![నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/41489505745_625x300.jpg.webp?itok=6ibswkKj)
నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది
Published Tue, Mar 14 2017 8:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
![నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/5/41489505745_625x300.jpg.webp?itok=6ibswkKj)
ఇంఫాల్: నేర చరిత్ర లేని ప్రజాప్రతినిధులను ఆశిస్తుంటే.. రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. తాజాగా మణిపూర్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 32 మంది కోటీశ్వరులు, నలుగురు నేరస్థులు ఉన్నారని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్మ్స్) తెలిపింది. నేరచరిత్ర, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి మంగళవారం ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 , బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలు గెలుచుకున్నారు. కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో క్రిమినల్ కేసులున్నవారు ఇద్దరని, సీరియస్ క్రిమినల్ కేసులు (హత్యానేర ఆరోపణలు) మరో ఇద్దరిపై ఉన్నాయని పేర్కొంది. బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ నేతల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులున్నాయి. 2012 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఏ ఒక్కరికి నేరచరిత్ర లేదు.
గత ఎన్నికల్లో సగటు ఎమ్మెల్యే ఆస్తి రూ.95.551లక్షలు కాగా 2017 లో రూ.2.196 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో కోటీశ్వరులు 27 శాతం ఉండగా ఈ ఎన్నికల్లో 53 శాతం మంది ఉన్నారు. ఆస్తుల వివరాల్లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో రూ.5 కోట్ల కన్నా ఎక్కవ ఆస్తులన్న అభ్యర్థులు ఇద్దరు, రూ.2- 5 కోట్ల ఆస్తులు ఉన్నవారు 17 మంది, రూ. 50 లక్షల - రూ.2కోట్లు ఉన్న వారు 27 మంది ఉన్నట్లు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక 13 మందికి రూ.10 - 50 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 18 మంది కోటీశ్వరులు, బీజేపీలో 21 ఎమ్మెల్యేలలో 10 మంది ఉన్నారు. ఇతరుల్లో నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. అత్యధికంగా రూ.36 కోట్ల ఆస్తి ఉన్నట్లు కాంగ్రెస్ ఉక్రుల్ ఎమ్మెల్యే ఎస్. అర్థుర్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక అతి తక్కువగా రూ. 9.28లక్షల ఆస్తి ఉన్నట్లు బీజేపీ ఇంఫాల్ వెస్ట్ ఎమ్మెల్యే సెక్మాల్ ప్రకటించారు.
ఆదాయపు పన్ను దాఖలు చేసిన అభ్యర్థులు ముగ్గురు. వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం విశేషం. 60 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ఆదాయపుపన్ను వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు రెండోసారి ఎన్నికయ్యారు. 2012లో వీరి సగటు ఆస్తి రూ.1.39 కోట్లు ఉండగా 2017లో రూ.1.96 కోట్లకు చేరింది. వీరి ఆస్తులు 41 శాతం పెరిగాయి. కాంగ్రెస్ నుంచి 22 మంది రెండో సారి ఎన్నిక కాగా, బీజేపీ నుంచి నలుగురు, ఇతరపార్టీల నుంచి ఇద్దరు గెలుపొందారు.
విద్యార్హతల పరంగా 14 మంది 5 నుంచి 12వ తరగతి చదివిన వారు ఉండగా, 42 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ పూర్తిచేశారు. వీరిలో 13 మంది పీజీ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడని తెలిపారు. వయసు రీత్యా 27 మంది ఎమ్మెల్యేలు 50 ఏళ్ల లోపు, 33 మంది 50 ఏళ్ల పై బడిన వారున్నారు. 8 మంది యువకులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం ముగ్గురే. 2012 లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలిచారు. ఈ సారి అదనంగా ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెట్టనున్నారు.
Advertisement
Related news by tags
-
సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటర్.. రాజీనామా లేఖలో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.మరోవైపు.. సీఎం రేవంత్ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్ రావు.. కాంగ్రెస్ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024 -
రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ సంబురాలు దేనికి?: బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.రైతుల రుణమాఫీపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. -
రెడ్ అలర్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉత్తరం వైపు మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రుణమాఫీకి రేషన్కార్డు కాదు.. పాసుబుక్లే ముఖ్యం: సీఎం రేవంత్
రుణమాఫీ నిధుల సందర్భంగా కాంగ్రెస్ నేతల కామెంట్స్ అప్డేట్స్..రైతులతో కలిసి రాహుల్ సభ..👉సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మరోసారి 2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం.👉రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చుతున్నాం. నా జీవితంలో ఇది మరపురాని రోజు. రైతు రుణమాఫీ అద్భుతమైన కార్యక్రమం. ప్రభుత్వం తరఫున రైతులందరికీ కృతజ్ఞతలు. దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రూ.లక్ష వరకు తొలివిడతలో రుణమాఫీ చేస్తున్నాం. మూడు విడుతల్లో రూ.31వేల కోట్లు వచ్చే నెలలోపు రుణమాఫీ చేస్తాం. రైతు రుణమాఫీకి పాస్ పుస్తకాలే ముఖ్యం. రేషన్ కార్డు ముఖ్యం కాదు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే అధికారులు సరిచేస్తారు. కొందరు రుణమాఫీపై అపోహాలు, అబద్దాలు చెబుతున్నారు వాటిని నమ్మకండి.👉గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రతీనెలా రూ.7వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఎల్లుండి ఢిల్లీ వెళ్తాను.. రాహుల్ గాంధీతో సమావేశమవుతాను. వరంగల్లో భారీ సభ పెడతామంటూ రైతులకు రేవంత్ చెప్పారు. ఐదు లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేద్దామన్నారు. వరంగల్లో రైతులతో కాంగ్రెస్ సభ జరుగుతుంది. ఈనెలాఖరులో సభకు ఏర్పాట్లు చేసుకుందామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి సంబురాలు చేసుకుందామని రైతులను కోరారు. 👉వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే సభ జరుగుతుంది. వరంగల్ సభకు రాహుల్ కృతజ్ఞత సభగా నామకరణం చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. రుణమాఫీ జరిగిన పలువురు రైతులకు సీఎం రేవంత్ చెక్లు అందజేశారు.👉ఇక, ఇదే సమయంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాం.👉రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29వేల కోట్లు ఖర్చు చేశాం. 👉రైతు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా రైతువేదికల్లో ఉన్న రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎం రేవంత్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రతీ జిల్లా నుంచి రైతులు మాట్లాడారు. 👉తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. పలు జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కామెంట్స్..👉రుణమాఫీ నేపథ్యంలో రైతు లోకానికి శుభాకాంక్షలు. రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది. రైతురాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది..మేము కేవలం నెలన్నరలో చేస్తున్నాం. విపక్షాలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. జై కిసాన్ జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్.. 👉నల్లగొండలో రైతువేదికలో రైతులతో కలిసి మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తూ చరిత్ర సృష్టించాం. రైతులు అప్పులాపాలు కాకుండా ఉండేందుకు రుణమాఫీ చేశాం. రూ.481 కోట్ల రూపాయల మాఫీ నల్లగొండ జిల్లాలో జరిగింది. బ్యాంకు వాళ్లు ఇబ్బందులు పెడితే అధికారులు, నా దృష్టికి తీసుకురండి. త్వరలో లక్షన్నర, రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తాం. డిండి, ఎస్సెల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు ఇది పండుగ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేర్చలేదు. ప్రతీ రూపాయి పోగేసి.. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నాం. ఒకేసారి రూ.31వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వర రావు కామెంట్స్..👉రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకరోజు.. రైతులకు పండుగరోజు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎంత మంది అపహాస్యం చేసినా.. రైతుల రుణమాఫీ చేస్తున్నాం. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అత్యంత కష్టతరమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపిస్తోంది. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. మేము నెరవేరుస్తున్నాం. భవిష్యత్లో రైతులకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. రుణమాఫీ నిధుల విడుదల..👉తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 11.42 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కానుంది.👉కాగా, తెలంగాణ సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. పలుచోట్ల రైతువేదికల్లో ఉన్న రైతులతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొననున్నారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. 👉ఇక, ఈ నెలాఖరులోగా రెండో విడత, ఆగస్టు మొదటి వారంలో మూడో విడతతో మిగిలిన రుణాలను మాఫీ చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఆగస్టు దాటకముందే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోంది. కాసేపట్లో రైతులతో సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. -
కవిత కస్టడీ పొడిగింపు.. ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో జూలై 22వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కవితకు అస్వస్థత నేపథ్యంలో ఆమెకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇక, లిక్కర్ కేసులో విచారణ కోసం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు జైలు అధికారులు. ఈ సందర్భంగా తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్షా ఫలితాల్లో(ల్యాడ్ టెస్టులు) వ్యత్యాసాలను కవిత న్యాయమూరి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో, కవితకు వైద్యపరీక్షలకు కోర్టు అనుమతించింది. ఎయిమ్స్లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్టును కోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రెండు క్రితం జైలులో కవిత అస్వస్థతకు గురికావడంతో దీన్దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కాగా, కవితకు ప్రైవేటు ఆసుపత్రిలో చెకప్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దరఖాస్తు చేయడంతో కోర్టు దీనికి అంగీకరించింది.
Related News by category
-
అధికారపార్టీలో వుంటేనే అర్హులు.. లెదంటే..
సూర్యాపేట: ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఎన్నికలకు ముందు దళితబంధు లొల్లి మొదలైంది. అనర్హులకు ఇచ్చారంటూ ఏకంగా సర్పంచ్ ఇంటికే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నెమ్మికల్ గ్రామానికి 24 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వాటి ని మాదిగ సామాజిక వర్గానికి 12, మాల సామాజిక వర్గానికి 12 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యూనిట్ల పంపిణీ సక్రమంగా జరగలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న దళితులకు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికే ఈ పథకం మంజూరు చేశారని, ఇదే విషయమై బుధవారం ఎస్సీ వర్గానికే చెందిన గ్రామసర్పంచ్ గంపల సతీష్ను కొందరు ప్రశ్నించారు. ఈ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో దళితులు ఆందోళన చేశారు. దళిత బంధులో అక్రమాలు జరిగాయని గ్రామంలోని సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేసిన గోడ గడియారాలను తీసుకొచ్చి పగులగొట్టారు. గృహలక్ష్మి పొందిన వారే తిరిగి దళితబంధు తీసుకుంటున్నారని, నిజమైన నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉదయం 7గంటలకే రోడ్డు ఎక్కి 11గంటల వరకూ ఆందోళన విరమించకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్రెడ్డి ఆందోళన కారులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగడంతో పాటు అతని కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్కు తరలివెళ్లారు. ఇదిలా ఉండగా అసలు మండలానికి దళితబంధు యూనిట్లు రాలేదని తెలుస్తోంది. కేవలం ఆ పార్టీకి చెందిన నాయకులు దళితబంధు మంజూరైందని చెప్పి దళితుల మెప్పుపొందేందుకు ప్రయత్నించారని, ఇది బెడిసి కొట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మండలంలో దళితబంధు ఊసెత్తని వారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంజూరైందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మల్సూర్నాయక్ను వివరణ కోరగా తమకు దళితబంధు పథకంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాస్తారోకో చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించిన గంపల కరుణాకర్, గంపల లెనిన్, చంద్రు, పురం శివక్రిష్ణ, జానకిరాములు, గరిగంటి రాంబాబులతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. -
'విమర్శలకు పోటీ పడుతున్నారు.. కానీ గుజరాత్లో ఏం సాధించారు?'
