'అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం' | ACB integration TDP Leaders pradeep and pullarao | Sakshi
Sakshi News home page

'అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం'

Published Tue, Jul 21 2015 5:23 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB integration TDP Leaders pradeep and pullarao

హైదరాబాద్: ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని టీడీపీ నేత ప్రదీప్ చౌదరితోపాటు విద్యార్థి నాయకుడు పుల్లారావు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో మంగళవారం వారిద్దరిని ఏసీబీ విచారించింది. ఆ విచారణ అనంతరం ప్రదీప్ చౌదరి, పుల్లారావులు విలేకర్లతో మాట్లాడారు. తన ఫోన్ లిస్ట్ ఆధారంగా తనను విచారించారని ప్రదీప్ వివరించారు.

అలాగే పుల్లారావు మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పుల్లారావు ఆరోపించారు. తనకు జిమ్మిబాబు స్నేహితుడని వివరించారు. వారితో మాట్లాడిన కాల్లిస్ట్ ఆధారంగానే తనను విచారించారని పుల్లారావు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement