రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు పెరిగాయి | robberies increased in trains and railway stations | Sakshi
Sakshi News home page

రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు పెరిగాయి

Published Sat, Mar 26 2016 4:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు పెరిగాయి - Sakshi

రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు పెరిగాయి

- ధృవీకరించిన రైల్వేశాఖ గణాంకాలు


న్యూఢిల్లీ: 2014 ఏడాదితో పోల్చితే 2015లో రైళ్లు, రైల్వే స్టేషన్లలో దొంగతనాలు, చోరీలు పెరిగాయని రైల్వేశాఖ ధృవీకరించింది. 2014లో 16,798 దొంగతనాల కేసులు నమోదవగా, 2015లో ఆ సంఖ్య 21,688కు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అందిన సమాచారం ప్రకారం.. రైళ్లు, ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల లగేజీలు, బ్యాగుల చోరీ కేసులు 3,583 నమోదయ్యాయని రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

నడుస్తున్న రైళ్లలో దొంగతనాల కేసులు ఈ ఏడాది 2489 నమోదవగా, ప్లాట్‌ఫాంలపై చోటు చేసుకున్న దొంగతనాల కేసులు 1094గా నమోదయ్యాయి.  నేరాల నియంత్రణ, కేసుల నమోదు, పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ దొంగతనాలు నియంత్రించేందుకు రైల్వే శాఖ ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement