teacher posts
-
వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 13,497 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్టు వివరించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీచేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచనచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని, త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు. ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సంస్కరణలు తెస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్లో 15 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. తాము నారాయణ విద్యాసంస్థలతో పోటీపడేలా పనిచేస్తున్నామని, 9వ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూల్స్కు ర్యాంకింగ్స్ ఇస్తామన్నారు. నాడు–నేడుతో ప్రయోజనం లేదు గత ప్రభుత్వం టీచర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఘనంగా మోసం చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా చాకరీ చేయించిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు చెప్పడంతో వారు పాఠాలు చెప్పలేకపోతున్నారని, దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో ఎలాంటి ప్రమోజనం లేదని, దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు.. పాఠశాలలు శిథిలమైపోయాయన్నారు. విద్యారంగానికిరూ.29 వేల కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమన్నారు. -
కొత్త టీచర్లకు నేడు నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వీరికి బుధవారం నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్కాల్స్ వచ్చాయి. ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్ 30న డీఎస్సీ మెరిట్ లిస్ట్ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు. 10,006 పోస్టుల భర్తీ.. మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్లాగ్లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు. ఎస్జీటీ, ఎస్ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
నార్కట్పల్లి: త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టుల ను భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రా హ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో ఆయన పాల్గొ ని విద్యార్థులకు నోట్బుక్స్, యూని ఫాం అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. బాత్రూమ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పా రు. నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల–ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీళ్లు నింపి డిసెంబర్లోపు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ బీమన్న, డీఈ మహేశ్, ఉదయ సముద్రం ప్రాజెక్టు సీఈ అజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
డీఎస్సీపై దగాకోరు రాతలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లు సీఎంగా పనిచేసి కేవలం 300 టీచర్ ఉద్యోగాలిచ్చిన చంద్రబాబును ఇదేమిటని ఎన్నడూ ప్రశ్నించరు ఈనాడు రామోజీరావు. గత ఐదేళ్లలో ఇప్పటికే 15 వేల టీచర్ ఉద్యోగాలిచ్చి పేదల పిల్లలకు చక్కటి చదువులు అందిస్తూ మరో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మాత్రం విషం చిమ్ముతారు అదే రామోజీ. ఎందుకంటే.. రామోజీ, చంద్రబాబు అంటేనే పెత్తందార్ల పెద్దలు. పేదల పిల్లల ఎదుగుదల, అభివృద్ధిని సహించలేరు. అందుకే పేదల చదువులపై ఎప్పుడూ విషం చిమ్ముతుంటారు. అదే క్రమంలో రాష్ట్రంలో తాజా డీఎస్సీపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి.. మెగా.. దగా.. అంటూ ఓ కుటిల కథనం అచ్చేశారు. అసలు ఈ పోలికే ఓ దగా. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నీ మురగపెట్టి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటున్నారు. కానీ, మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 1998 డీఎస్సీ నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ, మరో 12,00 కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు కలిపి 15 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇవన్నీ కలిపితే సీఎం జగన్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు 21,108. అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్న పోస్టులకంటే ఏపీలో పోస్టులే అధికం. ఈ విషయం చెప్పకుండా రామోజీ పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ కథనం ఇవ్వడం దగా కాక మరేమిటి? తాజా డీఎస్సీతో అన్ని ఖాళీల భర్తీ తాజాగా 2024 డీఎస్సీలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఆశ్రం), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ విద్యా సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇకపై ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి బోధన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బాబు డీఎస్సీ పెద్ద నాటకం చంద్రబాబు హయాంలో డీఎస్సీ ఓ పెద్ద నాటకం. చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. కానీ, డీఎస్సీకి చంద్రబాబు పేటెంట్ అన్నట్టు ఈనాడు కలరింగ్ ఇస్తోంది. ఇది సీఎం జగన్ చేసిన మేలు 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో నూరు శాతం టీచర్లను నియమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాత, కొత్త డీఎస్సీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమారు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు. అంతకు ముందు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా దశాబ్దాలుగా పోస్టింగ్స్ కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వీరినీ పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఇలా చంద్రబాబు దొంగ నాటకానికి బలైపోయిన అభ్యర్థులను సీఎం జగన్ చొరవ తీసుకుని టైం స్కేల్ ప్రాతిపదికన నియమించారు. ఇలా 1998 డీఎస్సీలోని 4,059 మంది, 2008 డీఎస్సీలోని 2,193 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చారు. వీటితో పాటు కేజీబీవీల్లో సుమారు 1,200 మంది రెగ్యులర్ టీచర్లను నియమించారు. నిత్యం శుద్దపూస కబుర్లు చెప్పే రామోజీ.. చంద్రబాబు చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ చేసిన ఈ మేలు గురించి ఒక్క అక్షరం రాయరు. ఇది రామోజీ కుటిలత్వం రామోజీ బోడి గుండుకు.. మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఖాళీలను దాచేస్తున్నారంటూ పాతరాగానికి కొత్త ట్యూన్ కట్టారు. ఇక్కడ పాఠశాలల అభివృద్ధిని కాంక్షిస్తూ రుణం వస్తుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తేనే ఆ పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కుతుంది. ఈనాడు చెప్పినట్టు కేవలం రుణం కోసం ఖాళీలను దాచేసి పాఠాలు చెప్పేవారు లేకుండా చేసి విద్యాభివృద్ధిని ఎలా సాధిస్తారు? కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా రామోజీ రాతల్లోని కుటిలత్వం బోధపడుతుంది. తెలంగాణలో ఇవెందుకు లేవు రామోజీ? విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు కళ్లకు కడుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం, టొఫెల్, సీబీఎస్సీఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ మూరుమూల పల్లెలోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి. మన పిల్లలను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. అక్కడి పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని ఈనాడు రాయదు. ఇక్కడ రామోజీ లక్ష్యం ఒక్కటే.. అది సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచడం. -
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఎం రేవంత్రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు. -
11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియా మకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజులపాటు పరీక్ష నిర్వహించే వీలుందని... ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్వేర్కు రూపకల్పన చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులే ఎక్కువ.. విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నట్లు లెక్కగట్టారు. వాటిల్లో ఎస్జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉండే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500–2,000 వరకూ ఎస్ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులొచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా అధికారులు డీఎస్సీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్వర్డ్స్, ఆన్లైన్ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. -
11 వేల పోస్టులతో డీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ ద్వారా మొత్తం 11 వేల టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని రెండ్రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు.. టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెనువెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్... గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డీఎస్సీని రద్దు చేయాల్సి వచ్చింది. అదీగాక.. డీఎస్సీలో ప్రకటించిన 5,089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీల్లేని పరిస్థితి తలెత్తింది. నాన్–లోకల్ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకూ పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. లోపాల్లేకుండా చూడాలి.. నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపు తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాల్లే కుండా చూడాలి. వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి.. ఖాళీలను భర్తీ చేయాలి. – రామ్మోహన్రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఖాళీలు ఎన్ని?.. భర్తీ చేసేవి ఎన్ని? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కలి్పంచడం ద్వారా 1,974 హెచ్ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకూ ఖాళీలు ఉండగా వాటిలో 70 శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి. కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిట్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11 వేలకుపైగా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
మెగా డీఎస్సీనేనా?
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మెగా డీఎస్సీ ప్రస్తావన రావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. 22 వేల ఖాళీలున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అధికారులు 18 వేల పోస్టులే ఉన్నట్టు సర్కారుకు నివేదించారు. మెగా డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిదాకా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క 2017లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, 8,792 పోస్టులు భర్తీ చేశారు. అప్పటికే 2.5 లక్షల మంది టెట్కు అర్హత సాధించి ఉన్నారు. కొత్త నియామకాలపైనే దృష్టి ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిసెంట్లు(ఎస్ఏ)గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ల ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేసి, 30 శాతం స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కూళ్లలో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థులున్నా, టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్దీకరణ చేయాలని విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది. ఈ సమస్యల కార ణంగానే 2022లో డీఎస్సీ ద్వారా కేవలం 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పదోన్నతులు కల్పించి, హేతుబద్దీకరణ చేపట్టి వాస్తవ ఖాళీలను భర్తీ చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే జరిగితే గత ఏడాది ఆగిపోయిన డీఎస్సీ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అడ్డంకులెన్నో... ఉపాధ్యాయ నియామకాల ప్రస్తావన వచ్చి నప్పుడల్లా లక్షలాదిమంది కోచింగ్ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది. అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు ముందు దీనిని చేపట్టాల్సి ఉంటుంది. వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగే వీలుంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలి విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయి. లక్షల మంది టెట్ ఉత్తీర్ణులై టీచర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో నియామకాలు చేపడితేనే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి. – రావుల రామ్మోహన్రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీపై కొత్త ప్రభుత్వం ఆరా తీసింది. నిలిచిపోయిన నియామకాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాకబు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీఎస్సీ రీ షెడ్యూల్? ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. రోస్టర్ విధానాన్ని స్పష్టం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఆగిపోయిన డీఎస్సీని ముందుకు తీసుకెళ్ళడమా? కొత్త షెడ్యూల్ ఇవ్వడమా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్ విధానం వెల్లడించిన తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి. స్థానికేతరులకూ కేవలం 15 శాతమే అర్హత ఉండటంతో డీఎస్సీపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లోనే కొన్ని పో స్టులు కలపాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. 20 వేలకుపైగానే ఖాళీలు విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు తెలిపారు. -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
టెట్లో తగ్గిన రిజల్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 15న జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టెట్ రెండు పేపర్లకు కలిపి 4,13,629 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 1,11,562 మంది అర్హత పొందారు. పేపర్–1ను 2,23,582 మంది రాస్తే 82,489 (36 .98%)మంది అర్హత పొందగా పేపర్–2లో మేథ్స్, సైన్స్ సబ్జెక్టులను 1,01,134 మంది రాస్తే 18,874 మంది (18.66%), సోషల్ స్టడీస్సబ్జెక్టును88,913 మంది రాస్తే 10,199 మంది (11.47%) అర్హత సాధించారు. పేపర్–2లో 1,90, 047 మందికి గాను 29,073 (15.30%) మంది అర్హత పొందారు. టెట్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://cgg.gov.inÌలో తుది ‘కీ’తోపాటు ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడిపోయిన ఫలితాలు...: ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు పరీక్ష జరిగింది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది టెట్ అర్హులు రాష్ట్రంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టెట్ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా పేపర్–1లో 2022లో మినహా అంతకు ముందు రెండేళ్లలో 50 శాతానికిపైగా రిజల్ట్ వచ్చింది. పేపర్–2లో మొదట్నుంచీ రిజల్ట్ తగ్గుతున్నా ఈసారి అతితక్కువగా 15.30 శాతమే నమోదైంది. గతేడాది ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే ప్రకటనతో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్కు సన్నద్ధమయ్యారు. ఈసారి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసినా పోస్టులు తక్కువగా ఉండటం, రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఏమాత్రం ఖాళీలు లేకపోవడంతో ఎక్కువ మంది టెట్కు ప్రిపేర్ కాలేదు. టీఆర్టీ దరఖాస్తుకు అర్హులు తాజాగా టెట్ ఉత్తీర్ణులు ప్రస్తుతం ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడవ్వడంతో ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీఆరీ్టకి ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్థానికత ఉన్నప్పటికీ పోస్టులు లేవని, పోస్టులు ఉన్న చోట నాన్–లోకల్ కోటాలో వెళ్లినా, ఆ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు టీఆర్టీకి వెనకడుగు వేస్తున్నారు. తాజా టెట్ అర్హులు టీచర్ పోస్టులకు ఎక్కువగా దరఖాస్తు చేసే వీలుందని భావిస్తున్నారు. -
ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియెట్ చదవకుండా గతంలో డైరెక్ట్ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. -
మెగా డీఎస్సీని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్ను విడుదల చేయడం సరికాదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు... మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
టెట్పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
తగ్గిన పోస్టులు..పెరిగిన ఆందోళన
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగులు ఆందోళన బాట పడుతుంటే, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు తప్పడం లేదు. 2017 తర్వాత ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ ఉంటుందంటే నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ దాదాపు 22 వేల ఖాళీలున్నాయని లెక్కగట్టడం దీనికి ఓ కారణం. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి దాదాపు 6,612 పోస్టుల భర్తీకే సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది టెట్ అర్హులు టీచర్ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో సగం పోస్టులు కూడా లేకపోవడంతో వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లలో అసంతృప్తి ఇప్పటికే స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. వేరే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు. గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధ న చేపట్టారు. దీంతో టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉన్న రెండు సెక్షన్లకూ బోధన చే యాల్సి వస్తోంది. ఈ కారణంగా తమపై పని భారం పెరిగిందని టీచర్లు అంటున్నారు. రా ష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 22 వేల వరకూ ఖాళీలున్నాయని విద్యాశాఖ గత ఏడా ది లెక్కలు వేసింది. ఇందులో 13,086 పోస్టు లు భర్తీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం కూడా 9,370 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్ర త్యేక అవసరాల పిల్లలకు బోధించే టీచర్లను కలుపుకొంటే 6,612 మందిని మాత్రమే నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో భారీ ఎత్తున చేపట్టాల్సిన నియామకాల జాడే కన్పించలేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లో ఎక్కువగా సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్ పో స్టులే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లిష్, మా థ్స్ సబ్జెక్టులకు భారీగా కోత తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. దీనివల్ల ఉన్న టీచర్లపై పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు వస్తే తప్ప మి గతా ఖాళీలు భర్తీ చేయడానికి వీల్లేదని ప్రభు త్వం అంటోంది. న్యాయ వివాదం కొన్నేళ్లుగా నలుగుతోంది, దీంతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆందోళన బాటలో నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలపై టెట్ ఉత్తీర్ణులు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్ల సమయంలో కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని మరీ కోచింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలని అప్పులు చేసి, హాస్టళ్లల్లో ఉండి సిద్ధమయ్యారు. కానీ టీచర్ల పదోన్నతులు ఇస్తేనే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టుల ఖాళీలు తెలుస్తాయి. వాటిని భర్తీ చేయడానికి వీలుంటుంది. ఇవేవీ జరగకపోవడంతో నిరుద్యోగులు ఏడాదిగా నలిగిపోతున్నారు. తాజాగా 6,612 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించడంతో వారు ఆందోళనలకు దిగుతున్నారు, 13,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
6,612 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆమె గురువారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, 1,523 పోస్టులు ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం నిర్దేశించినవి. వీటిని త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. 2017లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించి 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. దీనితో గతంలో నిర్వహించినట్టుగా డీఎస్సీల ద్వారా నియామకాలు చేపట్టనున్నాం..’’ అని మంత్రి సబితారెడ్డి వివరించారు. 9,979 పోస్టులకు పదోన్నతులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,22,386 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. వీటిలో 1,03,343 పోస్టుల్లో టీచర్లు పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 6,612 పోస్టులను భర్తీ చేస్తుండగా.. పదోన్నతుల ద్వారా మరో 9,979 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన కేటగిరీలో గెజిటెడ్ హెచ్ఎం ఖాళీలు 1,947 ఉన్నాయని, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు 2,162 ఉన్నాయని.. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతుతో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎస్జీటీ టీచర్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న టెట్ డీఎస్సీ ద్వారా చేపట్టాల్సిన నియామకాలకు టెట్ కీలకమని.. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహిస్తామని సబితారెడ్డి ప్రకటించారు. టెట్ ఫలితాలను వచ్చేనెల 27వ తేదీన ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాల ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతోందని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తక్షణమే వాటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇటీవల కేజీబీవీల్లో 1,264 పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగిందని.. కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుతో మరో 160 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా విద్యాశాఖలో 3,896 మందికి లబ్ధి చేకూరిందని, ఇందులో అత్యధికులు విద్యాశాఖ వారే ఉన్నారని మంత్రి చెప్పారు. గురుకుల విద్యాసంస్థల్లో కూడా పలువురు ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. మొత్తంగా విద్యాశాఖ పరిధిలో 8,792 పోస్టులు, కాలేజీల్లో 3,149 పోస్టుల భర్తీ ప్రక్రియలు టీఎస్పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నాయని తెలిపారు. భర్తీ చేసే టీచర్ పోస్టులు ఇవీ.. మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు: 6,612 జనరల్ టీచర్లు: 5,089 వీరిలో స్కూల్ అసిస్టెంట్లు: 1,739 సెకండరీ గ్రేడ్ టీచర్లు: 2,575 భాషా పండితులు: 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 164 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 1,523 వీటిలో ప్రాథమిక స్థాయిలో 796 పోస్టులు – ప్రాథమికోన్నత స్థాయిలో 727 పోస్టులు ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ’ ఇలా.. ప్రతి జిల్లాకు ఒక ‘డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)’ ఉంటుంది. దీనికి సదరు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా జిల్లా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (జెడ్పీ సీఈఓ) వ్యవహరిస్తారు. గతంలో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. -
Fact Check: వాస్తవాలకే ఉరి!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యకు ఉరి బిగిసింది చంద్రబాబు హయాంలోనే. ఆయన అధికారంలో ఉండగా ఏనాడు విశ్వవిద్యాలయాలను పట్టించుకోలేదు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. 2017–18లో తప్పుల తడకగా ఇచ్చిన నోటిఫికేషన్తో కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఫలితంగా ఆచార్యుల పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఇదీ వాస్తవం. రామోజీరావు మాత్రం ఈనాడు ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపుతుంటే పదేపదే నిస్సిగ్గుగా అసత్యాలు వల్లె వేస్తున్నారు. కనీసం ఇంగితం లేకుండా.. ఇది టెక్నాలజీ యుగం.. అత్యధికంగా కంప్యూటర్, కృత్రిమ మేథ రంగాల వైపు అంతా ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ మార్పు దేశవ్యాప్తంగా ఉంది. సహజంగానే అన్ని చోట్లా ఈ ప్రభావం తప్పదు! ఈనాడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో పీజీ విద్యార్థులు, అడ్మిషన్లు తగ్గిపోవడాన్ని ప్రస్తావించకుండా ఇదంతా ఒక్క ఏపీలోనే జరిగిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. సెంట్రల్ వర్సిటీల్లో సీట్ల భర్తీ గురించి ఈనాడు ఎందుకు ప్రస్తావించలేకపోయింది? పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి, అడ్మిషన్లు తగ్గిపోవడానికి అసలు సంబంధమే లేదు. అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ పరీక్షలు ఆగస్టుకి పూర్తవుతాయి. అందుకే సెప్టెంబర్లో ప్రవేశాల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు. డిగ్రీ ఫలితాలు రాకుండానే వర్సిటీలో అడ్మిషన్లు ఎలా ఇస్తారనే జ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్టు రాయడం ఈనాడుకే చెల్లింది. 2021–22లో తొలిసారిగా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉన్నత విద్యా మండలి వీడియోలు, పోస్టర్లను రూపొందించింది. దీన్ని అపహాస్యం చేస్తూ సీట్లు ఇస్తామని విద్యార్థులను బతిమిలాడుతున్నట్టు ఈనాడు కథనాలు ప్రచురించడం హేయం. నకిలీ అడ్మిషన్లకు అడ్డుకట్ట టీడీపీ హయాంలో ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కై కాగితాలపై పీజీ అడ్మిషన్లు చూపించి ఫీజురీయింబర్స్మెంట్ దోచిపెట్టారు. యూజీలో సున్నా అడ్మిషన్లు ఉన్న కాలేజీల్లో సైతం పీజీకి వచ్చే సరికి నూటికి నూరు శాతం అడ్మిషన్లు ఉండేవి. యూజీలోనే పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు లేని చోట పీజీ విద్యను నడిపించేశారు. వీటికి ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వర్సిటీల్లో పీజీ విద్యకు ఫీజురీయింబర్స్ ఇస్తోంది. ప్రతిభ ఆధారంగా అన్ని వర్గాల విద్యార్థులకు విద్యను అందిస్తోంది. అప్పుడు ఆర్ట్స్ గుర్తు రాలేదా? రామోజీ దృష్టిలో దార్శనికుడైన చంద్రబాబు ఆర్ట్స్, హిస్టరీ సబ్జెక్టులే అవసరం లేదని తేల్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు?లేడీ శ్రీరామ్, లయోలా చెన్నై, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లాంటి విద్యా సంస్థలు రాష్ట్రంలో ఒక్కటైనా లేవని శోకాలు పెడుతున్న రామోజీకి గతంలో ఈ విషయం గుర్తు రాలేదా? అధికారం దూరమైందనే అక్కసుతో అజ్ఞానపు విమర్శలు చేయడం సిగ్గు అనిపించట్లేదా? ద్రవిడ వర్సిటీలో ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడేదో కొత్తగా తగ్గిపోయినట్టు ఈనాడు చిత్రీకరించింది. నిజానికి 2014 నుంచే తగ్గిపోయాయా? చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆ వర్సిటీ ఉంది కాబట్టే నాడు గుర్తు లేదేమో? పెరిగిన ప్లేస్మెంట్లు.. ప్రవేశాలు గత ప్రభుత్వ హయాంలో సాధారణ డిగ్రీలో 37 వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పుడు లక్షకు పైగా పెరిగాయి. సాధారణంగా డిగ్రీ తర్వాత ఉద్యోగాల్లో చేరే విద్యార్థులు పీజీపై ఆసక్తి చూపరు. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు దాదాపు 3 రెట్లు పెరగడంతో సహజంగానే పీజీ అడ్మిషన్లు తగ్గుతాయి. ఉద్యోగం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో పీజీ చదువుతారు. ఇంటర్ తర్వాత డిగ్రీ కంటే ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కారణం.. ప్రభుత్వం విద్యా దీవెన కింద పూర్తి ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద మెస్ చార్జీలను కూడా అందించడమే. అందుకే 2018–19లో ఇంజనీరింగ్లో చేరికలు 87 వేలు ఉంటే ఇప్పుడు 1.20 లక్షలకు చేరుకున్నాయి. అంటే 30 వేల మందికిపైగా డిగ్రీలో చేరాల్సిన విద్యార్థులు సాంకేతిక విద్య వైపు వెళ్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇంటర్ తర్వాత డ్రాపవుట్లు 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గాయి. ఇదంతా విద్యావ్యవస్థ బలోపేతం కాదా రామోజీ? ఇవి మార్పులు కాదా? గత నాలుగేళ్లలో సీఎం జగన్ దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఏ కోర్సు అభ్యసించినా విద్యార్థికి కచ్చితంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా సింగిల్ మేజర్ సబ్జెక్టును ప్రవేశపెట్టింది. వీటికి తోడు 100కిపైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఆఫ్లైన్, ఆన్లైన్లో నైపుణ్య కోర్సులు, ఇంటర్న్షిప్, కమ్యూనిటీ డెలప్మెంట్ ప్రోగ్రామ్లను తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలు ఈనాడుకు కనపడవా? యూజీసీ చర్యలూ తప్పేనా? యూజీసీ సైతం సెంట్రల్ వర్సిటీలకు కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తోంది. తెలంగాణ కూడా స్టేట్ వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. చాలా రాష్ట్రాల్లో వర్సిటీలు ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. మరి రామోజీకి తాను నివాసం ఉంటున్న తెలంగాణలోని వర్సిటీలు కనిపించట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీలపై మాత్రం వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. ఇది కడుపు మంటతో వచ్చిన కపట ప్రేమే కదా! గతంలో ఒక విద్యార్థి వివిధ విశ్వవిద్యాలయాలకు విడివిడిగా ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి వచ్చేది. ప్రతి వర్సిటీకి ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఒకే టెస్టుతో అర్హత సాధించి ఇష్టమైన వర్సిటీలో చేరే వెసులుబాటు కలిగింది. దీని ద్వారా టాలెంట్ కలిగిన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు ఉన్న వర్సిటీలో తొలి ప్రాధాన్య సీటు పొందుతున్నారు. -
ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తుండటం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో ఉత్తీర్ణులైన వారూ గంపెడాశలు పెట్టుకున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని భావించారు. కానీ కల నెరవేరకపోవడంతో, నోటిఫికేషన్ వెలువడే సూచనలు లేకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్లో నిర్వహించిన టెట్లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్ ఉత్తీర్ణులు వాపోతున్నారు. పదోన్నతులకు, నియామకాలకు ముడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడి చేసినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేయడం లేదనే విమర్శలున్నాయి. కోర్టు వివాదాలకు దారి తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్ళడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి బదిలీలు, ప్రమోషన్స్ పేరిట కాలయాపన చేయడం వల్ల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మేమంతా టీచర్ పోస్టులు వస్తాయని ఉన్న ఉద్యోగాలు మానేసి, పోటీ పరీక్షకు రూ.వేలు ఖర్చు పెట్టాం. అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, టీఆర్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక శాఖకు అనుమతివ్వాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చాలి రాష్ట్రంలో 60 శాతానికి పైగా గెజిటెడ్ హెచ్ఎంలు, వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యాశాఖ ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాలయాపన చేయకుండా తక్షణమే బదిలీలు, పదోన్నతుల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి. – ఎం చెన్నయ్య (పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు) వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుని.. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ టీచర్ పోస్టునే లక్ష్యంగా పెట్టుకుంటారు. అవకాశం వచ్చే వరకు ప్రైవేటు స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తుంటారు. కొందరు ఇతర ఉద్యోగాలూ చేస్తుంటారు. టెట్ పరీక్ష నిర్వహించే కొన్ని నెలల ముందు వీరంతా తాము అంతకుముందు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యయప్రయాసలకోర్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. ఇదే క్రమంలో గత ఏడాది జూన్లో నిర్వహించిన టెట్కు హాజరయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల మంది వరకు పరీక్ష రాశారు. 1–5 తరగతులకు బోధించేందుకు డీఎడ్ అర్హతతో టెట్ పేపర్–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులు కారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు పేపర్–2తోపాటు, పేపర్–1 రాసేందుకూ వీలు కల్పించారు. దీంతో అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరీక్షలో ఏకంగా 2 లక్షల మందికి పైగా అర్హత సాధించడంతో మొత్తం అర్హుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్ అయ్యే అవకాశం వస్తుందని వీరంతా ఎదురుచూశారు. -
44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
గన్ఫౌండ్రీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బషీర్బాగ్లోని విద్యాశాఖమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయుల ద్వారా కాకుండా శాశ్వత ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిమెట్టు.. తీసికట్టు!
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్లైన్ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. షెడ్యూలు ఇలా.. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. టీచర్ల కొరతతోనే.. సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయులు లేక ఇన్చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. (చదవండి: ఎన్ఐఏ విస్తృత తనిఖీలు) -
టెట్ పాస్.. మరి టీచర్ కొలువెప్పుడో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్)లో ఉత్తీర్ణులైన వేలాదిమంది టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తుందంటూ ఆసక్తిగా వాకబు చేస్తున్నారు. 2016 నుంచి టెట్లో అర్హత సాధించిన అనేకమంది టీచర్ రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యం, టెట్ విధానాల్లో మార్పులు తేవడం, భారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఉద్యోగాలు మానేసి:చాలామంది బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ప్రైవేటు స్కూళ్లల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లంతా గత జూన్లో జరిగిన టెట్ పరీక్షకు హాజరయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షలమంది వరకూ టెట్ రాశారు. 1–5 తరగతులు బోధించేందుకు డీఎడ్ అర్హతతో టెట్ పేపర్–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ అభ్యర్థులు అర్హులుకారు. కానీ, ఈసారి టెట్లో బీఈడీ అభ్యర్థులు పేపర్–2తోపాటు పేపర్–1 రాసే వీలు కల్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–1 రాసి పోటీపడుతున్నారు. ఈ ఏడాది నియామకాలు ఉండేనా? రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో దాదాపు 19 వేల పోస్టులున్నట్టు ప్రభుత్వం లెక్కతేల్చింది. 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. అయితే, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప వాస్తవ ఖాళీల లెక్క తెలియదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. దీంతో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లభించడంలేదని ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడంతో పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని టెట్ అర్హత పొందినవారు ఆశించారు. ఈ నేపథ్యంలో వాస్తవ ఖాళీలు తెలియకుండా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తారా? టెట్ అర్హులకు అవకాశాలు లభిస్తాయా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఉద్యోగం మానేసి శిక్షణ ఈ ఏడాది టెట్లో అర్హత సాధించాను. ప్రైవేటు స్కూల్ టీచర్ ఉద్యోగం మానేసి ప్రభుత్వ టీచర్ నియామకం కోసం శిక్షణ తీసుకుంటున్నాను. కానీ, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియడం లేదు. – ప్రవీణ్, టెట్ ఉత్తీర్ణుడు, హైదరాబాద్ కరోనాతో రోడ్డెక్కా..టెట్తో ఆశలు బీఈడీ చేసిన తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. కోవిడ్ మూలంగా రెండేళ్ల నుంచి సరిగా జీతాలు ఇవ్వడంలేదు. ఊళ్ళో పొలం పనులకు వెళ్తున్నా. కానీ, టెట్ రావడం, ఉపాధ్యాయ నియామకాలు చేపడతారనే ఆశ రేకెత్తడంతో కోచింగ్ తీసుకుంటున్నాను. – ఆర్.జీవన్కుమార్, టెట్ అర్హుడు, వరంగల్ -
త్వరలో 21 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: సబిత
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ టు పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘మన ఊరు మన బడి... మన బస్తీ మన బడి’ పథకంపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. మంత్రి సబిత ఏమన్నారంటే.. ►మూడు దశల్లో స్కూళ్లను ఆధునీకరిస్తాం. రూ. 7,289.54 కోట్ల మొత్తం బడ్జెట్ ఖర్చుతో 26,065 పాఠశాలల్లో పనులు చేపడతాం. ►మొదటి దశలో రూ. 3,497.62 కోట్ల అంచనా బడ్జెట్తో బడులను బాగు చేస్తాం. మొదటి దశలోనే 9,123 స్కూళ్లను ఎంపిక చేశాం. మన ఊరు–మన బడి పథకంలో పూర్వ విద్యా ర్థులను, దాతలను భాగ స్వాములను చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆయన చది విన స్కూలుకు రూ.3.5 కోట్ల విరాళం ఇచ్చారు. ►ఎవరైనా రూ.2 లక్షలు ఖర్చు చేస్తే స్కూలు సభ్యుడిగా ఉంచుతాం. రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి పేరు పెడతాం. ►ప్రాథమికపాఠశాలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.50 లక్షలు, ఉన్నత పాఠశాలకు కోటి ఖర్చు చేస్తే దాతల పేర్లు పెడతాం. ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ... టీచర్లకు 14 నుంచి ఆంగ్లభాషపై శిక్షణ ఇస్తామని సబిత తెలిపారు. విద్యాశాఖలో త్వరలోనే 21 వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 973 గురు కులాలను ఏర్పాటు చేస్తే అడ్మిషన్లు కావాలని ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. -
ఎయిడెడ్పై చంద్రబాబు ఆందోళనలు విడ్డూరం
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయబోనని ఉత్తర్వులు ఇచ్చిన ఘనుడు చంద్రబాబేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈరోజు అదే చంద్రబాబు ఆందోళనలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఉత్తుర్వులు ఇచ్చేటప్పుడు బాబుకు బుద్ధి ఏమైందని, ఆయన హయాంలో చాలా ఘోరాలు జరిగాయని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సజ్జల మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్ధల్లో టీచర్లు సరిపడా లేనందువల్ల వాటిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, యాజమాన్యాలు వాటిని నడపలేకపోతున్నాయని తెలిపారు. ఆ సంస్థలను, టీచర్లను స్వచ్ఛందంగా అప్పగిస్తే ప్రభుత్వం నడుపుతుందని, లేదా టీచర్లను సరెండర్ చేసి మీరే విద్యా సంస్థలను నడుపుకోవాలని ఓ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఇందులో బలవంతం లేదు అని కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న చర్యలతో రానున్న ఐదు, పదేళ్లల్లో మన రాష్ట్రం హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. ఫీజుల నియంత్రణకు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం జరుగుతున్న మహా విద్యా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అనంతపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఎయిడెడ్ విద్యా సంస్థలో వాళ్లు గొడవ చేస్తే చంద్రబాబు కొడుకు లోకేశ్ అక్కడకు వెళ్లి కారుకూతలు కూస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం ఎలా అని లోకేశ్ అంటున్నాడని, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తోన్న విషయం గుర్తిస్తే మంచిదని చెప్పారు. చిన్న ఘటనను వారే సృష్టించి, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. వారు చెబుతున్న కాలేజీని సరెండర్ చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా వచ్చే వారి కాలేజీలనే ప్రభుత్వం తీసుకుంటుందని, వెనక్కి తీసుకుంటామన్నా తిరిగి ఇచ్చేస్తుందని తెలిపారు. పదవి పోయిన నిస్పృహతో లోకేశ్ పచ్చమూకను వెంటేసుకొని అబద్ధాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, పచ్చ మీడియా విష ప్రచారాన్ని అందరూ ప్రశ్నించాలని కోరారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాల కొనసాగింపులో భాగంగా సీఎం జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
డీఎస్ఎస్ఎస్బీలో 5807 టీజీటీ పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ)ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ)..అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 5807 ► సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ. ► అర్హత: మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజస్(ఎంఐఎల్)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్లో అర్హత కలిగి ఉండాలి. ► వయసు: 32ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: వన్ టైర్/టూ టైర్ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 04.06.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.07.2021 ► వెబ్సైట్: https://dsssb.delhi.gov.in -
‘విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి’
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్లోని రాష్ట్ర బీసీ భవన్లో తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం వ్యవస్థాపకుడు సుతారపు వెంకట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యారంగ సమగ్ర వికాసానికి ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ గా ఉన్న 40 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుతారపు వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడిగా పరంకుశం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మధుకర్, సం యుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్లు ఎన్నికయ్యారు. -
వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏజెన్సీ రిజర్వేషన్ల వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్తో సమీక్ష జరిపిన వైఎస్ జగన్ గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కనుక, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు నమోదు 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' -
వచ్చే నెలలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీని కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో త్వరితంగా నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రాథమికంగా 12 వేల నుంచి 15 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18 వేల మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10 వేల మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లోకి కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుత డీఎస్సీలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల సమగ్ర సమాచారాన్ని ఆయా జిల్లాల నుంచి రప్పించేందుకు అధికారులకు ఆదేశాలు పంపనున్నామని అధికారులు తెలిపారు. అలాగే, మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆ శాఖ నుంచి తెప్పిస్తున్నారు. జనవరి మొదటి వారంలో టెట్..ఆఖర్లో డీఎస్సీ నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్ అర్హత పరీక్ష (టెట్)ను, టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ)ని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే, ఈసారి రెండింటినీ కలపకుండా వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం.. టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహించాలి. 2018లో టెట్ను ఒకసారి నిర్వహించారు. ఈ ఏడాదిలో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాలవల్ల దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా టెట్ నోటిఫికేషన్ను జనవరి మొదటి వారంలో ఆ తరువాత నెలాఖరున డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరి ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు వచ్చే ఏడాది నుంచి, ఆ తరువాతి ఏళ్లలో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్, డీఎస్సీలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపర్చనున్నారు. టెట్ పేపర్–1, 2 రెండింటిలోనూ ఇంగ్లీషు ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్–2ఏలో భాషాంశాలు, కమ్యూనికేషన్ ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా, డీఎస్సీ–2018లో కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆంగ్ల నైపుణ్యాలపై ఒక పేపర్గా పెట్టారు. ఈసారి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్ పెట్టనున్నారు. అలాగే, టెట్లో ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రత్యేక పేపర్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎదురుచూపు గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తిచేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్లలో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్పై దృష్టిసారించారు. డీఎడ్ అభ్యర్థులు రెండు బ్యాచ్లు కలిపి 80వేల మంది, బీఎడ్ అభ్యర్థులు 30వేల మందితో పాటు గతంలోని అభ్యర్థులూ వేలల్లోనే ఉన్నారు. -
సారీ.. టీచర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘కొండంత రాగం తీసి.. ’’ అనే చందంగా తయారైంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారం. కోర్టు కేసులున్న దివ్యాంగుల కోటా మినహా దాదాపు అన్ని పోస్టుల్లో నియామకాలు చేపడతామని ఇటీవల సర్కారు పేర్కొంది. దీంతో సర్కారు బడులకు మంచి రోజులు రానున్నాయని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో అన్ని పోస్టులు కాదు కొన్నింటినే భర్తీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ఎప్పటిలాగే ఈ విద్యాసంవత్సరం కూడా సర్కారు బడుల విద్యార్థులకు అరకొర బోధనే దిక్కుకానుంది. గుర్తించిన పోస్టుల్లో ఐదో వంతు మాత్రమే ప్రస్తుతం భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒక్క ఎస్జీటీ పోస్టు కూడా భర్తీ చేయలేక పోతుండటం గమనార్హం. కనీసం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల్లోనూ పూర్తి స్థాయిలో నియామకాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 250 పోస్టులే భర్తీ! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,269 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది మొదట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించారు. ఇందులో 915 ఎస్జీటీ, 192 స్కూల్ అసిస్టెంట్, 146 లాంగ్వేజ్ పండిట్, 16 పీఈటీ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్జీటీ, పీఈటీ పోస్టుల భర్తీ విషయాన్ని సర్కారు పక్కన పెట్టింది. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 151 పోస్టులకు సంబంధించే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. హిందీ సబ్జెక్టు పోస్టుల ప్రస్తావనే లేదు. ఇక లాంగ్వేజ్ పండిట్ పోస్టుల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. కేవలం 99 తెలుగు పోస్టుల అభ్యర్థులనే వెరిఫికేషన్కు కబురు పెట్టారు. మొత్తం మీద 250 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లనే పరిశీలించనున్నారు. నేడు సర్టిఫికెట్ల పరిశీలన... స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత పత్రాలను ఈనెల 11న ఎల్బీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, నాలుగు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 13, 14 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయ్యే పోస్టులుస్కూల్ అసిస్టెంట్ గణితం: 29 ఫిజికల్ సైన్స్ : 5 బయోలాజికల్ సైన్స్ : 30 సోషల్ స్టడీస్ : 64 తెలుగు : 22 లాంగ్వేజ్ పండిట్ తెలుగు : 99 -
ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
సాక్షి, మచిలీపట్నం : పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం లేదు. మిగిలిన 179 పోస్టుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేసేందుకు విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. 2018 డీఎస్సీ ఫలితాల మేరకు అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకునేందుకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో సబ్జెక్టుల వారీగా అర్హులైన వారి మెరిట్ జాబితా ఇదివరకే సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు రావటంతో విద్యాశాఖాధికారులు డీఎస్సీ ఫైళ్లను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలు, పోస్టింగ్లు ఇచ్చేంత వరకు నిర్ధిష్టిమైన షెడ్యూల్ సైతం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అంతా ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న నియామకాలు కావడంతో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అంతా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. పాఠశాల విద్యాశాఖ (సీఎస్సీ) వెబ్సైట్ ద్వారా ఎంపిక అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న అందుబాటులో ఉంచనున్నారు. దీనిని జిల్లాల స్థాయి సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆమోదించి ఈ నెల 21న జాబితాను ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో వారికి సంబంధించిన ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు దఫాలుగా పరిశీలన అనంతరం ఆగస్టు 29న పోస్టుల కోసమని ఎంపికైన వారి తుదిజాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 30న వెబ్ అప్షన్ల అనంతరం ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లను సైతం ఆన్లైనే జారీ చేయనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ డీఎస్సీ ఫలితాల ఆధారంగా ఇప్పటికే సబ్జెక్టుల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. అయితే అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు మెరిట్, రోస్టర్, అభ్యర్థుల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితాలో టాప్లో నిలిచిన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు వడపోత కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఈ దశలోనే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయమై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను విద్యా, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, వైద్యశాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సభ్యులు పరిశీలన జరిపి, వాటికి ఆమోదం తెలిపిన తరువాతనే తుది జాబితా ప్రకటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భాషా పండితుల నియామకాలకు బ్రేక్ న్యాయస్థానంలో వివాదంలో ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ కేడర్లో గల తెలుగు (12), హిందీ (6), ఎల్పీ తెలుగు (4), ఎల్పీ హిందీ (4), ఎల్పీ సంస్కృతం (3), పీఈటీ (14) పోస్టులు మొత్తం 43 ఖాళీగా ఉండగా, వీటి నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వీటిని భర్తీ చేసేలా, జాబితా సిద్ధం చేస్తున్నారు. -
20వ తేది నుంచి కొత్త టీచర్ల నియామకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన డీఎస్సీ–2018 నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి టీచర్ పోస్టులకు అర్హులైన వారి ఎంపికకు పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంటు తెలుగు, స్కూల్ అసిస్టెంటు హిందీ, పీఈటీ పోస్టులు (మొత్తం అయిదు కేటగిరీలు) మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో 7,902 పోస్టులతో డీఎస్సీ–2018 నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హతల నిర్ణయం, పరీక్షల నిర్వహణలో అనేక లోటుపాట్లు తలెత్తాయి. ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు కేసులు కూడా దాఖలయ్యాయి. ఈ న్యాయ వివాదాల కారణంగానే అయిదు కేటగిరీల నియామకాలు మినహాయించి తక్కిన వాటికి షెడ్యూల్ ఇచ్చారు. వివాదాలు పరిష్కారమైన తరువాత మిగిలిన పోస్టులకూ నియామకాలు పూర్తిచేయనున్నారు. ఈ పోస్టులకు నియామకాల ప్రక్రియ మొత్తం తొలిసారిగా ఆన్లైన్లో చేపడుతుండడం విశేషం. అభ్యర్థులు పూర్తిగా కంప్యూటర్ ద్వారానే తమ ధ్రువపత్రాల పరిశీలన తదితర కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం, నియామక పత్రాలు పొందేలా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి కేటగిరీలో అభ్యర్థుల జాబితాల ప్రకటన, ధ్రువపత్రాల అప్లోడ్, వాటి పరిశీలన కార్యక్రమాన్ని మూడు దఫాలుగా చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆయా కేటగిరీల పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ (సీఎస్ఈ) ఆన్లైన్ పర్యవేక్షణలో కొనసాగనుంది. అంతిమంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది. అనంతరం పాఠశాలల ఎంపికకు వీలుగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు. వాటిని అనుసరించి ఆయా జిల్లాల ఎంపిక కమిటీల మెంబర్ సెక్రటరీలు (నియామకాధికారులు) అభ్యర్థులను ఆయా పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి మెంబర్ సెక్రటరీనే కేటాయింపు చేస్తారు. -
ముగిసిన మూడో టెట్ వ్యాలిడిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల మూడో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేకుండా పోతుంది. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. టెట్ నిర్వహించేందుకు అనుమతి కోసం విద్యా శాఖ పంపిన ఫైలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక 6 టెట్లు నిర్వహించగా, ఇప్పటి వరకు మూడు టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయింది. 2011 జూన్ 1 మొదటి టెట్ నిర్వహించగా, 2012 జనవరి 8న రెండో టెట్, అదే ఏడాది జూన్ 1న మూడో టెట్ నిర్వహించారు. ప్రస్తుతం వాటి వ్యాలిడిటీ ముగిసిపోవడంతో అభ్యర్థులంతా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ టీచర్లుగా పని చేయాలంటే టెట్లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించకపోవడంతో అనేక మంది టెట్ అర్హత లేకుండా టీచర్లుగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2017 జూలై నుంచి లేని టెట్ రాష్ట్రంలో 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. చివరగా నిర్వహించిన ఆ టెట్ పేపర్–1కు 98,848 మంది హాజరు కాగా, 56,708 మంది అర్హత సాధించారు. దాదాపు 40 వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇక పేపర్–2 పరీక్ష 2,30,932 మంది హాజరు కాగా 45,045 మంది అర్హత సాధించారు. అంటే 1.90 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే వారిలో అంతకుముందు టెట్లలో అర్హత సాధించిన వారు కొంత మంది ఉన్నా దాదాపు 2 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఆరు టెట్లలో దాదాపు 6 లక్షల మంది అర్హత సాధించగా, అందులో ఈ రెండు లక్షల మంది టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. వారితో పాటు 2017 జూలై తర్వాత రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. ఇక అప్పటి నుంచి బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన దాదాపు 60 వేల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందన్న నిబంధనను విధించింది. ఏడేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్లో అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప ఏటా రెండు సార్లు టెట్ను నిర్వహించట్లేదు. 2011 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు టెట్ నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లే టెట్ నిర్వహించింది. ఇందులో 2011 జూలై 1న నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1తో ముగిసింది. 2012 జనవరి 8న నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈ జనవరి 8తో ముగిసిపోయింది. అలాగే ఈనెల 1తో 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. -
ఎంపికైన టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలి
హైదరాబాద్: పబ్లిక్ కమిషన్ ద్వారా సెలక్ట్ అయిన 8,792 మంది టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సెలక్టెడ్ టీచర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సెలక్ట్ అయిన టీచర్లకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని విమర్శించారు. జాప్యం మూలంగా నెలకు రూ.100 కోట్లు బడ్జెట్ మిగుల్చుకోవాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అనేక వివాదాల మధ్య 6 నెలల క్రితం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్టెడ్ టీచర్ల జాబితాను విద్యాశాఖ అధికారులకు పంపారని, గత 6 నెలలుగా సీఎం పేషీలో ఈ ఫైలు పెండింగ్లో ఉందన్నారు. సీఎం ఫైళ్లను చూడటం లేదని, అందువల్ల సెలక్ట్ అయిన వేలాదిమంది టీచర్లు నిరుద్యోగులుగా మారా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్ను నియమించకుండా విద్యను భ్రష్టు పట్టిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న ఇంటర్ గందరగోళానికి కారణం సరైన అధ్యాపకులు లేకపోవడమేనన్నారు. దాదాపు 70% జూని యర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో విద్యార్హతలు లేని వారితో పేపర్ వ్యాల్యుయేషన్ చేయించారని ఆరోపించారు. టీచర్ ఉద్యోగాల భర్తీని పీఎస్సీ నుంచి బదిలీ చేసిన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా టీచర్ ఉద్యోగాల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, దాసు సురేష్, జి.అంజి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల ఖాళీలను ఫిబ్రవరికల్లా భర్తీ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంపై గతంలో జేకే రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ మౌలిక వసతులు కల్పించాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయలేదంటూ ఆర్.వెంకటేశ్ అనే టీఆర్టీ అభ్యర్థి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తాజాగా సోమవారం జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. టీచర్ పోస్టుల భర్తీలో తెలుగు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నివేదించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి 2017 మార్చిలోగా భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది జి.ప్రభాకర్ వాదిస్తూ.. ఏపీలో ఎస్జీటీ పోస్టులు 3,889, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,625 సహా మొత్తం 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. జనవరి నెలాఖరుకు సంబంధిత పరీక్షలు పూర్తవుతాయని, ఫిబ్రవరి నెలాఖరుకల్లా భర్తీ పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణలో సంబంధిత ఉద్యోగ పరీక్షలు పూర్తయినా కోర్టుల్లో కేసులుండటంతో ఫలితాలు వెల్లడించలేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఫిబ్రవరి ఆఖరులోగా నియామకాలు పూర్తిచేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారంలో చేపడతామని ఉత్తర్వులు జారీచేసింది. -
ఫిబ్రవరి చివరికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : సుప్రీం కోర్టు
-
నడిసంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు
కర్నూలు శారదానగర్కు చెందిన వివాహిత విజయలక్ష్మి(26) గత మూడేళ్ల నుంచి డీఎస్సీ కోసం ఎదురుచూస్తోంది.టెట్లో ఉత్తీర్ణత సాధించిన ఆమె ఈసారి డీఎస్సీలో కచ్చితంగా జాబ్ సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే డీఎస్సీ వాయిదా పడిందని తెలియడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్సీని నమ్ముకొన్నవారి పరిస్థితికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఇలా రాష్ట్రంలో ఎంతో మంది అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు గత మూడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ ప్రకటనల్లో అంతో ఇంతో ఎక్కువ ఉండేవి.. ఉపాధ్యాయ పోస్టులే. అందులోనూ పోస్టుల భర్తీ ఏటా ఉంటుందన్న ఆశతో ఏటా వేలాది మంది డీఈడీ, బీఈడీ కోర్సుల్లో చేరుతున్నారు. ఫీజులు భారమైనా అప్పోసప్పో చేసి కాలేజీల్లో చేరుతున్నారు. ఇందుకోసం దూరప్రాంతాలకు వెళ్లి హాస్టళ్లలో, రూముల్లో ఉంటూ భారీ అద్దెలు చెల్లిస్తున్నారు. ఇంత కష్టపడి కోర్సులు పూర్తిచేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం ఒక్క పోస్టూ భర్తీచేయకపోవడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 30 వేల ఖాళీలున్నా.. రాష్ట్రంలో దాదాపు 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా గత నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీచేయలేదు. 2014 టెట్ కమ్ టీఆర్టీకి 4.20 లక్షల మంది హాజరయ్యారు. అప్పట్లో ప్రకటించిన పోస్టులు 10,313 మాత్రమే. అంటే.. ఆ పోస్టులు పొందిన వారు కాకుండా ఇంకా 4.10 లక్షల మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఈ నాలుగేళ్లలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారి సంఖ్య ఏటా 70 వేల వరకు ఉంటోంది. ఈ లెక్కన దాదాపు ఏడు లక్షల మంది డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. టెట్, డీఎస్సీల కోసం లక్షల్లో ఖర్చు 2014లో టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాక మళ్లీ ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. ఈలోగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన లక్షలాదిమంది అభ్యర్థులు, అంతకుముందు టెట్లో అర్హత సాధించినవారు డీఎస్సీ నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వెలువడవచ్చని చేస్తున్న చిన్నచిన్న ఉద్యోగాలను, ఉపాధి పనులను పక్కనపెట్టి పరీక్షల కోసం కోచింగ్ కేంద్రాల్లోనే గడుపుతున్నారు. కొంతమంది తమ కుటుంబాలకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే వేతనమే ఆధారమైనా ప్రభుత్వ టీచర్ పోస్టు సాధిస్తే బతుకు సాఫీగా ఉంటుందని భావించి కోచింగ్ కోసం వాటిని వదిలేశారు. కుటుంబ పోషణకు, శిక్షణకు డబ్బులేకపోయినా అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకున్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో రెండుసార్లు టెట్ను నిర్వహించింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండడంతో మెరిట్ జాబితాలో ముందుండవచ్చన్న ఆశతో మళ్లీ అందరూ వీటికి సన్నద్ధమవ్వాల్సి వచ్చింది. మళ్లీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులు, పుస్తకాలు, కోచింగ్కు ఖర్చు తడిసిమోపిడైంది. డీఎస్సీ వేస్తామంటూ ప్రతిసారీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటనలు చేస్తుండటంతో ఏ క్షణంలో అది వస్తుందో అని అభ్యర్థులు మళ్లీ శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లలో చేరారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కొన్ని నెలలు శిక్షణ పొంది మళ్లీ ఇళ్లకు చేరారు. మళ్లీ మంత్రి నుంచి ప్రకటనలు రావడంతో మళ్లీ కోచింగ్ సెంటర్లవైపు పరుగులు తీశారు. ఒక్కో దఫాకు రూ.50 వేల వరకు ఆయా కోచింగ్ సెంటర్లకు ఫీజుల కింద చెల్లించారు. డీఎస్సీ శిక్షణ కేంద్రాలు కృష్ణా జిల్లా అవనిగడ్డతోపాటు హైదరాబాద్, తదితర నగరాల్లో ఉన్నాయి. మూడు నెలల శిక్షణకు ఆయా కోచింగ్ సెంటర్లు ఒకొక్కరి నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నాయి. ఇది కాకుండా అదనంగా మెటీరియల్ కోసం మరో రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. హాస్టల్లోనో, లేదంటే స్థానికంగా రూములు తీసుకొనో ఉండడానికి నెలకు కనీసంగా రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. మహిళలు అయితే మరిన్ని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వివాహితలు పిల్లలను ఇళ్ల దగ్గర వదిలి రాలేక తమతో పాటే వారిని కోచింగ్ సెంటర్లున్న ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. తమకు తోడుగా ఇంట్లోని వారిని కూడా తీసుకొని వెళ్తూ అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. అవివాహితల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంటోంది. తోడుగా తోటి అభ్యర్థినులు లేకుంటే ఇంటిదగ్గర నుంచి కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఇలా అన్నిటికి కలిపి మూడు లేదా నాలుగు నెలలకు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. పరీక్షల విధానం తెలీక అయోమయం మరోపక్క ఈసారి డీఎస్సీని ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఆన్లైన్లో ఉంటుందని ప్రచారం జరిగినా ఆన్లైన్లో అభ్యర్థులకు అనుభవం లేకపోవడంతో తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మరీ సంకటంగా మారుతుంది. ఇప్పటివరకు వీరంతా పుస్తకాల ఆధారంగా కోచింగ్లు తీసుకున్నారే తప్ప ఎవరూ కంప్యూటర్పై పరీక్షలకు శిక్షణ తీసుకోలేదు. మరోవైపు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా నేషనల్ కౌనిŠస్ల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అర్హత కల్పించింది. దీంతో వీరికి టెట్ పేపర్–1ను పెట్టాల్సి ఉంది. ఎన్సీటీఈ ఉత్తర్వులు వచ్చి రెండునెలలైనా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టలేదు. ఎన్సీటీఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టెట్ను వీరికి వేరేగా నిర్వహిస్తారా? లేక ఎస్జీటీ పోస్టుల వరకు టెట్ను, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టును కలిపి నిర్వహిస్తారా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలా డీఎస్సీ పోస్టుల ప్రక్రియ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు మాది శ్రీకాకుళం జిల్లా జిజివలస. నాకు పెళ్లైయి ఇద్దరు పిల్లలు. నా భార్య కూడా బీఈడీ పూర్తి చేసింది. మేమిద్దరం టెట్ పాసయ్యాం. రూ.10 వేలు చెల్లించి డీఎస్సీ కోచింగ్ తీసుకున్నా. తర్వాత మళ్లీ నోటిఫికేషన్ అని ప్రభుత్వం ప్రకటించడంతో విజయనగరంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లో రూ.13 వేలు వెచ్చించి శిక్షణ పొందాను. తాజాగా ఈ నెల 10న నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి గంటా ప్రకటించడంతో మళ్లీ విశాఖలో డీఎస్సీ కోచింగ్కు నాలుగు రోజుల క్రితమే రూ.20 వేలు చెల్లించి శిక్షణకు చేరాను. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిసారి వేలకు వేలు చెల్లించి కోచింగ్లు తీసుకోవడంతో మా ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోంది. ఏమి చేయాలో పాలుపోవడంలేదు. –సాదె కృష్ణారావు, ఎంఏ, బీఈడీ (10విఎస్సీ292బి–320046–సాదె కృష్ణారావు) ఎన్నికల స్టంట్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తుందని ఆశపడి మా భార్యాభర్తలం అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నాం. ఇప్పటి వరకూ ఇద్దరికీ కలిపి కోచింగ్కి రూ.2 లక్షలు, ఇంటి అద్దెలు, మెస్ ఛార్జీలు కలిపి సుమారు రూ.4 లక్షల వరకూ ఖర్చు అయింది. ఈ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ చూస్తామన్న నమ్మకం కలుగడం లేదు. ఎన్నికల స్టంట్గా కనిపిస్తోంది. –నేకూరి సతీష్, డీఎస్సీ అభ్యర్థి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది డీఎస్సీ ప్రకటిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ అదిగో, ఇదిగో అంటూ తాత్సారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈరోజు, రేపు అంటూ చెబుతున్నారు తప్ప ప్రకటన మాత్రం వెలువడడం లేదు. ఒక వేళ డీఎస్సీ ప్రకటించినా ఎన్నికలలోపు పరీక్ష రాసినా ఉద్యోగాలు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. –మేరుగు కిరణ్, డీఎస్సీ అభ్యర్థి ఖర్చు భరించలేకున్నాం.. అవనిగడ్డలో గతేడాది కాలంగా కోచింగ్ తీసుకుంటున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో కోచింగ్ ఖర్చులు పెరిగిపోయాయి.. ఇంటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ పోటీలో ఎక్కడ వెనకపడిపోతామేమోనన్న భయంతో ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాను. -ఎస్కే నాగూల్ మీరా, ఎస్జీటీ, గంపల గూడెం,కృష్ణా జిల్లా. కోచింగ్కు వేల రూపాయల ఖర్చు ఉద్యోగం సాధించాలనే ఆశతో సొంత ఊరుకు దూరంగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం, గుళ్ళపల్లి వెళ్లి అక్కడ శిక్షణ పొందుతున్నా. ఎనిమిది నెలలుగా కోచింగ్ ఫీజు, హాస్టల్ వసతికి రూ.70 వేలు ఖర్చయింది. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ను పదపదే వాయిదా వేస్తుండటంతో చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబానికి ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగం వస్తుందనే ఆశతో అమ్మానాన్న ఫీజులు చెల్లించారు. – పోతుల భ్రమరాంబ, గురజాల ఎదురుచూసి అలసిపోయి.. డీఎస్సీ కోసం ఎదురు చూసి అలసిపోయా. ఎంతకూ డీఎస్సీ ప్రకటన రాకపోవడంతో ఎమ్మెస్సీ కూడా పూర్తి చేశా. అయినప్పటికీ ఆశ చావక నాలుగేళ్లున్నరేళ్లుగా ప్రిపరేషన్లోనే ఉన్నా. డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు తలెత్తడంతో ట్యూషన్లు చెప్పుకుంటున్నా. –దగ్గుమాటి శ్రీలత, కావలి ఇప్పటికే లక్ష దాకా ఖర్చయింది టెట్, డీఎస్సీ శిక్షణకు ఇప్పటికే ఒక లక్ష రూపాయిల దాకా ఖర్చయింది. మేము నలుగురు పిల్లలం. అయినా నాన్న డీఎస్సీ శిక్షణ ఇప్పించడానికి ఎంత ఖర్చైనా వెనకాడలేదు. వ్యవసాయ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ శిక్షణకు పంపించారు. – మమత, కొండపల్లి, కనగానిపల్లి మండలం, అనంతపురం జిల్లా నెలకు రూ.3 వేల ఖర్చవుతోంది డీఎస్సీ కోసం ఆరు నెలలుగా కర్నూలులో అద్దె గదిలో ఉంటూ చదువుతున్నా. కోచింగ్ ఖర్చులు కాకుండా అద్దె, మెస్ చార్జీలతో కలిపి నెలకు రూ.3 వేలకు పైగా అవుతోంది. నోటిఫికేషన్ ఇస్తామని వాయిదా మీద వాయిదాలు వేస్తున్నారు. ఇలా వాయిదాలు వేస్తే ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది. – నారాయణ, ఎస్జీటీ అభ్యర్థి, కర్నూలు జిల్లా కాంట్రాక్టు ఉద్యోగాన్ని కూడా వదులుకుని.... నా పేరు శ్రీనివాసులు. మాది కడప. మా నాన్న 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ భారం నామీదే ఉంది. నాకు వివాహమైంది. అమె కూడా ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నేను రాయచోటి మున్సిపాలిటిలో కాంట్రాక్టు పద్ధతిన బిల్ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. నెలకు రూ. 15 వేలు జీతం వచ్చేది. డీఎస్సీ కోసమని సెలవుపెట్టాను. దీంతో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకటినర్న లక్ష జీతం పోవడంతోపాటు.. డీఎస్సీ కోసం 10 వేలకు పైగా ఖర్చు అయింది. ప్రస్తుతం నా భార్యకు వచ్చే జీతంతో కుటుంబం నడిస్తోంది. – శ్రీనివాసులు, కడప. డీఎస్సీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. పోస్టులు పెంచకుంటే అన్యాయానికి గురవుతాం. ఉద్యోగాలు కూడా వదులుకుని కోచింగ్లు పెట్టుకున్న ఈ తరుణంలో పోస్టులు కుదిస్తే మా పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. – కేతా సత్యనారాయణ (కొండ), డీఎడ్ అభ్యర్ధి, రాయవరం, తూర్పుగోదావరి జిల్లా. ఏమి చేయాలో పాలు పోవడం లేదు డీఎడ్ శిక్షణ పొంది రెండేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాను. అప్పు చేసి ఆర్నెళ్ల పాటు కోచింగ్ తీసుకున్నాను. నోటిఫికేషన్ పడకపోవడంతో తిరిగి ప్రైవేటు టీచర్గా పనిచేస్తున్నాను. – అల్లాడ సాయికుమార్, డీఎడ్ అభ్యర్థి, సోమేశ్వరం, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా. పాఠాలు చెప్పాల్సింది పోయి.. పనులకు నేను 2017లో టీటీసీ పూర్తి చేశాను. డీఎస్సీ రాసేందుకు శిక్షణ కోసం జిల్లా కేంద్రం ఒంగోలు వచ్చాను. కోచింగ్ ఫీజు, పుస్తకాలు, రూమ్ అద్దె, భోజనం కలుపుకుంటే దాదాపు లక్ష రూపాయల ఖర్చు అయింది. పాఠాలు చెప్పాల్సిన నేను ఊళ్లో పనులకు వెళ్లాల్సివస్తోంది. – వడ్లమూడి అనిల్కుమార్, జె.పంగులూరు, ప్రకాశం జిల్లా అన్యాయం చేస్తే ఊరుకోం ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన మాటప్రకారం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే. ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే ఊరుకునేది లేదు. నిరుద్యోగులంతా ఏకమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్న మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తే టీడీపీకి తగిన శాస్తి చెబుతాం. – వైభవి, చిత్తూరు అప్పలు చేసి కోచింగ్లు తీసుకుంటున్నాం డీఎస్సీ కోసం అప్పులు చేసి మరీ కోచింగ్లు తీసుకుంటున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్పై ప్రభుత్వం ఆశలు రేపడంతో ఎంతో కష్టపడి చదివాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సమాచారం రావడంతో మా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. వేలాది రూపాయలు అప్పులు చేసి తీసుకున్న కోచింగ్లు వృథా అయిపోయాయి. ఆర్థికంగా నష్టపోయాం. – పి.శివకుమార్, ఎన్ఎన్ కాలనీ, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా -
ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. గతంలో ప్రకటించిన పదివేల టీచర్ పోస్టులు, కొత్తగా 20వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతిపై అమలుపై మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించాలని తీర్మానించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. -
డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్న్యూస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టింది. మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్సీటీఈ విడుదల చేసిన గెజిట్పై కూడా చర్చిస్తున్నాం. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామ’ని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. భయపడినట్టుగానే.. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ మరోసారి వాయిదా పడింది. జులై 6న 10,351 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అంతకుముందు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చింది. అభ్యర్థుల ఆవేదన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో పాలకులు ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని, నోటిఫికేషన్ విడుదల చేయకుండా తమను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
బీఈడీ విద్యార్ధులకు శుభవార్త
-
టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్ : టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4,5 తేదీల్లో టీచర్ల ఖాళీల ప్రకటన వెలువడనుంది. జూన్ 5న ప్రభుత్వం, టీచర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. జూన్ 6 నుంచి 10 వరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. జూన్ 20 కల్లా టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆగస్టులో అంతర్ జిల్లా బదిలీలు ఉంటాయని పేర్కొంది. -
‘పాత’ లెక్కపై పోస్టుల భర్తీకి కసరత్తు
-
‘పాత’ లెక్కపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పాత పది జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల వారీగా కాకుండా పాత పది జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేసేందుకు సోమవారం రాత్రే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య.. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి లేఖ (లెటర్ నంబర్ 7126/ఎస్ఈ జనరల్1/ఎ12015, డేట్ 4–12–2017) రాశారు. అలాగే మెమో కూడా జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత 10 జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 21వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్కు సవరణ చేయాలని సూచించారు. అభ్యర్థులు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి రాత పరీక్షలను 2018 ఫిబ్రవరిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించిన విధంగానే ముందుకు సాగాలని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టుల వివరాలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను విద్యా శాఖ.. టీఎస్పీఎస్సీకి అందజేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ.. పోస్టుల వారీగా వివరాలతోపాటు రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను సోమవారం రాత్రి టీఎస్పీఎస్సీకి అందజేసింది. దీంతో తదుపరి కార్యాచరణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. విద్యా శాఖ అధికారులతోపాటు టీఎస్పీఎస్సీ అధికారులు పది జిల్లాల వారీగా పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలపై పరిశీలనను మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక సవరణ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. అపాయింటింగ్ అథారిటీపై సమాలోచనలు ఉపాధ్యాయ పోస్టులు జిల్లా కేడర్వి కావడంతో సంబంధిత జిల్లా అధికారి అయిన డీఈవోనే సాధారణంగా అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తారు. 31 జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే ఆ విధానమే అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. తాజాగా పాత జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో భర్తీ అయ్యే టీచర్ల అపాయింటింగ్ అథారిటీ ఎవరనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదని, పాత జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తున్నందున పాత జిల్లాల డీఈవోలే అపాయింటింగ్ అథారిటీగా వ్యవహరిస్తారని న్యాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ విషయంలో విద్యా శాఖ జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఇప్పుడే నియామకాలకు సంబంధించిన అంశంపై వివాదం ఎందుకన్న ధోరణితో ముందుకు వెళ్తోంది. పరీక్షలు పూర్తయి, నియామకాలు చేపట్టే నాటికి దానిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం ప్రకటించవచ్చని భావిస్తోంది. మార్పుల కోసం ఎడిట్ ఆప్షన్! ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త జిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకుని ఉన్నందున.. వారు పాత జిల్లాల ప్రకారం మార్పు చేసుకునేలా దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని విద్యా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తుల్లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్కూల్, ప్రాంతం, జిల్లా పేరు ఉంటుంది కనుక.. అవి ఏ జిల్లా పరిధిలోకి (పాత జిల్లాల్లో) వస్తే ఆ జిల్లాకు స్థానికునిగా పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని కొందరు అధికారులు భావిస్తున్నారు. దీనిపైనా రెండు మూడు రోజుల్లో టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రానుంది. -
విద్యా సంవత్సరంలోపు టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం లోపు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో టీచర్ల పోస్టుల భర్తీపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం రెండుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 4,600 ఖాళీలు ఉన్నాయని ఒకసారి పేర్కొంది. పోస్టుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని మరోసారి తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు గతంలో త్రిసభ్య కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మొత్తం 9,265 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కమిటీ తేల్చడంతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను జనవరి మూడో వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. -
40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తీర్పు ప్రకారమే పాత 10 జిల్లాలతో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, 8,792 నుంచి 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 2014లో మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ 25,600 టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని వెల్లడించారని, ఇప్పుడు తగ్గించి 8,972 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమన్నారు. గురువారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీచర్ పోస్టుల ఖాళీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలతో విద్యాశాఖకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఏటేటా రిటైర్మెంట్ పొందిన వారితో ఏర్పడ్డ ఖాళీలతో పోస్టులు పెరగాలి కానీ తగ్గటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏకమై ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జకృష్ణ, నందగోపాల్, వివిధ నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీచర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ ఉపాధ్యాయ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ కేటగిరీలకు చెందిన 8,792 పోస్టుల కోసం అభ్యర్థులు మరో 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి అక్టోబర్ 30న ప్రారంభమైన దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. అయితే 31 జిల్లాల ప్రకారం కాకుండా 10 జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా 10 జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. మరోవైపు విద్యాశాఖ కూడా 31 జిల్లాల ప్రకారం ఇచ్చిన 8,792 పోస్టులను, వాటి రోస్టర్ పాయింట్లను 10 జిల్లాల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టనుంది. మరోవైపు 31 జిల్లాల వారీగా ఇచ్చిన నోటిఫికేషన్ కిందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దరఖాస్తుల గడువును అందుకు అనుగుణంగానే టీఎస్పీఎస్సీ పొడిగించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అభ్యర్థుల స్థానికతను పాత జిల్లాల ప్రకారమే చూడాల్సి ఉంది. అయితే ఇందుకు ఎడిట్ ఆప్షన్ను ఇవ్వాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ఆమోదం, ఉత్తర్వులు వచ్చాకే పది జిల్లాల స్థానికతను ఎంచుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. -
లక్కీచాన్స్
టెట్లో అర్హత సాధించిన బీఈడీ, డీఈడీ మహిళా అభ్యర్థులకు టీఆర్టీ రూపంలో అదృష్టం వేచిచూస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం.. ఇందులో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మహిళలకు వరంగా మారింది. దీనికి తోడు జనరల్ కోటాలో వీరు పోటీ పడనుండడంతో వీరికి మరిన్ని సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. జిల్లాలో మొత్తం 820 పోస్టులకు గాను సుమారు 270 పోస్టులు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఉద్యోగంపై నమ్మకం ఏర్పడింది టీఆర్టీలో మహిళల కోటా ఎక్కువగా ఉండటంతో ఈ సారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. డీఎస్సీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది సదావకాశం. కోటాను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలి. – మాధవి, వికారాబాద్ సాక్షి, వికారాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించింది. టీచర్ పోస్టుల భర్తీకిగాను సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కాకుండా పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించింది. డీఎస్సీ బదులు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరుతో పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన విధంగా జిల్లాలో 820 పోస్టులు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటిలో 33 శాతం మంది మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించారు. దీంతో సుమారు వీరికి 270 పోస్టులు ప్రత్యేకంగా దక్కనున్నాయి. తమకు కేటాయించిన పోస్టులతో పాటుగా జనరల్ కేటగిరీలోనూ మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల ఆధారంగా మహిళలకు ఎక్కువ శాతం పోస్టులను కేటాయించారు. దీంతో జిల్లాలో ఎక్కువ మంది పంతులమ్మలు దర్శనమివ్వనున్నారు. మహిళలు చదువుకుంటే భవిష్యత్లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఖాళీలే నిదర్శనమని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. టెట్లో మహిళల ఉత్తీర్ణతే అధికం.. టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించిన వారిలో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు సుమారుగా 3,500 వరకు ఉండవచ్చని అంచనా. గత ఆగస్టులో నిర్వహించిన టెట్లో అన్ని విభాగాల్లో కలిపి 2,468 మంది అర్హత సాధించారు. పేపర్ – 1లో 1,683 మంది అభ్యర్థులు పాస్కాగా, పేపర్– 2లో సోషల్ స్టడీస్లో 490 మంది అభ్యర్థులు, గణితం మరియు సైన్స్ విభాగాల్లో 295 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో కూడా రిజర్వేషన్, జనరల్ కేటగిరీల్లో కలిపి పురుషులకంటే ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలను కైవసం చేసుకునే అవకాశముంది. మంచి అవకాశం.. ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మహిళలకు మంచి అవకాశాలున్నాయి. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు 528 ఉండగా, వాటిలో 346 జనరల్ కేటగిరీకి కేటాయించారు. వీటిలో 182 పోస్టులు మహిళలకు రిజర్వుచేశారు. ఎస్ఏ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులు జిల్లాలో 135 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 63 పోస్టులను రిజర్వు చేశారు. మహిళలకు 72 పోస్టులను కేటాయించారు. దీంతో ఎస్ఏ పోస్టుల్లో జనరల్ పోస్టులకంటే మహిళలకే 9 పోస్టులను అధికంగా రిజర్వ్ చేశారు. భాషా పండితుల పోస్టుల విషయానికొస్తే తెలుగు పండిత్ విభాగానికి సంబంధించి 54 ఖాళీలు ఉండగా, వీటిలో 32 జనరల్ కేటగిరీకి కేటాయించగా, మహిళలకు 24 పోస్టులను రిజర్వు చేశారు. ఉర్దూ మీడియంలో 30 పోస్టులు ఉండగా, వీటిలో 14 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలో 35 పోస్టులు ఉండగా, జనరల్ కేటగిరీకి 19 పోస్టులు, మహిళలకు 16 ఖాళీలను రిజర్వు చేశారు. హిందీ పండిత్ ఖాళీలు జిల్లాలో 29 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 32 పోస్టులు, మహిళలకు 22 పోస్టులను కేటాయించారు. పీఈటీ పోస్టులు జిల్లాలో మొత్తం 6 ఉండగా, జనరల్ కేటగిరీకిలో 2 పోస్టులు, మహిళలకు 4 పోస్టులను రిజర్వు చేశారు. పీఈటీలలో పురుషుల కంటే రెండు పోస్టులు మహిళలకే ఎక్కువగా కేటాయించడం విశేషం. -
మరో 8 వేల పోస్టులకు నోటిఫికేషన్: కడియం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ప్రస్తుతం భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులే కాకుండా మరో ఎనిమిది వేల పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాలలో విద్యా శాఖపై ఆయన వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో మొత్తం 1,22,955 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 1,09,256 పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 13,699 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. పదోన్నతితో భర్తీ చేసే పోస్టులను మినహాయించి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు హైకోర్టు ఆమోదం తెలిపిందన్నారు. ఈ నోటిఫికేషన్ను ఎందుకు ఆపలేకపోయామని కాంగ్రెస్ మధన పడుతోందన్నారు. ప్రభుత్వం కొత్తగా 544 గురుకులాలు ప్రారంభించిందని, పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీ వేశామన్నారు. ఈ నెలాఖరులో కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. బయ్యారంలో పరిశ్రమపై చిత్తశుద్ధితో ఉన్నాం: కేటీఆర్ బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అదే ప్రాంతంలో ఖనిజ నిల్వలు ఉండాలనే నిబంధన ఏమీ లేదు. విశాఖపట్టణం సమీపంలో ఎక్కడా ఇనుప ఖనిజం లేదు. అయినా అప్పటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేశారు. 2018 మార్చిలోపు నివేదిక వస్తుంది. దీన్ని సభ ముందు పెడతాం. బయ్యారంలో భారత ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందన్నారు. -
ఆ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం కాదు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రూల్స్ను.. అలాగే 8,700లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన పలు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఉమ్మడి హైకోర్టు గురువారం కొట్టేసింది. అధికరణ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక రూల్స్ను జారీ చేసిందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్ పోస్టులని, వాటికి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించడం లేదంటూ వారి పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన రూల్స్, నోటిఫికేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన కె.బాలకృష్ణ, కె.భాను, ఆర్.రాంమోహన్రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో జిల్లాను ఓ యూనిట్గా నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వాదించారు. 31 జిల్లాలను యూనిట్గా తీసుకోనున్నట్లు ఆ రూల్స్లో పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. 31 జిల్లాల ఏర్పాటునకు రాష్ట్రపతి ఆమోదం లేదని.. కేవలం 10 జిల్లాలకే గుర్తింపు ఉందని వివరించారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా రూల్స్ను తయారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తుండటం వల్ల కొన్ని జిల్లాలకు అసలు పోస్టుల భర్తీయే లేదన్నారు. రంగారెడ్డి, నిర్మల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో పోస్టుల భర్తీ లేకుండా పోయిందని, దీంతో పలువురు అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతోందని సరసాని వాదించారు. అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతారు? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేస్తుంటే అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతారని ప్రశ్నించారు. 31 జిల్లాల ఆధారంగా ఒక్కో జిల్లాను యూనిట్గా పేర్కొంటూ నియామకాలు చేయకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలన్నారు. అనంతరం ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయ పోస్టులు కేవలం జిల్లా క్యాడర్ పోస్టులని.. వాటికి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ మాత్రం వర్తించవన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
మొత్తం ఖాళీలు భర్తీ చేయాలి
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 40 వేల టీచర్ పోస్టులకు గాను మొక్కుబడిగా 8,792 ఖాళీలు మాత్రమే భర్తీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణల అధ్యక్షతన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. టీచర్ పోస్టుల ఖాళీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని విమర్శించారు. 2014 జూన్లో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ టీచర్ పోస్టులు 25,600 ఖాళీలు ఉన్నాయన్నారని ఆయన గుర్తుచేశారు. గత మూడున్నరేళ్ల కాలంలో రిటైర్ అయిన వారితో కలిపి మరో 15 వేల ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. ఖాళీలు లెక్కించడంలో విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకోవద్దని, 2012 నుంచి రిటైర్మెంట్వల్ల ఏర్పడ్డ ఖాళీలను ప్రాతిపదికగా తీసుకొవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్ పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2 వేలు, కసుర్బా పాఠశాలల్లో 1,200, కంప్యూటర్ టీచర్ పోస్టులు 4 వేలు, పీఈటీ పోస్టులు 3 వేలు, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 2 వేలు, లైబ్రేరియన్ పోస్టులు 3 వేలు, జూనియర్ అసిస్టెంట్ 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలు ఫిబ్రవరిలో కాకుండా జనవరి లేదా డిసెంబర్లో పెట్టాలని అన్నారు. ఒక వైపు 4,600 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి 9 నెలల కాలపరిమితి తీసుకోవడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు భూపేశ్ సాగర్, మహేందర్ గౌడ్, పగిల్ల సతీష్, జి.క్రిష్ణ యాదవ్, అనంతయ్య, యాదవ శ్రీనివాస్గౌడ్, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ పోస్టులు 10,000 పైనే!
-
టీచర్ పోస్టులు 10,000 పైనే!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల వారీగా భర్తీ చేయనున్న టీచర్ పోస్టులు దాదాపు ఖరారయ్యాయి. డీఈవోలు 31 జిల్లాల వారీగా పోస్టుల లెక్కల్ని తేల్చారు. బ్యాక్లాగ్ పోస్టులు కలుపుకొని మొత్తం 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో 8,792 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుండగా, మిగతావి బ్యాక్లాగ్ పోస్టులని అధికారులు చెబుతున్నారు. డీఈవోలు తాజాగా విద్యాశాఖకు ఈ వివరాలను అందజేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది వరకు రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడే 2 వేలకు పైగా ఖాళీలను కూడా భర్తీ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. అయితే వాటిని ఇప్పటికిప్పుడు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు(టీఆర్టీ) నిర్వహించే నాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పండిట్ పోస్టులు కలిపి వీటిని లెక్క వేసినట్లు తెలిసింది. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ పోస్టుల వివరాలపై అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోస్టుల వివరాలివీ.. ఆదిలాబాద్–293, నిర్మల్–226, మంచిర్యాల–169, కుమరం భీమ్–1,018, నిజమాబాద్–156, కామారెడ్డి–380, జగిత్యాల–253, పెద్దపల్లి–54, కరీంనగర్–71, సిరిసిల్ల–108, వరంగల్ అర్బన్–143, వరంగల్ రూరల్–123, జనగామ–168, మహబూబాబాద్–135, జయశంకర్ భూపాలపల్లి–380, ఖమ్మం–57, కొత్తగూడెం–100, నల్లగొండ–408, సూర్యాపేట–300, యాదాద్రి–339, రంగారెడ్డి–600, వికారాబాద్– 826, మేడ్చల్–200, మెదక్–297, సిద్దిపేట–155, సంగారెడ్డి–1,105, మహబూబ్నగర్–725, నాగర్ కర్నూల్–436, గద్వాల–387, వనపర్తి–154, హైదరాబాద్–200 -
డీఎస్సీకి మోక్షం
-
డీఎస్సీకి మోక్షం
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. మంగళవారం నియామక నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ‘టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్–2017 (జీవో 25)’పేరిట విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పది పదిహేను రోజుల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై పోస్టుల భర్తీపై చర్చించినట్లు తెలిసింది. మొత్తంగా ఉమ్మడి రాష్టంలో (2012లో) నియామకాలు చేపట్టిన ఐదేళ్ల తరువాత ఇప్పుడు టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. నోటిఫికేషన్పై కసరత్తు మొదలు.. విద్యాశాఖ ఇప్పటికే కొత్త, పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను టీఎస్పీఎస్సీకి పంపించినట్లు తెలిసింది. వాటిపై టీఎస్పీఎస్సీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారులతో చర్చించి.. అవసరమైన వివరణలు తీసుకోనున్నారు. అనంతరం నోటిఫికేషన్ జారీకి సంబంధించిన ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థుల వడపోత కోసం స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారా? లేదా ఒకే పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రకారం ఖరారు చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీఎస్పీఎస్సీ ఒకటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్కు 20 శాతం వెయిటేజీ, టీఎస్పీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎస్పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితాను ఇస్తే 31 జిల్లాల్లో జిల్లా యూనిట్గా పోస్టింగ్లు ఇస్తారు. పోస్టులు పెరుగుతాయా? ప్రస్తుత లెక్క ప్రకారం 8,792 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సుప్రీంకోర్టుకూ ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే ప్రస్తుతం 31 జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో.. కొన్ని పట్టణ జిల్లాల్లో పోస్టులు లేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో పోస్టులను ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి విద్యాశాఖ 2018 వరకు ఏర్పడే ఖాళీల వివరాలను కూడా సేకరించింది. పట్టణ జిల్లాల్లో పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తే ఆయా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రభుత్వం భావిస్తే.. అక్కడ 2018 వరకు ఏర్పడే ఖాళీలను కూడా నోటిఫై చేయవచ్చని భావిస్తున్నారు. అదే జరిగి మొత్తంగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెరగనుంది. నియామక నిబంధనల్లోని ప్రధానాంశాలివీ.. – ‘తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టుల ప్రత్యక్ష నియామక నిబంధనలు–2017’ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు వర్తిస్తాయి. – జిల్లా విద్యాశాఖాధికారే నియామకపు అధికారి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం విద్యార్హతలు వర్తిసాయి. – టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష నిర్వహణ. – టీఎస్ టెట్, సెంట్రల్ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. (2.06.2014 కంటే ముందు ఏíపీ టెట్ ఉత్తీర్ణులైన వారూ అర్హులే). స్కూల్ అసిస్టెంట్, తత్సమాన పోస్టులకు టెట్ పేపర్–2, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు టెట్ పేపర్–1 అర్హత తప్పనిసరి. – ఉపాధ్యాయ నియామకాల్లో రాతపరీక్షకు 80 శాతం వెయిటేజీ, టెట్ స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. – వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు. రాత పరీక్ష 100 శాతం మార్కులకు ఉంటుంది. ఉంటాయి. – స్కూల్ అసిస్టెంట్, తత్సమాన పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ మరియు సంబంధిత మెథడాలజీతో బీఎడ్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు ఉంటే చాలు. – సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల కోసం ఇంటర్మీడియట్లో జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. అలాగే రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) లేదా నాలుగేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. – 2007 సంవత్సరం నాటికి రెండేళ్ల డీఎడ్లో చేరిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం మార్కులు సరిపోతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం ఉన్నా చాలు. – ఏదైనా మాధ్యమం (మీడియం)లో బోధించేందుకు.. భాషేతర సబ్జెక్టుల ఉపాధ్యాయ అభ్యర్థులు టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీలో సంబంధిత భాషా మాధ్యమంలో చదివి ఉండాలి. లేదా టెన్త్లో మొదటి భాషగాను, ఇంటర్/ డిగ్రీలో ద్వితీయ భాషగాను చదివి ఉండాలి. – ఏ మీడియంలో పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. రాత పరీక్ష (టీఆర్టీ) ప్రశ్నపత్రం ఆ మీడియంలోనే ఉంటుంది. – భాషా పండిట్ పోస్టులకు సంబంధిత భాష డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులతో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా పీజీ అర్హతతోపాటు సంబంధిత మెథాడాలజీతో బీఎడ్, లేదా పండిట్ శిక్షణ పొంది ఉండాలి. – వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్తోపాటు వ్యాయామ విద్యలో డిప్లొమా చేసి ఉండాలి. లేదా డిగ్రీ, బీపీఈడీ చేసి ఉండాలి. – 2016 అక్టోబర్ 10న ఏర్పడిన కొత్త రెవెన్యూ జిల్లాల ప్రాతిపదిపక ఉపాధ్యాయ ఖాళీలను నిర్ణయించి పాఠశాల విద్యా డైరెక్టర్ సూచించిన మేరకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. – జీవో–3 ప్రకారం (10.01.2000) ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులకు స్థానిక గిరిజన అభ్యర్థులు మాత్రమే అర్హులు. మైదాన ప్రాంత పాఠశాలల్లో నియామకాలకు కూడా ఏజెన్సీ గిరిజనులు అర్హులు. – రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సర్వీసు నిబంధనల ప్రకారం గరిష్ట వయసును నోటిఫికేషన్లో ప్రకటిస్తారు. – రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్లు వర్తిస్తాయి. 80 శాతం స్థానిక. 20 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది. – ఉపాధ్యాయ నియమాకాలకు సంబంధించి 2009 జనవరి 23న విడుదల చేసిన జీవోలు 11, 12లలోని విద్యార్హతలను ఈ జీవో ద్వారా సవరించారు. మరింత స్పష్టత అవసరం ఉపాధ్యాయ నియామకాల నిబంధనల్లో మరింత స్పష్టత అవసరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. మంగళవారం ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం పలు అంశాలపై వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన అర్హతలకు సంబంధించి స్పష్టమైన వివరణలు అవసరమని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. స్పష్టత కోరుతున్న అంశాలివే.. – ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల అర్హతల్లో.. ఇంటర్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మినహాయింపు వివరాలు చెప్పలేదు. ఇక అదే పోస్టులకు డిగ్రీతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. కానీ డిగ్రీలో కనీస మార్కుల వివరాలను పేర్కొనలేదు. – ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులు డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, బీఎడ్ పూర్తి చేసి ఉండాలని, టెట్ పేపర్–2 అర్హత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అయితే ఎన్సీటీఈ ఉత్తర్వులు వచ్చిన 2010 సంవత్సరానికి ముందే డిగ్రీ పూర్తి చేసిన జనరల్ అభ్యర్థులకు పరిగణనలోకి తీసుకునే మార్కులను పేర్కొనలేదు. – ఎస్జీటీ పోస్టులకు అర్హతల్లో.. జనరల్ అభ్యర్థులు 2009కు ముందు ఇంటర్ పూర్తి చేసి ఉంటే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనా చాలనే స్పష్టత ఇచ్చారు. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ మార్కుల విషయంలో ఇవ్వలేదు. – గిరిజన సంక్షేమ పాఠశాలల నియామక ప్రక్రియ అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. వాటికి వేరుగా నిబంధనలు ఇస్తారా? స్పష్టత ఇవ్వాల్సి ఉంది. – భాషా సబ్జెక్టు పోస్టులను పండిట్ కోర్సులు చేసిన వారికే ఇవ్వాలని ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. కానీ ఏదేని సబ్జెక్టులో పీజీ చేసిన వారు బీఎడ్లో ఆ సబ్జెక్టు మెథాడాలజీ చేసి ఉంటే భాషా పండిట్ పోస్టుకు అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇది కొత్త సమస్యకు దారితీసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. భర్తీ చేసే టీచర్ పోస్టుల వివరాలు.. కేటగిరీ తెలుగు/ఇతర మీడియం ఉర్దూ మీడియం స్కూల్ అసిస్టెంట్ 1,754 196 లాంగ్వేజ్ పండిట్ 985 26 పీఈటీ 374 42 ఎస్జీటీ 4,779 636 మొత్తం 7,892 900 -
తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు. త్వరలోనే ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి అవసరమైన నిబంధనలను సర్కారు మంగళవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్కు 20శాతం వెయిటేజ్ను ప్రకటించింది. డీఎస్సీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. కొత్త టీచర్లను నియమించే అధికారాన్ని డీఈవోలకు కట్టబెట్టింది. అంతేకాకుండా డీఎస్సీ నియామకాలకు సంబంధించి పీటముడిగా భావించిన.. జిల్లాల పునర్విభజన అంశానికి సైతం ప్రభుత్వం తెరదించింది. కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. -
టీచర్ పోస్టుల మెయిన్స్ జాబితా విడుదల
హైదరాబాద్: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులకు సంబందించిన మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ బుధవారం ప్రకటించింది. మొత్తం 36,095 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక 1:15 రేషియోలో జరిగినట్లు చెప్పింది. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in లో చూడవచ్చు. పోస్టుల వివరాలు.. పీజీటీ-513 పొస్టులు, టీజీటీ- 2340, పీడీ- 6 పోస్టులకు మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 7330 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, బీసీ( మహిళ) ఎజన్సీ(మహిళ)ల కేటగిరిల నుంచి దరఖాస్తులు రాలేదని అధికారులు పేర్కొన్నారు. -
ప్రసవించిన మూడురోజులకే పరీక్షకు..
హన్మకొండ: ప్రసవించిన మూడురోజులకే ఓ మహిళ గురుకుల టీచర్ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన మల్లికంటి వరలక్ష్మి గురుకుల టీచర్ పోస్టుల రాత పరీక్షకు ప్రిపేర్ అయింది. పరీక్షకు మూడు రోజుల ముందే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో ప్రసవించింది. ప్రసవించి మూడు రోజులే అయినా పరీక్ష రాయాలనే పట్టుదలతో అంబులెన్స్లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రానికి వెళ్లింది. వరలక్ష్మికి ప్రత్యేకంగా సీటు కేటాయించగా పరీక్ష రాసింది. -
మార్పులతో గురుకుల నోటిఫికేషన్
-
మార్పులతో గురుకుల నోటిఫికేషన్
7,306 పోస్టులు.. 18 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యులు, ఇతర పోస్టుల భర్తీకి తొమ్మిది కొత్త నోటిఫికేషన్లు (రీ నోటిఫికేషన్స్) గురువారం జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మొత్తంగా 7,306 పోస్టులతో ఈ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని.. పూర్తి వివరాలను త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు బీఎడ్తోపాటు పీజీలో 60 శాతం మార్కులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు బీఎడ్తోపాటు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ శాఖలు రూపొందించిన నిబంధనలతో తాజా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజా నిబంధనలు ఇలా.. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఉపాధ్యాయ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు బీఎడ్తోపాటు పీజీ, డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. ఇతరులు బీఎడ్తో పాటు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎక్స్ సర్వీస్మెన్కు రిజర్వేషన్ ఉంటుంది. ఇక డీఎడ్–డిగ్రీ పూర్తి చేసిన వారికి టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బీకాం వారికి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారికి కూడా పోస్టుల్లో అర్హత కల్పించినట్లు సమాచారం. టీజీటీ పోస్టులకు అభ్యర్థులు బీఎడ్తో పాటు టెట్లోనూ అర్హత సాధించి ఉండాలి. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చాకే వెల్లడికానున్నాయి. -
ఈ ఏడాదే 16,392 టీచర్ పోస్టుల భర్తీ
-
ఈ ఏడాదే 16,392 టీచర్ పోస్టుల భర్తీ
⇔ జూన్ నుంచి ప్రతి ప్రభుత్వ బడిలో టాయిలెట్లు ⇔బాలబాలికలకు వేర్వేరుగా కనీసం ఒక్కోటి ఏర్పాటు ⇔కచ్చితంగా నీటి వసతి, విద్యుత్ సౌకర్యం ⇔స్కూళ్లలో మౌలిక వసతుల కోసం రూ. 2,682 కోట్లు ⇔5,600 బడుల్లో డిజిటల్ తరగతులు ⇔కొత్తగా 5,400 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ⇔బడులు తెరిచేలోపే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ⇔ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం ⇔‘కార్పొరేట్’కు కళ్లెం వేసేందుకు ఆన్లైన్ ప్రవేశాలు చేపడుతున్నట్లు శాసనసభలో వెల్లడి సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఈ ఏడాదే 16,392 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. అందులో సాధారణ పాఠశాలలకు సంబంధించి 8,792 పోస్టులు, గురుకులాలకు సంబంధించి 7,600 పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశలో కీలక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ సభ్యులు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ ప్రశ్నలకు సమాధానంగాను, విద్యా శాఖ పద్దుపై మాట్లాడిన సమయంలోనూ కడియం ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవలే 8 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని.. కానీ అర్హతల విషయంలో అభ్యర్థుల విన్నపం మేరకు దానిని నిలిపివేశామని చెప్పారు. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లుండరని, పాఠాలు సరిగా చెప్పరని, తగిన వసతులు ఉండవనే ఉద్దేశంతో పేదలు కూడా ప్రైవేటు బడులవైపే మొగ్గుచూపుతున్నారని.. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కడియం తెలిపారు. అందులో భాగంగా జూన్ 15 నుంచే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాల, బాలికలకు వేర్వేరుగా.. కనీసం ఒక్కోటి చొప్పున టాయిలెట్లు అందుబాటులోకి తెస్తామని, వాటిలో తప్పనిసరిగా నీటి వసతి, నిర్వహణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. విద్యుత్, నీళ్లు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ తదితర మౌలిక వసతుల కల్పనకు వీలుగా ఈసారి బడ్జెట్లో రూ.2,682 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తొలుత అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక జూన్ 15 నుంచి 5,600 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో 3వ తరగతి స్థాయిలో ప్రమాణాలు పెరిగాయన్నారు. వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికల్లా పాఠ్యపుస్తాకాలు, యూనిఫారాల సరఫరా చేయాలని నిర్ణయించామని కడియం వెల్లడించారు. మార్చి 21 నాటికే పాఠ్యపుస్తకాలు పంపామని, జూన్ 15 కల్లా యూనిఫారాలు సరఫరా అవుతాయని చెప్పారు. మరోవైపు ఇప్పటికే 5,400 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించగా... ఈ సంవత్సరం మరో 5 వేల పాఠశాలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. వాటిల్లో వచ్చే ఫలితాల ఆధారంగా అన్ని పాఠశాలలకు ఇంగ్లిషు మీడియాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో గతంలో బోగస్ ఎన్రోల్మెంట్ ఉండేదని.. దాన్ని అరికట్టేందుకు ఆధార్తో అనుసంధానించామని తెలిపారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం లక్ష చొప్పున విద్యార్థుల సంఖ్య తగ్గేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దాన్ని 50 వేలకు తగ్గించామని ప్రకటించారు. బడిబాట మొదటి విడత కార్యక్రమాన్ని ఏప్రిల్లో, రెండో విడతను జూన్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 2017–18 నుంచి అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక స్కూళ్ల పరిధిలోకి తెచ్చి ప్లేస్కూళ్లుగా తయారుచేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకూ భోజనం ఈ ఏడాది నుంచే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నామని కడియం తెలిపారు. వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం నుంచే ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లు మొదలుపెడతామని.. దాంతో కార్పొరేట్ కళాశాలల దూకుడుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే చర్యలు ప్రారంభించగా.. కొందరు కోర్టుకెళ్లటంతో బ్రేక్ పడిందని చెప్పారు. ఆ కేసు వేసినవారు కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నట్టు తెలిసిందని, వారు కేసు వెనక్కు తీసుకునేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని కడియం కోరారు. అయితే కేసు వేసినవారికి కాంగ్రెస్తో సంబంధం లేదని ఉత్తమ్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర నిధులు వచ్చేలా చూడాలి డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే ఆన్లైన్ ప్రవేశాలు ప్రారంభించామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మొదలుపెట్టామని కడియం తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సీఎం నిర్ణయించారన్నారు. ఉస్మానియా వర్సిటీ దేశంలో వందేళ్ల ఉత్సవాన్ని జరుపుకొంటున్న ఏడో విశ్వవిద్యాలయమని, ఇందుకు కేంద్రం నిధులు విడుదల చేసేలా బీజేపీ సభ్యులు ప్రయత్నించాలని కోరారు. కస్తూర్బా విద్యాలయాలు మంజూరయ్యేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు సీడీఎఫ్ నుంచి నిధులు కేటాయిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు కేటాయిస్తుందన్నారు. -
7 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
హైదరాబాద్: ఈ ఏడాది 17 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అందుకోసం నోటిఫికేషన్ జారీచేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇటీవల కొత్తగా 8 వేల ఉపధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, అయితే అర్హతకు సంబంధించిన విషయంలో అభ్యర్థుల విన్నపం మేరకు వాటిని నిలుపుదల చేశామన్నారు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు కడియం తెలిపారు. 2017–18 నుంచి అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రాథమిక పాఠశాలల స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నామని, ఆయా కేంద్రాలను ప్లే స్కూళ్లుగా తయారుచేస్తామని పేర్కొన్నారు. బాలికల కోసం 300 గురుకుల పాఠశాలలు కేటాయించామన్నారు. అందులో 30 ఎస్సీ బాలికల కోసం కేటాయించామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. -
టీచర్ పోస్టుల ఖాళీలపై సుప్రీం నోటీసు
అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణకు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న అంశంపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమిపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఆర్టికల్ 371–డి కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా.. విద్య ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ పాఠశాలల విషయంలో నిర్లక్ష్యం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై అసంతృప్తి వ్యక్తంచేసింది. పాఠశాలలంటే భవనాలు ఉంటే సరిపోదని, నాణ్యమైన విద్య అందించాలని సూచించింది. విద్యాహక్కు చట్టాలను సక్రమంగా అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. టీచర్ల నియామకంపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లలో నీటి వసతిలేమిపై ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పాఠశాలల్లో నీటి వసతి ఉన్న జిల్లా పేరు చెబితే తనిఖీలు చేయిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరుగుదొడ్డి వసతి లేకపోవడం కారణంగా కూడా విద్యార్థినుల హాజరు శాతం తక్కువగా ఉండడం, డ్రాప్ అవుట్స్ పెరగడం చోటుచేసుకుంటోందని వ్యాఖ్యానించింది. దీనికి ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ విజయనగరం జిల్లాలో పరిశీలన చేయవచ్చని కోర్టుకు విన్నవించారు. ఆ జిల్లాలో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని మౌలిక వసతుల లేమిని అధ్యయనం చేస్తున్న గుప్తా కమిటీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. -
టీఎస్పీఎస్సీ నిబంధనలతో నష్టం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు నష్టం కలిగించే నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం కోరింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామనే నిబంధనలు హేతుబద్ధంగా లేవని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య తెలిపారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు. -
గురుకుల నోటిఫికేషన్ విడుదల
ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తీపి కబురు అందించింది. గురుకుల పాఠశాలల్లో ఏడువేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందుకోసం ఈ నెల 10 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. మొత్తం 7,306 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. గురుకుల నోటిఫికేషన్ గురించి గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో పొందుపరచాల్సిన నిబంధనలపై టీఎస్పీఎస్సీ, సంక్షేమశాఖలు ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం. విద్యార్హతల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గురుకులాలు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు అయినందున ఆంగ్ల మాధ్యమంలోనే చదివి ఉండాలన్న నిబంధన ఉంటుందా అనే ఆందోళన అనేక మంది అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మీడియం విషయంలో ఆంక్షల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్మీడియెట్ డిగ్రీ, పీజీ, బీఎడ్ వంటి కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో చదివినా, తెలుగు మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. (చదవండి: మీడియం ఏదైనా అర్హులే!) -
త్వరలో 12,000 టీచర్ పోస్టులు
వచ్చే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చింది. వచ్చే నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పాఠశాలల్లో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వచ్చే జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో లేదా మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న విషయంలో ప్రభుత్వం పలు రకాలుగా ఆలోచనలు చేస్తోంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనూ టెట్ అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చిన అక్కడి ప్రభుత్వం 2014లోనే టెట్ లేకుండా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ టెట్ లేకుండానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. టెట్పై స్పష్టత రాగానే పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపైనా కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. -
10,00,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి విద్యావ్యవస్థపై పాలకుల నిర్లక్ష్యం వీడడం లేదు. అసలే అరకొర వసతులతో సతమతమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సుమారు పది లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లోక్సభకు ఇటీవల వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే ప్రభుత్వ సెకండరీ స్కూళ్లలో 15 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక్సభకు సమర్పించిన అధికారిక గణాంకాలివి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఆరు ఉపాధ్యాయ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా, కొన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఖాళీలు అధికంగా ఉన్నాయి. 2015–16 ఎడ్యుకేషన్ డేటా ప్రకారం దేశంలో 260 మిలియన్ల పాఠశాల విద్యార్థుల్లో 55 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. జార్ఖండ్లో అత్యధికం... దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలకు పైగా, సెకండరీ స్కూళ్లలో లక్షకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని సెకండరీ స్కూళ్లలో 70 శాతం పోస్టులు(ప్రాథమిక పాఠశాలల్లో 38%) ఖాళీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని సెకండరీ స్కూళ్లలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో మూడొంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలపై పాలకులకు చిత్తశుద్ధి కొరవడడం, రెగ్యులర్గా ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఆయా సబ్జెక్టులకు సంబంధించి నిపుణులైన ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు తక్కువగా ఉన్న చిన్న పాఠశాలలు వంటివి ప్రస్తుత పరిస్థితికి పలు కారణాలు. తెలుగు రాష్ట్రాల్లో... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,47,139 పోస్టులు ఉండగా, 19,468 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ స్కూళ్లలో మొత్తం 61,793 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 5,056 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎమ్ఎస్ఏ) కింద ఆమోదం తెలిపిన 860 స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులకు సంబంధించి ఏ ఒక్కటీ భర్తీ కాలేదు. తెలంగాణలో... తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 97,507 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 13,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ స్కూళ్లలో 43,746 పోస్టులు ఉండగా, 3,144 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏకైక రాష్ట్రం సిక్కిం.. గోవా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలన్నవే లేవు. అసోం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లోని సెకండరీ స్కూళ్లలో వరుసగా 3.9%, 3.9%, 2% చొప్పున ఖాళీలున్నాయి. దేశంలో ప్రాథమిక, సెకండరీ స్కూళ్లలో అన్ని పోస్టులు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం సిక్కిం మాత్రమే! -
భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు
- ఏపీలో 19,468.. తెలంగాణలో 13,049 ఖాళీలు లోక్సభలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలోని పాఠశాలల్లో మౌలికవసతుల కొరతతో పాటు బోధన సిబ్బంది పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎంపీలు కొత్తపల్లి గీత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నంది ఎల్లయ్య అడిగిన వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. 2016, మార్చి 31 నాటికి ఏపీలో 19,468 టీచర్ పోస్టులు, తెలంగాణలో 13,049 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 9, 10 తరగతులకు సంబంధించి ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో ఏపీలో 5,056, తెలంగాణలో 3,144 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. -
త్వరలో 6 వేల గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్
గ్రూప్-2 తర్వాత జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, కొత్త గురుకులాల్లో మంజూరు చేసిన దాదాపు 6 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్ష తర్వాతే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల్లో మహిళలతోనే పోస్టులను భర్తీ చే సేలా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. -
జిల్లాల ఏర్పాటు వల్లే పోస్టులు ఆలస్యం
⇒ హేతుబద్ధీకరణ తరువాత టీచర్ల నియామకాలు - కడియం హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో టీచర్ల హేతుబద్దీకరణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, ఎన్ని పాఠశాలలు అవసరం, ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని కావాలన్న అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. మొత్తానికి వచ్చే జూన్లో స్కూళ్లు తెరిచేనాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. 10 వేలకు పైగా పోస్టులకు కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపినా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నియామకాలు ఆపామన్నారు. పాఠశాలలు, వాటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం హేతుబద్దీకరణకు సంబంధించిన అన్ని ప్రణాళికలను 15 రోజుల్లోగా సిద్ధం చేసుకొని తమకు పంపించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డీఈవోలకు సూచించారు. కొత్త జిలాల్లో నియమితులైన డీఈవోలు, అసిస్టెంట్ డెరైక్టర్లు, ఆర్జేడీలకు మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన అవగాహన కార్యక్రమాలను ఆదివారం హైదరాబాద్లో కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు పాఠశాలలల్లో టీచర్ల నియామకాల్లో వెయిటేజీ ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన 250 గురుకులాలు, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న మరో 119 బీసీ, 90 మైనారిటీ గురుకులాల్లో మొత్తంగా 12వేల వరకు పోస్టుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎక్కడెక్కడ టీచర్లు అవసరమో డెరైక్టరేట్కు రాస్తే 24 గంటల్లో విద్యా వలంటీర్ల నియామకాలకు అనుమతిస్తామన్నారు. పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు 40 మంది ఎమ్మెల్యేలు ముందుకువచ్చారని, మిగితా వారికి లేఖలు రాస్తామన్నారు. 100 శాతం సిలబస్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు నోటీసులు ఇవ్వడం.. వారు కలిసి కవర్లు ఇవ్వగానే అన్ని బాగున్నాయని సర్టిఫై చేయడం వంటివి మానుకోవాలన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే రెగ్యులర్ డిప్యుటీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లిన టీచర్లకు అప్షన్ ఇస్తామని, ఈ విద్యా సంవత్సరంలో 5 వేల ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో 5 వేల స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు. -
టీచర్ల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం!
• విద్యాశాఖ టీచర్లే కాదు.. గురుకుల టీచర్ల భర్తీ ఆలస్యమే • గ్రూపు-2 తరువాత భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం • తేలని హేతుబద్ధీకరణ, టెట్ వెయిటేజీ.. • విద్యాశాఖలో 11 వేల వరకు ఖాళీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 11 వేల టీచర్ పోస్టులే కాదు.. వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న, కొత్తగా సృష్టించిన దాదాపు 5 వేల టీచర్ల భర్తీకి కూడా మరికొంత సమయం పట్టనుంది. వాస్తవానికి గురుకుల టీచర్ల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా అది జరగలేదు. పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండటం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో స్పష్టత రావాల్సి ఉండటం, మరోవైపు వచ్చే నెలలో గ్రూపు-2 నిర్వహణకు సంబంధించిన పనుల్లో టీఎస్పీఎస్సీ బిజీగా ఉన్న నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఇంకొన్నాళ్లు సమయం పట్టనుంది. వీటికి సంబంధించి వచ్చే నెలాఖరుకు స్పష్టత వస్తే డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హేతుబద్ధీకరణ చిక్కు..: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలే దు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ తరువాతే వాస్తవ అవసరాల మేరకు భర్తీపై నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకే 9,500 పైగా ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అధికారులంతా అదే పనుల్లో బిజీ అయ్యారు. దీంతో హేతుబ ద్ధీకరణపై పెద్దగా దృష్టిసారించలేని పరిస్థితి నెలకొంది. వీలైతే సంక్రాంతి నాటికి లేదా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల్లో కనుక హేతుబద్ధీకరణ పూర్తయితే అప్పుడే టీచర ్ల భర్తీకి చర్యలు చేపట్టే వీలుంది. లేదంటే వేసవి సెలవుల తరువాతే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గురుకులాల్లో ఇదీ పరిస్థితి.. : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డి గ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీపై గతంలోనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే అందులో అన్నింటికి సంబంధించిన అనుమతులు ఇంకా వెలువడలేదు. ఆరు నెలల కిందటే 2,444 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఆ తరువాత మరో 1,794 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఆ తరువాత మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు సంబంధిత శాఖల నుంచి ఇండెంట్లు రావాల్సి ఉంది. అర్హత పరీక్షగానే టెట్?: ఇప్పటివరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోర్కు (టెట్) ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే టెట్ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ మాత్రం టెట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతించాలని పేర్కొంటోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వెయిటేజీ ఇస్తారా? లేదా? అన్నది సంబంధిత యాజమాన్యాల ఇష్టమని, టెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
గురుకులాల్లో 302 ఉపాధ్యాయ ఖాళీలు
భర్తీ కోసం ప్రభుత్వానికి విద్యా శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో 302 లెక్చరర్, టీచర్ల ఖాళీలున్నాయి. ఆయా పోస్టులను డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీకి అనుమతివ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలోని 47 గురుకుల విద్యాలయాల్లో 802 మంజూరైన టీచర్ పోస్టులుండగా, అందులో 492 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 179 పోస్టుల్లో సీఆర్టీలు పని చేస్తున్నారు. డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో 302 ఖాళీలున్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు.. కేటగిరీ మంజూరైనవి ఖాళీలు భర్తీ చేయాల్సినవి జూనియర్ లెక్చరర్ 66 10 6 పీజీటీ 361 149 136 టీజీటీ 247 224 74 పీఈటీ 41 32 22 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ 46 43 32 స్టాఫ్ నర్స్ 41 34 32 మొత్తం 802 492 302 -
5 లక్షల టీచర్ పోస్టులపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఐదు లక్షల ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాయనుంది. కేవలం ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలలు దేశంలో నేడు లక్ష ఉన్నాయి. ‘టీచర్ల స్థానాలు ఖాళీగా ఉండడం అనేది తీవ్ర సమస్య. ఉపాధ్యాయులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రాలది కాబట్టి వారే వీలైనంత త్వరగా టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నాం’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సరైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేకుండా విద్యలో నాణ్యతను తీసుకురావడం కుదరదు కాబట్టి కేంద్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 33.08 లక్షల ప్రాథమిక స్థాయి టీచర్ల ఉద్యోగాలు మంజూరైతే ప్రస్తుతం 5.56 లక్షల స్థానాలు ఖాళీగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంటులో తెలిపింది. -
15 ఏళ్లదాకా 44,842 టీచర్ పోస్టులే
* భవిష్యత్తులో డీఎస్సీలు కష్టమే * మరోవైపు 10 లక్షలకు చేరనున్న బీఎడ్, డీఎడ్ల సంఖ్య * 2030 నాటికి పరిస్థితులపై సక్సెషన్ ప్రణాళిక రూపొందించిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్లలో ఉపాధ్యాయ పోస్టులు, బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఏర్పడనుంది. లక్షలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదు. విద్యాశాఖలో రిటైర్మెంట్ ద్వారా 44,842 పోస్టులు మాత్రమే ఖాళీ కానున్నాయి. అంటే 2030 నాటికి వాటిని మాత్రమే భర్తీ చేసే అవకాశమున్నట్లు పాఠశాల విద్యాశాఖ నివేదిక రూపొందించింది. మరోవైపు రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థుల సంఖ్య మాత్రం 10 లక్షలకు చేరనుందని పేర్కొంది. సక్సెషన్ రిపోర్టు పేరుతో 2030 నాటికి రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఖ్య, ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యను అంచనా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.24 ల క్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 44,842 మంది ఉపాధ్యాయులు 2030 నాటికి పదవీ విరమణ పొందనున్నారు. వారిలో బీఎడ్ అర్హతతో ఉద్యోగాలు పొందిన స్కూల్ అసిస్టెంట్లు దాదాపు 23 వేల మంది, మరో 21,482 మంది డీఎడ్ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉండే అవకాశముంది. అయితే, పదవీ విరమణ పొందే స్కూల్ అసిస్టెంట్లలో 30 శాతం మందిని రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రెండు, మూడుసార్లకు మించి చేపట్టే అవకాశం కనిపించడం లేదు. 10 లక్షలకు చేరనున్న అర్హులు రాష్ట్రంలో టెట్ పేపరు-1 లో అర్హత సాధించినవారు లక్షన్నర మంది ఉండగా, పేపరు-2లో అర్హత సాధిం చినవారు 2.5లక్షల మంది ఉన్నారు. టెట్ రాసేం దుకు సిద్ధంగా మరో 2 లక్షల మంది ఉన్నారు. అంటే ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు 5లక్షల వరకు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని డీఎడ్, బీఎడ్ కాలేజీల నుంచి ఏటా 40 వేల మంది బయటకు వస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 10 లక్షలు దాట నుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 61 లక్షల మంది విద్యార్థులుండగా, జనాభా నియంత్రణ నేపథ్యంలో 2030 నాటికి ఆ సంఖ్యలో మార్పు లక్ష లోపే ఉండే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త పోస్టుల సృష్టి పెద్దగా ఉండే అవకాశం లేదు. -
మరో 2 వేల గురుకుల టీచర్ పోస్టులు
► భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం ► ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు ► వీలైతే అన్నింటికీ కలిపి నెలాఖరులో నోటిఫికేషన్! ► నోటిఫికేషన్తోపాటే సిలబస్, పరీక్ష నిబంధనలు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 4,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 224 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలకు 2 వేల పోస్టులు మంజూరు చేసేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతకం చేసినట్లు తెలిసింది. 224 గురుకుల పాఠశాలల్లో 103 ఎస్సీ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాలు, 50 ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 50 బీసీ గురుకులాల మంజూరు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టులు, కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి అవసరమైన పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీల నుంచి ఇండెంట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలను తీసుకొని నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల సమయం పట్టనుంది. మరోవైపు నియామక నిబంధనలు, సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని టీఎస్పీఎస్సీ అధికారులను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో 2 వేల పోస్టుల వివరాలు అందితే వాటిని కూడా కలిపి మొత్తంగా దాదాపు 4,500 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వివరాలు అందడం ఆలస్యమైతే తొలుత 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత 2 వేల పోస్టులు వచ్చాక వాటిని అదే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. మరోవైపు కేటగిరీలవారీగా పోస్టులకు నిర్వహించే పరీక్ష సిలబస్ను ముందుగా ప్రకటించాలని భావిస్తోంది. వీలుకాకపోతే నోటిఫికేషన్తోపాటు జారీ చేసే అవకాశం ఉంది. అర్హత పరీక్షగానే టెట్? ఇప్పటిరవకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా లేదా అనే సందేహం నెలకొంది. అయితే టెట్ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టె ట్ వెయిటేజీ అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 5న జరిగే టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
టీచర్ల భర్తీ ఇప్పట్లో లేనట్లే
►కొత్త జిల్లాలు, పాత డీఎస్సీల వివాదాలతో జాప్యం ►అందుకే విద్యా వలంటీర్ల నియామకం ►పెరగనున్న విద్యా వలంటీర్ పోస్టులు ►9,335కి బదులు 11,428 పోస్టుల భర్తీ! ►మార్గదర్శకాలపై దృష్టిపెట్టిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,428 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత డీఎస్సీల వివాదాలే ఇందుకు కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. వాటికి సంబంధించిన సమస్యలు, వివాదాలను పరిష్కరించకుండా ముందుకు సాగడం కష్టమని చెబుతున్నారు. కొత్త జిల్లాల అంశాన్ని పక్కనబెట్టినా 1998 డీఎస్సీ నుంచి 2012 డీఎస్సీ వరకు ఆయా డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసే వ్యవహారం తేల్చకుండా కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ బాధిత అభ్యర్థులను కాదని ముందుకు సాగితే వారంతా ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న భావన అధికారుల్లో నెలకొంది. పైగా ఒక్కో డీఎస్సీలో ఒక్కో రకమైన సమస్యలతో అభ్యర్థులు నష్టపోయిన వారూ ఉన్నందున, వారందరికీ ఇప్పటికిప్పుడు న్యాయం చేయడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట స్వయంగా వరంగల్లో అభ్యర్థులకు హామీ ఇవ్వడం, ఆ తరువాత అన్ని డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే అంశాన్ని తేల్చాలని అధికారులను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అంశాన్ని తేల్చకుండా టీచర్ల నియామకాల్లో ముందుకు సాగడం సాధ్యం కాదన్న భావనకు అధికారులు వచ్చినట్లు సమాచారం. వలంటీర్లతోనే సరి...: పాత డీఎస్సీల వ్యవహారం, జిల్లాల పునర్విభజన అంశాలతోపాటు పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే 1,604 పాఠశాలల్లో ఒక్క టీచర్ కూడా లేరని విద్యాశాఖ ఇటీవల బడిబాట సందర్భంగా తేల్చింది. అయితే కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విలీనం, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వంటి అంశాలను తేల్చాల్సి ఉంది. ఇందుకోసం హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నెల 30 వరకు వచ్చే విద్యార్థుల వివరాలను తీసుకొని జూలై మొదటి వారంలో హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో హేతుబ ద్ధీకరణ తరువాత స్పష్టంగా ఎంత మంది ఉపాధ్యాయులు అవసరమన్నది తేలుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నెలల తరబడి సమయం పడుతుందని, అందుకే ముందుగా విద్యా వలంటీర్లను నియమించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం సోమవారం నిర్ణయించిన 9,335 వలంటీర్ల నియామకాలకు బదులుగా 11,428 క్లియర్ వెకెన్సీలలో వలంటీర్ల నియామకాలు చేపట్టేందుకు మార్గదర్శకాల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇవీ జిల్లాల వారీగా నియమించే విద్యా వలంటీర్లు జిల్లా వలంటీర్లు ఆదిలాబాద్ 1,582 నిజామాబాద్ 790 కరీంనగర్ 915 వరంగల్ 690 ఖమ్మం 895 నల్లగొండ 817 మహబూబ్నగర్ 2,023 రంగారెడ్డి 1,670 హైదరాబాద్ 539 మెదక్ 1,507 మొత్తం 11,428 -
నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశాపాఠం
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు శిక్షణ పొందినా దక్కని ఉద్యోగం రేషనలైజేషన్తో మరింత ముప్పు ఏటా భర్తీకాని టీచర్ పోస్టులు చిరుద్యోగులుగా మిగిలిపోతున్న అభ్యర్థులు భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పేది ఉపాధ్యాయులే. అందుకే ఆచార్యదేవో భవ ! అన్నారు పెద్దలు. అటువంటి ఉన్నతమైన వృత్తిపై ఉన్న మక్కువతో జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. అంతకు ముందు ఇతర కోర్సుల్లో అవకాశం వచ్చినా కాదనుకున్నారు. చివరకు స్థిరపడాలనుకున్న రంగంలో ఉద్యోగం లభించక కుటుంబ పోషణకోసం ప్రయివేటు సంస్థల్లో చిరుద్యోగులుగా మారుతున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఏటా ఆరువేల మంది బయటికొచ్చి ఉపాధి వేటలో విసిగివేసారిపోతున్నారు. చిత్తూరు: ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఎన్నో ఆశలతో వ్యవస్థలోకి వచ్చే వారికి చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దీంతో వారు నిరాశకు గురవుతున్నారు. మారుమూల మండలాలు గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగం దొరికినా ఆ యాజమాన్యం ఇచ్చే చాలీచాలని జీతానికి అంగీకరించి వెళ్తున్నారు. ఇళ్లు గడవడం కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డులు, వారి కుల వృత్తుల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. మరికొంత మంది వ్యసాయం చేసుకుంటున్నారు. ఇదిలానే కొనసాగితే రాబోయే కాలంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారు ఉండరని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. కొంప ముంచుతున్న ప్రభుత్వ నిర్ణయం... ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. టీటీసీ శిక్షణ తీసుకున్న వారు మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నిబంధన విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. బీఈడీ శిక్షణ తీసుకున్న వారందరూ ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగులుతున్నారు. టీటీసీ పూర్తి చేసుకున్న వారు ప్రతి సంవత్సరం 2500 మంది. గత 13 సంవత్సరాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది 3200 ఉద్యోగాలు మాత్రమే. ఈ 13 సంవత్సరాల్లో 32500 మంది శిక్షణ ముగించుకొని ఉద్యోగ వేటకు వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న డీఎడ్ కాలేజీలు 51. ఈ కాలేజీల్లో సీట్లు సుమారుగా 7 వేలు. ఈ సీట్లలో కేవలం 4500 మంది మాత్రమే ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. 2500 సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. రేషనలైజేషన్తో... ప్రభుత్వం రేషనలైజేషన్ విధానం అమలు చేస్తే ఉపాధ్యాయ నిరుద్యోగులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉన్న స్కూళ్లను మూసివేస్తుండటంతో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం విముఖత చూపే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నా ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. తమిళనాడు విధానమే మేలు.. టీచర్ ఉద్యోగాల అమలులో తమిళనాడు విధానం మేలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. కళాశాలలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటే శిక్షణ బాగుంటుంది. తమిళనాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా భర్తీ చేస్తారు. సీనియార్టీ ఉన్న వారికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఉపాధ్యాయ నిరుద్యోగి కూడా కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ధీమాతో ఉంటాడని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కొరియర్బాయ్గా పని చేస్తున్నా డీఈడీ పూర్తి చేసి మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో కేవలం ఒకసారి టీచర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేద్దామంటే రూ.5 వేల జీతం కూడా ఇవ్వరు. పూట గడవడం కష్టం. కొరియర్బాయ్గా పని చేస్తున్నా. రేషనలైజేషన్ అమలు చేస్తే టీచర్ ఉద్యోగం ఇక దొరకదు. అనవసరంగా డీఎడ్ చేశాను అనిపిస్తోంది. -మహేశ్, చిత్తూరు. సీనియార్టీ విధానం అమలు చేయాలి పరీక్ష విధానం తీసేసి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో సీనియార్టీ ప్రకారం ఉద్యోగాలిస్తే మేలు. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగం వ స్తుందో ఒక అంచనా ఉంటుం ది. టీచర్ ఉద్యోగం అవసరం అయిన వారు ఎదురు చూస్తారు. అవసరం లేని వారు ఇంకో ఉపాధి మార్గం ఎంచుకుంటారు. ఉపాధ్యాయ పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. -వీ. రెడ్డిశేఖర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, వైఎస్సార్ టీఎఫ్