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి పోటీ పడి విమర్శలు చేస్తున్నారని మంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ.. అధికారంలో ఉన్న గుజరాత్లో ఏం సాధించారో ప్రజలకు తెలపాలన్నారు. అప్పుల గురించి మాట్లాడే నాయకులు అభివృద్ధిని గమనించడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే రైతు బీమా, ఉచిత కరెంటు గుజరాత్లో ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగించిందని చెప్పారు. ఆదానీ, అంబానీలకే మేలు.. దేశంలో ఆదానీ, అంబానీలకు ఉపయోగపడే విధంగా బీజేపీ సర్కార్ లక్షల కోట్ల అప్పులు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీ వంటి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా కేంద్రం మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం భారతదేశ పరువు తీస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. బీజేపీ నిర్వాకం వల్లనే చచ్చిన కాంగ్రెస్ ఉరుకులు పెడుతోందని అన్నారు. కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఏం లేదు కానీ..గత్యంతరం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్కు పట్టం కట్టారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నీడను ప్రజలు వదలరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: రేవంత్రెడ్డిపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ -
తిరుగులేని శక్తిగా కాంగ్రెస్
సాక్షి, నల్లగొండ : మీ రాకతో నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నాలుగు సార్లు గెలిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ గౌరవాన్ని నిలబెట్టా...ఐదోసారి గెలిపించండి.. ఐదేళ్లు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు శనివారం మర్రిగూడలోని లక్ష్మీగార్డెన్లో కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. భారీగా వచ్చిన కార్యకర్తలను చూసి కోమటిరెడ్డి ఉద్వేగభరింతగా ప్రసగించారు. మీ ప్రేమను చూ స్తుంటే నాబాధను మరిచిపోతున్నాని అన్నారు. మీలో నాకొడుకును చూసుకుంటున్నారు. కార్యకర్తలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ కోమటిరెడ్డి ప్రకటించారు. తాను సమావేశానికి వస్తుంటే కార్యకర్తలలు ప్రేమతో ఎదురువచ్చారు. కిక్కిరిసిన కార్యకర్తల మధ్య స్టేజిమీదికి వచ్చా నేను గట్టివాన్ని కాబట్టి తట్టుకున్నా.. అదే కేసీఆర్ ఆయితే ఎప్పుడో చచ్చేవాడని అనడంతో కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. మీ ప్రేమకు నేను మరిచిపోను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆశయ సాధనకు తనను గెలిపించాలని కోరారు. నన్నుగెలిపిస్తే అది మీగెలుపు, నేను ఓడితేమీరు ఓడినట్లేనన్నారు. తెలంగాణ కోసం పోరాడడంతో పాటు ఫ్లోరిన్ సమస్య పరిష్కారానికి ఆమరణ నిరాహారదీక్ష చేశానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్కళాశాలను పూర్తి చేసి నల్లగొండ రూపురేఖలు మారుస్తానన్నారు. లక్షమందితో నామినేషన్ తాను ఐదో సారి లక్షమందితో కలిసి నామినేషన్ వేయాలని,కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ని మంచి పొజీషన్లో చూస్తాము, కాబట్టి అందరం కలిసి గెపించాలని పిలుపు నిచ్చారు. అందుకు అందరం కష్టపడి పనిచేయాలని అన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నాని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గెలుపే ధ్యేంగా అందరం కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేస్తామని చెప్పారు. పార్టీలో చేరిన మున్సిపల్ వైస్చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 20 సంవత్సరాల ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సందర్భంలో నియోజక వర్గం ప్రశాతంగా ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి గెపుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఖయూంబేగ్, హమీ ద్, బండమీది అంజయ్య, శ్రీనాథ్, మార్కెట్ వైస్ చైర్మన్ పాశం నరేష్రెడ్డి, జానకిరాములు, పనస శంకర్, సిరాజుల్లా ఖాన్, హజీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వంగాల స్వామిగౌడ్, జెడ్పీటీసీలు శ్రీనివాస్గౌడ్, రాధ,అల్లి సుభాష్, వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. అంతకు ముం దు ఎన్జీ కళాశాల నుంచి లక్ష్మిగార్డెన్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. దొంగల చేతివాటం ..! కాంగ్రెస్ సమావేశంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. సమావేశానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడం కోమటిరెడ్డిని కలిసేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే దుండగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. నాయకుల జేబులో నుంచి డబ్బులు కొట్టేశారు. బుర్రిశ్రీనివాస్రెడ్డితో పాటు పలువురు నాయకుల వద్ద నుంచి రూ.3 లక్షల వరకు తస్కరించారు. ఓ నాయకుడి వద్ద లక్ష రూపాయలు పోగా మిగిలిన వారి జేబుల్లోనుంచి 10 నుంచి 20 వేల పైచిలుకు వరకు కొట్టేశారు. సమావేశం అనంతరం నాయకులు తమ జేబులు చూసుకుని అవాక్కయ్యారు. -
‘సన్నాల’ పేరిట దగా..!
సూర్యాపేట : సన్న రకాలు.. ఈ బియ్యం కొనుగోలు చేశారంటే.. మరోమారు మా వద్దనే కొనుగోలు చేస్తారంటూ మాయమాటలు చెబుతూ కొందరు వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా కాలనీలు, వీధుల్లో కేకలు వేస్తూ సంచరిస్తున్నారు. సన్న రకం బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.4400 కాగా.. తమ వద్ద రూ.3400 మాత్రమే అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. సన్న బియ్యాన్ని ఎలా గుర్తించాలని ప్రజలు అడగడమే ఆలస్యం.. వెంటనే సంచులు విప్పి సన్నబియ్యాన్ని చేతిలో పోసి అంటగడుతున్నారు. వారు వెళ్లిన క్షణాల్లోనే సంచులు విప్పి కొంచెం లోతుగా బస్తాలోకి చెయ్యి పెట్టి బియ్యం తీస్తే దొడ్డు బియ్యం దర్శనమిస్తున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని.. సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులు ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ పట్టణాల్లోకి దిగడమే ఆలస్యం.. అక్కడి అక్రమ వ్యాపారులను పరిచయం చేసుకుంటున్నారని సమాచారం. మాస్ కాలనీల పేర్లు తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. సన్న బియ్యం రూ.3400 విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తే.. తాము పెద్ద రైతులమని.. మార్కెట్లో నేరుగా విక్రయించే కంటే ఇలా విక్రయిస్తే తమకుకొద్దోగొప్పో లాభమంటూ బుకాయిస్తూ అమాయయకుల నుంచి దోచుకుంటున్నారు.తమపై నమ్మకం లేకపోతే మా ఫోన్ నంబర్లు కూడా తీసుకోండంటూ నంబర్లను కూడా ఇచ్చి వెళ్తున్నారు. కానీ ఆ నంబర్లు పనిచేయకపోవడంతో కంగుతింటున్నారు. ఒక్కరిద్దరు వ్యాపారులు కలిసి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులే ఇలాంటి అక్రమ వ్యాపారాలకు తెర తీశారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారులు ఇక సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మర ఆడిస్తున్నారు. అట్టిబియ్యాన్ని ఆటోలు, టాటా ఏసీల్లో వేసుకుని ముగ్గురు నలుగురు వ్యాపారులు కలిసి సన్న బియ్యం అంటూ విక్రయిస్తున్నారు. అయితే ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారులు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయకుండా ఎలా కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారో.. అదే రీతిలో సన్న బియ్యం పేరుతో దొడ్డుబియ్యం అంటగడుతూ మోసగిస్తున్న వారిపై కన్నేసి కటకటాలకు పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు చర్చికంపౌండ్లో బాణోతు సునిత అనే మహిళ నివాసముంటోంది. అయితే వీరునివాసముంటున్న ప్రాంతానికి ముగ్గురు గుర్తుతెలియని వ్యాపారులు ఆటోలో బియ్యం బస్తాలు వేసుకుని సన్న రకం బియ్యం అంటూ కేకలు వేసుకుంటూ వచ్చారు. కాగా, సునిత సన్న బియ్యం కావడంతో క్వింటా బియ్యం రూ. 3400 వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంట్లోకి తీసుకెళ్లినబియ్యం సంచులను విప్పి చూడగా.. పై భాగంలో సన్నగా.. కింది భాగంలో మొత్తం దొడ్డు బియ్యం ఉండడంతో ఒక్కసారిగా అవాక్కైపోయింది. చేసేదేమి లేక వెంటనే తేరుకున్న ఆమె మోసం చేసిన బియ్యం వ్యాపారులను వెతుక్కుంటూ చర్చికంపౌండ్ నుంచి సీతారాంపురం కాలనీకి చేరుకుంది. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో లబోదిబోమంది. ఇలా సునిత ఒక్కరే కాదు..జిల్లా వ్యాప్తంగా అమాయకులు మోసపోతున్నారు. ఉదయం ఓ చోట.. సాయంత్రం మరో చోట పీడీఎస్ బియ్యాన్ని మర ఆడించిన కొందరు అక్రమ వ్యాపారులు సన్న బియ్యం పేరుతో అమాయకులకు అంటగట్టేందుకు రోజుకో చోట ప్రత్యక్షమవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో నల్లగొండ, దేవరకొండ పట్టణాల్లో వందలాది క్వింటాళ్ల విక్రయించామని ఎక్కడా కూడా తమ బియ్యం బాగోలేదని చెప్పిన వారు లేరంటూ తెలుపుతున్నారు. ఉదయం నల్లగొండలో ఉంటే సాయంత్రానికి భువనగిరి లేదా దేవరకొండ పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు లేకపోలేదు. -
మృత్యు తటాకం..!
దురాజ్పల్లి : జిల్లా కేంద్రంలో మినీట్యాంకుబండ్గా మారుతున్న సద్దల చెరువు (తటాకం) మృత్యుతీరంగా మారుతుందా..? ఇందుకు ఇటీవల కాలంలో జరిగిన రెండు సంఘటనలు నిజమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గస్తీలోపమో...రక్షణ లేకపోవడమో కానీ.. నిండు ప్రాణాలు చెరువులో కలిసిపోతున్నాయి. ఇటీవల పట్టణంలోని ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడమే ఇందుకు నిదర్శనం. 2018 జనవరి 26 అర్ధరాత్రిర పట్టణంలోని అన్నాదురైనగర్కు చెందిన నంద్యాల శ్రీనివాస్ చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. 2017 నవంబర్ 11 అన్నాదురై నగర్కు చెందిన అలువాల సాయి అనే యువకుడు ప్రమాదవశాత్తు సద్దల చెరువులో జారిపడి మరణించాడు. మూడు నెలల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు.. అదీ ఒకే కాలనీకి చెందిన వారు చెరువులో ప్రాణాలొదలడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని సంవత్సరాల్లో చాలానే జరిగాయి. గతంలో కంపచెట్లతో చెరువు నిండి ఉండడంతో ప్రమాదాలను గుర్తించలేకపోయారు. కానీ.. ఇప్పుడు మినీ ట్యాంక్బండ్గా మారిన తర్వాత కూడా ప్రమాదాలను నివారించలేకపోతున్నారంటే అది గస్తీలోపమా..? లేక చెరువుకట్టపై రక్షణగోడలు లేకపోవడమా అనేది అర్థం కావడం లేదు. తూతూమంత్రంగా చర్యలు..! గత సంత్సరం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి చెరువులో శవమై తేలాడు. పట్టణంలో ఒక వ్యాపారి చెరువులో శవంగా కనపడ్డాడు. అభం శుభం తెలియని పసికందులు చెరువుల్లో శవల్లా కనిపిస్తున్న సంఘటనలు కొకోల్లాలుగా చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. ఇటు ప్రమాదాలను కానీ.. అటు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న హత్య, ఆత్మహత్య చర్యలను పోలీస్ యంత్రాంగా నివారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని కట్టపైకి వాహనాలు రాకుండా చూడాలని పట్టణ ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా.. చర్యలు మాత్రం తూతూమంత్రంగానే చేపడుతున్నారు. ముఖ్యం గా చెరువుకట్టపై మందుబాబుల ఆగడాలకు హద్దులు దాటుతున్నాయి. యువతీయువకులు పట్టపగలే చెరువుకట్టలపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇతరులు కూడా పెడదారి పట్టే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. చెరువు కట్టపై రక్షణ గోడలు ఏవీ? మినీట్యాంక్బండ్ను సుందరంగా తీర్చిదిద్దడంతో ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించడానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. పట్టణంలో ఉన్న పలు హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సెలవు దినాలలో తమ వెంట సహాయకులు ఎవరూ లేకుండా కట్టపై తిరుగుతున్నారు. దీనికి తోడు పట్టణంలో ఇరుకురోడ్ల కారణంగా కట్టపై నుంచి స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులు, ప్రయాణికులను చేరవేసే ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అయితే కట్ట పొడవునా రక్షణ లేకపోవడంతో ఇటీవలో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. కట్టపై రక్షణ గోడలు లేని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసుశాఖ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు గస్తీ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రక్షణ గోడలు ఏర్పాటు చేయాలి మినీ ట్యాంక్బండ్గా సద్దుల చెరువును మార్చడం సంతోషమే కానీ.. అక్కడ ప్రజలకు రక్షణ ఉన్నట్టుగా కనబడటం లేదు. పట్టణానికి ఆనుకుని చెరువు ఉండడంతో క్షణికావేశంలో కొందరు, ప్రమాదాలతో మరికొందరు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కట్టపై రక్షణ గోడలు ఏర్పాటు చేసి.. పోలీసులు గస్తీ తిరగాలి. – కోట గోపి, సూర్యాపేట
Advertisement