. తర్వాత వారిని సురక్షితంగా వదిలేశారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సాంస్కృతిక, సమాచార శాఖ ఉప మంత్రి జబియుల్లా ముజాహిద్ చెప్పారు. నిర్బంధించిన వారిలో అఫ్గాన్లో చిరకాలంగా పని చేస్తున్న బీబీసీ మాజీ జర్నలిస్టు ఆండ్రూ నార్త్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూఎన్హెచ్సీఆర్ కోసం పని చేస్తున్నారు. -
నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం
కాబూల్: అఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో.. పలు హృదయవిదారక దృశ్యాల్ని ప్రపంచం వీక్షించింది. అఫ్ఘన్ నుంచి పారిపోవడానికి విమానాల రెక్కలు, టైర్ల మధ్య కూర్చోవటం.. గగనతలం నుంచి కిందపడి పౌరులు ప్రాణాలు పోగొట్టుకోవడం, తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల వంటి ఘటనలు కలిచివేశాయి. ఈ పరిస్థితుల్లో కాబుల్లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో.. ఓ పసికందును ఫెన్సింగ్ దాటించిన ఫొటో గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సైనికుడు బాబును తిరిగి తమవద్దకు చేరుస్తారని భావించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలు అయ్యాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు నెలలో జరగగా.. నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఆ బాబు మళ్లీ తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. కానీ, పెంచిన తండ్రి కన్నీళ్ల నడుమ.. ఆ చేరిక భావోద్వేగానికి పంచుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. అతని తండ్రి మీర్జా అలీ అహ్మదీ. అతను యూఎస్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు(మాజీ). తన భార్య సురయా నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా తరలిపోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ముందుగా బిడ్డను ఎయిర్పోర్ట్లోకి చేరవేయాలని.. ఫెన్సింగ్ దాటించాడు. ఆపై ఆ తర్వాత బాబు కనిపించకుండా పోయాడు. అయితే ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. ట్యాక్సీ డ్రైవర్ హమీద్ సఫీ గుర్తించాడు. గందరగోళ పరిస్థితుల్లో బాబును ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. పైగా పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు సఫీ. చిన్నారి సోహైల్ను తాతకు కన్నీళ్లతో అప్పగిస్తున్న సఫీ ఈ ఘటన తర్వాత మూడు నెలలపాటు మీర్జా అలీ అహ్మదీ.. కాబూల్లోనే ఉండిపోయి కొడుకు కోసం వెతుకుతూనే ఉంది. బిడ్డపై ఆశలు పోతున్న క్రమంలో చివరికి పునరావాసం కింద అమెరికాకు వెళ్లింది ఆ కుటుంబం. అయితే బిడ్డను వెతికే పని ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావి(మీర్జా అలీ మామ)కి అప్పగించాడు. చివరికి రెడ్క్రాస్ సాయంతో ఆ చిన్నారి టాక్సీ డ్రైవర్ సఫీ వద్ద బాబు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాసేమ్ రజావి.. సఫీ వద్దకు పంపి బాబును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సఫీ ముందు ససేమీరా అన్నాడు. పోలీసులు కిడ్నాప్ కేసు పెడతామని హెచ్చరించారు. అయినా సఫీ బెదరలేదు. చివరికి కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్ను తాత రజావి చేతికి అందించాడు. ‘సోహైల్ను తల్లిదండ్రుల చెంతకు చేర్చటం తన బాధ్యత’ అని తాత ఖాసేమ్ రజావి మీడియాకు తెలిపాడు. -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Afghanistan: ఇంకా లభించని అమెరికా సైన్యానికి అప్పగించిన చిన్నారి ఆచూకీ
కాబూల్: అఫ్గనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో భయాందోళను గురైన అక్కడి ప్రజలు తాలిబన్ల పాలనలో జీవించలేమని ఇతర దేశాలకు పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విమానం రెక్కలపై కూడా ఎక్కి ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఘటనలన్నీ ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. శరణార్ధుల తరలింపు సందర్భంగా అమెరికా సైనికులకు అప్పగించిన ఓ రెండు నెలల వయసున్న చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇప్పటికీ ఆ పాప తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చదవండి: Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..! కాగా అప్ఘనిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పదేళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మిర్జా అలీ (35), తన భార్య సూరయా (32), అతడి ఐదుగురు పిల్లలతో దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతూ తమ పరిస్థితి ఎలా ఉన్నా.. తమ రెండు నెలల కొడుకు బాగుండాలని చిన్నారి(సోహెల్)ని ఆ సైనికుడి చేతికి అందించాడు. ఆ తర్వాత అరగంటకు మీర్జా అలీ తన కుటుంబంతో సహా ఎయిర్పోర్టులోకి ప్రవేశించారు. అనంతరం తన కొడుకు కోసం వెతుకులాట ప్రారంభించారు. చదవండి: నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. అక్కడే ఉన్న సైనికులను అడిగి చూశాడు. ఎయిర్ర్టులో చిన్న పిల్లలకు ప్రమాదమని, వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఉంటారని వాళ్లు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అయితే సైనికులు చెప్పిన ప్రదేశంలో పిల్లలెవరూ లేరు . గంటల తరబడి వెతికినా ఫలితం లేకపోవడంతో బరువెక్కిన హృదయంతోనే.. కుటుంబ సభ్యులతో కలిసి రెస్క్యూ విమానంలో ఖతర్ అక్కడి నుంచి జర్మనీ వెళ్లి, అక్కడ నుంచి శరణార్థిగా అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం టెక్సాస్లోని శరణార్థుల కేంద్రంలో ఉంటున్న మీర్జా అలీ దంపతులు.. సోహెల్ జాడ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. -
కాబుల్లో బాంబు దాడి, 19 మంది మృతి
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతం మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదలు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. చదవండి: Guinness World Records: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం -
కాబూల్లో బాంబ్ పేలుడు.. 14 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు. -
‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళలు వినూత్నంగా..
కాబుల్: పరిపాలన పేరుతో తాలిబన్లు అఫ్గన్ ప్రజలపై పాల్పడుతున్న ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బాలకల విద్య పై కఠిన ఆంక్షలు విధిస్తూ వారిని పాఠశాలలోకి అనుమతించని సంగతి తెలిసిందే. తాజాగా కాబుల్లో కొందరు మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేందుకు తాలిబన్లు తమదైన శైలిలో హింసాత్మక ధోరణిని ప్రదర్శించారు. స్థానికి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 6-12 తరగతుల బాలికలను తిరిగి పాఠశాలలకు అనుమతించాలని ‘స్పాంటేనియస్ మూవ్మెంట్ ఆఫ్ అఫ్గాన్ వుమెన్ యాక్టివిస్ట్స్’ బృందానికి చెందిన కొందరు మహిళలు ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. అందులో.. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దని.. రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇంతలో అక్కడికి వచ్చని తాలిబన్లు వారిని వెనక్కి నెట్టి, ఆ బ్యానర్లు లాగేసుకున్నారు. నిరసన ఆపకపోయేసరికి వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపారు. ఇదంతా రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్ట్ను నిలువరించడమేగాక రైఫిల్తో అతన్ని కొట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన బృందానికి నాయకుడైన మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వెల్లడిస్తూ, ఇతర దేశాల మాదిరిగానే తమ దేశంలో కూడా నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిని తెలియజేశారు. అఫ్గాన్లో 6-12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. చదవండి: Pakistan: ట్రోలింగ్: అధికారుల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే.. -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ అయిదేళ్ల క్రితం భారత్ అప్పగించినవాడేనని ఇస్లామిక్ స్టేట్తో లింకులున్న ఒక మ్యాగజైన్ వెల్లడించింది. ఆ ఆత్మాహుతి బాంబర్ని అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిగా గుర్తించింది. గత నెల 26న కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని భారత ప్రభుత్వం అయిదేళ్ల క్రితం అఫ్గానిస్తాన్కు అప్పగించిందని ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్–అల్–హింద్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం కశ్మీర్పై భారత్ వైఖరికి ప్రతీకారంగా హిందువులపై ఆత్మాహుతి దాడుల్ని జరపడానికి అయిదేళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లిన అల్–లోగ్రిని ఢిల్లీలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంప్రదింపులు జరపగా భారత ప్రభుత్వం లోగ్రిని అఫ్గాన్కు అప్పగించింది. ఇప్పుడు కాబూల్ ఆత్మాహుతి దాడి అతనే జరిపాడంటూ ఆ మ్యాగజైన్ అల్–లోగ్రిని కీర్తించింది. ‘‘మన సహోదరుడు భారత్ జైల్లో మగ్గిపోయాడు. ఆ తర్వాత అఫ్గాన్కు అప్పగించారు. అయినా అతను తన ఇంటికి వెళ్లలేదు. తన ఆపరేషన్ని కాబూల్లో నిర్వహించాడు. అఫ్గాన్ అధికారులు, వారి కుటుంబసభ్యులు శత్రువులతో చేతులు కలిపి దేశం విడిచి పారిపోతున్నందుకే లోగ్రి ఈ దాడి చేశాడు’’అని స్వాత్–అల్–హింద్ పేర్కొంది. ఢిల్లీలోని లజ్పత్ నగర్లో నివాసం ఉంటున్న ఒక అఫ్గాన్ జాతీయుడిని 2017లో నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్తో అతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడంతో అఫ్గాన్కు అప్పగించాయి. -
కాబుల్లో భారత సంతతి వ్యాపారి అపహరణ!
-
"ఇది మా తప్పిదమే": యూఎస్
వాషిగ్టంన్: కాబూల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగే సమయంలో జరిపిన డ్రోన్ దాడిలో చిన్న పిల్లలతో సహా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడిని అర్థం లేని దారుణమైన చర్యగా కమాండర్ జనరల్ కెనత్ మెకెంజీ అభివర్ణించారు. ఇది ఒక విషాదకరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు యూఎస్ రకణ శాఖ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు. తెల్లని టయోట కారు... ఈ సందర్భంగా మెకెంజీ మాట్లాడుతూ..." ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆగస్టు 29న కాబూల్ ఎయిర్పోర్ట్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో ఆ ఐఎస్ఐ ఉగ్రవాద బృందం తెల్లని టయోట కారుని వాడుతున్నట్లు తెలిసి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాం. కానీ విషాదమేమిటంటే ఆ దాడిలో చనిపోయిన వాళ్లెవ్వరికీ ఐఎస్ఐఎస్తో సంబంధం లేదు" అని అన్నారు. ఆగస్టు 26న తాలిబన్లు చేసిన ఆత్మహుతి బాంబు దాడిలో యూఎస్ సర్వీస్ సభ్యులతో సహా సుమారు 13 మంది చనిపోయిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ దాడులను నిర్వహించామంటూ. .కెనెత్ మెకెంజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
కాబూల్లో భారతీయుని అపహరణ !
