ముంబై: సొంతగడ్డపై బౌలర్లు చెలరేగడంతో... ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో గెలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో విజయంతో భారత్కు రెండు పాయింట్లు లభించాయి. ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ మాయాజాలానికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. 8 ఓవర్లు వేసిన ఏక్తా 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుంది. ఏక్తాకు లభించిన చివరి మూడు వికెట్లు ఐదు బంతుల తేడాలో రావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. స్పిన్నర్లు ఏక్తా బిష్త్ (4/25), దీప్తి శర్మ (2/33) భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.అంతకుముందు భారత ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ (58 బంతుల్లో 48; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్కు 69 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. స్మృతి ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ తడబడింది. ఒకదశలో ఒక వికెట్కు 85 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా పది పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి ఐదు వికెట్లకు 95 పరుగులతో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 44; 4 ఫోర్లు), వికెట్ కీపర్ తానియా (41 బంతుల్లో 25; 2 ఫోర్లు) సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆరో వికెట్కు 54 పరుగులు జత చేశారు.తానియా, మిథాలీ ఔటయ్యాక చివర్లో జులన్ గోస్వామి (37 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జార్జియా అమండా ఎల్విస్, నటాలీ షివెర్, సోఫీ ఎకిల్స్టోన్ రెండేసి వికెట్లు తీశారు.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు శుభారంభం లభించలేదు. పేసర్ శిఖా పాండే (2/21) ధాటికి ఇంగ్లండ్ 38 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే నటాలీ షివెర్ (44; 5 ఫోర్లు), కెప్టెన్ హీతెర్ నైట్ (39 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్కు 73 పరుగులు జోడించి ఇంగ్లండ్ను ఆదుకున్నారు. వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ 31వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు 111 పరుగుల వద్ద నటాలీ షివెర్ను ఏక్తా బిష్త్ రనౌట్ చేయడం మ్యాచ్ను మలుపు తిప్పింది. అనంతరం ఏక్తా తన స్పిన్ మాయాజాలంతో విజృంభించింది. తొలుత కేథరీన్ బ్రంట్ను ఔట్ చేసిన ఆమె... ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఐదు బంతుల తేడాలో ష్రబ్సోల్, సోఫీ ఎకిల్స్టోన్, అలెగ్జాండ్రా హార్ట్లెలను ‘డకౌట్’ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 25 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం.
ఏక్తా మాయాజాలం
Published Sat, Feb 23 2019 12:43 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మియాపూర్లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
క్రాష్ టెస్ట్లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
తప్పక చదవండి
- విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
- ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్
- ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
- కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
- బీఆర్ఎస్ ప్రక్షాళన.. కేసీఆర్ బిగ్ ప్లాన్ ఇదేనా?
- రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
- తెలంగాణ: 20 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
- నడిరోడ్డులో ఈ బిల్డప్ అవసరమా? ఇంకెక్కడా చోటే లేదా బాస్?! వైరల్ వీడియో
- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఎనిమిది మంది నక్సల్స్ మృతి
- 'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్
Advertisement