
విడిపోయినా సహకరించుకోవాలి: వెంకయ్య
హైదరాబాద్: ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కొత్త ప్రభుత్వానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ సోదరులుగా ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని విధాలా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడానికి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.