గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కరీంనగర్: గ్యాస్ సిలిండర్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం మామిండ్లవాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నాం జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ మతిన్ ఇంట్లో ఈ ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సిలిండర్ పేలుడికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వసం అవడమే కాక చుట్టు పక్కల ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.