Hang
-
120 మీటర్ల ఎత్తులో ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే
కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని షినియుజాయ్ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్ కన్వీనియెన్స్ స్టోర్. ’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్ను తిరిగి తెరవడంతో విషయం వైరల్ అయింది. (చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..) -
ఇమ్రాన్ ఖాన్ను బహిరంగంగా ఉరితీయాలి: పాక్ ప్రతిపక్ష నేత
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను బహిరంగంగా ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టులపై కూడా విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ను జడ్జీలు అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్.. అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని, యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రియాజ్. ఈ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, దాడులు చేశారని పేర్కొన్నారు. కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని మండిపడ్డారు. కోర్టులు ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకవేళ ఆయన అంతగా నచ్చితే జడ్జీలంతా వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్లో విధ్వంసం సృష్టిస్తున్న తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయారు. దీంతో ప్రజలంతా శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని ఇమ్రాన్ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హింసకు పాల్పడింది ఒవరో నిర్ధారించుకోకుండా పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. చదవండి: అమ్మో హాజీ! పాకిస్తాన్ అండతో రెచ్చిపోతున్న డ్రగ్ కింగ్.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్... -
కూకట్పల్లి హౌసింగ్బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులను భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఇద్దరూ ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. స్నేహితుడి రూమ్కు వెళ్లి ఆత్యహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
భారత సంతతి తంగరాజును ఉరితీసిన సింగపూర్.. కేసు ఇదే..
సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు. వివరాల ప్రకారం.. సింగపూర్కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది. ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. కాగా, సింగపూర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa — Al Jazeera English (@AJEnglish) April 26, 2023 -
'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య
జైపూర్: భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి రాజస్తాన్లో చోటు చేసుకుంది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భార్య.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు.. ఈ సంఘటన రాజస్తాన్, ఆర్కే పురం స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన అంజలి సుమన్ అనే మహిళకు రాజస్తాన్కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు బాగానే ఉండేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దంపతులిద్దరికి ఓ షర్ట్ విషయంలో గొడవ జరగింది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్ కుట్టించుకోలేదని అతడితో గొడవపడింది అంజలి. (చదవండి: వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి ) చిన్నగా ప్రారంభం అయిన వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన శుభం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అంజలి భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మాట్లాడదాం అని చెప్పాడు. అరగంట తర్వాత అతడి మొబైల్కు ఓ కాల్ వచ్చింది. విషయం ఏంటంటే అంజలి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంజలి ఏకంగా ప్రాణాలు తీసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. చదవండి: అవని ఆనందం ఆకాశమంత... -
తప్పిన ప్రమాదం.. రెయిలింగ్ను ఢీకొట్టిన బస్సు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ట్రాఫిక్ను అదుపు చేస్తున్నారు. బస్సు కింద పడుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
టీనేజర్ ఉసురు తీసిన చోరీ.. చేతిలో లోదుస్తులతో పరిగెడుతుండగా
బాల్కనీలో ఆరేసిన లోదుస్తులు చోరీ చేస్తుండగా ఓ టీనేజర్ను ఆ జంట చూసింది. అతన్ని వెంటాడి పట్టుకుని గదిలో బంధించింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ టీనేజర్ ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. భోపాల్: రవి(24), అతని భార్య స్థానికంగా గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్ను ఉరేసుకుని చనిపోయాడు. అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు. -
ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం!
గువాహటి: అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. కోక్రాజ్హర్ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్హర్ పోలీసులు చెప్తున్నారు. చదవండి: శారీరక సుఖం కోసం పోయి.. -
150 ఏళ్ల అనంతరం తొలి ఉరి.. 40 ఏళ్లలో తొలిసారి
సాక్షి, న్యూఢిల్లీ : తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఉత్తరప్రదేశ్ మహిళ షబ్నమ్-సలీంలను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఒకే కేసులో దోషులుగా తేలిన ప్రియుడు సలీం, ప్రియురాలు షబ్నమ్ ప్రస్తుతం వేరువేరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2010లో దిగువ విధించిన మరణశిక్షను 2015లో సుప్రీంకోర్టు సమర్థించడం, ఆ తరువాత దోషులు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో ఉరిశిక్ష తప్పలేదు. ఈ క్రమంలోనే ఖైదీలను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథురు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో ఆగ్రా సెంట్రల్ జైలు ఉన్న మరో దోషి సలీంను సైతం ఉరితీసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే ఈ రెండు ఉరితీతలకు ఓ ప్రత్యేకత ఉంది. దేశానికి స్వాతంత్య్ర వచ్చిన అనంతరం ఉరితీయబడుతున్న తొలి మహిళ షబ్నమ్ కావడంతో పాటు.. 1984న తరువాత ఆగ్రా సెంట్రల్ జైలులో ఉరితీయడం కూడా ఇదే తొలిసారి. మథుర జైలులో షబ్నమ్ను ఉరితీసే సమయానికి ఆగ్రాలో సలీంను సైతం ఉరికంభం ఎక్కించనున్నారు. ఉత్తరప్రదేశ్లో అనేక కారాగారాలు ఉన్నప్పటికీ కేవలం ఆగ్రా, మథురలోనే ఉరికంభాలు ఉన్నాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలో 1741లో ఆగ్రా సెంట్రల్ను జైలు ఏర్పాటు చేయగా.. ఎంతోమందికి అక్కడ ఉరితీశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి 35 మందిని ఉరికంభం ఎక్కించారు. ఒక్క 1959లోనే పదిమంది ఖైదీలను ఉరితీయగా.. 1984లో చివరిసారిగా ఆగ్రాజైలు ఉరితీత జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిపిన బులంద్షహర్కు చెందిన జమాన్ ఖాన్ను చివరగా ఉరితీశారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆగ్రాజైల్లో ఒక్క ఖైదీని కూడా ఉరికంభం ఎక్కించలేదు. దాదాపు 40 ఏళ్ల అనంతరం సలీంను బలిపీఠం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు దేశంలో 150 ఏళ్ల తరువాత ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తన ప్రియుడు సలీంతో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించారన్న కారణంతో 2008లో షబ్నమ్ కుటుంబ సభ్యుల్ని అందరినీ దారుణంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. రెండు పీజీ పట్టాలు పొందిన యువతి ఆరో తరగతి చదవిన యువకుడి కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం దేశ వ్యాప్తంగా సంచలన రేపింది. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. అయితే ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షబ్నమ్కు క్షమాభిక్ష పెట్టాలని ఆమె తరుఫు న్యాయవాదులు కోరుతున్నారు. మరోవైపు తన తల్లికి విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని షబ్నమ్ కుమారుడు వేడుకుంటున్నాడు. ‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’ ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి -
‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’
లక్నో: అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి.. ఈ ప్రశ్న చదువుతుంటేనే కడుపులో పేగు బాధతో మెలిపెడుతోంది కదా. అలాంటిది తన కళ్ల ముందే తల్లి చనిపోతుందని తెలిస్తే.. 12 ఏళ్ల ఆ చిన్నారి మనసు ఎంత విలవిల్లాడుతుందో ఊహించుకోండి. తల్లి లేకుండా అసలు బిడ్డలు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎన్ని జన్మలు అనుభవించినా తనివి తీరనది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి బంధం తర్వలోనే తనకు దూరం కాబోతుందని తెలిసి ఆ చిన్నారి విలవిల్లాడాడు. తన కోసం అయినా అమ్మను క్షమించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎందుకు అతడి తల్లి చనిపోతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా షబ్నం అనే పేరు మార్మోగుతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష అనుభవించబోతున్న తొలి మహిళ షబ్నం. ఉత్తరప్రదేశ్ మథురలో నివాసం ఉండే ఈమె.. ప్రేమించిన వ్యక్తితో విహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో లవర్తో కలిసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం అనగా 2008 ఏప్రిల్ 14న షబ్నం తన ప్రియుడు సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మథుర కోర్టు విచారించింది. ఇక నిందితులు షబ్నం, ఆమె ప్రియడు ఇద్దరికి మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో వచ్చిన మథుర కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇదే రిపీట్ కావడంతో 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మథుర కోర్టు, జైలు అధికారులను ఆదేశించింది. ఇక కుటుంబ సభ్యులను హతమార్చే సమయానికే షబ్నం గర్భవతిగా ఉంది. జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. తనతో పాటే కుమారుడిని పెంచింది. అయితే ఖైదీగా ఉన్న తల్లి దగ్గర పిల్లలు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. ఈ క్రమంలో 2015లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి షబ్నం కుమారుడిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. దాంతో షబ్నం కాలేజీ స్నేహితుడైన సైఫి, ఆమె కుమారుడి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లి పెంచసాగాడు. ఈ సందర్భంగా సైఫి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్గా ఉండేవాడిని. అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సైఫి బులంద్షహర్లో జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ‘‘ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తతకు సంబంధించిన యాడ్ చూశాం. గతంలో తను నన్ను ఆదుకోకపోయి ఉంటే.. ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది’’ అని తెలిపాడు. ‘‘ఆ తర్వాత మేం భార్యభర్తలిద్దరం జైలుకు వెళ్లి షబ్నమ్ని కలిశాము. ఆమె కుమారుడిని మాతో పాటు తీసుకెళ్తాం.. అతడి బాధ్యతను మేం తీసుకుంటాం అని అడిగాం. ఆమె అంగీకరించింది. ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు. జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్ అని పెట్టాం’’ అని తెలిపారు. ‘‘తల్లి గురించి తాజ్కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇక తర్వలోనే షబ్నమ్ను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది. అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కోరుతున్నాడు. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్ని దాఖలు చేశాడు. పాపం అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో అన్నాడు’’ సైఫి. చదవండి: ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా? -
ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి
సాక్షి, న్యూఢిల్లీ : స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు ఉత్తరప్రదేశ్ జైలు అధికారులు సిద్ధమయ్యారు. ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చిన ఓ మహిళను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథుర కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో తలారి పవన్ జల్లద్ ఉరితాడును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేసు వివరాల ప్రకారం.. మథురకు చెందిన షబ్నమ్ అనే మహిళ స్థానికంగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే సలీం అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడి అనంతరం శారీరక సంబంధానికి దారతీసింది. పెళ్లికి ముందే షబ్నమ్ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు. మరోసారి అతనితో తిరగొద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కొరకు కుటుంబ సభ్యుల అనుమతినికోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి హతమర్చాలని పథకం పన్నింది. అనుకున్నదే తడువుగా 2008 ఏప్రిల్ 14న అర్థరాత్రి సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. దీంతో తాజాగా మథుర కోర్టు దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. కాగా కాగా బ్రిటిష్ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు. మళ్లీ దాదాపు 150 ఏళ్ల తరువాత మహిళను ఉరితీయడం గమనార్హం. -
హత్రాస్ దోషులను ఉరి తీయాలి: సీఎం
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఎంతో బాధతో ఇక్కడ సమావేశం అయ్యాం. మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. (చదవండి: ‘వారు రైతుల పక్షాన పోరాడారు’) ఇక భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. ‘హత్రాస్ను సందర్శిస్తాను. యూపీ సీఎం రాజీనామా చేసేవరకు నా పోరాటం కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నేను వెనకడుగు వేయను. ఈ ఘటనను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నాను’ అన్నారు. సూర్యాస్తమయం తర్వాత నిరసనకారులు కొవ్వొత్తులను వెలిగించి చీకటిలో పట్టుకుని నిలబడ్డారు. -
ఖేల్ ఖతమ్
-
నిర్భయ కేసు: దేశ చరిత్రలో ఇదే ప్రథమం
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లు ఈ తెల్లవారుజామున ఉరి తీయబడ్డారు. ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జలాద్ వారిని ఉరితీశారు. జైలు నెంబర్ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. కాగా, 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. చదవండి : నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ -
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరికి రంగం సిద్ధమైంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించడం.. తీహార్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్వారెంట్లు జారీ చేయడంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు వారి ఉరితీత ఖరారైంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉండగా.. ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన పిటిషన్ను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిటిషన్ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారెంట్లు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే వాటిని జారీ చేయడం చకచక జరిగిపోయాయి. నిర్భయ తండ్రి హర్షం.. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఒకరైన ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లకు ఉరిపడటం దాదాపుగా ఖాయమైనందుకు సంతోషంగా ఉంది. క్షమాభిక్ష పెట్టిన వెంటనే తిరస్కరిస్తారని మాకు భరోసా ఇచ్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 22న జరగాల్సిన ఉరితీత వాయిదా పడటం నిరాశకు గురిచేసిందని, తాజా పరిణామాలతో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. నిర్భయ ఘటన.. 2012 డిసెంబర్లో నిర్భయపై ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ అనే నలుగురితోపాటు మరికొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, ఈ క్రమంలో అయిన తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ నిర్భయ కొన్ని రోజుల తరువాత సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో మరణించడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘోర సంఘటనకు స్పందనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2013 మార్చిలో ఐదుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది ఈలోపుగా ప్రధాన నిందితుడైన రామ్సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుల్లో మరొకరు జువెనైల్ కావడంతో అతడిని మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచి ఆ తరువాత విడుదల చేశారు.మిగిలిన నలుగురి నిందితుల విచారణ తరువాత 2013 సెప్టెంబర్లోనే న్యాయస్థానం దోషులు నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. మైనర్నంటూ సుప్రీంకోర్టుకు.. నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్నంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే పిటిషన్ను ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణ సమయంలో దోషి తరఫు న్యాయవాది హాజరుకాక పోవడంతో అతనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వ్యవహారంపై పవన్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. -
నిర్భయ కేసు: ఉరికంబాలు సిద్ధం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్యకేసులోని నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష వేసేందుకు రంగం సిద్ధమైంది. దేశంలో నలుగురు దోషులకు ఒకేచోట, ఒకేసారి ఉరిశిక్షను అమలు చేస్తున్న జైలుగా.. తీహార్ జైలు రికార్డు సృష్టించనుంది. గతంలో తీహార్ జైలులో ఒక ఉరికంబం మాత్రమే ఉండగా.. ఒకేసారి నలుగురు దోషుల ఉరితీతకు ఉరికంబాలు అవసరం అవుతుండడంతో జైలు అధికారులు ఆ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అంతేకాక ఉరితీత సమయంలో జేసీబీ అవసరం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే తీసుకువచ్చి తీహార్ జైలు ప్రాంగణంలో ఉంచారు. జేసీబీ యంత్రం సహాయంతో ఉరి తీయడానికి ఫ్రేమ్, భూగర్భంలో కొద్దిమేర గుంత తవ్వడానికి, ఉరిశిక్ష అనంతరం దోషుల మృతదేహాలను తరలించడానికి ఉపయోగించబడుతుంది. వివరాల్లోకి వెళితే.. 2012, డిసెంబర్ 16న పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానవీయంగా హత్యాచారం చేశార. సామూహిక అత్యాచారం అనంతరం ఆమెను కదులుతున్న బస్సులోంచి కిందకు తోసివేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్లో చికిత్స పొందుతూ డిసెంబరు 29, 2012న ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. మిగతా నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా నిర్భయ దోషులకు డెత్ వారెంట్ల జారీపై విచారణను పటియాలా హౌజ్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్భయ కేసు : లాయర్కు భారీ జరిమానా..! -
సెంగార్కు ఉరే సరి
ఉన్నావ్/న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి మంగళవారం డిమాండ్ చేశారు. మరో నిందితురాలు శశిసింగ్ను నిర్దోషిగా విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం యూపీలోని ఉన్నావ్లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్న కేసులో ఢిల్లీ కోర్టు సెంగార్ను సోమవారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి మంగళవారం స్పందిస్తూ ‘‘శశిసింగ్ను ఎందుకు వదిలేశారు? ఉద్యోగమిస్తానని మాయమాటలు చెప్పి నా కూతురిని కుల్దీప్ సెంగార్ వద్దకు తీసుకెళ్లింది శశిసింగే’అని వాపోయారు. బాధితురాలి సమీప బంధువు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, అతడు విడుదలయ్యేంత వరకూ తనకు న్యాయం దక్కనట్లేనని స్పష్టం చేశారు. దోషికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ వాదించగా ఈ అంశంపై తాను డిసెంబరు 20న తీర్పు వెలువరిస్తానని ఢిల్లీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ప్రకటించారు. (ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) -
నిర్భయ దోషులను ఉరి: తలారి కోసం వెతుకులాట
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లింది. ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా.. దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడంలేదని మహిళా సంఘాలతో సహా.. పలువురు ప్రముఖులూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు చేయకపోవడంపై నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారని, దానిపై రామ్నాథ్ కోవింద్ తుది నిర్ణయం తీసుకున్న అనంతరం శిక్షను అమలు చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే క్షమాభిక్ష పటిషన్పై వినయ్ శర్మ వెనక్కితగ్గారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష వేడుకోలేదని ఆయన తరుఫున న్యాయవాది తెలిపారు. దీనిపై కేంద్ర నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఉరిశిక్ష అమలుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దోషులను ఉరి తీసేందుకు జైలులో తలారి లేరని జైలు అధికారులు అంటున్నారు. దేశంలో ఉరిశిక్షలు చాలా తక్కువ సందర్భాల్లో అమలు అవుతున్న విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేవలం నాలుగురిని మాత్రమే ఉరితీశారు. దీంతో జైలులో ఉరి తీసేందుకు శాశ్వత సిబ్బందిని అధికారులు నియమించడంలేదు. అవసరం పడిన సందర్భాల్లో మాత్రమే తలారి కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. తాజాగా నిర్భయ నిందితులును ఉరి తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుండటంతో ఆ మేరకు జైలు అధికారులు తలారి కోసం మల్లాగుల్లాలు పడుతున్నారు. కాగా వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్పై కేంద్ర హోంశాఖ తుది ప్రకటన వెలువడిన అనంతరం వారికి విధించిన శిక్షను అమలు చేస్తామని జైలు అధికారులు పేర్కొన్నారు. -
ఆయన కంటే ముందే నేను చనిపోతాను
సాక్షి, హైదరాబాద్: ‘నా భర్త మరణాన్ని జీర్ణించుకునే శక్తి నాకు లేదు.. ఆయన కంటే ముందే నేను చనిపోతా.. అంటూ తల్లికి ఫోన్ చేసి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేటకు చెందిన సింధూజ(25), భర్త శివకుమార్తో కలసి రహ మత్నగర్లో అద్దెకుంటోంది. వారికి ఇద్దరు కొడుకులు. ఈ నెల 12న శివకుమార్కు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన శివకుమార్ తన భార్యకు చెప్పి ఇక తాను ఎక్కువ రోజులు బతకలేనేమోనని బాధపడ్డాడు. మానసిక ఒత్తిడికి గురైన సింధూజ తన తల్లి రత్నాదేవికి ఫోన్చేసి ఏ క్షణంలోనైనా తన భర్త గుండెపోటుతో చనిపోవచ్చని ఆయన కంటే ముందే తానే చనిపోతానంటూ చెప్పి ఏడ్చింది. సముదాయించిన ఆమె ఆ తెల్లవారే కుమార్తె వద్దకు రావాలని అనుకున్నా రాలేక పోయింది. ఈలోపునే సింధూజ సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రత్నాదేవి సోమవారం ఉదయం వచ్చే సరికి ఆమె విగతజీవిగా కనిపించింది. తమ అల్లుడి ఆరోగ్యం విషయంలో మనస్తాపానికి గురైన తన కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
ఊయలే ఉరితాడై..
ప్రకాశం, అద్దంకి: అప్పటి వరకు ఊయలలో ఊగుతూ చిన్నారి కేరింతలు కొట్టింది. కిలకిలా నవ్వింది. అంతలోనే ఆ ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడుగా మారింది. ఊయలగా చేసిన చీర మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాజీవ్ కాలనీలో సోమవారం జిరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీలో రాజు కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి లక్ష్మీ ప్రసన్న (9) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో బాలిక తండ్రి రెండు నెలల క్రితం, తల్లి 9 నెలల క్రితం మృతి చెందారు. చిన్నారి అత్త వద్దే ఉంటోంది. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకు చీరను ఊయలగా వేసుకుని బాలిక ఊగుతోంది. ఊయల గిరగిరా గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. కొద్దిసేపటికి చీర పైనుంచి మెలికలు పడటం మొదలు పెట్టింది. చిన్నారి కిందకు జారిన సమయంలో చీర మెడకు చుట్టుకుని బిగుసుకోవడంతో ఊపిరి ఆడక మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతిపై పలు అనుమానాలు చిన్నారి తల్లిదండ్రులు ఇదివరకే మరణించడంతో బాలిక పేరుతో ఉన్న ఆస్తి కోసం బంధువులెవరైనా హత్య చేసి ఊయల ఊగుతూ మృతి చెందిందనే కథ అల్లి ఉండొచ్చనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగా మృతి చెందింది పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉంది. బాలిక మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాపం పసివాళ్లు
పహాడీషరీఫ్: ఎనిమిదేళ్ల క్రితమే అమ్మా నాన్నలను కోల్పోయి బాబాయి వద్ద పెరుగుతున్న ఓ బాలుడి జీవితంతో విధి మరోసారి ఆడుకుంది. ఇంట్లో తాడుతో ఆడుకుంటుండగా తాడు మెడకు చుట్టుకొని ఉరి పడటంతో బాలుడు మృతి చెందిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ గ్రామానికి చెందిన కె.లోకేష్(11)కు తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నాన్న ప్రభాకర్, చిన్నమ్మ హరిత వద్ద ఉంటూ స్థానిక లార్డ్స్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతను తన చిన్నాన్న కుమారుడితో కలిసి తాడుతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుంది. కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన అతడి చిన్నమ్మ హరిత దీనిని గుర్తించి స్థానికుల సహాయంతో లోకేష్ను బాలాపూర్లోని ఓం సాయి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచనమేరకు డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వారు నిలోఫర్కు రెఫర్ చేశారు. దీంతో అతడిని నిలోఫర్కు తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి లోకేష్(11) తల్లిదండ్రులు శ్రీనివాస్, లావణ్య ఎనిమిదేళ్ల క్రితమే మృతి చెందారు. 2011లో కుటుంబ కలహాల కారణంగా అతడి తల్లి లావణ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలను ఆర్పే క్రమంలో భర్తకు కూడా అంటుకోవడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి వారి బాబాయి ప్రభాకర్ చిన్నారులను పెంచుకుంటున్నాడు. కాగా ఈ నెల 10న లోకేష్ మరో బాబాయి పెళ్లి జరుగనుంది. ఈ తరుణంలో లోకేష్ మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనంపై నుంచి పడి బాలుడి దుర్మరణం యాకుత్పురా: ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకత్తా ప్రాంతానికి చెందిన కరీముల్లా ఘాజీ, హీనా ఘాజీలు దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మీరాలంమండిలో ఉంటూ బుర్ఖాల దుకాణంలో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి అతడి కుమారుడు అర్షద్(3) చిన్నారులతో కలిసి భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డా డు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రికి త రలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మీర్చౌక్ పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తాళి కట్టాకే ఆత్మహత్య ?
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని, మృతి చెందారు. ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. లంపకలోవ గ్రామానికి చెందిన మాసా ఏసుబాబు, రాణి దంపతుల కుమార్తె నవ్య (17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం దూర ప్రాంతంలో ఇటుకబట్టీలో పనిచేస్తున్నారు. నవ్య తన నాయనమ్మ మాసా ముసలమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కింతాడ అంజిబాబు (21) పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అంజిబాబు, నవ్యలు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అంజిబాబు తల్లిదండ్రులు రాంబాబు, నూకాలమ్మలు అంజిబాబు, నవ్యలకు వివాహం చేయాలని నవ్య తల్లిదండ్రులను కోరారు. కానీ బంధువుల అబ్బాయితో తమ కుమార్తెకు వివాహం చేస్తామంటూ ఏసుబాబు, రాణిలు తిరస్కరించారు. పెద్దలు తమ వివాహానికి అంగీకరించకపోవడంతో నవ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి పాలడ్డారు. మాసా ముసలమ్మ ఇంటికి వచ్చి తలుపు తీసి చూడగా నవ్య మృతదేహం కిందన, దూలానికి వేలాడుతూ అంజిబాబు ఉండడంతో కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎం అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇరుగు పొరుగుతో సఖ్యతతో ఉండే అంజిబాబు, నవ్యలు మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవ్య నాయనమ్మ ముసలమ్మను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పిల్లను చేతిలో పెట్టి బతుకు దెరువు కోసం దూరప్రాంతాని వెళ్లిన తన కొడుకు, కోడలికి ఏమి చెప్పాలంటూ బోరున విలపిస్తోంది. ఇక కింతాడ రాంబాబు, నూకాలమ్మ దంపతుల మూడో సంతానమైన అంజిబాబు ఎలక్ట్రికల్, పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు మృతిని వారు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం వరకు కళ్లముందు ఉన్న కొడుకు విగతజీవుడుగా మారడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాళి కట్టాకే ఆత్మహత్య ? మాసా నవ్య మెడలో పసుపుతాడు ఉండడంతో ఆత్మహత్యకు ముందే ఆ గదిలో వివాహం చేసుకున్నారా? అనే అనుమానం కలుగుతోంది. వారిద్దరి వివాహానికి నవ్య తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోగలిగామనే సంతృప్తితోనే ఆఖరి క్షణంలో వివాహం చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే. -
బోధ్ గయను సందర్శించడానికి వచ్చి..
పాట్నా : బౌద్దుల పవిత్ర పుణ్యక్షేత్రం బోధ్ గయాను దర్శించడానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాలు.. సిడ్నికి చెందిన హీత్ అల్లాన్ అనే వ్యక్తి బోధ్ గయను దర్శింకుందామని బిహార్ వచ్చాడు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం అడవికి వెళ్లిన స్థానికులకు ఉరేసుకుని మరణించిన హీత్ కనిపించాడు. వెంటనే వాళ్లు ఈ విషయం గురించి పోలీస్లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హీత్ బ్యాగ్, డైరీ, వాటర్ బాటిల్తో పాటు ఓ సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో హీత్ తన సోదరి ఫోన్ నంబర్ రాసి.. ఈ విషయం గురించి ఆమెకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
ఉరి తద్దినం
కథాసారం బాతుల వేటకు బయల్దేరాడు కెప్టెన్ వర్మ. డబుల్ బేరల్ షాట్గన్ భుజానికి తగిలించుకుని హంటింగ్ సూట్లో బంగళా మెట్లు దిగాడు. వెంట పెంపుడు కుక్క సీజర్. తంపర వైపు నడుస్తున్నాడు. చుట్టూ చీకటి. చలి మంచు. పొల్లాల్లో నక్కల మంద ఊళ. క్రాంక్... క్రాంక్... ఆకాశంలో బాతుల మంద. అదే చీకట్లో, అదే తంపర వైపు పిట్టల వేటకు బయల్దేరాడు డిబిరిగాడు. వయసు అరవై దాటింది. గోచీ తప్ప మరేమీ లేదు. చేతిలో నాటు తుపాకి. భుజానికి పాత మురికి సంచి. అందులో ముసలి పెంపుడు కొంగ. సంచీలోంచి నాటుసారా తీసి డగ్డగ్మని గుటకేశాడు. బీడీ వెలిగించాడు. తంపర ఒడ్డున మొగలి డొంకలో కూర్చున్న వర్మకు దూరంగా ఏదో దీపం కదులుతున్నట్టనిపించింది. అప్పుడే బాతుల మంద నీటి మీద వాలడానికి చక్కర్లు కొడుతోంది. చీకట్లో రెండు మెరుపులు ధన్ ధన్. తుపాకి నిప్పులు కక్కింది. ధప్ ధప్ మని మంటిముద్దల్లా చచ్చిన బాతులు. వాటిని నోట కరుచుకుని ఒడ్డుకు తెచ్చింది సీజర్. రిలాక్సింగ్గా సిగరెట్ వెలిగించి ముందుకు నడిచాడు వర్మ. దూరంగా డిబిరిగాడు చలి కాగుతున్నాడు. ‘దండాలు దొరా’. ‘నీది ఏ ఊరు?’ ‘నక్కలోణ్ణి’ ‘ఏ ఊరు?’ ‘ఎక్కడుంటే అదే మా ఊరు’ ‘ఈ రాత్రప్పుడు ఏం చేస్తున్నావు?’ ‘ఏటకి వచ్చాను’ చెప్పాడు డిబిరి. దీపం ఎలుతుర్లో ఏట. బుర్ర మీద లాంతరుంటుంది. మనిషి నీళ్లల్లో ఉంటాడు. లాంతరు లైటుకి పిట్టలు ఎగిరొచ్చి వాల్తాయి. వాలగానే గబుక్కున లాగేయాలి. పక్క పిట్ట కూడా పోల్చుకోకూడదు. చిన్నప్పుడు వాళ్ల బాబు దగ్గర నేర్చుకున్నాడు. ‘పిట్టలు దొరికాయా?’ ‘రెండు మూడు దీపం ఎలుతుర్లో చెక్కర్లు కొట్టాయి. నువ్వు దూరంగా తుపాకి పేల్చావు. ఆ శబ్దానికి పారిపోయాయి. మరి దిగవు’. అర్థం కాకుండా నవ్వాడు డిబిరి. నీ ఏటతో నా ఏటకి దెబ్బకొట్టేశావనే నిస్పృహ. వర్మ మనసు చివుక్కుమంది. నాటుసారా తీసి గడగడా తాగేశాడు డిబిరి. ఎర్రటి కళ్లు. లస్క్ ఠపక్ లస్క్ ఠపక్. మందు ఎక్కువైందనుకున్నాడు వర్మ. దూరంగా పెంపుడు కొంగ సైతాన్ పట్టినట్టు దగ్గింది. వెళ్లి వలను తెచ్చాడు. డిబిరి సంచీ పక్కనే నాటు తుపాకి. దాన్ని చేతిలోకి తీసుకుంటూ సిగరెట్ ఇచ్చాడు వర్మ. ‘సారూ అది మర్డరీ తుపాకి’. వర్మకు షాక్ కొట్టినట్లయింది. వెనక్కిచ్చేశాడు. ‘ఈ కొంగను పెంచుతున్నావా?’ ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలంటే ఆ జాతి పిట్టను మచ్చిక చేసుకోవాలి. వల మీద దీన్ని ఉంచాలి. దీన్ని చూసి అక్కడ కూడా మేతుందని నత్తగొట్లు వాలి చిక్కడిపోతాయి. కానీ దీనియమ్మ దీని అరుపులకే అవి దిగకుండా పారిపోతున్నాయని ఒక్క బాదు బాదాడు డిబిరి. అది కేర్మంది. ‘ఇది ఎగిరిపోదా?’ దానికి చూపులేదు. కంటిరెప్పల్ని దారంతో కుట్టేశాడు. దాని మందను చూసిందా ఎగిరిపోతుంది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం ఈ వేటలో తమాషా. డిబిరిగాడి హంటింగ్ టాక్టిక్స్కు అబ్బురపడ్డాడు వర్మ. ‘నత్తగొట్లు రాత్రిళ్లు రావుకదా? రాత్రి వలేశావు?’ ‘గానీ సారూ తుంగ గుబుర్లలో గూళ్లు కట్టుకున్న కొండకోళ్లు, దాసరి కోళ్లు చీకట్లో కానుకోలేక వలలో చిక్కడిపోతాయి. పరదలు కూడా ఈ అరుపుకి అప్పుడప్పుడు దిగిపోతాయి. గానీ దొరా ఇందాక నువ్వు పరదల మందని బెదరగొట్టేశావు’. ‘నేనా?’ ‘నువ్వు అరప దిగి అగ్గిపుల్ల గీసి సిగరెట్టు ఎలిగించలేదూ?’ అగ్గిపుల్ల వెలుగులో వర్మ తుపాకి గొట్టాలు జిగేల్మన్నాయి. ఆ మెరుపుకి దిగబోతున్న పరదల మంద బెదిరి వెనక్కి తిరిగింది. ‘ఇది మర్డర్ తుపాకీ అన్నావుకదా ఇందాక... మర్డర్ చేశావా?’ గారబట్టిన పళ్లతో గుసగుస నవ్వాడు డిబిరి. ‘నేను కాదు నా బాబు. ఈ తుపాకీతో ఒకే దెబ్బకి ఒకణ్ణి ఖూనీ చేశాడు’. డిబిరి పెదాలు ఆవేశంగా కదులుతున్నాయి. చూపులు గతాన్ని చూస్తున్నాయి. ‘సాలాకాలం క్రిందట... అప్పుడు తెల్లదొరలుండేవోళ్లు. నేను చిన్నోడ్ని. ఒకరోజు ఏటకెళ్లిన మా బాబు చీకటి పడ్డా ఇంటికి రాలేదు. ఇంతలో పక్కనున్న మావోడు వచ్చి, ‘ఏట్రా డిబిరిగా! నీ బాబుని నిన్నటినుంచి పోలీస్ స్టేషన్లో కుళ్లబొడిచేస్తున్నారు’ అన్నాడు. ‘ఎందుకూ?’ ‘దొంగతనం చేశాడట. షావుకారి ఇంట్లో బంగారం పోయిందట’. కంగారెత్తిపోయి పరుగెత్తాడు. బాబును రెండు చేతులూ చాచి కట్టేసి దూలానికి వేలాడదీశారు. కాళ్లు కట్టేసున్నాయి. గోచీ తప్ప వంటి మీద గుడ్డ లేదు. దబ్ ఫట్... వంటì æనిండా లాఠీ దెబ్బలు. చర్మం చిట్లి రక్తం ముద్ద కట్టేసింది. గావుకేకలు. కాళ్లు తన్నుకోలేక గింజుకుంటున్నాడు. ‘చెప్పరా బంగారం ఎక్కడ దాచావో’ కొడుకును కొడితేనన్నా చెబుతాడేమోనని పసివాడి బుర్రను గోడకేసి కొట్టారు. బాబోయ్ అమ్మోయ్... దెబ్బకి రాత్రి తిన్నది కక్కుకున్నాడు. ‘ఆడ్ని ఒదిలెయ్యండి. నేను నిజం చెబుతాను’. పోలీసులు నవ్వుకున్నారు. బంగారం దాచిన చోటు తెల్లారి చూపాలని ఆదేశిస్తూ, ఒక పోలీసును వెంట పంపారు. వెళ్లాక, ‘బాబూ, నువ్వు దొంగతనం చేశావా?’ అడిగాడు డిబిరి. జుట్టు నిమిరి, కొడుకును పడుకొమ్మన్నాడు. తెల్లారి తుపాకీ అందుకున్నాడు. మెరుపు వేగంతో థూమ్. పోలీసు ఎగిరిపడ్డాడు. ‘దొరా! నిన్న నేను దొంగతనం చేశానని ఒప్పించారే అది పచ్చి అబద్ధం. నేను దొంగతనం చేయలేదు. ఖూనీ చేశాను’. పోలీస్ ఇన్స్పెక్టర్ ముందు లొంగిపోయాడు. జైలుకి తీసుకెళ్లిపోయారు. పిల్లాడినే కోర్టులో సాక్షిగా వేశారు. నిజం చెప్పాలని బెదిరించారు. అబద్ధం మాత్రం ఎందుకు ఆడతాడు? ‘బాగా ఏట చెయ్యి బాగా తిను’ అని చెప్పాడు తండ్రి డిబిరికి. అప్పుడే దెబ్బలకు తట్టుకోగలవన్నాడు. మనవి దెబ్బలు తినే బతుకులన్నాడు. తర్వాత అతడిని ఇంకేదో పెద్ద జైలుకు మార్చారు. చాలా రోజులైంది. ఒకరోజు డిబిరి ఉడుము మాంసం వంతులేసి అమ్ముతున్నాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి, ‘ఓరీ ఇక్కడున్నావట్రా. నీ చెట్టు దగ్గర చూశాను. రేపు పొద్దుట నీ బాబుకు సెంట్రల్ జైలులో ఉరి తీస్తారట. కావాలంటే వెళ్లి చూసుకో’ అన్నాడు. ఉరి... ఒళ్లు గజగజలాడిపోయింది. పెద జైలు చాలా దూరం. ఎలా వెళ్లాలో తెలీదు. ఉడుం మాంసం అమ్మిన పైసలు చాలవు. దాంతో అడుక్కున్నాడు. చేతులు చాచి. మా బాబుకు ఇలాగైందని చెప్పి. ఖూనీకోరు కొడుకని ఎగతాళి చేశారు. ఇక పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఎండకీ, ఆకలికీ ఓర్చుకుంటూ, చీకటినీ, వర్షాన్నీ లెక్కచేయకుండా... ఉరుకు పరుగు నడక ఆయాసం ఆకలి... వచ్చిందా? ఇంకాదూరం. మళ్లీ నడక. పరుగు. అదిగో జైలు. ‘ఏం కావాల్రా గుంట నాకొడకా’ విసుక్కున్నాడు వార్డెన్. ‘నా బాబుకి ఈ రోజు ఉరిసిచ్చని కబురెట్టారు’ వార్డెన్ వాడి కళ్లలోకి చూశాడు. ఇంత ఆలస్యమైందేంటి? తెల్లవారుజామునే ఉరి తీసేశారు! సచ్చిపోయాడా? నా బాబు సచ్చిపోయాడా? ఒళ్లు గజగజ వణికింది. వార్డెన్ విస్తరాకులో రెండు జొన్నరొట్టెలు ఇచ్చి తినమన్నాడు. వాళ్ల బాబు చివరి కోరిక ఈ జొన్నరొట్టెలు. ఉరితీసేముందు, ‘బాబూ నా కొడుకు ఇంకా రాలేదూ? రాలేదుగానీ వస్తాడు. రాత్రంతా కడుపు నకనకలాడిపోతూ పరుగెత్తుకుంటూ వస్తాడు. వాడికియ్యండి బాబూ’ అన్నాడు. బాబు శవాన్ని పాతిపెట్టిన చోటే కూర్చుని ఆ రొట్టెలు తిన్నాడు డిబిరి. ∙∙ గతం పూర్తయ్యేసరికి తూర్పు ఆకాశం మీద వెలుగు. నత్తగొట్టు ఇక వేటకు పనికిరాదని చాకుతో మెడ సఫా చేశాడు డిబిరి. పెంచుకున్న కొంగను చంపడం వర్మకు పాపం అనిపించింది. అమానవీయం. తుపాకీతో కాల్చడానికీ చాకుతో కోయడానికీ మధ్య తేడా ఏమిటన్నాడు డిబిరి. కోడిని పెంచి కోసుకుని తినవా సారూ? ‘ఈరోజు నేను దీనినే తిని పొట్టనింపుకోవాలా! లేదంటే ఆకలితో సవ్వాలా!’ ఏది పాపం? భుజానికి సంచీ తగిలించుకున్నాడు డిబిరి. అప్పటికే వర్షం మొదలవుతోంది. అలాగే నిల్చుండిపోయాడు వర్మ. అల్లం శేషగిరిరావు -
ఇద్దరు రైతుల ప్రాణం తీసిన అప్పు
నర్సింహులపేట: అప్పుల బాధ ఇద్దరు రైతుల ప్రాణం తీసింది. పంట దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు పేరుకుపోవడంతో తీర్చే మార్గం లేక మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు జగ్యాతండాకు చెందిన కౌలు రైతు భూక్య హెమోజీ(48) గత రెండు సంవత్సరాలుగా నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పంట దిగుబడి లేక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు చేశాడు. అలాగే ఆరు నెలల క్రితం తన కుమారుడు వాసు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందాడు. అతడికి ఆస్పత్రిలో చికిత్స కోసం కూడా తెలిసినవారినల్లా డబ్బులు అడిగాడు. దీంతో అతడికి రూ.4 లక్షల మేర అప్పులయ్యాయి. ప్రస్తుతం ఎకరం భూమిలో టమాట సాగు చేశాడు. మంగళవారం సాయంత్రం తొర్రూరు సంతకు వెళ్లి టమాటాలు విక్రయించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. లక్షలాది రూపాయల అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన అతడు బుధవారం వ్యవసాయ భూమిలో వేపచెట్టుకు ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతరు ఉన్నారు. ఎస్సై నగేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మల్లెంపల్లిలో.. మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం పరిధిలోని మల్లెంపల్లికి చెందిన జింకల రవి(42) తనకున్న ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు మిర్చి, రెండు ఎకరాలు పత్తి సాగు చేశాడు. గత నాలుగేళ్లుగా పండించిన పంటలకు పెట్టుబడి పెరగడంతోపాటు దిగుబడి సక్రమంగా రాకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన రవి మంగళవారం సాయత్రం తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య వినోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థి ఆత్మహత్య
పత్తికొండటౌన్: స్థానిక నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న మంగలి నాగేష్, నాగమ్మ దంపతుల కుమారుడు ఎం.ఉరుకుందు(12) కడుపునొప్పి తాళలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు.. నాగేష్, నాగమ్మ దంపతులకు కుమార్తె, ఒక కుమారుడు కాగా కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు స్థానిక సెయింట్జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 7వతరగతి చదువుతున్నాడు. ఉరుకుందు ఉదయం స్కూల్కు వెళ్లమని చెప్పి, తండ్రి సెలూన్ షాపుకు వెళ్లగా, తల్లి కూలీ పనులకు వెళ్లింది. తల్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో చుట్టు పక్కల వారి సహాయంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి సొమ్మసిల్లింది. కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాఠశాల మదర్ అన్నాగ్రేస్, హెచ్ఎం సిస్టర్ అనూఫా, ఉపాధ్యాయులు, విద్యార్థులు మృతికి సంతాపం తెలిపి తల్లిదండ్రులను పరామర్శించారు. ఎస్ఐ బి.మధుసూదన్రావు మృతిపై విచారణ జరిపారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ వివరించారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
వెల్దుర్తి(కృష్ణగిరి) : రత్నపల్లెలో బుధవారం తెల్లవారుజామున వెంకటలక్ష్మి(16) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద వెంకటపుల్లయ్య, మద్దమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు వివాహం కాగా 3వ కుమార్తె అయిన వెంకటలక్ష్మి తల్లితో కలిసి కూలీ పనులకెళ్లేది. అయితే తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడమేకాక తరచూ తల్లిని దూషించేవాడు. తన తల్లిని తిట్టొద్దంటూ పలుమార్లు తండ్రిని కోరింది. అయినా తండ్రి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈక్రమంలో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి అందరూ నిద్రిస్తున్న సమయంలో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ–2 నాగేష్ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
పాణ్యం : స్థానిక ఎస్సార్బీసీ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి కుమారుడు బాల తిరుపతయ్య (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ చిరంజీవి వివరాల మేరకు మృతుడికి పదిహేను రోజులుగా మానసిక స్థితి సరిగా లేదు. పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. గాలి సోకిందేమోనన్న ఉద్దేశ్యంతో అంత్రాలు కూడా వేయించారు. అయినా నయం కాలేదు. రాత్రుళ్లు నిద్రపోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుండేవాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. తెల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉరివేసుకొని విద్యార్థి మృతి
ఆలూరు రూరల్: పెద్దహోతూరు గ్రామానికి చెందిన హోతూరప్ప, హనుమంతమ్మల మూడో కుమారుడు నరసింహ(14) అనే విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంపనులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన తల్లి హనుమంతమ్మ ఇంటిలో ఉరివేసుకున్న కుమారుడిని చూసి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. వారు హుటాహుటిన ఉరితాడు నుంచి విద్యార్థి నరసింహను కిందకు దించారు. బతికి ఉన్నాడన్న నమ్మకంతో చికిత్సల కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆలూరు వైద్యసిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎస్ఐ ధనుంజయ, పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి నరసింహ మృతిపై విచారణ చేపట్టారు. నరసింహ ఆలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. కడుపునొప్పి తీవ్ర కావడంతోనే తమ కుమారుడు ఉరివేసుకొని మృతిచెందినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. -
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
పాములపాడు: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక బాలగారి విజేయుడు(46) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన పాములపాడులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దూరు గ్రామానికి చెందిన విజేయుడు 15 సంవత్సరాల క్రితం పాములపాడుకు వచ్చి స్థిరపడ్డాడు. ఎస్సీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటి కోసం రూ.1.50లక్షలు అప్పు చేశాడు. అప్పుల బాధతో తాగుడుకు బానిసయ్యాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై ఈనెల 9న అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో మృతుని భార్య ఆశీర్వాదమ్మ పొదుపు డబ్బులు చెల్లించేందుకు వెళ్లింది. సమావేశం ముగించుకొని ఆమె ఇంటికి వచ్చే సరికి భర్త మృతదేహం ఫ్యాన్కు వ్రేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టు ప్రక్కల వారు వచ్చి వ్యక్తిని కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్దామని ప్రయత్నించారు. అయితే అప్పటికే మృతిచెంది ఉండటాన్ని గమనించి ఏమి చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఆశీర్వాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. -
‘ఉరి’ తీసేస్తారా?
నిర్భయ రేప్ కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012 డిసెంబరులో ఈ హత్యాచారం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వీరికి ‘ఉరే’ సరి అని తేల్చిచెప్పాయి. ఈ ప్రక్రియకు నాలుగున్నరేళ్ల సమయం పట్టింది. దోషులు ముకేశ్, అక్షయ్, పవన్, వినయ్లను ఇక ఉరి తీసేస్తారా? అంటే అప్పుడే తీయలేరు. వీరికి మరో మూడు అవకాశాలున్నాయి. అత్యంత హేయమైన నేరానికి ఒడిగట్టిన వీరికి ఈ మూడుచోట్ల కూడా చుక్కెదురైతేనే ఉరి కంబం ఎక్కుతారు. వీరి ముందున్న మార్గాలేమిటో చూద్దాం... రివ్యూ పిటిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష (రివ్యూ) కోరవచ్చు. తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. విచారణలో ఏదైనా లోపం జరిగిందని స్పష్టంగా కనపడుతుంటే తప్ప నిర్భయ లాంటి కేసుల్లో రివ్యూ పిటిషన్ను అనుమతించకూడదని సుప్రీంకోర్టు రూల్స్ చెబుతున్నాయి. రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు ఈ కేసును విచారించిన న్యాయమూర్తుల (రిటైరయితే తప్పితే) ముందుకే రివ్యూ పిటిషన్ కూడా వెళుతుంది. వారు తమ చాంబర్లో కూర్చొని రివ్యూ పిటిషన్ను అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. దోషుల తరఫున న్యాయవాది వాదనకు ఆస్కారం ఉండదు. రివ్యూ పిటిషన్ వేస్తామని శుక్రవారం తీర్పు వెలువడ్డాక దోషుల తరఫున న్యాయవాదులు తెలిపారు. క్యూరేటివ్ పిటిషన్ భారత రాజ్యాంగంలో క్యూరేటివ్ పిటిషన్ ప్రస్తావన లేదు. న్యాయప్రక్రియలో లోపాలకు ఆస్కారమివ్వకూడదనే ఉద్దేశంతో 2002లో సుప్రీంకోర్టు ‘క్యూరేటివ్ పిటిషన్’ను పరిచయం చేసింది. విధివిధానాలకు రూపొందించింది. 1. రివ్యూ పిటిషన్ కొట్టివేశాక మాత్రమే క్యూరేటివ్ పిటిషన్కు ఆస్కారం ఉంటుంది. ఎన్ని రోజుల్లో అనేది నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. 2. కోర్టు తీర్పు సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్ ససాక్ష్యంగా ఎత్తిచూపినపుడు మాత్రమే... క్యూరేటివ్ పిటిషన్ను అనుమతిస్తారు. 3, సహజ న్యాయసూత్రాలకు భంగం వాటిల్లిందని ఒక సీనియర్ న్యాయవాది ధృవీకరించాలి. క్యూరేటివ్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను విశదీకరించాలి. 4. క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టులోని ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జిల (ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ముగ్గురిలో ఉండాలని నియమమేమీ లేదు) ముందుంచుతారు. తర్వాత తుదితీర్పునిచ్చిన జడ్జిల ముందుంచుతారు. విచారించాల్సిన అవసరముందని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడితే... క్యూరేటివ్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారు. లేదా తిరస్కరణకు గురవుతుంది. క్షమాభిక్ష పిటిషన్ న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు... దోషులు భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ను పెట్టుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు. మరణశిక్షను యావజ్జీవంగా మార్చవచ్చు. ఈ పిటిషన్లపై మంత్రివర్గం సలహామేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. హోంశాఖ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారు. క్షమాభిక్ష పిటిషన్ను ఎంతకాలంలో పరిష్కరించాలనే విషయంలో గడువు ఏమీలేదు. ఫలితంగా ఏళ్లకు ఏళ్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరిగిందనే కారణంతో మరణశిక్షను జీవితఖైదుగా కోర్టులు మార్చిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఉరి’తీతలో రాజకీయం హోంశాఖ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయానికి వస్తున్నారు. దీని కారణంగా రాజకీయ జోక్యానికి ఆస్కారం ఏర్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ నిర్ణయమైనా తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఇందుకు ఆఫ్జల్ గురు ఉరి అమలు మంచి ఉదాహరణ. భారత పార్లమెంటుపై 2001 డిసెంబరు 13న దాడి జరిగింది. ఎనిమిది మంది రక్షణ సిబ్బంది, ఒక తోటమాలి చనిపోయారు. ఈ దాడికి కుట్ర చేశారనే అభియోగంపై అఫ్జల్ గురుపై కేసు పెట్టారు. 2005 ఆగష్టు 4న సుప్రీంకోర్టు ఆఫ్జల్ గురుకు మరణశిక్షను ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్నూ తొసిపుచ్చింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం... మైనారిటీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని అమలుపై నాన్చివేత ధోరణిని అవలంభించింది. చివరకు దేశ భధ్రత విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వచ్చినపుడు... ఒత్తిడికి లోనై చివరకు ఫిబ్రవరి 9, 2013న గోప్యంగా ఉరితీసింది. భారత ప్రజాస్వామ్యానికి, సార్వభౌమాధికారానికి ప్రతిబింబమైన పార్లమెంటు భవనంపై దాడికి కుట్ర పన్నారని న్యాయస్థానాలు తేల్చి... మరణశిక్ష విధించిన వ్యక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైఖరి కారణంగా, క్షమాభిక్ష పిటిసన్పై నిర్ణయం వెలువడక ఏడున్నరేళ్లు ప్రాణాలతో ఉన్నాడు. ఇప్పుడు నిర్భయ దోషుల విషయంలోనూ ‘రాజకీయ మైలేజీ’ ప్రధానపాత్ర వహించొచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తల్లిదండ్రుల్లారా క్షమించండి!
- సూసైడ్ నోట్ రాసి ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య కర్నూలు: ‘‘ తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయాను.. రెండు సబ్జెక్టులు తప్పిపోయాను.. జీవితంలో ఏమి సాధించలేక పోయాను.. తల్లిదండ్రుల్లారా క్షేమించండి’’ అంటూ సూసైడ్ నోట్ను జేబులో పెట్టుకొని ఆదివారం ఉదయం ఎంటెక్ విద్యార్థి కార్తీక్ కుమార్ (22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్తీక్ కుమార్ తండ్రి మల్లికార్జున కడపలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. రెండో భార్య మంగమ్మ లక్ష్మినగర్లో నివాసం ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పని చేస్తున్నారు. కార్తీక్ కుమార్ పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతూ.. తల్లి దగ్గరే ఉంటున్నాడు. తండ్రి మల్లికార్జున కడప నుంచి వారానికోసారి వచ్చి పోతుంటారు. చదువులో కొద్దిగా వెనుకబడటమే కాకుండా రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో అవమాన భారంతో సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని ఇంట్లోననే ఫ్యాన్ కొక్కికి తాడుతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి గమనించి కేకలు వేసేలోగా ఇరుగు, పొరుగు వారు గుమికూడారు. తలుపులు బద్దలు కొట్టి ఉరి నుంచి కార్తీక్ కుమార్ను తప్పించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మూడో పట్టణ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ ఆకె రవికృష్ణ తలపెట్టిన నేత్రదాన కార్యక్రమాన్ని గురించి ఎస్ఐ మల్లికార్జున కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అతని కళ్లను ఐ బ్యాంకుకు దానం చేశారు. -
యువకుడి బలవన్మరణం
- వివాహం ఇష్టం లేక ఆత్మహత్య - రోళ్లపాడులో ఘటన మిడుతూరు: రోళ్లపాడు ఏకేఆర్ క్యాంపులో అసిస్టెంట్ మెకానిక్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు బుధవారం.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన దూదేకుల బాలస్వామి(22) రోళ్లపాడు ఏకేఆర్క్యాంపులో అసిస్టెంట్ మెకానిక్గా పద్దెనిమిది నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం అక్క కుమార్తె రమిజాబీతో వివాహమైంది. పెళ్లి ఇష్టం లేదని లేఖ రాసి రాత్రి సమయంలో నాల్గో షెడ్లో తన చొక్కాతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టర్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామన్నారు. మృతుడి అన్న పెద్ద మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉరివేసుకొని వ్యక్తి మృతి
కొత్తపల్లి: మండలంలోని శివపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ల చెన్నయ్య(42)అనే వ్యక్తి కడుపునొíప్పి తాళలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు..చెన్నయ్య ఏడాది నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నా బాగుకాలేదు. దీంతో జీవితంపై విరక్తిచెంది ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ ఏసన్న తెలిపారు. -
యువతి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు నగరం సోమిశెట్టి నగర్లో నివాసం ఉంటున్న జంబులయ్య కూతురు బోయ యామిని (29) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జంబులయ్య లైబ్రరీయన్గా పని చేస్తూ పదవీవిరమణ పొందాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కూతురు యామిని ఎమ్మెస్సీ, బీఈడీ, ఎంఏ ఇంగ్లీష్ వరకు చదువకుంది. నగరంలోని గుడ్షెప్పర్డ్ స్కూలులో టీచర్గా పని చేస్తుంది. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబం«ధాలు చూస్తున్నప్పటికీ కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు నాలుగేళ్లుగా పార్శ్యనొప్పి (మైగ్రేన్)తో బాధపడుతుండేది. గురువారం రాత్రి 9గంటల సమయంలో పార్శ్యనొప్పి తీవ్రం కావడంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకొని స్కిప్పింగ్ తాడుతో ఫ్యాన్కు ఉరి వేసుకొంది.కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు కిటికీలో నుంచి గమనించారు. రోకలి బండతో తలపులను బద్దలుకొట్టి ఆమెను ఉరి నుంచి తప్పించి, ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం కోలుకోలేక చనిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్రావు తెలిపారు. -
అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య
కర్నూలు: వ్యాపారం కోసం చేసిన అప్పులు చెల్లించలేక లక్ష్మినగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణ(35) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఫుట్పాత్పై పాన్ బంకు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం, కుటుంబ అవసరాలకు కర్నూలులో తెలిసిన వారి వద్ద సుమారు రూ.20 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించలేక కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుదారుడు శ్రీనివాసరెడ్డి, అక్బర్, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ తదితరులు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు. పాన్దుకాణాన్ని రామకృష్ణ తన పేరిట రాయించుకున్నాడు. దీంతో వెంకటరమణ కలత చెంది శుక్రవారం మధ్యాహ్నం భార్య రాజేశ్వరిని దుకాణం వద్ద కూర్చోబెట్టి పిల్లలను స్కూలు వద్ద వదిలివస్తానంటూ ఇంటికి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. భర్త దుకాణం వద్దకు ఎంత సేపటికి రాకపోవడంతో రాజేశ్వరి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్క నివాసితులతో కలిసి తలుపులు తెరిచి కిందకు దించగా అతను అప్పటికే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు అప్పు ఇచ్చిన రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, అక్బర్, వెంకటేశ్వరమ్మ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ పట్టణ సీఐ మధుసూదన్రావు తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం. -
యువతి ఆత్మహత్య
కర్నూలు : ఈ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు కూతురు సాయిలక్ష్మి (18) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పంచలింగాల వద్ద ఉన్న టీటీసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. తండ్రి వెంకటేశ్వర్లు ఆల్కాలిస్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కూలీ పనికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బిగించుకుని చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇచ్చిన అప్పు వసూలు కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. నగరంలోని రామచంద్రానగర్లో బి.పద్మావతి, కృష్ణారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. కృష్ణారెడ్డి హౌసింగ్ కార్పొరేషన్లో అటెండర్గా ఆదోనిలో పనిచేస్తున్నాడు. వీరు రామచంద్రానగర్లో 12 ఏళ్ల పాటు ఈశ్వరమ్మ అనే మహిళకు చెందిన ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే ఎక్కువ కాలం ఒక్కరే ఇంట్లో ఉంటే న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయని ఆమె వారిని ఆరు నెలల క్రితం ఇళ్లు ఖాళీ చేయించింది. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వారు ఈశ్వరమ్మ దగ్గర రూ. 24 వేలు అప్పు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ఈశ్వరమ్మ సోమవారం పద్మావతి ఇంటికెళ్లి తీవ్ర ఒత్తిడి చేసింది. తన భర్త రెండు, మూడు రోజుల్లో ఆదోని నుంచి వచ్చిన వెంటనే అప్పు చెల్లిస్తామన్నా వేడుకున్నా గోల చేయడంతో పద్మావతి మనస్తా«పానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బహిరంగంగా విద్యార్థి ఉరితీత
ఘాజి: తమ నిఘా అధికారిని హత్యచేశాడని ఆరోపిస్తూ తాలిబాన్ మిలిటెంట్లు అఫ్గానిస్తాన్లో ఓ విద్యార్థిని బహిరంగంగా ఉరితీశారు. కాబూల్ పాలిటెక్నిక్ వర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫైజుల్ రెహ్మాన్ అనే విద్యార్థి గురువారం కారులో ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మిలిటెంట్లు అతన్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం బహిరంగంగా ఉరితీశారని స్థానిక గవర్నర్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఘాతుకాన్ని అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ నిర్ధరించింది. దుశ్చర్యకు పాల్పడిన వారిని పట్టుకుని, శిక్షించేందుకు విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. 2001 నుంచి తాలిబాన్ మిలిటెంట్లు ఎంతో మందికి బహిరంగ శిక్షలు అమలు చేశారు. అఫ్గానిస్తాన్, విదేశాలకు సమాచారం అందజేసిన వారిని, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని బహిరంగంగా రాళ్లతో, కొరడతాలతో కొట్టడం వంటి శిక్షలు విధించారు. -
వివాహిత ఆత్మహత్య
కర్నూలు : అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (32) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తాటిపాడుకు చెందిన నాగిరెడ్డి, రాధమ్మ దంపతుల కూతురు వెంకటేశ్వరమ్మను గార్గేయపురం గ్రామానికి చెందిన బాబురెడ్డికి ఇచ్చి 16 సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి కూతురు, కుమారుడు సంతానం. కడుపునొప్పితో బాధ పడుతుండటంతో ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేయించి గర్భసంచి తొలగించారు. ఉబ్బసం వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతుండేది. జబ్బు నయం కాదని కలత చెంది ఇంట్లోనే ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించే సరికే చనిపోయింది. తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. -
డీ కోటకొండలో వివాహిత ఆత్మహత్య
ఆస్పరి: మండల పరిధిలోని డీ కోటకొండకు చెందిన వివాహిత సుధ అలియాస్ అరుణ (23) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ వెంకటరమణ వివరాల మేరకు.. ఆదోని మండలం కల్లుబావికి చెందిన సుధను ఏడాదిన్నర్ర క్రితం కోటకొండకు చెందిన వీరేష్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 నెలలు కూతరు అక్షిత ఉంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎనిమిది నెలల వయసుల్లో తల్లి ప్రేమకు దూరమైన చిన్నారని చూసి స్థానికులు కంట తడి పెట్టారు. -
పెళ్లైన రెండు రోజులకే..
సైదాపూర్(కరీంనగర్): నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జగీర్పల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అన్నె రాజు(25)కు శుక్రవారం వివాహం అయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
యువతి ఆత్మహత్య
కోసిగి : మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం మధా్యహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కంబళదిన్నె బోయ అంజినయ్య, మారెమ్మ దంపతుల మూడో కుమార్తె అయిన అనుమంతమ(18)కు మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు.దీనికి తోడు ఆయువతి కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపులు వేసుకుని ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అనుమానంతో చుట్టు పక్కల వారు తలుపులు తెరిచి చూస్తే తాడుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారాన్ని వారు యువతి కుటుంబ సభ్యులకు చేరవేశారు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కోసిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఆసుపత్రిలో ఉరివేసుకుని రోగి ఆత్మహత్య
గుంటూరు మెడికల్: చికిత్స కోసం జ్వరాల ఆసుపత్రిలో చేరిన రోగి బాత్రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగింది. మృతుడి భార్య కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ సుంకరివారితోటకు చెందిన లేళ్ళ రెడ్డియ్య (40) తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో టీబీ వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం స్థానిక అమరావతి రోడ్డులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం చేరాడు. వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం అతనికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. విషయాన్ని రెడ్డియ్యకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని రెడ్డియ్య శనివారం మధ్యాహ్నం భోజనం అనంతరం బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు. అరగంట సేపు గడిచినా భర్త బయటకు రాకపోయేసరికి భార్య సెక్యూరిటీ సిబ్బందికి విషయం తెలియజేసింది. వారు తలుపులు పగులగొట్టగా లుంగీతో బాత్రూమ్ కిటికీకి రెడ్డియ్య ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవినేని సుధీర్బాబు విషయాన్ని పోలీసులకు తెలపగా.. వారు వచ్చి వివరాలు నమోదు చేసుకుని రెడ్డియ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
కొవ్వూరు: పట్టణానికి చెందిన సంగంరెడ్డి అర్జున్కుమార్ (17) అనే యువకుడు శనివారం సా యంత్రం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసుల వేధింపులు కారణమని బంధువులు పోలీసుస్టేషన్ వద్ద రాత్రి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. పురపాలక సంఘం పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అర్జున్ను ఓ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గం టల వరకు విచారణ చేసి విడిచిపెట్టారు. తర్వా త ఇంటికి వచ్చిన అర్జున్ ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. అర్జున్కు ఎలాంటి సంబంధం లేకపోయినా విచారణ పేరుతో కిలా డి శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని భీష్మించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు స్టేషన్కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. తమకు న్యాయం జరిగే వరకూ మునిసిపల్ పారిశుధ్య కార్మికులెవరూ విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుం టున్నానని అర్జున్ సూసైడ్ నోట్ రాశాడు. -
ఓ ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని..
రియో డి జెనిరో: ఎత్తైన కొండ అంచు. మూడొందల అడుగుల కింద సముద్రం. ఆ కొండ అంచునుంచి కేవలం కాళ్ల సహాయంతో తలకిందులుగా వేలాడాడు ఓ వ్యక్తి. ఆ సాహసం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచాల్సిదే. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్లోని రియో డి జెనీరోకు చెందిన 27 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ చేసిన సాహసం ఇప్పుడు అందరిచే ఔరా అనిపిస్తుంది. లుయీజ్ ఫెర్నాండో క్యాండియా రియో డిజెనీరో లోని ఓ కొండ అంచునుంచి వేలాడిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఉంచిన ఫేక్ ఫోటోను స్పూర్తిగా తీసుకొని లుయీజ్ ఈ సాహసం చేయడం విశేషం. తన మిత్రుడి సహాయంతో తాడుతో ముందుగా కొండ అంచుకు చేరుకున్న లూయీజ్.. కాళ్ల సపోర్ట్తోనే వేలాడి ఫోటోలకు పోజిచ్చాడు. అనంతరం మళ్లీ తన మిత్రుడి సహాయంతో కొండపైకి చేరుకున్నట్లు లూయీజ్ తెలిపాడు. అతడి సాహసం, ఫిట్నెస్పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. స్పూర్తినిచ్చిన ఫేక్ ఫోటో -
యువకుడి ఆత్మహత్య
దావులూరు (కంకిపాడు) : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లోని షెడ్డులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని పంట పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మంగళవారం రాత్రి ఆ యువకుడు అక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించుకున్నారు. తాను వేసుకున్న చొక్కాకు, బ్యానర్తో ముడి వేసి షెడ్డులోని ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు బందరు మండలం గరాలదిబ్బకు చెందిన పంతగాని నాగూర్ (32) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద లక్ష్మీ తిరుపతమ్మ, దావులూరు, గౌడ అన్న కార్డు ముక్క దొరికింది. బందరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నల్లగొండ క్రైం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్కతట్ల పద్మ(40), చంద్రయ్య దంపతులు పట్టణంలోని రాక్హిల్స్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఆడపడచు జాల లింగమ్మ,ఆమె భర్త సైదులుతో భూ వివాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం పద్మ భర్త చంద్రయ్యపై బావసైదులు చేయి చేసుకోవడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో మనోవేదనకు గురైన పద్మ భర్త కూలికి వెళ్లిపొగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం ఇవ్వడంతో ఘటన స్తలాన్ని టూటౌన్ పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యక్తి బలవన్మరణం
విజయవాడ (భవానీపురం) : కుటుంబ కలహాలు, భార్య పుట్టింటికి వెళ్లి వేరేగా ఉండడంతో మనస్థాపానికి గరైన మేడిశెట్టి రమేష్ (34) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యాధరపురం హెడ్వాటర్ వర్క్స్ పక్కన యనమదల కుసుమకుమారి (72) నివసిస్తోంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమారుడు మేడిశెట్టి రమేష్ (34)కు కాకినాడ సమీపంలోని పండూరు గ్రామానికి చెందిన దుర్గాదేవితో పదేళ్ల క్రితం వివాహమైంది. పెయింటింగ్ పనులు చేసుకునే రమేష్ ఒక పాప పుట్టే వరకు బాగానే ఉండేవాడు. తరువాత మద్యానికి అలవాటుపడిన అతను తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో భార్య దుర్గాదేవి వేరే వెళ్లిపోయింది. కొన్నాళ్ల తరువాత పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చి కలిపారు. తరువాత ఒక బాబు పుట్టాడు. మళ్లీ గొడవలు వచ్చి రెండేళ్ల క్రితం విడిపోయారు. అయినా రమేష్ భార్య దగ్గరకు వెళితే ఆమె రావద్దని తిరస్కరించేది. రమేష్కు స్థిరత్వం లేకపోవడంతో తల్లి కూడా ఇంటికి రానిచ్చేదికాదు. అమ్మమ్మ వద్దే ఉంటూ.. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం విద్యాధరపురం హెడ్ వాటర్వర్క్స్ పక్కన ఉంటున్న అమ్మమ్మ కుసుమకుమారి వద్దకు వచ్చి ఇక్కడే పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ అమ్మమ్మకూ, తనకూ బయటి నుంచే భోజనం తీసుకువచ్చేవాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రమేష్ భోజనం తీసుకురాలేదు. అమ్మమ్మ అడుగగా ఏం మాట్లాడకుండా రోజూ మాదిరిగానే పక్క ఇంటి డాబాపైన పడుకునేందుకు వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో ఉండే గోవింద్ అనే యువకుడు సినిమాకు వెళ్లి 12.30 గంటల సమయంలో వచ్చాడు. మూత్రవిసర్జనకు ఇంటి పక్కకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేళాడుతున్న రమేష్ను చూసి అందరికీ చెప్పాడు. భవానీపురం ఎస్సై అబ్దుల్ సలాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి రాజేశ్వరి నగరానికి చేరుకోగా, భార్య దుర్గాదేవి రావడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అచ్చం సినిమాల్లో మాదిరిగానే..!
బెర్న్: సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సన్నివేశాలు నిజంగా జరిగితే ఎలా ఉంటుంది. స్విజర్లాండ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం హాలివుడ్ చిత్రాలు.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఇటాలియన్ జాబ్లలోని సన్నివేశాలను తలపించింది. కొండపైన ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొని, అంతటితో ఆగకుండా కిందకు వచ్చి.. ముందు చక్రాలు గాల్లో తేలేలా ఎవరో ఆపినట్లు ఆగింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాక్టర్ను చూసి షాక్ తీన్నారు. ట్రాక్టర్ ఏమాత్రం ముందుకు కదిలినా కింద ఉన్న రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉండటంతో క్రేన్ సహాయంతో జాగ్రత్తగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్టర్ డ్రైవర్ను రక్షించారు. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. -
చెట్టుకు ఉరేసుకొని రైతు ఆత్మహత్య
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామం సమీపంలో ఓ రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని పోలుకూరి ఆంజనేయులు(35)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
గవర్నర్ హంతకుడిని ఉరితీశారు
లాహోర్: పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తాసిర్ను హత్య చేసిన పాకిస్థాన్ పోలీసు కమాండర్ ముంతాజ్ ఖాద్రిని పాక్ పోలీసులు సోమవారం ఉదయం ఉరితీశారు. రావల్పిండి జైలులో అతడిని ఉరి తీసినట్లు అధికారులు చెప్పారు. 2011లో గవర్నర్ సల్మాన్ ను ఆయన ఇంటికి సమీపంలోని ఓ మార్కెట్ వద్ద ముంతాజ్ హత్య చేశాడు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఆయనను చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు అప్పగించగా అది ఉరి శిక్షను విధించింది. దీంతో రావల్పిండిలోని అడియాల జైలులో అతడిని ఉరి తీశారు. 2015లో ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లిన అతడికి క్షమాభిక్ష దొరకలేదు. -
నాన్న.. అమ్మ గొంతు కోసేశాడు!
తొమ్మిదేళ్ల సమీక్షకకు సోమవారం రాత్రి ఓ పిడకలగా మిగిలిపోయింది. కన్నతండ్రే తల్లి గొంతును కోసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటుండగా సమీక్ష నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. తన కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని పోలీసులకు వివరించిన ఆ చిన్నారి.. ఆ సమయంలో తాను మేల్కొని ఉన్నానని, అయితే ఈ విషయం కాలయముడిగా మారిన తండ్రికి తెలిస్తే.. ఎక్కడ తనను కూడా చంపుతాడోనని భయంతో నిద్రపోతున్నట్టు నటించానని తెలిపింది. తూర్పు ముంబైలో హనుమాన్ నగర్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల నితిన్ పంద్కర్ తన భార్య సురేఖ గొంతుకోసి హతమార్చి.. ఆ తర్వాత ఆమె చీరతో సీలింగ్కు ఉరి వేసుకొని చనిపోయాడు. మృతిచెందిన ఈ దంపతులకు కూతురు సమీక్ష, కొడుకు యువరాజ్ (7) ఉన్నారు. భార్య సురేఖకు వివాహేతర సంబంధం ఉందని నితిన్ అనుమానించేవాడని, ఈ విషయంలో భార్యాభర్తలిద్దరికి తరచూ తగదాలు జరిగేవాని సమతా నగర్ పోలీసులు తెలిపారు. ఈ జంటకు 2007లో పెళ్లయిందని, అప్పటి నుంచి ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారని చెప్పారు. సాయి మోటార్ ట్రైనింగ్ స్కూల్ లో నితిన్ డ్రైవింగ్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనను గురించి బాలిక సమీక్ష పోలీసులకు వివరిస్తూ.. 'నేను నిద్రపోయాను. అలికిడి రావడంతో లేచిచూడగా పప్పా (నాన్న) మమ్మీ మీద కూచుని దిండుతో ఆమె మొఖాన్ని అదిమిపట్టాడు. ఆ తర్వాత దిండు తీసి కత్తితో ఆమె గొంతు కోసేశాడు. ఆ తర్వాత అమ్మ చీర గుంజుకొని నాన్న సీలింగ్కు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో నేను చాలా భయపడ్డాను. కనీసం సాయం కోసం అరిచే ధైర్యం కూడా చేయలేదు. నిద్రపోతున్నట్టు నటిస్తూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్న మేల్కొన్న వెంటనే మా ఆంటీ వద్దకు పరిగెత్తి ఈ విషయాన్ని చెప్పాను' అని తెలిపింది. -
'అక్కా.. ఉరి ఎలా వేసుకుంటారో చూపించనా అంటూ..'
ముంబయి: అనుకరణ అస్తిత్వాన్నే కాదు ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. ఆ విషయాన్ని రుజువు చేస్తూ ముంబయిలో ఓ ఘటన చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్లో ఎలా ఉరి వేసుకుంటారో తన సోదరికి చూపిస్తూ ఓ పదకొండేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోగల బీద్ జిల్లాలో షేక్ సాజెద్ షేక్ వాజెద్ అనే విద్యార్థి ఓ ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వెళ్లొచ్చి తన సోదరుడితో కలిసి భోజనం చేశాడు. అనంతరం తన సోదరితో కలిసి టీవీ ముందు కూర్చున్నారు. టీవీ చూస్తూ చూస్తూ మధ్యలో తన సోదరితో మాట్లాడుతూ టీవీ సీరియల్స్ లో ఎలా ఉరివేసుకుంటారో ప్రదర్శనగా చూపించేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగే సమయంలో ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేరు. అలా ఉరి వేసుకుంటున్నట్లుగా నటించిన సాజెద్ మెడకు నిజంగా తాడు బిగుసుకుపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగిన సంఘటనగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఎల్జి నుంచి మడత పెట్టే టీవీలు
-
తొమ్మిది మంది ఉగ్రవాదులకు ఉరి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాకు పాల్పడిన తొమ్మిది మందికి ఊరి శిక్ష ఖరారైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో రావల్పిండిలోని పరేడ్ లేన్ మసీదుపై దాడి జరిపిన ఘటనలో నిందితుడుగా ఉన్న ముహమ్మద్ ఘరి కూడా ఉన్నాడు. అతను తెహ్రిక్-ఇ- తాలిబన్(టీటీపీ)లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. 2009 డిసెంబర్లో జరిగిన ఈ సంఘటనలో మొత్తం 38 మంది మృతి చెందగా 57 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముల్తాన్లోని ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో హస్తం ఉన్న హర్కత్-ఉల్-జీహాద్-ఇ-ఇస్లాంలో కీలక సభ్యుడు అబ్దుల్ ఖుయ్యుంకు కూడా ఉరి శిక్ష పడింది. 2009 డిసెంబర్లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న టీటీపీ సభ్యుడు ఇమ్రాన్, ఆల్ ఖైదా సభ్యుడు అక్సన్ మహబూబ్లకు ఉరి శిక్ష పడింది. సిపాయి-ఇ-సహబాలో సభ్యులుగా ఉన్న అబ్దుల్ రప్ గుజ్జర్, హసిం, సులేమాన్, ఫరూఖీ, ఫరాన్లు లాహోర్లో సాధారణ ప్రజలను చంపిన కేసులో ఉరి శిక్ష పడింది. -
ఉరేసుకుని నవ వధువు బలవన్మరణం
యాకుత్పురా: పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మొఘల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం... లాల్దర్వాజా మోడ్ నాగులచింత ఆర్య మైదాన్ ప్రాంతానికి చెందిన పోలీసు శాఖ మాజీ ఉద్యోగి మోహన్ జాదవ్, శోభ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక అబ్బాయి ఉన్నారు. కాగా చిన్నమ్మాయి జ్యోతిరాణి (24) వివాహం గత నెల 26వ తేదీన అత్తాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణ (26)తో జరిపించారు. ఈ నెల 2న నాగులచింత తల్లిగారింట్లో ఉన్న నవ దంపతులు, బంధువులతో కలిసి బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం సమయంలో జ్యోతిరాణి బట్టలు మార్చుకు వస్తానని గదిలోకి వెళ్లింది. అనంతరం తిరిగి బయటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. దీనిపై అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): సామర్లకోట మండలకేంద్రంలోని స్టేషన్ సెంటర్లో జానకీ మిశ్రా(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జానకి భర్త 6 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న జానకి, మానసిక ఒత్తిడికిలోనై సోమవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు 6 ఏళ్ల పాప ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!
షీనా బోరా తండ్రి సిద్ధార్థ్ దాస్ ముంబై/కోల్కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు సహజీవనం చేశానని దాస్ చెప్పారు. తన కూతురు షీనా హత్య వార్త విని ఎంతో వేదన చెందానన్నారు. షీనాను ఇంద్రాణే హత్య చేసుంటే, ఆమెకు ఉరి శిక్ష విధించాల్సిందేనన్నారు. ఇంద్రాణికి మొదట్నుంచి డబ్బు పట్ల వ్యామోహం ఎక్కువేనని, తన మధ్య తరగతి ఆర్థిక స్థాయి భరించలేకే తనను వదిలి వెళ్లిపోయి ఉండొచ్చన్నారు. కోల్కతాలో సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతూ.. 1989 తరువాత ఇంద్రాణితో సంబంధాలు తెగిపోయాయని, తన కూతురు షీనాతో మాత్రం ఆమె పదోతరగతిలో ఉండగా ఒకసారి మాట్లాడానన్నారు. మీడియా ద్వారానే షీనా హత్య విషయం తెలిసిందని, ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని, దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పారు. పిల్లలను ఇంద్రాణి తల్లిదండ్రులు చూసుకునేవారని, పిల్లల సంరక్షణ బాధ్యతను తనకివ్వడానికి వారు ఒప్పుకోలేదన్నారు. ఇంద్రాణి ఈ హత్య చేశారని నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు నేటి సమాజంలో ఎవరు ఎవర్నైనా హత్య చేయొచ్చన్నారు. కాగా, ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖైల్ బోరాల డీఎన్ఏతో పోల్చి చూసే ఉద్దేశంతో మహారాష్ర్టలోని అడవిలో షీనా బోరా మృతదేహాన్ని తగలబెట్టిన చోట పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజర అవశేషాలను ముంబైలోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు. -
పెద్దాపురంలో మహిళ బలవన్మరణం
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దాపురంలోని సత్తెమ్మ కాలనీకి చెందిన వై. విజయలక్ష్మి (30) భర్త ఇటీవల మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మానసికస్థితి సరిగా ఉండటం లేదు. అయితే ఆదివారం రోజున విజయలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, విజయలక్ష్మికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
కసబ్..అఫ్జల్...మెమన్..
న్యూఢిల్లీ : గత మూడేళ్లలో యాకుబ్ మెమన్ది మూడో ఉరితీత. దేశంలో గడిచిన మూడేళ్ల కాలంలోమూడు ఉరిశిక్షలు అమలు అయ్యాయి. 2008 ముంబై మారణకాండలో సజీవంగా పట్టుబడ్డ కసాయి అజ్మల్ అమీర్ కసబ్ 2012 నవంబరు 12న పుణేలోని యెరవాడ జైలులో ఉరితీశారు. తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. ఆ తర్వాత అతడిని జైలులోనే ఖననం చేశారు. ఇక ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన విషయం తెలిసిందే. కాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004 నుంచి 2015 మధ్యకాలంలో దేశంలోని వివిధ కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణదండన విధించాయి. అయితే వీరిలో వెస్ట్ బెంగాల్ (2004), మహారాష్ట్ర (2012), ఢిల్లీ (2013)కి చెందిన ముగ్గురు మాత్రమే ఉరికంబం ఎక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగష్టు 14న వెస్ట్ బెంగాల్లోని అలిపోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇక 2004 -2014 మధ్య కాలంలో ఎవరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఈ పదేళ్ల కాలంలో 3.751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి. -
జైలుకు బర్త్డే కేక్ పంపించారు
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు. తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది. -
ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం
నాగ్పూర్: ఈ నెల 30న ఉరిశిక్ష అమలు ఖాయమైన నేపథ్యంలో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరిక తీరకుండానే చనిపోనున్నారు. గడిచిన 21 ఏళ్లుగా జైలులోనే ఉన్న ఆయన.. రెండు పీజీ కోర్సులు పూర్తిచేశారు. అరెస్టుకు ముందు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా మెమన్ కు మంచి పేరుండేది. జైలులోనూ తన పఠనాసక్తిని కొనసాగించిన ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు పాస్ అయ్యారు. చనిపోయేలోగా ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకోవాలనుకుంటున్నట్లు మెమన్.. జైలు అధికారులకు చెప్పగా వారు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అయితే ఇప్పటికిప్పుడు పీజీ పట్టాలు ఇవ్వలేమని, దానికి కొంత సమయం పడుతుందని, అదికూడా ఈ నెల 30లోగా పట్టా అందించడం అసాధ్యమని ఇగ్నో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆఖరి కోరిక తీరకుండానే మెమన్ ఉరి కంబం ఎక్కనున్నారు. -
పిట్టకు ఉరి....
విశాఖ : మనిషి తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాడు. తమ మనుగడ కోసం మూగ జీవాలను వాడుకుంటున్న జనాలు... తమకు తెలిసి, ఒక్కోసారి తెలియకుండా వాటి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న హృదయాన్ని కదిలించే దృశ్యం విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం 'సాక్షి' కెమెరా కంటపడింది. వినోదం కోసం ఎవరో ఎగరేసిన గాలిపటం దారం చెట్టు మీద సేద తీరుతున్న పిట్ట మెడకు చుట్టుకుంది. దాన్ని వదిలించుకునే క్రమంలో దారం పిట్ట మెడకు బిగుసుకుపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది. ఎవరో తమ ఆనందం కోసం ఎగరేసిన గాలిపటం ఇలా ఓ పక్షిని బలిగొంది. -
217 మందిని ఉరి తీశారు
బీరుట్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దారుణాలకు అంతూ అదుపు లేకుండా పోయాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో దాదాపు 217 మందిని వారు నిర్థాక్షిణ్యంగా ఉరితీసినట్లు సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అకారణంగా ప్రాణాలుకోల్పోయిన వారిలో అమాయకులైన ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు వివరించింది. మే 16 నుంచి ఈ దమనకాండ సిరియా పురాతన నగరం పాల్మిరాలో ఉగ్రవాదులు సాగించినట్లు పేర్కొంది. ఉరి ద్వారా ప్రాణాలుకోల్పోయినవారిలో సామాన్య పౌరులు, చిన్నారులు కలిసి 67 మంది, 150 మంది ప్రభుత్వ బలగాలు, 12 మంది మహిళలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. -
'అఫ్జల్గురుని అందుకు ఉరితీయలేదు'
ముంబయి: పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్గురుని ఉరితీసింది రాజకీయ ప్రయోజనాలకోసం కాదు అని కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. కోర్టు తీర్పులకనుగుణంగానే తాము నడుచుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకోసమే యూపీఏ ప్రభుత్వం అఫ్జల్ గురుని ఉరితీశారని నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. 'సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానంలో అఫ్జల్ కేసుపై అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. క్షమాభిక్ష కూడా తిరస్కరించబడింది. ఇవన్నీ జరిగిన తర్వాత చివరిగా ఉరితీసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రాజకీయ నిర్ణయం కాదు' అని ఆయన వివరణ ఇచ్చారు. కాశ్మీర్లో రాజకీయాలను పెడద్రోవ పట్టించాలని ఒమర్ ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతుండొచ్చని షిండే చెప్పారు. ఉరి తీసే సమయంలో ఇలాంటి ఆరోపణలేవి ఆయన ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. -
''3వేల మంది ఉగ్రవాదులను ఉరితీయాలి''
-
సురేందర్ కోలీకి రేపే ఉరి?
మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి సోమవారం ఉదయం ఉరి తీసే అవకాశం ఉందని మీరట్ జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉరిశిక్ష విధించాలని సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెప్టెంబర్ 4 తేదిన కోలీని గజియాబాద్ లోని దస్నా జైలు నుంచి మీరట్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7 తేది నుంచి 12 తేది లోపల ఏ రోజైనా ఉరితీసే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే కోలీ ఉరిపై అధికారుల నోరు మెదపనప్పటికి.. సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఉరి తీసే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. నైనీ సెంట్రల్ జైలు నుంచి ఉరితాడు.. కొక్కెం జైలు అధికారులకు అందాయని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్ఎమ్ రిజ్వీ తెలిపారు. -
ఒక ఊరు.. ఒక ఉరి..
ఒక ఊరు.. ఒక ఉరి.. 1916, ఫిబ్రవరి నెల.. ఓ మధ్యాహ్నం వేళ.. చార్లీ స్పార్క్స్ సర్కస్ అమెరికాలోని కింగ్స్పోర్ట్కు వచ్చింది.. సర్కస్ మొదలైంది.. రకరకాల జంతువులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి.. కానీ జనమంతా ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారు.. అదిగదిగో మేరీ వచ్చింది.. ఒకటే చప్పట్లు.. ఈలలు.. మేరీ ఆ సర్కస్ స్టార్.. మేరీ ఓ ఏనుగు.. మేరీ డ్యాన్స్లేస్తుంది.. డ్రమ్స్ వాయిస్తుంది.. బేస్బాల్ ఆడుతుంది.. మేరీ అన్నీ చేస్తుంది. శాంతంగా ఉంటుంది.. అందుకే ఆమె అంటే అందరికీ ఇష్టం.. కానీ ఆ రోజు.. ఆ రోజు.. సర్కస్ ప్రచారం కోసం దాని యజమాని చార్లీ స్పార్క్స్ ఏనుగులతో వీధుల్లో పరేడ్ చేయించాలనుకున్నాడు. మేరీని నియంత్రించే పని వాల్టర్ ఎల్డ్రిడ్జ్కు అప్పగించాడు. అసలు వాల్టర్కు ఏనుగులను నియంత్రించడమే రాదు. అనుభవం లేదు. అతనికి అంకుశంతో హింసించడమెలాగో తెలుసు అంతే.. కింగ్స్పోర్ట్ వీధుల్లో పరేడ్ కొనసాగుతోంది.. మేరీ నడుస్తోంది.. అవసరమున్నా లేకున్నా.. వాల్టర్ అంకుశంతో ఆమెను పొడుస్తూనే ఉన్నాడు. ఇంతలో మేరీకి రోడ్డు పక్కన పుచ్చకాయ ముక్క కనిపించింది. తొండంతో దాన్ని తీసుకోవాలనుకుంది. వాల్టర్కు మండింది. మేరీని ఎన్నాళ్ల నుంచో బాధిస్తున్న పుండుపై అంకుశంతో గట్టిగా పొడిచాడు. అంతే .. జరగరానిది జరిగిపోయింది. ఎప్పుడూ శాంతంగా ఉండే మేరీ రెచ్చిపోయింది. తొండంతో వాల్టర్ను తీసి.. నేలకేసి కొట్టింది. కాళ్లతో తొక్కింది.. మిగతా వారిని మాత్రం ఏం చేయలేదు. శాంతంగా అక్కడే అలా ఉండిపోయింది. జనంలో హాహాకారాలు. ఒకతను పిస్టల్తో కాల్పులు జరిపాడు. మేరీకి చిన్నచిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. జనం.. దగ్గరదగ్గర 3 వేల మంది జనం. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారు.. అదిగదిగో మేరీ వచ్చింది.. ఈసారి చప్పట్లు లేవు. చంపేయండి.. చంపేయండి అన్న అరుపులు తప్ప.. తప్పు ఎవరిది అని ఎవరూ ఆలోచించలేదు. కసి తీర్చుకోవాలి. మేరీని చంపాలి అంతే.. అయితే ఎలా చంపాలి? బులెట్ల ప్రభావం లేదు కనుక.. రెండు రైలు ఇంజిన్ల మధ్య మేరీని ఉంచి గుద్దించాలి అని అన్నారొకరు.. దాని కాలు ఒక ఇంజిన్కు, తల మరో ఇంజిన్కు తగిలించి.. రెండుగా చీల్చేయాలి అన్నారు మరొకరు.. కరెంట్ షాక్ ఇవ్వాలని ఇంకొకరు.. మేరీని చంపడానికి ఒప్పుకోకుంటే.. తన సర్కస్ మూతపడిపోతుందన్న భయంతో ఉన్న చార్లీ ఉరి తీస్తే ఎలా ఉంటుందన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. దగ్గర్లోని ఎర్విన్లోని రైల్వే యార్డ్ వద్దకు మేరీని తీసుకెళ్లారు. అక్కడ రైలు వ్యాగన్లను ఎత్తే 100 టన్నుల క్రేన్ సిద్ధంగా ఉంది. మేరీ తల చుట్టూ ఇనుప చైను వేశారు. పారిపోతుందన్న భయంతో కాలిని ఓ రైలు ఇంజిన్కు కట్టారు. చంపేయండి.. చంపేయండి.. జనం మళ్లీ అరుపులు.. మేరీ ఎప్పట్లాగే శాంతంగా ఉంది. క్రేన్తో మేరీని 5 అడుగుల ఎత్తుకు లేపారు. పటపటమని ఎముకలు విరిగిన శబ్దం.. ఇంతలో చెయిన్ తెగిపోయింది.. మేరీ దడేలున కింద పడిపోయింది. శరీరంలోని ఎముకలన్నీ ఫటేల్. బాధతో మేరీ చేస్తున్న ఆర్తనాదాలు ఎవరి చెవులనూ తాకలేదు. బలమైన ఇనుప చెయిన్ తెచ్చారు. మళ్లీ కట్టారు. ఈసారి చాలా ఎత్తుకు లేపారు. మేరీ చనిపోయింది. ప్రపంచంలో ఓ ఏనుగును ఉరి తీసిన ఏకైక పట్టణంగా ఎర్విన్.. ఉరి తీయబడిన ఏకైక ఏనుగుగా మేరీ చరిత్రలో నిలిచిపోయారు. నాటి మనుషుల ఆటవిక న్యాయానికి గుర్తుగా.. మేరీ ఇప్పటికీ ఎర్విన్లోనే ఉంది.. అక్కడి భూమిపొరల్లో ఎక్కడో.. ఎప్పట్లాగే.. శాంతంగా నిద్రపోతోంది.. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య