ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్
Published Thu, Sep 14 2017 12:27 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ చెల్లించడానికి సంస్థ యాజమాన్యం అంగీకరించింది. అడ్వాన్స్ను ఈ నెల 19న అందజేయనున్నదని టీఎస్ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) తెలిపింది. టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి, కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, యూనియన్ రాష్ట్ర నేతలు బస్భవన్లో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావును కలిశారు. సంస్థలోని క్లాస్-3 క్యాటగిరీ ఉద్యోగుల వరకు రూ. 4500, క్లాస్-4 క్యాటగిరీ ఉద్యోగులకు రూ. 3000 చొప్పున అడ్వాన్స్ అందజేస్తామని ఎండీ హామీ ఇచ్చినట్టు టీఎంయూ నేతలు తెలిపారు. దీనిపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement