
నేటి నుంచి ఐపీటీఎల్
మనీలా (ఫిలిప్పిన్స్): అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. మనీలాలో ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ల మధ్య నేడు జరిగే మ్యాచ్తో లీగ్కు తెర లేవనుంది. భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టులో ఫెడరర్తో పాటు సానియా మీర్జా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అయితే తొలి అంచె పోటీల్లో ఫెడరర్ పాల్గొనడం లేదు.