భారీ వసూళ్లు సాధించిన బాలయ్య | Bala Krishna Jai Simha Final Collections Report | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 1:52 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై మంచి వసూళ్లు సాధించింది. సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్‌ ఉన్న బాలయ్య జై సింహా సక్సెస్‌ తో మరోసారి ఆ సెంటిమెంట్ నిజమని ప్రూవ్‌ చేశాడు. ఇప్పటి వరకు ఈ సినిమా 35.85 కోట్ల షేర్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 28.25 కోట్లు షేర్‌ రాబట్టగా.. కర్ణాటకలో 4.30 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి 2.10 కోట్లు, ఓవర్‌ సీస్‌ నుంచి 1.20 కోట్ల షేర్‌ సాధించింది.

బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్‌ భట్‌ సంగీతమందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement