ఐదవ రోజు ఆట ఆరంభించిన భారత్; విజయలక్ష్యం 349 | India require another 349 runs with 10 wickets remaining | Sakshi
Sakshi News home page

ఐదవ రోజు ఆట ఆరంభించిన భారత్; విజయలక్ష్యం 349

Published Sat, Jan 10 2015 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

India require another 349 runs with 10 wickets remaining

సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు భారత్ జట్టు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదవ రోజు ఆటలో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగి శుభారంభాన్నిచ్చారు. ప్రస్తుతం మురళీ విజయ్ (4), కేఎల్ రాహుల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 8.2 ఓవర్లలో 17 పరుగులతో కొనసాగుతోంది.


అయితే ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆఖరి సెషన్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేశారు. కెప్టెన్ స్మిత్ (70 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (39 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. హాడిన్ (31 బ్యాటింగ్), హారిస్ (0 బ్యాటింగ్) పరుగులు చేశారు. ఆతిథ్య జట్టు ఆసీస్ 349 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 97 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (230 బంతుల్లో 147; 20 ఫోర్లు)కి తోడు అశ్విన్ (111 బంతుల్లో 50; 6 ఫోర్లు), భువనేశ్వర్ (75 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement