-
రూ.100 కోట్ల క్లబ్లో సలార్ హీరో మూవీ..!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్కు ధన్యవాదాలు తెలిపారు. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా చూస్తే మలయాళ చిత్రసీమలో ఈ మైలురాయిని సాధించిన ఆరో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. గతంలో రూ.100 కోట్ల మార్క్ను చేరుకోవడానికి '2018' సినిమాకు 11 రోజులు పట్టగా.. ఆ రికార్డును అధిగమించింది. 'లూసిఫర్', 'మంజుమ్మెల్ బాయ్స్' 12 రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఇటీవల హిట్గా నిలిచిన 'ప్రేమలు చిత్రానికి ఈ క్లబ్లో చేరడానికి 31 రోజులు పట్టింది. అలాగే 'పులిమురుగన్' సినిమాకు 36 రోజులు పట్టింది. అంతే కాకుండా మలయాళ చిత్రసీమలో అత్యంత వేగంగా రూ.50 కోట్ల మార్కును క్రాస్ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో ‘ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత రూ.100 కోట్ల మైలురాయి చేరుకున్న మూడో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. కాగా.. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. 100 Cr and counting at the Global Box Office! Thank you for this unprecedented success! ❤️🙏 #Aadujeevitham #TheGoatLife @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams@Haitianhero @rikaby @resulp @iamkrgokul @HombaleFilms @AAFilmsIndia @PrithvirajProd @RedGiantMovies_… pic.twitter.com/6H1gynVIJ6 — Prithviraj Sukumaran (@PrithviOfficial) April 6, 2024 -
బాక్సాఫీస్ వద్ద క్రేజీ మార్క్ను దాటిన 'ఆడుజీవితం' కలెక్షన్స్
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన చిత్రం 'ఆడుజీవితం'. 'సలార్'లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్ చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మలయాళంలో మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి అయిన తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం మలయాళ వెర్షన్ రూ. 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగులో కోటి రూపాయలు కూడా దాటలేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల 'గోట్ డేస్'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవలకు మంచి ఆదరణ దక్కిన వెంటనే, సినిమాగా తీయాలని ఎంతోమంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రన్ టైమ్ విషయంలో కాస్త తగ్గించి ఉంటే బాగుండు అనే విమర్శ ఉంది. -
బెంచ్ మార్క్ దగ్గర్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్తో ఆ మార్క్ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్ప్లేలో భాగమయ్యారు. ఓటీటీలో ఎప్పుడంటే.. మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. #TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥 All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎 Our Starboy 🌟 shattering records all over! 🤘 - https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4 — Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024 -
రీల్ కాదు.. ‘కాల్’ నాయక్!
సాక్షి, హైదరాబాద్: రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ‘నాయక్’ అనే సినిమాలో.. నాయక్ భాయ్గా మారిన కథానాయకుడు ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తుల్ని, రౌడీలను పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. వారిని భయపెట్టి, దండించి వారు చేసిన నేరాలు, అలాగే వారు సంపాదించిన ఆస్తుల వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని పత్రా లపై సంతకాలు చేయించడం ద్వారా వారి స్థిర చరాస్తులు అనాథాశ్రమాలకు చెందేలా చేస్తాడు. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీల్ సీన్తో కొన్ని సారూప్యతలు ఉన్న రియల్ సీన్ ఒకటి గతంలో హైదరా బాద్ శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శివారు కమిషనరేట్ అప్పటి ఉన్నతాధికారి.. ఓ పార్టీకి విరాళాలు సేకరించి ఇచ్చేందుకు ఈ తరహా పద్ధతిని అనుసరించారు. నేను సైతం.. అనుకున్న ఈయన కూడా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నుంచి అందిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల్ని ఆధారంగా చేసుకున్నారు. పలువురు వ్యాపారు లను వేర్వేరుగా తమ ప్రాంతానికి పిలిపించారు. ఎవరి రికా ర్డులు వారికి వినిపించి ‘కప్పం’ కట్టేలా చేశారు. ఇందులో ఓ అధికారి నేతృత్వంలోని స్పెషల్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీనిపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం. టార్గెట్లు నిర్దేశించి మరీ.. ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ల్లో ఓఎస్డీలుగా పని చేసిన టి.ప్రభా కర్రావు, పి.రాధాకిషన్రావు ట్యాపింగ్లో వెలుగులోకి వచ్చి న అంశాల ఆధారంగా బెదిరింపు వసూళ్లకు, విరాళాల సేకరణకు తెగబడినట్టుగా సిట్ ఇప్పటికే గుర్తించింది. ఓపక్క వీరి వ్యవహారాలు ఇలా సాగుతుండగా.. శివారు ప్రాంత కమిషనరేట్ ఉన్నతాధికారి కూడా తన వంతుగా ఎంతోకొంత చేయాలని భావించారు. ప్రభాకర్రావు నుంచి తనకు అందిన ట్యాపింగ్ రికార్డులను విశ్లేషించి, అవతలి వ్యక్తులను సంప్రదించడానికి వీలుగా స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశా రు. వీరిలో ఫార్మా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన వాళ్లూ ఉన్నట్టు సమాచారం. కాగా స్పెషల్ టీమ్కు నేతృత్వం వహించిన అధికారి తన సిబ్బందితో ఆయా వ్యాపారులు, బిల్డర్లు, రియల్టర్లు నిర్దేశించిన సమయాల్లో మీటింగ్కు వచ్చేలా ఒత్తిడి చేసేవారు. ఇలా వచ్చిన వారితో సమావేశమయ్యే శివారు ఉన్నతాధికారి ట్యా పింగ్ ఆడియోలను వినిపించే వారు. అందులోని సున్నిత, వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి వాళ్లు ఇవ్వాల్సిన మొత్తానికి సంబంధించి టార్గెట్లు ఇచ్చేవారు. వారు ఎప్పుడు? ఎలా? ఎవరికి? ఆయా మొత్తాలు చెల్లిస్తారో అప్పటికప్పుడే తెలుసు కునేవారు. ఇక వారి వెంటపడి వసూలు చేసే బాధ్యతల్ని స్పెషల్ టీమ్ ఇన్చార్జికి అప్పగించేవారు. కాగా ఇలా వసూ లైన మొత్తం ఓ పార్టీకి విరాళంగా అందినట్లు సమాచారం. తిరుపతన్నకు ‘ద్వితీయ శ్రేణి’ బాధ్యతలు నాటి ప్రతిపక్ష నేత, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్ల ట్యాపింగ్ను ప్రభాకర్రావు నేతృత్వంలోని ప్రణీత్రావు టీమ్ చేపట్టింది. అయితే ప్రతిపక్ష నేత లేదా ఆ స్థాయిలో ప్రాధాన్యం లేని, ద్వితీయ శ్రేణికి చెందిన వారి నంబర్లు ట్యాప్ చేసే బాధ్యతల్ని తిరుపతన్న తన బృందంతో కలిసి నిర్వర్తించినట్లు సిట్ చెప్తోంది. ఆ వ్యక్తుల్ని, వారి నంబర్లు గుర్తించే బాధ్యతల్ని టాస్క్ఫోర్స్లో ఉన్న పి.రాధాకిషన్రావు నిర్వర్తించారు. తన టీమ్ ద్వారా ఇతర మార్గాల్లో వివరాలను సేకరించే ఈయన, వాటిని తిరుపతన్నకు అందించేవారు. వీటిపై ప్రభాకర్రావుకు సమాచారం ఇచ్చే తిరుపతన్న ట్యాపింగ్ రికార్డులను కూడా ప్రభాకర్రావుకే అందించేవారని తెలిసింది. ప్రాథమిక విచారణలోనే ఈ విషయం గుర్తించిన సిట్ అధికారులు తిరుపతన్న నేరాంగీకార వాంగ్మూలంలోనూ దాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ప్రభాకర్రావు టీమ్ గత ఏడాది కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికోసం కొన్నాళ్లు బెంగళూరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వచ్చినట్లు తెలిసింది. పరిచయస్తులకు ప్రభాకర్రావు ఫోన్లు! ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్రావు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో తన ఒక్కడినే బాధ్యుణ్ణి ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం. ట్యాపింగ్ జరిగిన సమయంలో తాను రెగ్యులర్ అధికారిని కాదని, పద వీ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్పై ఉన్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) మాత్రమే అని చెప్తున్నట్లు సమాచారం. తాను ఓఎస్డీగా ఉన్న సమయంలో నిఘా విభాగాధిపతు లుగా పని చేసిన అదనపు డీజీలు, అప్పటి డీజీపీలు సైతం బాధ్యులే అని, వారికి తెలిసే ఎస్ఐబీ కేంద్రంగా వ్యవహారా లు సాగినట్లుగా వాదిస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల్ని తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుత్రరత్నం లీలలు.. ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, తన హవా చెలాయించిన ఉన్నతాధికారి పుత్రరత్నం లీలలు తాజాగా బయటకు వస్తున్నాయి. తన తండ్రి పలుకుబడిని వినియోగించి ఇతను తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని భారీగా విస్తరించుకున్నట్లు తెలు స్తోంది. అంతేకాకుండా శివారు పోలీసులకు మన‘శ్శాంత్’ లేకుండా చేసినట్లు సమాచారం. నగరం వెలుపల ఇతను ఓ ఫామ్హౌస్ ఏర్పాటు చేసుకోగా.. అక్కడి నిర్మాణాలు, జనరేటర్తో పాటు నాటిన మొక్కలు సైతం పోలీసుల ‘సౌజన్యమే’ అని తెలుస్తోంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు ఈ పుత్రరత్నం తండ్రికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఆయన తన కార్యాలయం ల్యాండ్ లైన్ నుంచి ఏదో ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి, తన కుమారుడు ఫోన్ చేస్తాడని చెప్పేవారు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసే సుపుత్రుడు తన డిమాండ్ చెప్పి పీడించి మరీ నెరవేర్చుకునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతడికి ఓ డీఎస్పీ స్థాయి అధికారి షాక్ ఇచ్చాడని తెలిసింది. ఈయనకు ఫోన్ చేసిన సుపుత్రుడు ఐదు జేసీబీలు, ఐదు టిప్పర్లు ఫామ్హౌస్ వద్దకు పంపాలంటూ హుకుం జారీ చేశారని, దీంతో ఆ డీఎస్పీ ‘డబ్బు ఎవరు ఇస్తారు? ఎంత డిస్కౌంట్ కావాలి?’ అంటూ ప్రశ్నించడంతో ఫోన్ పెట్టేశారని సమాచారం. -
'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. చాలారోజుల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా ఆ ప్రభావాన్ని తట్టుకుని భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. సామజవరగమన హిట్ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్ను అందుకున్నాడు. రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే మంచి కలెక్షన్స్నే ఈ చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొదటిరోజు రూ.4.6కోట్ల, రెండో రోజు రూ.5.84 కోట్లు రాబట్టింది. అమెరికాలో అయితే ఇప్పటికే సుమారుగా రూ. 3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఓం భీమ్ బుష్ సినిమా లాభాల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తక్కువ బడ్జెట్తోనే తెరకెక్కిన ఈ మూవీకి మంచి ఓపెనింగ్తో కలెక్షన్స్ రన్ అవుతున్నాయి. తాజాగా ఓం భీమ్ బుష్ సినిమా సక్సెస్ మీట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర యూనిట్ను ప్రశంసించారు. 'నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్కు వచ్చింది. అందరూ థియేటర్కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. BLOCKBUSTER BAZINGAAAA ❤🔥#OmBheemBush grosses 10.44+ CRORES in 2 days worldwide 🔥 Go LOL in the theatres! 🎟️ https://t.co/duPyNtQcze Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan @PreityMukundan @SunnyMROfficial @SunilBalusu1981… pic.twitter.com/gcmVwvMqzn — V celluloid (@vcelluloidsoffl) March 24, 2024 -
తగ్గేదేలే అంటోన్న విశ్వక్ సేన్.. రెండు రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గామి'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గామి టీమ్ను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.9.07 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో వీకెండ్ కావడంతో వసూళ్ల పర్వం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్కు చేరుకుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా థియేటర్లలో 52 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. #Gaami is going super strong all over 💥 Collects 15.1CRORE+ gross worldwide in 2 days with super positive WOM & remains #1 choice of moviegoers this week 💥💥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 🤩 🎟️… pic.twitter.com/l13z6Wik1b — UV Creations (@UV_Creations) March 10, 2024 -
బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఈగల్'. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 9న థియేటర్లలోకి వచ్చింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తర్వాత నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్లోనూ ఆసక్తి నెలకొంది. మూవీ రిలీజైన మొదటి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద ఈగల్ అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.20.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈగల్.. రెండో రోజు అదే జోరులో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే రూ.11.2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈగల్ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో 32.84 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కాగా.. ఈగల్ చిత్రానికి దేవ్ జాంద్ సంగీతమందించారు. ఈ మూవీలో అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో మాస్ మహారాజా నటించారు. కాగా.. ఈ చిత్రాన్ని హిందీలో సహదేవ్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్
కలర్ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుహాస్. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. తాజగా విడుదలైన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తోనే దూసుకుపోతుంది. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్కు బాగా దగ్గరైందని చెప్పవచ్చు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్గా మెప్పిస్తే.. హీరో అక్కగా శరణ్య ప్రదీప్ దుమ్మురేపిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మోషన్ పిక్చర్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రానికి తొలిరోజు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలకు మించి ఓపెనింగ్స్ను సాధించింది. హార్డ్ హిట్టింగ్ బ్లాక్బాస్టర్ అంటూ మేకర్స్ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. రెండో రోజు సుమారు రెండున్న కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.5.16 కోట్లు రాబట్టింది. ఏదేమైనా హీరో సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. రాయలసీమకు రానున్న హీరో,హీరోయిన్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రానికి పాజిటివ్ రావడంతో చిత్ర యూనిట్తో పాటు సుహాస్, హీరోయిన్ శివాని నాగరం రాయలసీమలో సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నేడు (ఫిబ్రవరి 4న) మొదటగా కర్నూలులోని ఆనంద్ థియేటర్కు మధ్యాహ్నం 12: 30గంటలకు చిత్ర యూనిట్ రానుంది. ఆ తర్వాత కడపలోని రాజా థియేటర్కు మధ్యాహ్నం 3:30 గంటలకు వారి షెడ్యూల్ ఉంది. చివరగా తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్దకు సాయింత్రం 7 గంటలకు చిత్ర యూనిట్ రానుంది. 🫶 pic.twitter.com/KjPyTtN54o — Suhas 📸 (@ActorSuhas) February 3, 2024 ❤️❤️❤️ pic.twitter.com/pt9TpJGItb — Suhas 📸 (@ActorSuhas) February 4, 2024 -
జనవరిలో జీఎస్టీ @ రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి. -
ప్రశాంత్ వర్మ హను-మాన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్కు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. -
విజయ్ దేవరకొండ అరుదైన ఘనత.. సలార్, యానిమల్ను వెనక్కినెట్టి!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. గతేడాది థియేటర్లలో రిలీజైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో స్టార్ హీరోగా ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండకు.. కోలీవుడ్లోనూ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకుల అభిమానం పొంది తమిళనాట కూడా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "ఖుషి" అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2023లో కోలీవుడ్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ -తమిళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే రూ.12.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. షారుక్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ తర్వాత స్థానంలో నిలిచింది. ఖుషి తర్వాత బ్లాక్బస్టర్ మూవీలైన సలార్, యానిమల్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ లవ్ అడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అంతే కాకుండా గతేడాది టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో ఖుషి ఒకటిగా నిలిచింది. -
సలార్ 1000 కోట్లు కొట్టేదెప్పుడు..?
-
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
Prabhas Salaar: బాక్సాఫీస్ వద్ద సలార్ జోరు.. ఐదో రోజు ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ ప్రభంజనం ఐదు రోజు కూడా కొనసాగింది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే.. నాలుగు, ఐదు రోజుల్లో కాస్తా తగ్గినట్లు కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. రూ.500 కోట్ల క్లబ్లో చేరితే.. బాహుబలి, బాహుబలి 2: ది కన్క్లూజన్ తర్వాత ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలవనుంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్ను దాటేశాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు చేరుకున్న సలార్.. ఐదో రోజు అదే ఊపులో దూసుకెళ్లింది. సలార్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.రూ.490.23 కోట్లు కొల్లగొట్టిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ భారీ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ ఐదు రోజుల్లో రూ.280.30 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. #Salaar WW Box Office #Prabhas is racing towards his 3rd ₹500 cr club film after #Baahubali and #Baahubali2. Day 1 - ₹ 176.52 cr Day 2 - ₹ 101.39 cr Day 3 - ₹ 95.24 cr… pic.twitter.com/0maGBGaqY8 — Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2023 -
వీకెండ్ దాటినా సలార్ అదే జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.402 కోట్లు రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజు కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే సోమవారంతో కలిపి రూ.450 కోట్ల వసూళ్లు దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే కేవలం ఇండియా వ్యాప్తంగా రూ.250 కోట్ల కలెక్షన్ల మార్కును దాటడం మరో విశేషం. ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.255.40 కోట్లు కొల్లగొట్టింది. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.76.91 కోట్లు వసూళ్లు రాగా.. ఇండియాలోనే రూ.45.77 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదేవిధంగా కలెక్షన్స్ జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్ను దాటేశాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. #Animal Roars Louder 🔥🪓 Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/rXLUe4SSod — Animal The Film (@AnimalTheFilm) December 10, 2023 -
నకిలీ టోల్ప్లాజాతో కోట్లు కొట్టేశారు
గాం«దీనగర్: పూర్వం రహదారిపై దారి దోపిడీలు జరిగేవి. ఇప్పుడు దొంగలు ఏకంగా జాతీయరహదారిపై టోల్ప్లాజా ఒకటి తెరిచేసి దర్జాగా టోల్ వసూళ్లు మొదలెట్టేశారు. ఈ దోపిడీ ఘటనకు గుజరాత్ రాష్ట్రంలోని జాతీయరహదారి వేదికైంది. నకిలీ టోల్ప్లాజా ద్వారా మోసగాళ్ల ముఠా ఏకంగా రూ.75 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏడాదికాలంగా ఇది జరుగుతున్నా పోలీసులకు ఇంతకాలం సమాచారం లేకపోవడం విడ్డూరం. నకిలీ టోల్ప్లాజా గుట్టుమట్లు తాజాగా స్థానికంగా వెలుగులోకి వచ్చాక చిట్టచివరన పోలీసులకు తెలిశాయి. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టి ఐదుగురిని అరెస్ట్చేశారు. సంబంధిత వివరాలను పోలీసులు వెల్లడించారు. తక్కువ రేటు కావడంతో అంతా గప్చుప్ మోర్బీ జిల్లా, కఛ్ జిల్లాలను కలిపే 8ఏ నంబర్ జాతీయరహదారిపై వాఘసియా టోల్ప్లాజా ఉంది. దీని గుండా వెళ్లకుండా సమీప ప్రాంతం గుండా వెళ్లొచ్చని వాహనదారులు కనిపెట్టారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతం గుండా వెళ్లడం మొదలెట్టారు. ఈ విషయం తెల్సుకున్న ఒక ముఠా ఒక కొత్త పథకంతో రంగంలోకి దిగింది. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ‘వైట్హౌజ్’ అనే సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. దానికి ఇరువైపులా హైవే వరకు కొత్త రోడ్లు వేశారు. ఫ్యాక్టరీలో టోల్ ప్లాజా కౌంటర్ నిర్మించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సాధారణంగా జాతీయరహదారిపై ఒక్కో వాహనాన్ని బట్టి రూ. 110 నుంచి రూ.595 వసూలుచేస్తారు. కానీ ఈ ‘దొంగ’ మార్గంలో వెళ్లే వాహనదారుల నుంచి ఈ ముఠా కేవలం రూ.20 నుంచి రూ.200 వసూలుచేసేవారు. ఇంత తక్కువకే టోల్గేట్ను దాటేస్తుండటంతో తెల్సినవారంతా ఈ మార్గంలోనే రాకపోకలు సాగించేవారు. కొత్త వాహనదారులకు, స్థానికులకు ఇది బోగస్ టోల్ప్లాజా అని తెల్సికూడా.. తక్కువ ధరలో పని అయిపోతుందని మిన్నకుండిపోయారు. దాంతో ముఠా వ్యాపారం ఒక ఏడాదిపాటు యథేచ్చగా సాగింది. గత 18 నెలల్లో ఈ ముఠా దాదాపు రూ.75 కోట్లు కొట్టేసిందని మాజీ ఐపీఎస్ రమేశ్ ఆరోపించారు. నిందితుల్లో పటేల్ నేత కుమారుడు స్థానిక మీడియాలో కథనాలు, విమర్శలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఐదుగురిని అరెస్ట్చేశారు. సిరమిక్ ఫ్యా క్టరీ యజమాని అమర్షీ పటేల్తోపాటు అతని నలుగురు అనుచరులు, మరో వ్య క్తినీ అరెస్ట్చేశారు. అమర్షీ సౌరాష్ట్ర ప్రాంతంలో కీలకమైన పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నేత కుమారుడు కావడం గమనార్హం. -
వెయ్యి కోట్లు వైపు యానిమల్ చూపు..
-
ఈ ఏడాది కలిసొచ్చింది
రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్’ రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నాలుగు, ‘దిల్’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్చరణ్గారి ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. -
టైగర్-3 దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్లు!
కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం టైగర్ 3. ఈ చిత్రాన్ని టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ చిత్రాలకు సీక్వెల్గా తెరకెక్కించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. యష్రాజ్ఫిల్మ్స్ స్పై యూనివర్శ్లో సినిమాటిక్ టైమ్లైన్లో వచ్చిన ఐదో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, పండుగ రోజు కావడంతో ఏకంగా రూ.44.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కూడా అదే రేంజ్లో దూసుకెళ్లింది. రెండో రోజు రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 102 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా.. సినిమా రిలీజ్ రోజే సల్మాన్ ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేశారు. మాలేగావ్లోని సినిమా హాలులో మూవీ ఆడుతుండగానే టపాసులు కాల్చి హల్ చల్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ‘టైగర్-3’ ట్విటర్ రివ్యూ) సల్మాన్ ఖాన్ తన ట్వీట్లో రాస్తూ.. 'టైగర్ 3 సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో బాణాసంచా కాల్చడం గురించి విన్నా. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మనం ఇతరులను రిస్క్లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉందాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటించారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ విడుదలైంది. #Tiger3 becomes #SalmanKhan's 17th consecutive 100cr Grosser, Highest for any Indian star🔥. #KatrinaKaif #Tiger3BoxOffice pic.twitter.com/fyRaOcy6C0 — MASS (@Freak4Salman) November 14, 2023 -
రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్ను సైతం లియో బద్దలు కొట్టింది. గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్ తర్వాత ఆ లిస్ట్లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) -
బాక్సాఫీస్ వద్ద లియో జోరు.. నెగెటివ్ టాక్ వచ్చినా తగ్గేదేలే!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈనెల 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టిన లియో.. దాదాపు మూడో రోజు అదే జోరును కొనసాగించింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.40 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సినిమా రిలీజ్ రోజు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన లియో.. మూడో రోజే రెండొందల కోట్ల మార్కును దాటేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. మొత్తంగా తమిళనాడులో మూడు రోజుల్లో కలిపి రూ.56.9 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.63 కోట్లు, రెండో రోజు రూ.15.95 కోట్లు, మూడో రోజు రూ.13.32 కోట్లు వసూలు మాత్రమే రాబట్టింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రిలీజ్పై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగులోనూ రిలీజ్పై స్టేలు ఇవ్వడం కలెక్షన్లపై కాస్తా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. -
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్ను అందుకుని పది కోట్ల మార్క్ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
రిలీజ్ కి ముందే రికార్డులు
-
వేగా శ్రీ రెండో వార్షికోత్సవం గోల్డ్ అండ్ డైమండ్స్ స్పెషల్ కలెక్షన్స్ (ఫోటోలు)
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement