'మోడీ, చంద్రబాబు దొందూ దొందే' | Jairam Ramesh takes on Narendra Modi, Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే'

Published Wed, Apr 23 2014 4:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే' - Sakshi

'మోడీ, చంద్రబాబు దొందూ దొందే'

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు దొందూ దొందే అని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు దొందూ దొందే అని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు నేతలు మత సామరస్యాన్ని విస్మరించారని ఆరోపించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్లో విచ్చేశారు. ఈ సందర్బంగా జైరాం రమేష్ మాట్లాడుతూ... గతంలో మోడీని విమర్శించిన బాబు.... ఇప్పుడు ఆయనతోనే బాబు అంటకాగడాన్ని జైరాం రమేష్ విమర్శించారు. చంద్రబాబు రంగులు మార్చే ఊసరవెల్లిగా అని ఆయన అభివర్ణించారు.

కేసీఆర్కు రెండు కళ్లున్నా... తెలంగాణ ప్రాంతం పునర్ నిర్మాణం అంటూ ఓ వైపు మాత్రమే చూస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రెండు కళ్లతో రెండు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటుందని గుర్తు చేశారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని మాట ఇచ్చి... ఆ తర్వాత మాట మార్చిన మహా నాయకుడు అంటూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో జైరాం రమేష్ విరుచుకుపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement