తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరి | Nine 'hardcore terrorists' set to be hanged in Pakistan | Sakshi
Sakshi News home page

తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరి

Published Fri, Jan 1 2016 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

Nine 'hardcore terrorists' set to be hanged in Pakistan

ఇస్లామాబాద్:
పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాకు పాల్పడిన తొమ్మిది మందికి ఊరి శిక్ష ఖరారైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో రావల్పిండిలోని పరేడ్ లేన్  మసీదుపై దాడి జరిపిన ఘటనలో నిందితుడుగా ఉన్న ముహమ్మద్ ఘరి కూడా ఉన్నాడు. అతను తెహ్రిక్-ఇ- తాలిబన్(టీటీపీ)లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. 2009 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటనలో మొత్తం 38 మంది మృతి చెందగా 57 మందికి తీవ్రగాయాలయ్యాయి.


ముల్తాన్లోని ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో హస్తం ఉన్న హర్కత్-ఉల్-జీహాద్-ఇ-ఇస్లాంలో కీలక సభ్యుడు అబ్దుల్ ఖుయ్యుంకు కూడా ఉరి శిక్ష పడింది. 2009 డిసెంబర్లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న టీటీపీ సభ్యుడు ఇమ్రాన్, ఆల్ ఖైదా సభ్యుడు అక్సన్ మహబూబ్లకు ఉరి శిక్ష పడింది.

సిపాయి-ఇ-సహబాలో సభ్యులుగా ఉన్న అబ్దుల్ రప్ గుజ్జర్, హసిం, సులేమాన్, ఫరూఖీ, ఫరాన్లు లాహోర్లో సాధారణ ప్రజలను చంపిన కేసులో ఉరి శిక్ష పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement