బస్సు బోల్తా : 30 మందికి గాయాలు | 30 passengers injured in bus accident in prakasam district | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : 30 మందికి గాయాలు

Published Tue, Oct 4 2016 7:46 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామును రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి... బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి..  పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement