
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానటి సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అంచనాలకు మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
త్వరలో గోవాలో జరగనున్న 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)ఉత్సవాలలో ప్రదర్శనకు మహానటి సినిమా ఎంపికైంది. హిందీ, తమిళ, మలయాళం, తుళు ఇలా భారతీయ భాషల నుంచి 22 నాన్ ఫీచర్ చిత్రాలకు ఈ చిత్రోత్సవాలలో ప్రదర్శనకు చోటు దక్కింది. తెలుగు నుంచి ఆ గౌరవం మహానటికి మాత్రమే దక్కింది.