
నగరంలోని ముషీరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాంనగర్ ప్రేమ విఫలమై శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే బాలాజీ ప్రతాప్ అనే యువకుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి అంగీకరించక పోవడంతో మనస్థాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాలాజీ ఆత్మహత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.