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో భారతీయుని అపహరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాబూల్లో భారతీయ పౌరుడు బాన్శ్రీ లాల్ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ‘కాబూల్లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. లాల్ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్లో లాల్ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు. -
Afghan: అఫ్గన్ కేంద్రంగా దాడులు జరగనివ్వం
కాబూల్: అఫ్గాన్ను ఉగ్రశిబిరాలకు అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్ నేతృత్వంలోని నూతన అఫ్గాన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పష్టంచేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమిర్ ఖాన్ తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తమ తాత్కాలిక తాలిబన్ ప్రభుత్వం ఎంతకాలం మనుగడలో ఉండనుందో, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారో లేదో తదితర అంశాలపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చదవండి: క్వారంటైన్లోకి పుతిన్ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. అల్–ఖాయిదా తదితర ఉగ్రసంస్థలతో ఇకపై సంబంధాలను తెంచుకుంటా మని గత ఏడాది అమెరికాతో చర్చల సందర్భంగా తాలిబన్లు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ మేరకు, అఫ్గాన్ గడ్డపై ఉగ్రసంస్థల కార్యకలాపాలను జరగనివ్వబోమని ఆమిర్ ఖాన్ స్పష్టంచేశారు. ఉగ్రసంస్థల పట్ల నూతన ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపై ఇలా ఒక కేబినెట్ మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి. -
Afghanistan: తాలిబన్ల పంట పండింది
ఆర్థికంగా ముప్పావు భాగం మునిగిన అఫ్గన్ నావను నడిపేందుకు తాలిబన్లకు ఇప్పుడు ఆసరా అవసరం. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) సైతం అఫ్గనిస్తాన్కు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈలోపు తమ వనరులను సమీకరించుకునే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలోనే పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అమ్రుల్లా సలేహ్.. అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. د امر الله صالې په کور کې شپږنیم میلیونه ډالر د سرو زرو له اتلس خښتو سره يوځای د اسلامي امارت د ځواکونو لاسته ولوېدل. pic.twitter.com/E5YinxvTe0 — Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 13, 2021 ఇక సలేహ్తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్ను తాలిబనిస్తాన్గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్షీర్కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్ సోదరుడు రుల్లాహ్ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు. చదవండి: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్కు ఆర్థిక ముప్పు ఇక సెప్టెంబర్ 3న చివరిసారిగా పోరు కొనసాగుతుందని ప్రకటించిన సలేహ్.. సెప్టెంబర్ 6న పంజ్షీర్ తాలిబన్ల వశం అయ్యిందన్న ప్రకటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడా? అనేది నిర్దారణ కావాల్సి ఉంది. చదవండి: తాలిబన్ ఎఫెక్ట్.. భారత్లో అలర్ట్ -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్వర్క్కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్వర్క్కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
పాక్ వ్యతిరేక నినాదాలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో హై టెన్షన్ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్ సహకరిస్తోందని అఫ్గనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తీరుకు నిరసనగా పలువురు అఫ్గన్ వాసులు పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అఫ్గన్ వాసుల చర్యల పట్ల తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందకు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (చదవండి: పాక్ సహా ఏ దేశ జోక్యాన్ని సహించం: తాలిబన్లు) కాబూల్లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. అఫ్గనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులు పరుగులు పెట్టారు. తాలిబన్ల తాజా చర్యలతో వారి వైఖరి ఏ మాత్రం మారలేదని.. హింసే వారి ఆయుధమని.. శాంతి మంత్రం వారికి రుచించదని మరోసారి రుజువుయ్యింది. చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి! Kabul Protest started from Pakistani embassy and continued till the presidential palace. The Taliban was seen shooting after that to disperse the crowd. pic.twitter.com/yJuwYWT9vl — Sidhant Sibal (@sidhant) September 7, 2021 -
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్షీర్ కైవసం
అఫ్గనిస్తాన్లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్షీర్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్షీర్ మరోవైపు పంజ్షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్షీర్ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్షీర్లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
Afghanistan: తాలిబన్లకు పెరుగుతున్న మద్దతు!
అఫ్గానిస్తాన్లోని నాయకులు బతుకు జీవుడా అంటూ విదేశాలకు పారిపోతున్నారు. అక్కడి సామాన్య ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటుతున్నారు. ఎక్కడ చూసినా కల్లోలమే.. ఏ దేవుడైనా కాపాడకపోతాడా అని ఎదురు చూపులే. ఇది తాలిబన్ల రాకతో అఫ్గాన్లోని పరిస్థితులు. ఈ క్రమంలో తాలిబన్లకు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ కాబుల్: అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అఫ్గాన్లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లకు తొలిసారిగా చైనా మద్దతు ప్రకటించింది. ‘‘తాలిబన్ల పాలనను స్వాగతిస్తున్నాం. అఫ్గాన్ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించునే హక్కును చైనా గౌరవిస్తుంది. అఫ్గానిస్తాన్తో స్నేహపూర్వక, సహకారం సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. తాలిబన్లు కూడా చైనాతో సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నారు. అఫ్గాన్ పునర్నిర్మాణం, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం కోసం తాలిబన్లు ఎదురు చూస్తున్నారు’’ అని ఇటీవల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్లో తాలిబన్లు నాగరికతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రపంచ సమాజం కాబుల్తో మంచి దౌత్య సంబంధాలను కొనసాగించే విధంగా తాలిబన్లు ప్రవర్తించడాన్ని చూడాలనుకుంటున్నానని పుతిన్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ విచ్ఛిన్నంపై రష్యాకు ఆసక్తి లేదని, ఒకవేళ అదే జరిగితే.. మాట్లాడటానికి ఎవరూ ఉండరని పుతిన్ అన్నారు. అంతే కాకుండా అమెరికన్లు చాలా ఆచరణాత్మక వ్యక్తులు అనే ప్రచారానికి కొన్ని సంవత్సరాలుగా 1.5 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేశారని, కానీ ఫలితం ఏంటి? సున్నా అని తెలిపారు. ఇక 1989 సోవియట్ దళాల ఉపసంహరణతో అఫ్గాన్లో 10 సంవత్సరాల సుదీర్ఘ యుఎస్ఎస్ఆర్ యుద్ధం నుంచి పుతిన్ ఓ పాఠాన్ని నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్కు సంబంధించి రష్యా తన దౌత్య ప్రయత్నాలన్నింటినీ చేసింది. ఇప్పటికీ తాలిబన్ గ్రూప్ను మాస్కోలో 'తీవ్రవాద సంస్థ'గా ముద్ర ఉంది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ పతనం తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్ను సందర్శించారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్ను ఆహ్వానించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనార్టీల హక్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. ముఖ్యమైన విషయాలు, సమస్యలపై తాలిబన్ల సారథ్యంలోని కొత్త అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చిస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు. మరోవైపు అఫ్గాన్లో మానవ సంక్షోభం, ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. 'మానవతా సంక్షోభం' అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తాలిబన్ల పట్ల తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్తాన్లో తీవ్రవాదులచే హింసకు గురవుతోన్న స్థానికులను కాపాడటం గురించి ఆందోళన చెందుతోంది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలు తాలిబన్లతో సంబంధాలకు తెల్ల జెండాలను రెపరెపలాడిస్తున్నాయి. కానీ అఫ్గాన్లో జరిగే సంఘటనల గురించి ప్రపంచం బాధాతప్త హృదయంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ‘‘ఒక్కటిగా’’ నిలువాలి" అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ అన్నారు. చదవండి: పోలీస్ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్గా అఖుంద్జాదా -
తాలిబన్లకు ఊహించని ఝలక్
ఇరవై ఏళ్ల స్వేచ్ఛకు కళ్లెం వేయాలనే ప్రయత్నానికి అఫ్గన్ మహిళ ఎదురు తిరిగింది. తాలిబన్ల దురాక్రమణ జరిగిన మరుక్షణం నుంచి అఫ్గన్ నేలపై మహిళా భద్రత గురించి ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అణచివేత పరిణామాలు ఉండబోవని ఓవైపు చెబుతూనే.. మరోవైపు కట్టడికి తాలిబన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ తరుణంలో హక్కుల కోసం అఫ్గన్ మహిళలు గళం లేవనెత్తారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ వేల మంది అఫ్గన్ మహిళలు ర్యాలీలు చేపడుతున్నారు. ‘‘మేం అసహనంలో ఉన్నాం’’.. ఈ ఫ్లకార్డులతో ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘తాలిబన్ల ఆక్రమణ పరిణామాల తర్వాత యావత్ అఫ్గన్ మహిళా లోకం నాలుగు గోడల నడుమే బంధి అయిపోయింది. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు పని చేస్తేనే గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు దిగజారకముందే తమను పనులకు అనుమతించాల’’ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ప్రభుత్వమేదైనా.. ప్రజాస్వామ్యయుతంగా అఫ్గన్ను చూడాలనుకుంటన్నట్లు వాళ్లు కోరుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మరోపక్క ఆడవాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాబోవని, వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉందని తాలిబన్లు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మహిళా నిరసనకారులు. ‘‘తాలిబన్లవి అబద్దపు ప్రచారాలు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదు. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఆడ పిల్లలను స్కూల్స్, కాలేజీల్లోకి అనుమతించలేదు. ఇదేనా వాళ్లిచ్చే స్వేచ్ఛ’’ అంటూ తాలిబన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే ! విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే తాలిబన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. క్యాబినెట్లోనూ మహిళలకు చోటు దక్కకపోవచ్చనే సంకేతాలిస్తుండడంపై అఫ్గన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల్ని రక్షించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం అని ప్రకటించుకుంటున్నారు వాళ్లు. మరోవైపు కుటుంబాలతో సహా ఆడవాళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘‘బుర్ఖాలకు మేం సిద్ధం. ప్రతిగా తమ ఆడబిడ్డలను చదువు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కొందరు తల్లులు, తాలిబన్లను డిమాండ్ చేస్తున్నారు. కాబూల్లో కిందటి నెలలో ఇలాంటి ర్యాలీ ఒకటి జరిగింది. అయితే తాలిబన్లు సమర్థవంతంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలైన క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం తాలిబన్లకు మింగుడు పడడం లేదు. చదవండి: తాలిబన్ చీఫ్ అఖుంద్జాదా గురించి ఆసక్తికర విషయాలు -
రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్ డాలర్ల పరికరాలు
కాబూల్: అమెరికా భద్రతా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి అడుగు బయట పెట్టగానే.. తాలిబన్లు రెచ్చిపోయారు. అఫ్గానిస్తాన్లోని కాందహార్ మీదుగా వెళ్తున్న యూఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్కు ఓ మృతదేహాన్ని తాడుతో వేలాదీసి కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరవై ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31 తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం అఫ్గాన్ నుంచి బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Afghanistan Crisis: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే! అయితే తాజాగా ‘‘కాందహార్ ప్రావిన్స్లో పెట్రోలింగ్ చేయడానికి తాలిబన్లు తీసుకున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్కు తాలిబన్లు ఓ వ్యక్తిని చంపి అతడిని వేలాడతీశారు’’ అంటూ పలువురు జర్నలిస్టులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై సెనేటర్ టెడ్ క్రజ్ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై మండి పడ్డారు. ఈ విపత్తును తీవ్రమైన విషాదంగా.. ఊహించలేనిదిగా వర్ణించారు. అయితే ఆ మృతదేహం అమెరికాకు చెందిన ఓ వ్యాఖ్యాతది అంటూ ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గానిస్తాన్లో బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను యూఎస్ దళాలు అక్కడే వదిలేశాయి. ఇప్పుడు వాటిని తాలిబన్లు ఉపయోగించనున్నారు. కాబూల్ విమానాశ్రయంలో 73 విమానాలు, 27 హై-మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్ (హమ్వీ) కూడా అక్కడే వదిలేశారు. వాటితో పాటు కౌంటర్ రాకెట్, ఆర్టీలరీ, మోర్టార్ (సి-ర్యామ్) క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ గాగుల్స్ కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు Another landmark picture taking the world in a new era of terror. Taliban hang a person, presumed to be an American interpreter, from a U.S. Blackhawk helicopter. The left over US helicopters will now be used in #Afganistan like this. pic.twitter.com/8q6C5bo4IB — Sudhir Chaudhary (@sudhirchaudhary) August 31, 2021 #UPDATES The Taliban joyously fire guns into the air and offer words of reconciliation, as they celebrate defeating the US and returning to power in a victory that is a "lesson for other invaders" https://t.co/zenNKV5CFK pic.twitter.com/IHU2rFkFfg — AFP News Agency (@AFP) August 31, 2021 -
కాబూల్ మిషన్: చిట్టచివరి సైనికుడు ఈయనే.. ఫొటో వైరల్!
The last American soldier to leave Afghanistan: దాదాపు ఇరవై ఏళ్లుగా అఫ్గనిస్తాన్లో మోహరించిన అమెరికా బలగాలు మంగళవారంతో పూర్తిగా వెనక్కి మళ్లాయి. కాబూల్ ఎయిర్పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం బయల్దేరడంతో సేనల ఉపసంహరణ పూర్తైంది. కాగా న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించిన సెప్టెంబరు 11, 2001 నాటి ఉగ్రదాడి(ఆల్ఖైదా) తర్వాత అమెరికా సేనలు.. అఫ్గనిస్తాన్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అగ్రరాజ్యం పూర్తి ఆధిపత్యం సాధించింది. అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తాలిబన్ల అరాచకాలకు చెక్ పెట్టే విధంగా ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఖర్చు పెట్టింది. అయితే, 2020లో తాలిబన్లతో కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం నేపథ్యంలో తమ సేనలను ఉపసంహరించుకునేందుకు నాటి ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో వేగంగా పుంజుకున్న తాలిబన్లు.. అఫ్గన్ సైన్యాన్ని ఓడించి ప్రధాన పట్టణాలు సహా రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకుని అఫ్గన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న అశ్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పారిపోయి తలదాచుకుంటున్నారు. మరోవైపు తాలిబన్ల గత పాలనలోని అరాచకాలు తెలిసిన అఫ్గన్ ప్రజలు, విదేశీయులు సైతం దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపు ప్రక్రియ ద్వారా ఇప్పటికే వేలాది మంది అఫ్గన్ను వీడారు. ఈ క్రమంలో అమెరికా అమెరికా సేనలు ఆగష్టు 31 నాటికి ఖాళీ చేయాలని తాలిబన్లు బైడెన్ సర్కారుకు డెడ్లైన్ విధించగా నేటితో అది పూర్తైంది. ఈ నేపథ్యంలో.. 20 ఏళ్ల యుద్ధంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకొట్టున్న అమెరికా ఎట్టకేలకు నేటితో అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకుంది. చదవండి: అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు చిట్ట చివరి సైనికుడు ఈయనే! ఈ విషయాన్ని ధ్రువీకరించిన అమెరికా రక్షణ శాఖ అఫ్గన్ను వీడిన చివరి సైనికుడి పేరిట ఓ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘82వ ఎయిర్బోర్న్ డివిజన్, 18 ఎయిర్బోర్న్ కార్్ప్స కమాండర్, మేజర్ జనరల్ క్రిస్ డోనా.. ఆగష్టు 30, 2021న అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్లో యూఎస్ మిషన్ ముగిసింది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అమెరికా పెత్తనం ఇక ముగిసిందని పేర్కొంటుండగా.. మరికొందరు.. తాలిబన్ల అరాచకాలు మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్లో మిగిలిపోయిన యుద్ధ విమానాలను అమెరికా సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇకపై అవి ఎగురలేవని, వాటిని ఎవరూ ఆపరేట్ చేయలేరని యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ పేర్కొన్నారు. -వెబ్డెస్క్ చదవండి: ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు -
అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ(ఎయిర్లిఫ్టు) అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా- అఫ్గన్ మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. అఫ్గన్లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు... ‘‘20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పటితో తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్ తెలిపారు. తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలి ‘‘అఫ్గనిస్తాన్ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అఫ్గన్, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు తీర్మానం జరుగనుంది’’ అని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బైడెన్ గుర్తుచేశారు. అంతర్జాతీయ పౌరుల ప్రయాణాలపై తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరని అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నారు. ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్ పేర్కొన్నారు. కాగా ఆగష్టు 15న తాలిబన్లు అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి(ఆగష్టు 31)తో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు డెడ్లైన్ విధించారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
అఫ్గన్కు సెలవు; గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్ల సంబరాలు
-
అఫ్గన్కు సెలవు; గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్ల సంబరాలు
Last US Troops Leave Afghanistan: సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ వాషింగ్టన్ టైమ్తో మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తైందని ప్రకటన చేస్తున్నా. సెప్టెంబరు 11, 2001 నుంచి దాదాపు 20 ఏళ్లుగా అఫ్గన్లో చేపట్టిన ఆపరేషన్ ముగిసింది’’ అని పేర్కొన్నారు. హమీద్ కర్జాయి ఎయిర్పోర్టు నుంచి సీ-17 విమానం బయల్దేరడంతో బలగాల ఉపసంహరణ ముగిసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చింది: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఆగష్టు 31లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మంగళవారం తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక మార్పు అంటూ సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ఈరోజు తమకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిందన్నారు. ఇక తాలిబన్ అధికారి అనాస్ హక్కాని.. ‘‘చారిత్రాత్మక క్షణాలు. ఎంతో గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్లో ఉగ్రవాదంపై అమెరికా చేసిన 20 ఏళ్ల యుద్ధం ముగిసింది. 73 విమానాలు ధ్వంసం అమెరికా బలగాలు కాబూల్ నుంచి స్వదేశానికి వెళుతూ వెళుతూ విమానాశ్రయంలోని హ్యాంగర్లో ఉన్న 73 యుద్ధ విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశాయి. అక్కడి 73 విమానాలను ముందు జాగ్రత్త పడుతూ ఎందుకూ పనికి రాకుండా చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెడ్ మెక్కెంజీ చెప్పారు. 70 ఎంఆర్ఏపీ ఆయుధాలు కలిగిన వాహనాలు వదిలి వెళ్లారు. ఆ ఒక్కొక్క వాహనం ఖరీదు 10 లక్షల డాలర్ల వరకు ఉంటుంది. చివరి విమానం బయల్దేరగానే తాలిబన్లు ఎయిర్పోర్ట్లోకి దూసుకువచ్చారు. చదవండి: Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి -
భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు
కాబూల్: అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తర్వాత తొలిసారిగా తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు బెహెస్తా అర్ఘాండ్ దేశం విడిచి పారిపోయారు. జర్నలిస్టులు, సాధారణ పౌరుల పట్ల తాలిబన్ల అరాచకాలకు భయపడి అఫ్గన్ను వీడారు. తాను కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉంటానని, దేశంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని పేర్కొన్నారు. కాగా స్థానిక వార్తా చానెల్ టోలో న్యూస్ తరఫున తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్ను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బెహెస్తా వార్తల్లో నిలిచారు. మహిళల పట్ల వివక్ష చూపమంటూ తాలిబన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ మేరకు వీడియోలు ప్రసారమయ్యాయి. కాగా స్త్రీల హక్కులను కాలరాసే విధంగా.. మహిళా గవర్నర్ బంధించడం, కో- ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై కాందహార్లో నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ చేయడం వంటి చర్యలతో ఇప్పటికే తాలిబన్లు తమ వైఖరిని స్పష్టం చేశారు. అంతేకాక తమకు వ్యతిరేకంగా పనిచేసిన జర్నలిస్టుల పట్ల కూడా ఉక్కుపాదం మోపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బెహెస్తా అఫ్గనిస్తాన్ను వీడటం గమనార్హం. నాకూ భయాలు ఉన్నాయి.. ఈ విషయం గురించి ఆమె సీఎన్ఎన్తో మాట్లాడుతూ...‘‘తాలిబన్ల పాలన గురించి లక్షలాది మంది ప్రజలు భయపడుతున్నట్లుగానే నాక్కూడా భయాలు ఉన్నాయి. అందుకే దేశం వీడాను. ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. ఒకవేళ తాలిబన్లు తాము ప్రకటించిన విధంగా మహిళ పట్ల వివక్ష చూపకుండా ఉంటే, అక్కడి పరిస్థితులు మెరుగపడితే కచ్చితంగా అఫ్గనిస్తాన్కు తిరిగి వెళ్తాను. నా దేశానికి, నా ప్రజలకు సేవ చేస్తాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేయడం గురించి చెబుతూ.. ‘‘ఆరోజు చాలా కఠినమైనది. అఫ్గన్ మహిళల కోసమే నేను ఆ సాహసం చేశాను’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఒకవేళ ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటే.. మహిళలకు ఏమీ చేతకాదని అంటారు. కాబట్టి... మేం ఆఫీసులకు వెళ్తాం. పని చేస్తాం. అది మా హక్కు. సమాజ నిర్మాణంలో మాకూ భాగం కావాలి’’ అని 24 ఏళ్ల ఈ యువ జర్నలిస్టు పేర్కొన్నారు. అఫ్గన్ పరిస్థితులకు అద్దం పడుతోంది బెహెస్తా పనిచేసిన టోలో న్యూస్ యజమాని సాద్ మొహెసెనీ స్పందిస్తూ.. ‘‘ప్రముఖ రిపోర్టర్లు, జర్నలిస్టులంతా ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. వాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అందరూ భయపడిపోతున్నారు. చానల్ నడపటం ఒక సవాల్గా మారింది’’ అని చెప్పుకొచ్చారు. బెహెస్తా దేశం వీడటం తాలిబన్ పాలనకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. చదవండి: Afghanistan Crisis: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’ -
కాబుల్లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా హెచ్చరిక
-
ఐసిస్ కె అంటే ఏంటి..?
-
కాబూల్ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి
ఐక్యరాజ్యసమితి: కాబూల్లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది. -
ఐసిస్–కెతో భారత్కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్గోడ్కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
-
కాబుల్ పేలుళ్లకు తామే కారణమని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
-
మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు
ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలన చేపట్టినప్పటి నుంచి కాబూల్ పౌరులు తమ బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి నిత్యావసరాల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ప్రధానమైన ఆహార గోధుమ ధరలు రెట్టింపు అయ్యాయి. తనను తాను 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుచుకునే తాలిబన్లు గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగ దేశ కేంద్ర బ్యాంకు తాత్కాలిక గవర్నర్ నియామకం కూడా ఉంది. గత అఫ్గన్ ప్రభుత్వంలో గవర్నర్ గా పనిచేసిన అజ్మల్ అహ్మదీ తిరుగుబాటు తర్వాత అకస్మాత్తుగా కాబూల్ నుంచి పారిపోయాడు. "ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రజల ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వం హాజీ మొహమ్మద్ ఇద్రీస్ డా అనే వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ గా నియమించారు" అని ఆగస్టు 23న 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. అసలు ఇద్రీస్ కు ఉన్న అర్హతల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇంతకముందు తాలిబన్ ఆర్థిక కమిషన్ అధిపతి, జావ్జ్జాన్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేశారు. ఇక గుల్ ఆఘా అనే వ్యక్తిని ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. కానీ, ఇద్రీస్ వలె ఇతని గురించి కూడా పెద్దగా వివరాలేమీ తెలియదు. మునిగిపోతున్న నావను నడుపుతున్నారు అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి ఆదాయ వనరులు దేశాన్ని నడపడానికి సరిపోవని 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ఒక వ్యాసంలో అహ్మదీ చెప్పారు. "అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి లేదా వాణిజ్య మార్గాల ద్వారా ఆదాయాలు పెద్దవిగా ఉన్నట్లు కనిపించడం వల్ల కొందరు అవి ఆర్థిక సమస్యను తగ్గిస్తాయని భావిస్తున్నారు. అలాగే, చైనా లేదా రష్యా పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నారు. కానీ, అది ఒక ఆశ మాత్రమే. నిజం చెప్పాలంటే తాలిబన్లు మునిగిపోతున్న నావను నడుపుతున్నారు. తిరుగుబాటు చేసేటప్పుడు అటువంటి తాలిబన్ ఆదాయ వనరులు సాపేక్షంగా పెద్దవిగా కనిపిస్తాయి. ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడపడానికి అవి పూర్తిగా సరిపోవు" అని అజ్మల్ అహ్మదీ అన్నారు.(చదవండి: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు) అంతర్జాతీయ ఆంక్షలు, ప్రధాన దాతల నుంచి సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "ప్రియమైన దేశవాసులారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డాలర్లు, పురాతన వస్తువులను వాయు, భూ మార్గం ద్వారా బదిలీ చేయకూడదు అని మేము మీకు తెలియజేస్తున్నాము. మేము పేర్కొన్న వాటిని మీరు బదిలీ చేసేటప్పుడు గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి, బదిలీదారులతో చట్టబద్ధంగా వ్యవహరిస్తాము" అని ముజాహిద్ ట్వీట్ చేశారు. సహాయం నిలిపివేత అమెరికా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర బ్యాంకులకు చెందిన 9.4 బిలియన్ డాలర్ల నిల్వలను ఫ్రీజ్ చేయగా, ప్రధాన దాతలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. ప్రధాన ఆదాయాలు అన్నీ తాలిబన్లు కోల్పోతున్నారని అహ్మదీ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దేశంలోని 38 మిలియన్ల ప్రజలకు మరింత బాధ కలుగుతుంది. "తాలిబన్ల రాజ్యంలో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. దాతలు ఆర్థిక సహాయం నిలిపివేయడం వల్ల ప్రభుత్వ సేవలను తగ్గించాల్సి ఉంటుంది. చాలా మ౦ది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతారు, మిగిలి వారికి జీతాలు చాలా తక్కువగా ఉ౦టాయి" అన్నారు.(చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్) పోషకాహార లోపం అనుభవలేమి గల తాలిబన్ల ఆర్థిక బృందం చేసే పొరపాట్లు, ఆంక్షలు వల్ల సాధారణ అఫ్గన్ ప్రజలు బాధలు పెరుగుతాయి. మే 2021లో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదికలో ముగ్గురు ఆఫ్ఘన్లలో ఒకరు తీవ్రంగా ఆహార కోసం అలమటిస్తున్నారని తెలిపింది. "రాబోయే అనిశ్చితికి ముందే మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి, ప్రజల ఇళ్లకు ఆహారాన్ని దగ్గర చేయాలి, తల్లులు, పిల్లల్లో కోలుకోలేని పోషకాహార లోపాన్ని తగ్గించాలి. వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి మేము వేచి చూడలేము" అని ఆఫ్ఘనిస్తాన్ లోని డబ్ల్యుఎఫ్పీ ప్రతినిధి మేరీ-ఎల్లెన్ మెక్ గ్రోర్టీ తిరుగుబాటుకు మూడు నెలల ముందు చెప్పారు. మరి ప్రస్తుత కఠిన పరిస్థితులను చక్కదిద్ది అఫ్గన్ను తాలిబన్లు ఎలా పాలిస్తారో మనం వేచి చూడాలిక!. -
Panjshir Valley: తాలిబన్లతో మాటలా? తూటాలా?
తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. మేజర్ అమీర్ అక్మల్.. పంజ్షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్పోస్ట్ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్. పటిష్టమైన పద్మవ్యూహం హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్షిర్ లోయ ఉంది. పంజ్షిర్(పంజ్షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది. లొంగుబాటు కథనాలు పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు. నిజంగా ఆక్రమించారా? మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్షిర్లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది. చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో? -
‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’
న్యూఢిల్లీ: తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, అందుకే దేశం విడిచి పారిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్ మహిళ ముస్కాన్ అన్నారు. శవాలపై కూడా తాలిబన్లు అత్యాచారాలకు పాల్పడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో ఆమె భారత్కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. న్యూస్18తో ముస్కాన్ మాట్లాడుతూ.. ‘‘ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్ ఫైటర్లు కోరతారు. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారు. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారు. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదు. అక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడినట్లే. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్ కూడా ఉండదు. అంతం చేయడమే’’ అంటూ తాలిబన్ల అరాచకాల గురించి చెప్పుకొచ్చారు. కాగా తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు. చదవండి: Afghanistan Crisis: కాబూల్ ఎయిర్పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్! -
కాబూల్ ఎయిర్పోర్టులోకి ఎంట్రీ.. వరుసలో ఆర్మీ మాజీ చీఫ్, నెటిజన్ల ఫైర్!
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ వలీ మహ్మద్ అహ్మద్జై దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్పోర్టులో ప్రవేశం కొరకు మిగతా ప్రయాణికులతో కలిసి ఆయన వరుసలో నిల్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు కూడా పారిపోతే ఎలా? దేశంలోనే ఉంటూ పంజ్షీర్ వంటి రెసిస్టెన్స్ ఫ్రంట్కు అండగా నిలవవచ్చు కదా!’’ అని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి వాళ్ల అసమర్థ నాయకత్వం వల్లే తాలిబన్లు.. దేశాన్ని ఆక్రమించుకోగలిగారు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అఫ్గన్ తాలిబన్ల స్వాధీనం అయిన నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్గా పనిచేసిన వలీ సైతం అదే బాటలో నడవడం గమనార్హం. కాగా తాలిబన్ల విజృంభణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ.. గత నెలలో వలీని సైన్యాధిపతిగా తొలగించి, ఆయన స్థానంలో హిబాతుల్లా అలీజైని నియమించారు. అయితే, క్రమేణా ఆఫ్గన్ సైన్యంపై పైచేయి సాధించిన తాలిబన్లు ఆగష్టు 15న రాజధాని కాబూల్లో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అశ్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయి ఆశ్రయం పొందుతుండగా.. పలువురు ఇతర నేతలు సైతం దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అఫ్గనిస్తాన్లో నివాసం ఉంటున్న విదేశీయులు సహా అఫ్గన్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. చదవండి: Afghanistan Crisis: పాకిస్తాన్ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్.. Former Afghan Army Chief Wali Muhammad Ahmadzai is standing in line at Airport to leave the country. pic.twitter.com/SBaQ3QYmTZ — Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2021 -
వద్దన్నా నా సోదరి వినలేదు.. అఫ్గన్కు వెళ్లి తాలిబన్ల చేతిలో..
కోల్కతా: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి అక్కడి మహిళల పరిస్థితిని తలచుకుని అంతర్జాతీయ సమాజం ఆందోళనకు గురవుతోంది. గత పాలనలో స్త్రీల హక్కులను తీవ్రంగా భంగపరిచిన తాలిబన్లు ఈసారి.. వారికి ఎలాంటి హాని తలపెడతారోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఎలాంటి వివక్షకు తావులేకుండా మహిళలకు అన్ని రంగాల్లో ప్రవేశం కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. ఆ మాటలు నీటి మీద రాతలేనని ఇప్పటికే నిరూపితమైంది. తమను ఎదిరించిన మహిళా గవర్నర్ను బంధించడం సహా.. కో ఎడ్యుకేషన్ను రద్దు చేస్తూ జారీ చేసిన ఫత్వా వారు అవలంబించబోయే వైఖరికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల చేతిలో హత్యకు గురైన తన సోదరి సుస్మితను గుర్తు చేసుకుని పశ్చిమ బెంగాల్కు చెందిన గోపాల్ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గనిస్తాన్లో ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో తెలియదంటూ ఉద్వేగానికి గురయ్యారు. భర్తతో కలిసి అఫ్గనిస్తాన్కు.. బెంగాల్కు చెందిన సుస్మితకు 1986లో జాన్బాజ్ ఖాన్తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ అఫ్గనిస్తాన్కు వెళ్లారు. ఈ క్రమంలో కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్ పేరిట సుస్మిత ఓ పుస్తకాన్ని రచించారు. అఫ్గనిస్తాన్లో తన అనుభవాలను రంగరించిన ఆ బుక్ను 1997లో పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్ అనే సినిమా కూడా తీశారు. కాగా 1994లోనే భర్తతో కలిసి భారత్కు తిరిగి వచ్చిన సుస్మితా.. తన రెండో పుస్తక రచన పూర్తి చేసేందుకు 2013, మేలో మళ్లీ అఫ్గనిస్తాన్కు వెళ్లారు. అయితే అప్పటికి అమెరికా సేనలు అఫ్గన్లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరించినా.. జూలైలో పుట్టింటికి వచ్చిన సుస్మిత.. తన బుక్ గురించి సోదరుడు గోపాల్ బెనర్జీకి చెప్పింది. కానీ, ఎందుకో అతడి మనసు ఈసారి కీడు శంకించింది. ఈ పుస్తకం తాలిబన్లను ఆగ్రహానికి గురిచేస్తుందని, ఎప్పటికైనా అఫ్గనిస్తాన్కు వెళ్లడం ప్రమాదమేనని హెచ్చరించారు. అయితే, సుస్మిత మాత్రం పట్టుదల వీడలేదు. మహిళల పట్ల తాలిబన్ల వైఖరి మారిందని, భావ ప్రకటన స్వేచ్ఛను వారు గౌరవించడం నేర్చుకున్నారని సోదరుడికి సర్దిచెప్పింది. కానీ, ఆమె అభిప్రాయం తప్పని అదే ఏడాది నిరూపితమైంది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే దారుణంగా.. సెప్టెంబరు 4న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాలిబన్లు సుస్మితను ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చారు. జుట్టుపట్టుకుని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఈ విషయాల గురించి గోపాల్ బెనర్జీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అక్కడ మహిళలు చదువుకోవడం నిషేధం. వస్త్రధారణ విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి. అయితే, అమెరికా సేనల మోహరింపుతో అఫ్గన్లో పరిస్థితులు మారిపోయానని నా సోదరి అనుకుంది. అందుకే మరో పుస్తకం రాసేందుకు 2013లో అక్కడికి వెళ్లింది. ఆరోజు జాన్బాజ్తో జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. తనతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండగానే తాలిబన్లు వచ్చి వాళ్లను బెదిరించి.. సుస్మితను లాక్కెళ్లి కాల్చి చంపారు’’ అని చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. భయంగా ఉంది.. ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ‘‘నా సోదరి చెప్పిన విషయాలను బట్టి.. ఇప్పటి కంటే గతంలో తాలిబన్లు మరింత క్రూరంగా ప్రవర్తించేవారు. అసలు వాళ్లు ఒక దేశాన్ని పాలించగలరా? ప్రపంచ దేశాలు గళం విప్పాలి. ఎంతో మంది అమాయకులు చచ్చిపోతున్నారు. కొన్ని దృశ్యాలు చూసి నేను షాకయ్యాను. అక్కడ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చనిపోతారో వారికే తెలియని దుస్థితి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’ -
Afghanistan: తాలిబన్ల రాజ్యం.. రంగంలోకి అమెరికా, జర్మనీ దళాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్ఘాన్ భద్రతా సిబ్బందిపై తాలిబన్లు కాల్పులకు తెగపడ్డారు. కాల్పుల్లో అఫ్ఘాన్ భద్రతా అధికారి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అఫ్గాన్లో పరిస్థితులను అదుపులోకి తేవడానికి అమెరికా, జర్మనీ మిలటరీ దళాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. చదవండి: Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే కాగా అమెరికా దళాల ఉపసంహరణను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. తాలిబన్లు దాడులకు తెగబడకుండా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. తాలిబన్ల వ్యవహారశైలి ఆధారంగా నిధులు మంజూరు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఎవరినీ నమ్మేలా లేవని జో బైడెన్ అన్నారు. చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ? -
Afghanistan: 300 మంది తాలిబన్లు హతం..!
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్షీర్ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్షీర్ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్షీర్ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.(చదవండి: Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!) అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్షీర్ ప్రజలు ప్రకటించారు. పంజ్షీర్ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1 — Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021 -
Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే
ఇల్లు అలకగానే పండుగ కాదు అంటుంటారు. అఫ్గానిస్తాన్లో తాలిబన్లది ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితే. 20 ఏళ్ల తర్వాత దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలపై తమ పాలన రుద్దడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్నారు. తాలిబన్ కమాండర్లే ఇక గవర్నర్లు, మేయర్లుగా అవతారం ఎత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కల్లోలిత అఫ్గాన్ పాలన అనుకున్నంత సులభం కాదని, తాలిబన్ల కోసం ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం జనామోదం సాధ్యమా? అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య వంటి కనీస సదుపాయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు అంతంతే. అవినీతి పెచ్చరిల్లింది. జనం మార్పును కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం తాలిబన్లను స్వాగతిస్తున్నారని కాదు. ఘనీ అసమర్థ, అవినీతి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజల మనసులను గెలుచుకోవడం తాలిబన్లకు కత్తి మీద సామేనని చెప్పొచ్చు. షరియా చట్టం పేరిట గతంలో సాగించిన నిరంకుశ పాలనకు ఈసారి స్వస్తి చెప్పి, సంస్కరణలకు బాటలు పరిచి, జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడితే తాలిబన్లకు కొంత జనామోదం లభించే అవకాశం ఉంది. బలగాలు సరిపోతాయా? అఫ్గానిస్తాన్ ప్రస్తుత జనాభా 3.80 కోట్ల పైమాటే. తాలిబన్ల సంఖ్య కేవలం లక్ష లోపే. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా వారి నియంత్రణలోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లో వార్లార్డ్స్(స్థానిక భూస్వాములు) పెత్తనం సాగిస్తున్నారు. సొంతంగా ప్రైవేట్ సైన్యాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని అణచివేసి, దేశం మొత్తాన్ని తమ పరిధిలోకి తీసుకురావాలంటే తాలిబన్లు తమ బలం, బలగాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. పాలనపై పట్టు చిక్కేనా? తుపాకులు పట్టి శత్రువులపై పోరాడడం తప్ప ప్రజలకు సుపరిపాలన అందించడం తాలిబన్లకు పెద్దగా అలవాటు లేదు. చెప్పుకోదగ్గ ఆధునిక సదుపాయాలు లేని అఫ్గాన్ను పాలించడం కష్టమైన పనేనని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి తగిన యంత్రాంగం కూడా అఫ్గాన్లో లేదు. పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందే. 1996– 2001 వరకూ దేశాన్ని పాలించినప్పుడు తాలిబన్లు అరాచకానికి మారుపేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా తీరు మార్చుకోకపోతే జనం తిరగబడడానికి ఎక్కువ సమయం పట్టదు. సొంత బలగాలను అదుపు చేసేదెలా? విదేశీ శక్తులపై పోరాటం అనే భావన తాలిబన్లను ఇన్నాళ్లూ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని తాలూకు అవలక్షణాలన్నీ ఒంటబట్టడం ఖాయం. కొందరు అధికార భోగాలు అనుభవిస్తుండడం, మరికొందరు సాధారణ సైనికులుగా మిగిలిపోవడం వంటివి వారిలో విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేయడాన్ని కొట్టిపారేయలేం. తాలిబన్ పాలకులు తమ సొంత బలగాలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. మైనార్టీలను మచ్చిక చేసుకొనేదెలా? మహిళలు, మైనార్టీల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరిస్తారన్న చెడ్డపేరుంది. వారి నిర్వాకం వల్ల అఫ్గానిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా మారింది. దేశంలో పెద్ద సంఖ్యలో గిరిజన తెగలున్నాయి. వీటిలో చాలా తెగలకు తాలిబన్లతో శత్రుత్వం కొనసాగుతోంది. వారిని మచ్చిక చేసుకొని, మిత్రులుగా మార్చుకోవడం సులభంగా సాధ్యమయ్యే పని కాదని స్థానికులు అంటున్నారు. మానవ హక్కులను, మైనార్టీల హక్కులను కాపాడడం, పౌర చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం వంటివి తాలిబన్ల ముందున్న పెద్ద సవాళ్లు. ఆర్థిక పరిస్థితి ఆగమాగం ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అఫ్గానిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అఫ్గాన్కు లభించే ఆదాయంలో 20 శాతానికి పైగా విదేశాల ఆర్థిక సాయం నుంచే అందుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ఆ సాయం మొత్తం ఇక నిలిచిపోయినట్లే. మరోవైపు అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. అంతేకాదు అఫ్గాన్కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. అఫ్గాన్ను ఐక్యరాజ్యసమితి బ్లాక్లిస్టులో చేర్చింది. దీంతో విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. అఫ్గాన్లో ఖనిజ సంపద ఉన్నప్పటికీ దాన్ని తవ్వితీయాలంటే విదేశీ పెట్టుబడులు అవసరం. తాలిబన్ పెద్దలు ఇక రష్యా, చైనా, పాకిస్తాన్పైనే ఆశలు పెట్టుకున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి చదవండి: తాలిబన్ల దమనకాండ -
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
-
కాబూల్ నుంచి 168 మంది తో ఢిల్లీ బయల్దేరిన ప్రత్యేక విమానం
-
కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియో భయానకం కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 169 మంది అమెరికన్ల ఎయిర్లిఫ్ట్ అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బారన్ హోటల్లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్ చేసి మరీ తీసుకువెళ్లారు. విమానాశ్రయం దగ్గరకు రావొద్దు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. Now - Another morning, another gunshot with struggle for escape. Kabul international airport. pic.twitter.com/eScU7ERM5V — Muslim Shirzad (@MuslimShirzad) August 19, 2021 -
రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి గత ఆదివారం బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సీ–17 విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ, వాస్తవానికి ఆ రోజు ఆ విమానంలో 183 మంది చిన్నారులు సహా మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ–17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. గత ఆదివారం కాబూల్లోకి తాలిబన్లు అడుగు పెట్టడంతో భీతిల్లిన విదేశీయులు, స్థానికులు అమెరికా వైమానిక దళానికి చెందిన విమానంలో చోటు సంపాదించేందుకు ప్రాణాలకు తెగించారు. ఎలాగైనా సరే, దేశం నుంచి బయటపడాలనే ఆత్రుతలో కొందరు విమానం పైన కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!
Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్షిర్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబూల్: అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్షిర్ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అహ్మద్ షా మసూద్ ఎవరు? హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్షిర్ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ కూడా. 2001లో యూరప్ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గాన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ.. 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితం
కాబూల్: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితంగా బయట పడ్డారు. తాలిబన్లు ట్రావెల్ డాక్యుమెంట్లు తనిఖీ చేసి భారతీయులను ప్రశ్నించారు. అంతే కాకుండా వారు ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. కాగా భారతీయుల తరలింపునకు అడుగడుగునా తాలిబన్లు ఆటంకాలు సృష్టించారు. ఆటంకాల మధ్య ఉదయం 87 మందిని భారత్ అక్కడి నుంచి తరలించింది. తాలిబన్లు విడిచిపెట్టిన వారిని త్వరలోనే భారత్కు తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!) -
తాలిబన్ల దుశ్చర్య.. 150 మంది భారతీయుల కిడ్నాప్
కాబూల్: అఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్ ఎయిర్పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: ఆరుకోట్లకు అమ్ముడుపోయిన ఆటోగ్రాఫ్, ఎవరిదంటే..) భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్కు చెందిన రిపోర్టర్ ఒకరు ట్వీట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్ చానెల్ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ-130జే విమానం కాబూల్ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?) -
తాలిబన్ల మిత్రులకు అసలు పరీక్ష?
తాలిబన్లు మళ్లీ అఫ్గాన్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ దేశ భవిష్యత్తు ప్రత్యేకించి అక్కడి మైనారిటీలు, మహిళలు, బాలికల భవిష్యత్తు.. తాలిబన్లలో ఎవరు ఆధిపత్యం నిరూపించుకుంటారు అనే అంశంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాలతో కూడిన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికీ, క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకూ మధ్య బోలెడన్ని తేడాలున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి, వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. కాబూల్ని తాలిబన్లు కైవసం చేసుకోవడం, అఫ్గాన్ ప్రభుత్వం కుప్పగూలడం జరిగిన తర్వాత కాలం గుర్తించదగినంత ప్రశాంతంగా సాగుతోంది. దుకాణాలు, వ్యాపారాలను చాలా వరకు మూసివేశారు. సాధారణ పౌరులు తమ ఇళ్లలో దాక్కున్నారు. తాలిబన్లు పోలీసు ఫోర్స్గా వ్యవహరిస్తూ నగరాన్ని పరిరక్షిస్తున్నారు. కానీ, ఈ సాపేక్ష ప్రశాంతతలో అఫ్గాన్లు అసాధారణమైన వాస్తవికతను ఎదుర్కొంటున్నారు. వారు ఇప్పుడు పూర్తిగా కొత్త దేశంలో నివసిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికన్ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకుంటూ, అమెరికన్ అధికారులు ఊహించిన దానికంటే వేగంగా పరిణామాలు జరిగిపోయాయని అంగీకరించారు. బైడెన్ అభిప్రాయం ప్రకారం, అఫ్గానిస్తాన్ రాజకీయ నేతలు చివరకు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతోపాటు చేతులెత్తేసి దేశం వదిలి పారిపోయినందుకే ఇలా జరిగింది. పైగా అఫ్గాన్ సైన్యం కుప్పకూలిపోయిందని, కొన్ని సందర్భాల్లో పోరాటం చేయకుండానే సైన్యం కూడా చేతులెత్తేసిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అఫ్గానిస్తాన్ క్రియాశీల రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా ఖాన్ మహమ్మది తన సైన్యం వైఖరిని సమర్థించుకుంటూ ట్వీట్ చేశారు. ‘వారు మా చేతుల్ని వెనక్కి విరిచి కట్టేసి, దేశాన్ని అమ్మేశారు. ఘనీ, అతడి ముఠానే దీనంతటికీ కారణం’ అని వ్యాఖ్యానించారు. గతవారం కాబూల్ వీధుల్లో జరిగిన పరిణామాలు ఏవైనా కానివ్వండి.. ఇప్పుడు మాత్రం తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న. తాలిబన్లు అంటే ఎవరు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం 2 లక్షల కోట్ల డాలర్లకంటే ఎక్కువగా వెచ్చించి తాలిబన్లను ఓడించటానికి ప్రయత్నించింది. కానీ ఆ తాలిబన్లే ఇప్పుడు అధికారంలోకి రావడంతో అఫ్గాన్లు, వారి ఇరుగుపొరుగు దేశాల పౌరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంది? తాలిబన్లు ఒక ఏకీకృత శక్తి కాదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాల మొరటైన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికి, క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకు మధ్య గణనీయంగా వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ తాలిబన్ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్ నేతలను గుర్తించి వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. ఇక్కడ మనకు ఒక శుభవార్త. అత్యంత తాజా సమాచారం ప్రకారం, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ అధినేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ అఫ్గానిస్తాన్ నూతన నాయకుడు కావచ్చని తెలుస్తోంది. తనకు తానుగా వాస్తవికవాదిగా, అనుభవశీలిగా, ఆలోచనాత్మకమైన నాయకుడిగా బరాదర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పైగా తన చుట్టూ ఉన్న తాలిబన్ గ్రూపులన్నింటిని ఐక్యంగా ఉంచే శక్తి ఈయనకుంది. పైగా అంతర్జాతీయ శక్తులతో సమర్థంగా చర్చించే సామర్థ్యమూ ఈయనకుంది. ఆగస్టు 17న బరాదర్ చాలా ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్లో అడుగుపెట్టారు. పైగా, సమీకృత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని రూపొందించాలని తాలిబన్ నేతలు ప్రతిజ్ఞ చేశారు కూడా. తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తాజా ప్రకటన ప్రకారం, అలాంటి ప్రభుత్వం తాలిబనేతర అఫ్గాన్లను కూడా తీసుకుంటుందని, వీరిలో అందరికీ సుపరిచితులు కూడా ఉండవచ్చు. అఫ్గాన్ మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఈ ప్రముఖులలో ఒకరు కావచ్చు. శాంతియుతంగా అధికార మార్పిడికి ఈయన ఒక సమన్వయ మండలిని కూడా ఏర్పర్చారు. ప్రస్తుతం దోహాలో ఉన్న ఈ కౌన్సిల్ అఫ్గానిస్తాన్ జాతీయ పునర్వ్యవస్థీకరణపై అత్యున్నత మండలి చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్మత్యార్తోపాటు తాలిబన్ నాయకత్వంతో భేటీ కానుంది.అయితే వాస్తవానికి తాలిబనేతర ప్రముఖులు కూడా భాగమై ఉండే ఈ తరహా ప్రభుత్వంలో చాలామంది తాలిబన్ రాడికల్ శక్తులకు తావు ఉండకపోవచ్చు. అంటే ఇలా అధికారంలో భాగం కాని ఈ తీవ్రవాద శక్తులు అల్ ఖయిదా లేదా ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ జతకట్టే ప్రమాదం కూడా ఉంది. అంతకుమించిన ప్రమాదం ఏమిటంటే, అఫ్గానిస్తాన్ ఏకజాతి (పస్తూన్) ప్రాబల్య దేశంగా మారిపోవచ్చు కూడా. ఇది మళ్లీ దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి తీరుతుంది. పైగా, సమీకృత ప్రభుత్వాన్ని స్థాపించాలంటే తాలిబన్లు సైన్యా న్ని, పోలీసు బలగాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అంతకుమించి తక్కిన ప్రపంచంతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాల్సి ఉంది. రష్యా, చైనా దేశాలకే ప్రస్తుతం తాలిబన్లతో సత్వర సంబంధాలు నెలకొల్పుకునే అవకాశమున్నట్లు కనబడుతోంది. తాలిబన్లతో రష్యా అధికార పీఠం సత్సంబంధాలను నిర్వహిస్తోందని అఫ్గానిస్తాన్కి రష్యా అధ్యక్షుడి తరపున రాయబారి జమీర్ కుబులోవ్ చెబుతున్నారు. కాబట్టి అఫ్గాన్లో జరిగిన పరిణామాలు చూసి రష్యా కలవరపడటంలేదు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్ లవ్రోవ్తో ఫోన్లో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్లో తమ రెండు దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సి ఉందని చెప్పడం బహిర్గతమైంది. అక్కడి పరిస్థితిని బట్టి తమ రెండు దేశాలు పరస్పరం బలపర్చుకోవలసి ఉంటుందని కూడా వీరు అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్తాన్ పొరుగున ఉన్న సెంట్రల్ ఆసియన్ దేశాలను కూడా తాలిబన్లు భాగస్వాములుగా చేసుకోవచ్చు. విస్తృతార్థంలో చూస్తే, మధ్య ఆసియా దేశాలు తాలిబన్ల నేతృత్వంలోని అప్గానిస్తాన్తో సహకారానికి అవకాశముందని ఆశాభావంతో చూస్తున్నాయి. పైగా అఫ్గానిస్తాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కొత్త ప్రమాదాలు జరిగే అవకాశాన్ని అనుమతించబోమని బరాదర్ ప్రతిజ్ఞ చేశారు. పైగా మజర్ షరీఫ్, కాబూల్ గుండా ఉబ్జెకిస్తాన్ లోని టర్మిజ్ నుంచి పాకిస్తాన్లోని పెషావర్ వరకు కాబూల్ కారిడార్ నిర్మించాలంటూ ఉజ్బెకిస్తాన్ చేసిన ప్రతిపాదనను బరాదర్ స్వాగతించారు. అమెరికా వైదొలిగాక, అఫ్గాన్తో సహా మధ్యాసియా దేశాల మధ్య వాణిజ్య, మౌలిక వసతుల కల్పన మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. అలాగే అమెరికా, దాని మిత్ర దేశాల విధానం పైన కూడా అఫ్గాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అఫ్గాన్లో అమెరికా ఘోర ‡వైఫల్యం, సైనిక బలగాల ఉపసంహరణ అంతర్జాతీయ స్థాయిలోనే అమెరికాను ఘోరంగా అవమానపర్చింది. అఫ్గానిస్తాన్ విధ్వంసంలో అది నిర్వహించిన పాత్ర రీత్యా, అఫ్గాన్ ప్రజల శ్రేయస్సుకు అమెరికా ఏమేరకు బాధ్యత వహిస్తుందన్నది కూడా ప్రశ్నే. సమీకృత∙పాలన, ఉగ్రవాద నిరోధంవైపుగా తాలిబన్లు ఏమేరకు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించగలరని తాము వేచి చూస్తున్నామని జో బైడెన్ చెబుతున్నారు. అమెరికా, దాని మిత్రదేశాలు సాధారణ అఫ్గాన్ పౌరులకు చేయవలసిన సహాయం ఎంతగానో ఉంది. అలాగే అఫ్గాన్ పొరుగుదేశాలు, రష్యా కూడా అఫ్గాన్ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవలసి ఉంది. చైనా, రష్యా, మధ్యాసియా దేశాలు ఇలా ఆసక్తి కలిగిన అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి అఫ్గాన్పై ప్రత్యేక అంతర్జాతీయ సదస్సును ఏర్పర్చాలి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సహాయ మందించే దేశాలు కూడా ఒక్కటవ్వాలి. అలాగే ఐరాస, వివిధ అభివృద్ధి బ్యాంకులు కలిసి అఫ్గాన్ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక నిధిని ఏర్పర్చాలి. మధ్యాసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగల రష్యా, అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదు. రష్యాతో సంబంధ బాంధవ్యాలతో పాశ్చాత్య ప్రపంచం కూడా ఈ మొత్తం ప్రక్రియను మెరుగుపర్చవచ్చు. – జూమార్ట్ ఒటోర్బెవ్, కిర్గిజ్స్తాన్ మాజీ ప్రధాని (ప్రాజెక్ట్ సిండికేట్ సౌజన్యంతో) -
తాలిబన్ల ఇంటర్వ్యూ తర్వాత ఓ అఫ్గాన్ మహిళా జర్నలిస్టు స్పందన
తాలిబన్ల అరాచకాలు అంతా ఇంతా కాదు.. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటి అరాచకాలు కోకొల్లలు. అయితే మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు అంటూ ఓ మహిళా జర్నలిస్టుకు తాలిబన్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి వాస్తవ పరిస్థితులపై షబ్నమ్ దావ్రాన్ అనే అఫ్గాన్ జర్నలిస్టు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రశ్న: మహిళలు తమ హక్కులన్నీ కలిగి ఉంటారని తాలిబన్లు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి? జవాబు: నేను స్టేట్ రన్ అనే వార్తా సంస్థ (ఆర్టీఏ) పాష్టోలో పని చేస్తున్నారు. తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు ఉదయం నేను పనిచేసే కార్యాలయాని వెళ్లాను. వారు నన్ను ఇక నుంచి పనికి రావొద్దని చెప్పారు. కారణం ఏంటని అడిగాను. అయితే ఇప్పుడు నియమాలు మారాయని, మహిళలు ఇకపై ఆర్టీఏలో పని చేయడానికి అనుమతి లేదన్నారు. అయితే మహిళలు చదువుకోవడానికి, పనికి వెళ్లడానికి అనుమతి ఉంటుందని తాలిబన్లు ప్రకటించినప్పుడు నేను ఆనంద పడ్డాను. అయితే నా ఆఫీసులో మహిళలు పని చేయడానికి అనుమతించమని నన్ను రానివ్వలేదు. నేను వారికి నా గుర్తింపు కార్డులను చూపించాను. అయినప్పటికీ నన్ను ఇంటికి వెళ్లమన్నారు. ప్రశ్న: ఇతర ఛానెల్ల మహిళా యాంకర్లకు కూడా ఇదే విధమైన ఆదేశాన్ని ఇచ్చారా? జవాబు: లేదు.. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళలను మాత్రమే పనికి రానివ్వమని తెలిపారు. టోలో న్యూస్ ఓ ప్రైవేట్ ఛానెల్ అందువల్ల అక్కడి మహిళల కోసం ఇలాంటి ఆదేశాన్ని జారీ చేయలేదు. ప్రశ్న: ఓ మహిళగా మీకు ఏదైనా ప్రత్యేక ప్రమాదం వాటిల్లిందా? జవాబు: నీవు ఓ మహిళవు. ఇప్పుడే ఇంటికి వెళ్లన్నారు. అయితే నా సహోద్యోగిని మాత్రం పనికి వెళ్లడానికి అనుమతించారు. మహిళలు ఇకపై ఆర్టీఏలో పనిచేయడానికి వీలులేదని వారు స్పష్టంగా తెలియజేశారు. ప్రశ్న: తాలిబన్లతో ఓ మహిళా ఇంటర్వ్యూ చూసినపుడు చాలా మంది సంతోషించారు. కానీ మీ కథను చూసిన తర్వాత, అది కేవలం ఓ పార్శ్వంగా మాత్రమే అనిపిస్తుంది. జవాబు: అవును, అది టోలో న్యూస్లో ఉంది. నా స్నేహితులలో ఒకరు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏం జరుగుతుందనే ఆలోచన అందరికీ ఉంది. కానీ తాలిబన్లతో ఇంటర్వ్యూ తర్వాత, పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు అనుకున్నాం. కానీ తాలిబన్లు ప్రభుత్వానికి సంబంధించిన మీడియాతో అలా చేయడం మంచిది కాదు. ప్రశ్న: మీరు ఇతర మహిళా జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతారు? మీలాగ పని చేసే మహిళలకు భవిష్యత్లో ఏదీ ఉండదని మీరు అనుకుంటున్నారా? జవాబు: ప్రస్తుతానికి నాకు ఏం అర్థం కావడం లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రశ్న: మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? జవాబు: నేను ఇకపై ఇక్కడ పని చేయలేను. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్లో జీవించడం చాలా కష్టం. నాకు ఏదైనా మద్దతు లభిస్తే, నేను వెళ్ళిపోతాను. ప్రశ్న: మీ కుటుంబం గురించి ఆలోచిస్తే మీరు భయపడుతున్నారా? జవాబు: అవును, నా జీవితం కంటే, నేను వారి కోసమే ఎక్కువ భయపడుతున్నాను. -
తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్ స్త్రీల పరిస్థితి ఇదే!
తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ను 1996 నుంచి 2001 వరకు పరిపాలించారు. షరియా చట్టం ప్రకారం.. చిన్న వయసు నుంచే బాలికలను పాఠశాలలకు వెళ్ళనివ్వరు. మహిళలు ఉద్యమాలు చేయరాదు. తమ శరీరం కనిపించకుండా తల నుంచి కాళ్ల వరకూ మహిళలు నిండుగా బుర్ఖా ధరించాలి. అయితే తాలిబన్ల పాలనకు పూర్వం అఫ్గాన్లో స్త్రీలు ఏ విధమైన జీవనాన్ని గడిపేవారో ఓ సారి తెలుసుకుందాం. కాబూల్: అశ్వకన్, అస్సాకన్ అనే పేరు నుంచి అఫ్గాన్ అనే పేరు ఉద్భవించింది. ఈ ప్రాంత నైసర్గిక స్వరూప రీత్యా ఇక్కడ అశ్వాలపై సంచారం ఎక్కువగా ఉండేది. ఈ అశ్వికుల తెగలు నివసించే ప్రాంతం కనుక క్రమ క్రమంగా అఫ్గానిస్తాన్గా పేరు మారింది. ఇక్కడ పాలించిన వారందరూ తమను అఫ్గాన్లుగానే చెప్పుకున్నారు. ప్రత్యేకించి పష్తో భాష మాట్లాడేవారికి ‘అఫ్గాన్’ పదం వర్తిస్తుంది. ఈ భాష ఇక్కడి స్థానిక భాష. ఉదార, పాశ్చాత్య జీవనశైలి శతాబ్దాలుగా అంతర్గత సంఘర్షణ, విదేశీ జోక్యంతో విచ్ఛిన్నమైన ఆఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో అఫ్గాన్ అనేక తాత్కాలిక చర్యలు తీసుకుంది. 1950,1960లలో సాంప్రదాయ వర్గాల పట్ల గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఆ సమయంలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానానికి అడుగులు పడ్డాయి. విద్య, ఓటు వేసే స్వేచ్ఛ ఆఫ్ఘన్ ప్రభుత్వం బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. కొత్త విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చి, ఓ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. అది ప్రజాస్వామ్య చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆఫ్గన్ మహిళలకు ఓటు హక్కును కల్పించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మహిళలు కళాశాలకు వెళ్లేందుకు మార్గం పడింది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా నిర్వహించారు. మరి కొంతమంది మహిళలు రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో కాబూల్ కాస్మోపాలిటన్ అయింది. సంపన్న సమాజం అఫ్గనిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యూఎస్, సోవియట్ యూనియన్తో స్నేహపూర్వకంగా మెలిగింది. సోవియట్ యంత్రాలు, ఆయుధాలను.. యూఎస్ నుంచి ఆర్థిక సహాయాన్ని అంగీకరించింది. ఆ కాలంలో అఫ్గన్కు చాలా ప్రశాంతమైన యుగం. పాత సాంప్రదాయ మట్టి నిర్మాణాలతో పాటు.. కాబూల్లో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. కొంతకాలం పాటు బుర్ఖాలు ధరించడం అనేది ఓ ఆప్షన్గా మారింది. దేశం సంపన్న సమాజం వైపు ఓ మార్గంలో వెలుతున్నట్లు కనిపించింది. అకస్మాత్తుగా అంతా తలకిందులు దేశంలో తాలిబన్లు పురుడు పోసుకోవడంతో అంతా తలకిందులైనది. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 2001లో అమెరికా దాడులు జరిపి పీచమణిచింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. కాగా ఇరవైఏళ్ల తర్వాత అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఈ నేపథ్యంలో గతంలో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్లు, ఇటు ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం -
విమానం నుంచి పడిపోయిన ఘటన: అన్నదమ్ముల విషాద గాథ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట. దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో ప్రజలు, అఫ్గాన్ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్కు ఇక భారీ దెబ్బే!
తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్లో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. అఫ్గన్ నుంచి భారత్కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇవేం తక్షణ పరిణామాలు కావని, నెలన్నర నుంచే ముందు నుంచే నడుస్తున్నా ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ట్రక్కులు నిలిచిపోవడంతో.. ఇంక వేచిచూడడమే మార్గంగా భావిస్తున్నారు. ‘వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయని తాలిబన్లు హామీ ఇస్తున్నారు. కానీ, అంతకు ముందు పూర్తి ఆర్థిక వ్యవస్థను సమీక్షించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి, వర్తక వ్యాపారాల క్లియరెన్స్కు ఎంత సమయం పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, భారత్ నుంచి వెళ్లే గూడ్స్ నార్త్-సౌత్ ట్రేడ్ కారిడార్ మార్గంలో లేదంటే దుబాయ్ నుంచి అక్కడికి చేరుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. చాబహర్ పోర్ట్ నుంచి ముంబైకి రవాణా కొనసాగే ఛాన్స్ ఉంది. కానీ, అన్నింటి కంటే ముందు తాలిబన్ల అనుమతులు అవసరం పడొచ్చు’ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ సీఈవో, డైరెక్టర్ జనరల్ అజయ్ షా హాట్ న్యూస్: అఫ్గన్ పరిణామాలు.. తాలిబన్లు తెచ్చిన తంటాలు దిగుమతులు ఇవే పాక్(48 శాతం) తర్వాత అఫ్గన్ నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశంగా భారత్(19) ఉంది. ఆ తర్వాతి ప్లేసులో రష్యా, ఇరాన్, ఇరాక్, టర్కీలు ఉన్నాయి. 2020-2021కిగానూ భారత్-అఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక్ష వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది(2019-20తో పోలిస్తే తక్కువే). ఇందులో భారత్ దిగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్నట్, ఆల్మండ్, అంజీర్, పైన్, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్, చెర్రీ, వాటర్ మిలన్, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి. ఎగుమతుల మీదా.. దిగుమతుల మీదే కాదు.. అఫ్గన్కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వర్తకం మీదా ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్ నుంచి సుమారు 509 మిలియన్ డాలర్ల విలువ చేసే వర్తకంపై తీవ్ర ప్రభావం పడింది. టీ, కాఫీ, మిరియాలు, కాటన్, బొమ్మలు, చెప్పులు, ఇతరతత్రా ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారుల్లో నెలకొన్న ఆర్థిక భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అఫ్గన్ జీడీపీపై ప్రభావం వ్యవసాయం, పశు పోషణ అఫ్గన్ల జీవనాధారంగా. తొలినాళ్లలో వ్యక్తిగత సాగు, వలస పశు పోషణ మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తూ.. విదేశాలకు ఎగుమతిపైనా తక్కువగా దృష్టిపెట్టేవాళ్లు. అయితే తర్వాతి కాలంలో ఎగుమతుల మీద ఆసక్తి మొదలుపెట్టారు. డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, కార్పెట్స్, ఉన్ని ఎగుమతులు సాగాయి. ఇక విదేశాల నుంచి వాహనాలను, పెట్రోలియం ప్రొడక్టులను, చక్కెర, దుస్తులు, ప్రాసెస్ట్ యానిమల్-వెజిటెబుల్ ఆయిల్, టీను దిగుమతి చేసుకుంటాయి. ఇక ఎగుమతులే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థలో 20 శాతం జీడీపీని శాసిస్తున్నాయి. -
20 ఏళ్ల తర్వాత అఫ్గన్కు: కాబోయే అధ్యక్షుడు.. ఎవరీ అబ్దుల్ ఘనీ?!
కాబూల్: అఫ్గనిస్తాన్ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అఫ్గన్ ప్రజల నిరసన జ్వాలలు కొనసాగుతున్నప్పటికీ లెక్కచేయక అధికారం చేపట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాలిబన్లు అఫ్గన్ను హస్తగతం చేసుకున్న వెంటనే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గనిస్తాన్కు కాబోయే తదుపరి అధ్యక్షుడు అనే వార్తలు వెలువడుతున్నాయి. 2001లో తాలిబన్ నాయకత్వం నుంచి తొలగించబడి, దేశం విడిచి వెళ్లిపోయిన అబ్దుల్ మళ్లీ మంగళవారం కాందహార్లో అడుగుపెట్టారు. ఒకప్పుడు తాలిబన్ లీడర్గా ఓ వెలుగు వెలిగిన అబ్దుల్ ఎందుకు అఫ్గన్ను వీడాల్సి వచ్చింది? పాకిస్తాన్లో అరెస్టై, సుమారు 8 ఏళ్ల పాటు నిర్బంధ జీవితం గడిపిన ఆయన ఎవరి చొరవతో బయటపడ్డారు? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం.. ►అఫ్గనిస్తాన్లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్లో 1968లో అబ్దుల్ ఘనీ బరాదర్ జన్మించారు. 1980లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా అఫ్గన్ ముజాహిదీన్ తరఫున పోరాడారు. ►1989లో సోవియట్ సేనలు దేశాన్ని వీడిన తర్వాత మహ్మద్ ఒమర్తో కలిసి కాందహార్లో మదర్సాను స్థాపించిన అబ్దుల్ ఘనీ.. 1994లో తాలిబన్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో 1996లో తాలిబన్ అధికారం చేపట్టింది. కాగా తాలిబన్ ఉద్యమ సహచరులుగా ఉన్న అబ్దుల్- ఒమర్ ఆ తర్వాత బంధువులుగా మారారు. ఒమర్ సోదరిని అబ్దుల్ పెళ్లి చేసుకున్నారు. ►తాలిబన్ పాలనలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అబ్దుల్.. న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత అఫ్గన్ పరిస్థితులపై అమెరికా జోక్యంతో దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని కేవలం పాకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ మాత్రమే గుర్తించిన విషయం తెలిసిందే. ►అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2010లో పాకిస్తాన్లోని కరాచీలో అబ్దుల్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను దోహా(ఖతార్)కు తరలించారు. ►ఖతార్లో ఉన్న సమయంలో అబ్దుల్ అమెరికా, అఫ్గన్ శాంతిదూతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆ సమావేశాలకు హాజరైన జల్మే ఖలిజాద్ అబ్దుల్ నమ్మదగ్గ వ్యక్తి అని, అఫ్గనిస్తాన్లో శాంతి స్థాపనకై కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో నిర్బంధ జీవితం నుంచి అబ్దుల్కు విముక్తి లభించింది. ►ఈ క్రమంలో 2020లో అమెరికాతో తాలిబన్లకు కుదిరిన చారిత్రాత్మక దోహా ఒప్పందంపై అబ్దుల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అఫ్గనిస్తాన్లో శాంతి స్థాపనకై అబ్దుల్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ►అదే విధంగా.. తాలిబన్లను అఫ్గన్ సైన్యంగా, రాజకీయ శక్తిగా గుర్తించిన చైనా ఆహ్వానం మేరకు తొమ్మిది మంది తాలిబన్ నేతల బృందంతో కలిసి అబ్దుల్ 2021లో డ్రాగన్ దేశంతో చర్చలు జరిపారు. ►ఇక అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తాలిబన్లు ఆదివారం అఫ్గన్ను ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో అబ్దుల్ వారిని ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘‘తాలిబన్ ఫైటర్లూ.. మున్ముందు అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాధించాల్సి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. ►అంతేగాక, ఆదివారమే ఖతార్ నుంచి అఫ్గన్ చేరుకున్న అబ్దుల్.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాలిబన్ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఆ సమయంలో అబ్దుల్ ఖతార్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. -వెబ్డెస్క్ చదవండి: Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ! -
ప్రభుత్వ ఏర్పాటు: మాజీ అధ్యక్షుడితో తాలిబన్ల భేటీ
కాబూల్: అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాలిబన్ కమాండర్, హక్కాని నెట్వర్క్ గ్రూపు సీనియర్ నేత అనాస్ హక్కాని, అఫ్గన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయిని కలిశారు. బుధవారం జరిగిన ఈ భేటీలో కర్జాయితో సహా గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా పాల్గొన్నట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సమావేశం జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్ కథనం ప్రచురించింది. కాగా తాలిబన్ వ్యవస్థలో హక్కాని నెట్వర్క్ ఒక ముఖ్యశాఖ. అఫ్గన్ను తాలిబన్లు గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఈ నెట్వర్క్ కీలక పాత్ర పోషించింది. కాబూల్ను స్వాధీనం చేసుకుని సైన్యంపై పైచేయి సాధించింది. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో స్థావరాలు ఏర్పరచుకున్న హక్కాని నెట్వర్క్... అఫ్గనిస్తాన్లో అనేకమార్లు ఉగ్రదాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అఫ్గనిస్తాన్ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని, ఎవరిపై ప్రతీకార చర్యలు ఉండవని ప్రకటించినప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. చదవండి: Afghanistan: తొలి మహిళా గవర్నర్ను బంధించిన తాలిబన్లు! Afghanistan: తాలిబన్ల రాజ్యం.. బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు -
అఫ్గన్ తొలి మహిళా గవర్నర్ను బంధించిన తాలిబన్లు!
కాబూల్: అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై పైచేయి సాధించి ఎట్టకేలకు బంధించినట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్లోని బల్ఖ్ ప్రావిన్స్లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్ ప్రావిన్స్ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి పోరాడారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు. కాగా తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Karnataka: అఫ్గాన్లలో కలవరం.. మా వాళ్లకు అక్కడ నరకమే! తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...! -
Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు
మోర్తాడ్ (బాల్కొండ): అఫ్గానిస్తాన్లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతలోనే అంతా అయిపోయింది.. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. కాబుల్లో చిక్కుకుపోయాను నేను అఫ్గానిస్తాన్లోని అమెరికన్ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్ పట్టణం కసబ్ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్ఫోన్లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు. - బొమ్మన రాజన్న( మంచి ర్యాల) ఎటుపోవాలో తెలియడం లేదు నేను అఫ్గానిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. - బొమ్మెన మహేందర్ (మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా) అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు) అఫ్గాన్లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్ వస్తోంది. అఫ్గాన్ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి. -
Afghanistan Crisis: తాలిబన్లు సంచలన ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నా, అఫ్గాన్ ప్రజ మాత్రం ఉలిక్కిపడుతూనే ఉంది. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా సమాంగని టీవీలో చెప్పారు. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్ కమిషన్లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదు. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పౌర ప్రభుత్వాలతో, విదేశీ సేనలతో కలిసి పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను తాలిబన్లు తయారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. స్త్రీలే ప్రధాన బాధితులు గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. అయితే ‘ఇస్లామిక్ చట్టం’ అంటే ఏంటనేది ఆయన వివరించలేదు. ప్రజలకు ఈ చట్టం నిబంధనలు తెలుసన్నట్లు మాట్లాడారు. ప్రజల్లో అన్ని పక్షాలు ప్రభుత్వంలో చేరాలన్నారు. స్త్రీలపై తమ వైఖరి మారిందనేందుకు సాక్ష్యం కోసం తాలిబన్ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు ప్రజా జీవనం నుంచి స్త్రీలను దూరం చేయవద్దంటూ కాబూల్లో పలువురు మహిళలు హిజాబ్ ధరించి ప్రదర్శన చేశారు. తాలిబన్లు తాము చేసే వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వీరి గత వైఖరి గమనిస్తే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయని ఐరాస ప్రతినిధి రూపర్ట్ అన్నారు. రెండు దశాబ్దాల్లో అఫ్గాన్ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ జరిగిందని, వీటిని కాపాడాలని సూచించారు. ఆగిన ఆర్థిక సాయం 2021లో అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్కు అందించే సాయాన్ని తగ్గిస్తామని స్వీడన్ మంత్రి పర్ ఆల్సన్ ఫ్రిడ్ చెప్పారు. సైనికుల తరలింపు కోసం అఫ్గాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరలా తెరిచారు. అఫ్గాన్లో ఉన్న అమెరికన్లు స్వదేశం వచ్చేందుకు ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని యూఎస్ ఎంబసీ సూచించింది. దేశమంతా వేలాదిమంది గాయాల పాలైనట్లు రెడ్క్రాస్ తెలిపింది. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సురక్షితంగా ఉంచుతాం.. ఇస్లామిక్ చట్టం ప్రకారం స్త్రీలకు హక్కులు అఫ్గానిస్తాన్ను సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్ భవితవ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాలిబన్ ప్రకటన వెలువడింది. ఈ మేరకు తొలిసారి విలేకరులతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారు. సంవత్సరాలుగా జబిహుల్లా బయటకు కనిపించలేదు. రహస్యంగా ఉంటూ తాలిబన్ల తరఫున ప్రకటనలు జారీ చేసేవారు. తాజాగా అందరినీ క్షమించామని, స్థానికులపై ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోమని తన ఇంటర్వ్యూలో జబిహుల్లా చెప్పారు. ‘‘ఎవరి ఇంటి తలుపు తట్టి ఎందుకు పాశ్చాత్యులకు సాయం చేశావు అని ఎవరూ అడగరు’’ అని తెలిపారు. తాలిబన్ల మాటపై దేశ ప్రజల్లో నమ్మకం చేకూరడం లేదు. మహిళా హక్కులను ఇస్లామ్ చట్టానికి లోబడి పరిరక్షిస్తామని జబిహుల్లా చెప్పారు. ప్రైవేట్ మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలని, జాతీయ విలువలకు వ్యతిరేకంగా పనిచేయకూడదని కోరారు. ఇతర దేశాలతో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని, అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి శత్రువులను కోరుకోవడం లేదని తెలిపారు. ఆఫ్గాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని జబిహుల్లా ప్రకటించారు. ‘ఆఫ్గానిస్తాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని ప్రపంచదేశాలకు మేము వాగ్ధానం చేస్తున్నాం’ అని అన్నారు. అందరి భాగస్వామ్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు కోరుకుంటున్నారని తెలిపారు. విమానం.. ఓవర్ లోడ్ కిక్కిరిసిపోయిన జనాలతో బస్సులు, రైళ్లు, పడవల్ని ఇన్నాళ్లూ చూశాం. తాలిబన్ల పుణ్యమాని ఇప్పుడు విమానాలను కూడా అలా చూసే రోజు వచ్చింది. విమానం టేకాఫ్కి కాస్త ముందు ప్రాణభయంతో పరుగు పరుగున, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయాణికులు ఎక్కే రోజు ఒకటి వస్తుందని మనం కలలో కూడా ఊహించి ఉండం. ఇప్పుడు అలాంటి దృశ్యాలే కాబూల్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. అమెరికా తమ దౌత్య సిబ్బందిని తీసుకురావడానికి పంపిన సి–17 రవాణా విమానంలోకి అఫ్గాన్ పౌరులు పరుగులు తీసుకుంటూ వచ్చి ఎక్కారు. పిల్లా పాపలతో విమానం లోపల కిందనే కూలబడ్డారు. కనీసం సామాన్లు కూడా వెంట తెచ్చుకోలేదు. ఎలాగైనా కాబూల్ని విడిచిపెడితే ప్రాణాలు దక్కుతాయన్న ఆందోళన తప్ప వారిలో మరేం కనిపించడం లేదు. 150 మంది సైనికుల్ని తీసుకువెళ్లే ఆ విమానంలో ఏకంగా 640 ఎక్కేశారు. విమానం టేకాఫ్కి కాస్త ముందు సగం తెరిచిన ర్యాంప్ మీదుగా ఒక్క ఉదుటున.. పోటెత్తిన వరదలా లోపలికి వచ్చేశారు. విమానం సిబ్బంది కూడా వారిని తీసుకునే ప్రయాణించడానికి నిర్ణయించారు. ఈ ఫొటోని అమెరికా ఎయిర్ఫొర్స్కి చెందిన సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్గా మారింది. వారినందరినీ ఖతర్ విమానాశ్రయంలో దింపినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు పరుగులు తీసుకుంటూ విమానంలోకి ఎక్కిన వీడియోలు కూడా వైరల్గా మారి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఎటు చూసినా గందరగోళమే అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. అయితే కాబూల్ విమానాశ్రయానికి విపరీతంగా జనం వచ్చి పడిపోతూ ఉండడంతో అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ వారిని చెదరగొడుతున్నాయి. రన్వేలపై ఉన్న విమానాలను అదేదో బస్సుల మాదిరిగా కదులుతుంటే కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. -
తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక ప్రకటన
కాబూల్: అఫ్గనిస్తాన్ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... ‘‘20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం’’ అని పేర్కొన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి మీదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడించారు. అదే విధంగా... ‘‘అఫ్గన్లో ఇతర దేశీయులకు హాని తలపెట్టబోము. కాబూల్ ఎయిర్పోర్ట్లో ఉన్నవారు వెనక్కి రావాలి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. అలాగే మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం’’ అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం వెల్లడించారు. అలాగే అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని ముజాహిద్ తెలిపారు. అయితే మీడియాకు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదని సూచించారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషిచేస్తాం’’ అని చెప్పారు. చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’ అఫ్గన్లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది! The security of embassies in Kabul is of crucial importance to us. We would like to assure all foreign countries that our forces are there to ensure the security of all embassies, missions, international organizations, and aid agencies: Taliban spokesperson Zabihullah Mujahid pic.twitter.com/tmMKJifZc9 — ANI (@ANI) August 17, 2021 -
అఫ్గన్లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది!
కాబూల్: గత రెండు రోజులుగా భయంతో అల్లాడిపోతున్న అఫ్గనిస్తాన్లో త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినప్పటికీ.. కాబూల్లో కొంతమంది భయం భయంగానే బయటికు వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులతో బుర్ఖా ధరించి బయటకు వస్తున్నట్లు సమాచారం. అఫ్గన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామంటూ తాలిబన్లు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొన్నిచోట్ల వ్యాపారులు ధైర్యం చేసి మార్కెట్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. అఫ్ఘన్ టీవీ ఛానళ్లలో తాలిబన్ బోధనలు ప్రారంభమయ్యాయి. మహిళా యాంకర్లు, మహిళా రిపోర్టర్లు తెరమీదకు వస్తున్నారు. ఈ క్రమంలో.. అఫ్ఘన్ టాప్ ఛానల్ టోలో న్యూస్ చానెల్కు తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్ మహిళా యాంకర్ బెహెస్తాకు ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను టోలో న్యూస్ ట్విటర్లో షేర్ చేసింది. అయితే, ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘తాము మారిపోయామని నమ్మించడానికే తాలిబన్లు ఇలా చేస్తున్నారు’’ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.. ‘‘కనీసం మహిళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా ఒప్పుకొన్నారు. అయినా ఎందుకో కాస్త అనుమానంగానే ఉంది’’ అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భారత్కు మాత్రమే ఆ శక్తి ఉంది... ఇదిలా ఉండగా... అఫ్ఘాన్లో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ అక్కడి యువత ఫైర్ అవుతోంది. ‘‘తాలిబన్లపై మాకు నమ్మకం లేదు. తాలిబన్లు వైరస్, క్యాన్సర్ లాంటివాళ్లు. తాలిబన్లు మారారు అనుకోవడం అవివేకం. అఫ్ఘాన్ అభివృద్ధికి భారత్ చాలా సహాయం చేసింది. తాలిబన్లు, పాకిస్తాన్, చైనా ముగ్గురూ భారత్కు శత్రువులే. తాలిబన్లను తరిమికొట్టే శక్తి భారత్కు ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Afghanistan: ‘వాళ్ల కోసమే వెయిటింగ్.. వచ్చి నన్ను చంపేస్తారు’ Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు.. NIMA WORAZ: #Kabul Situation Discussed [Pashto] In this program, host Beheshta Arghand interviews Mawlawi Abdulhaq Hemad, a close member of the Taliban’s media team, about Kabul’s situation and house-to-house searches in the city. https://t.co/P11zbvxGQC pic.twitter.com/Pk95F54xGr — TOLOnews (@TOLOnews) August 17, 2021 -
Afghanistan: భారత రాయబార కార్యాలయం మూసివేయలేదు!
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని మంగళవారం వివరణ ఇచ్చింది. భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని, దాదాపు 1650 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని ప్రకటించింది. మరోవైపు కాబూల్లోని భారత రాయబార కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది తమ సేవలను కొనసాగిస్తున్నారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో హిందన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. మిగిలిన సిబ్బందికి రక్షణగా అక్కడే ఉండనున్నారు. అఫ్గానిస్తాన్లో పరిస్థితి దారుణంగా ఉందని ఐటీబీపీ కమాండింగ్ ఆఫీసర్ రవి కాంత్ గౌతమ్ అన్నారు. అయినా ప్రజలను విజయవంతంగా తరలించగలిగాము, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తమ దళాలు 3-4 రోజులు నిద్రపోలేదనీ, ఈ రాత్రి హాయిగా నిద్రపోతామంటూ సంతోషం ప్రకటించారు. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) కాగా తాలిబన్ల ఆక్రమణ, అఫ్గన్ పరిస్థితుల నేపథ్యంలో వేలాదిమంది పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీశారు. మరోవైపు అఫ్గన్లకు అండగా నిలుస్తామని ప్రభుత్వం సోమవారం తెలిపింది. కాబూల్ నుండి వాణిజ్య విమానాలు ప్రారంభం తర్వాత హిందువులు, సిక్కులను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రాధాన్యతనిస్తామని, భారత పౌరుల భద్రతకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!) ITBP personnel who were securing the Indian embassy in Kabul get back home. At the Hindan airforce station pic.twitter.com/ceoE8sxSvk — Abhishek Bhalla (@AbhishekBhalla7) August 17, 2021 The situation is bad in #Afghanistan but we managed to successfully evacuate our people, which is a matter of pride for all of us. Our troops have not slept for 3-4 days. We will sleep comfortably tonight: Ravi Kant Gautam, Commanding Officer of ITBP troops in Afghanistan pic.twitter.com/eiWmeP4Wev — ANI (@ANI) August 17, 2021