సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు నష్టం కలిగించే నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం కోరింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామనే నిబంధనలు హేతుబద్ధంగా లేవని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య తెలిపారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు.