మతిమరుపు వ్యాధికి మందు వచ్చేసింది | New drug in the market in China to cure Alzheimers disease | Sakshi
Sakshi News home page

మతిమరుపు వ్యాధికి మందు వచ్చేసింది

Published Thu, Jan 2 2020 3:04 AM | Last Updated on Thu, Jan 2 2020 3:04 AM

New drug in the market in China to cure Alzheimers disease - Sakshi

బీజింగ్‌: తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి ఎంతో ఊరట చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రౌన్‌ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు.. అల్జీమర్స్‌ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న మొట్ట మొదటిదని చైనాలోని నేషనల్‌ మెడికల్‌ ప్రోడక్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

జీవీ–971గా పిలుస్తున్న ఈ మందుకు నవంబర్‌ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా, ఆదివారం నుంచి మార్కెట్‌లోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మందును చైనాలో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తామని, దీంతో రీయింబర్స్‌మెంట్‌ చేసుకునే వీలు కలుగుతుందని షాంఘై గ్రీన్‌ వ్యాలీ ఫార్మాసూటికల్స్‌ చైర్మన్‌ సొంగ్‌టావో తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement