'మా' ఎన్నికల్లో 'జయ'భేరి | jayasudha elected as maa president | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికల్లో 'జయ'భేరి

Published Fri, Apr 17 2015 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

'మా' ఎన్నికల్లో 'జయ'భేరి

'మా' ఎన్నికల్లో 'జయ'భేరి

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల్లో నటి జయసుధ విజయభేరి మోగించారు. ఈ అసోసియేషన్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. మొత్తం 702 మంది సభ్యులున్న 'మా' అధ్యక్ష పదవికి ఆమెతో నటుడు రాజేంద్రప్రసాద్ పోటీపడ్డారు. మా ఎన్నికలు రెండేళ్లకోసారి జరుగుతాయి.

మార్చి 29వ తేదీన జరిగిన ఎన్నికల్లో 394 మంది సభ్యులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైనా.. దాన్ని కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ చాంబర్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. .......గంటలకే ఫలితాలను వెల్లడించారు. ఇందులో జయసుధ .... ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్ను ఓడించారు. జయసుధకు ... ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్కు ... ఓట్లు వచ్చాయి.

నటరాజు చూసుకుంటాడు
''మంచికోసం, మార్పుకోసం ధర్మయుద్ధానికి దిగాం. ఈ ధర్మయుద్ధంలో నటరాజు తీర్పు ఎలా ఉన్నా అది పదిమందికీ ఉపయోగపడాలని నా కోరిక, అలా జరుగుతుందని నా ఆశ. మిగతా సంగతి నటరాజు చూసుకుంటాడు'' అని కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement