Love failure
-
అమెరికా వెళ్లాక గర్ల్ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..!
ఫిలింనగర్: జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ప్రేమలో విఫలమై ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్ (23) షేక్పేట గుల్షన్కాలనీలో ఓ పెంట్హౌస్లో అద్దెకు ఉంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా గత జనవరి నుంచి పనిచేస్తున్నది. ఈ నెల 8వ తేదీన ఉదయం ఆమె స్నేహితుడు అబ్దుల్ ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికే ఆమె తల్లి కూడా అబ్దుల్కు ఫోన్ చేసి తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. ఆందోళన చెందిన అబ్దుల్ సాయంత్రం 5.30 గంటలకు ఇరం ఉంటున్న గదికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్మెన్ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అబ్దుల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అంతకముందు రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కశ్మీర్లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లుగా నిర్థారించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశీ్మర్కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయంరతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఉంచనున్నారు . -
యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య
దుండిగల్: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. అతడు గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్ ఫోన్లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ చివరిసారిగా ఓ యువతితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ప్రేమ విఫలమైందని.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
మహబూబాబాద్: ప్రేమ విఫలమైందనే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన వినోద్(25) మానుకోట జిల్లా కలెక్టరేట్లోని దివ్యాంగుల విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోలారం గ్రామానికే చెందిన ఓ యువతితో ఆయన ప్రేమలోపడగా, యువతి తండ్రి వినోద్ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ ఇరవై రోజుల క్రితం పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వినోద్ తండ్రి ప్రభాకర్ ఫిర్యాదుతో యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే
సాక్షి, వరంగల్: ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు. గణేష్కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్కు వేలాడుతూ గణేష్ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్ ఉరి వేసుకున్న చోట ఫోన్కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం! -
Hyderabad: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..
సాక్షి, మియాపూర్: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్(28) పటాన్చెరులోని శ్రీనగర్కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న చందానగర్లోని ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్లో ఓ సూసైడ్ నోట్ను గుర్తించారు. అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పృథ్వీ షా లవ్స్టోరీకి ఎండ్కార్డ్ పడిందా!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా లవ్స్టోరీకి ఎండ్కార్డ్ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పృథ్వీ షా నిధి తపాడియా అనే అమ్మాయితో లవ్లో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు తమ రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇటీవలే నిధి తపాడియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకుంది. పంజాబీ నేపథ్యంలో ఉన్న బ్రేకప్ పాటను షేర్ చేసుకుంది. ఆ తర్వాత పృథ్వీ షా, నిధి తపాడియాలు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడం బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నిధి తపాడియా మోడల్, నటిగా రాణిస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 108కె ఫాలోవర్లు ఉన్నారు. నిధి తపాడియా స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్. కాగా ఇటీవలే ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్గా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. ఈ ఇద్దరు ఇలా తమ లవ్ను బ్రేక్ చేసుకోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు, పబ్లకు వెళ్లారు. పృథ్వీ షా ప్రేమలో ఉన్నాడని తెలిసేలోపే ఇద్దరి మధ్య రిలేషిన్షిప్కు బ్రేక్ పడింది. ఇక పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్తో టి20 సిరీస్లో ఆడుతున్నాడు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చినప్పటికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.మూడో టి20కి వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సహా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsxhmemewala🔵 (@harsxhmemewala) చదవండి: బట్లర్కు ఇదేమి కొత్త కాదు.. -
ఆమె వల్ల పిచ్చోడినయ్యా.. ప్లీజ్ వారినైనా కాపాడండి: బీటెక్ విద్యార్థి సూసైడ్
సాక్షి, విజయవాడ: సూసైడ్ నోట్ రాసిపెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్ పాస్ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు. -
రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..
సాక్షి, బెంగళూరు: విధానసౌధలో బాంబు పెట్టామని శుక్రవారం బెదిరింపులకు పాల్పడిన టెక్కీని విధానసౌధ పోలీసులు అరెస్ట్చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఫోన్ చేసిన టెక్కీ సౌధలో బాంబు పెట్టామని, త్వరలో పేలిపోతుందని పదే పదే చెప్పాడు. సౌధలో పోలీసులు సోదాలు చేయగా ఎలాంటి బాంబు కనబడలేదు. ఊరికే బెదిరించడానికి పోన్ చేశాడని అనుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని గుర్తించారు. హెబ్బగోడికి చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీరు ప్రశాంత్ ఈ బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో టెక్కీని అరెస్ట్ చేశారు. కాగా, రెండుసార్లు ప్రేమలో విఫలం చెంది ఆ డిప్రెషన్లో నకిలీ బాంబు కాల్స్ చేసినట్లు చెప్పాడు. అతడు గతంలోనే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలిసింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలిసి..) -
Trisha: ప్రేమలో మరోసారి ఫెయిల్ అయ్యిందా?
సాక్షి, చెన్నై: అందమైన రూపం, చక్కని నటనా ప్రతిభ త్రిష సొంతం. అందుకే మోడలింగ్ రంగం నుంచి కేరీర్ను ప్రారంభించి మిస్ తమిళనాడు కీరీటాన్ని గెలుచుకుంది. 2002లో కథానాయికగా పరిచయం అయ్యి నేటికీ ఎవర్గ్రీన్ నటిగా వెలిగిపోతోంది. రెండు దశాబ్దాలుగా కథానాయకగా రాణిస్తున్న బహుభాషా నటి బ్యూటీ. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో దాదాపు అగ్ర నటులందరితోనూ నటించింది. లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే వ్యక్తిగతంగా 40వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమెకు ప్రేమ, పెళ్లి వంటి అంశాలు ఇంకా సెట్ కాలేదనే చెప్పాలి. ఈ వ్యవహారంపై ఇంతకు ముందు నిత్యం వార్తల్లో నానింది. అప్పట్లో ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ తర్వాత ఆ ప్రేమ విఫలం అయిందని టాక్. ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే అంశాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ సంచలన నటి ఇటీవల తన ఇంస్ట్రాగామ్లో పోస్ట్ చేసిన ఒక విషయం సంచలనంగా మారింది. అదేంటో చూద్దాం ‘వక్ర బుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండటమే ఉత్తమం’అని పేర్కొంది. దీంతో అలా పేర్కొనడానికి కారణం ఏమిటి? ఎవరిని అంతగా ద్వేషిస్తోంది. ప్రేమలో మూడోసారి ఫెయిల్ అయ్యిందా? ఇలాంటి ప్రశ్నలు ఇటు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: సండే సినిమా: వెండితెరపై జై జవాన్ -
ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగితే..
సాక్షి, మామిడికుదురు (తూర్పుగోదావరి): వారిద్దరిదీ ఒకే గ్రామం. ఒకే కులం. ఐదేళ్ల నుంచి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చివరకు అతడిని పెళ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు శుక్రవారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలో దూకి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పూర్వాపరాలివీ.. మొగలికుదురు గ్రామానికి చెందిన బిళ్ల సూర్యప్రతాప్ (22) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. ప్రతాప్ను పెళ్లి చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా నగరం పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. సూర్యప్రతాప్తో తన కుమార్తె చేసిన చాటింగ్, అతడితో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయాలని, తన కుమార్తె జోలికి రాకుండా చూడాలని కోరాడు. దీనిపై గురువారం రాత్రి పోలీసులు ప్రతాప్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతడి సెల్ఫోన్ తీసుకుని ఫొటోలు, మెసేజ్లు డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్లో మెసేజ్ చేసిన సూర్యప్రతాప్ పాశర్లపూడి బ్రిడ్జిపై సెల్ఫోన్ పెట్టి వైనతేయ గోదావరి నదిలో దూకేశాడు. అతడి ఆచూకీ కోసం నగరం ఎస్సై షేక్ జానీబాషా ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద కారణంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యప్రతాప్ ఆచూకీ తెలియరాలేదు. యువకుడి తండ్రి బిళ్ల గణపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు) -
లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు..
తగరపువలస (భీమిలి) విశాఖపట్నం: ప్రేమ విఫలమై భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొయ్య లావణ్య(16) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొయ్య లావణ్య, ఇదే గ్రామానికి చెందిన మణి కుమార్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్కూల్ కరస్పాండెంట్ పాడుపని.. బాలికకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి.. ఈ క్రమంలో వివాహం చేసుకోమని మణికుమార్ను లావణ్య కోరగా నిరాకరించాడని ఒక కథనం వినిపిస్తుండగా.., మణికుమార్ కుటుంబ సభ్యులు లావణ్య కుటుంబ సభ్యులను కలిసి వివాహం గురించి మాట్లాడగా వారు నిరాకరించారని మరో కథనం వినిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న లావణ్యను సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం గ్రామంలో జరిగిన రజస్వల ఫంక్షన్లో ఉత్సాహంగా పాల్గొన్న లావణ్య ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభిన్న కథనాలపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్లో పిస్టల్ కొన్న సురేష్రెడ్డి!
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్తో కాల్చి, ఆపై సురేష్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్రెడ్డి బిహార్లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు. సురేష్రెడ్డి సెల్ఫోన్లను సీజ్చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్ చేసిన వారి వివరాలు, మెస్సేజ్లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్లో సుమారు 20 రోజులు బిహార్లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్ వెళ్లారు. పిస్టల్ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఐదోసారి తూటా పేలి.. సురేష్రెడ్డి వినియోగించిన పిస్టల్ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్రెడ్డి ఆరో రౌండ్ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్ పిస్టల్లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం.. కావ్యారెడ్డి, సురేష్రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Nellore: పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి.. ఒకప్పుడు వర్గ రాజకీయ హత్యలతో అట్టుడికిన గ్రామం. ఆ ఊరంతా వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. నేటితరం యువత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. కాలంతో పాటు ఆ ఊరు రాజకీయ వైషమ్యాలకు దూరమైంది. ఒకరికొకరు కలుపుగోలుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటున్న ఆ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతి పెళ్లికి నిరాకరించిందని తుపాకీతో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. పొదలకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయం, పాడి–పంటలతో అలరారుతున్న ఆ పల్లెలో ప్రేమోన్మాద తూటాలు పేలాయి. ఆ ఊరు ఉలిక్కిపడింది. విషయం తెలిసి విషాదంలో మునిగిపోయింది. తాను మనసు పడిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తుపాకీతో ఆమెను కాల్చి, తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నా డు. మండలంలోని తాటిపర్తిలో దిగువ మధ్య తరగతికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఉన్నంతలో ఉన్నతంగా జీవనం సాగి స్తున్నారు. గౌరవంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు విధి ఆడిన వింత నాటకంలో విషాదంలో మునిగిపోయా యి. హతురాలు కావ్య, ఆత్మహత్య చేసుకున్న సురేష్రెడ్డి కుటుంబాల నేప«థ్యాలు ఇంచుమించుగా ఒకటే. ఉన్నతంగా ఎదగాలని ఉన్నత చదువులు చదు వుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సాఫ్ట్వేర్గా సంతోషాన్ని ఆస్వాదిస్తుండగానే.. హతురాలు పలుకూరు కావ్య తండ్రి వెంకటనారపరెడ్డి మూడెకరాల రైతు. ఆయనకు ఇద్దరమ్మాయిలు. ఉన్నంతలో ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాడు. కావ్య పెద్దామ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడాదిన్నర కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చిన్నమ్మాయి కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుని చదువుతోంది. కావ్య సాఫ్ట్వేర్గా సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలోనే ప్రేమోన్మాదానికి బలైపోయింది. పెళ్లి ఆశ నెరవేరలేదు.. మాలపాటి సురేష్రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి సైతం సన్నకారు రైతు. వ్యవసాయంతో పాటు వరిగడ్డి వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు కొడుకు, కుమార్తె. ఆడపిల్లకు పెళ్లి చేశాడు. సురేష్రెడ్డి పెద్దవాడు కావడంతో బాగా చదివించాడు. ఐదేళ్ల కిందటే సురేష్రెడ్డి బెంగళూరులో సాప్్టవేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాడు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు కాల్పుల ఘటనతో గ్రామం ఉలిక్కి పడింది. విష యం తెలియడంతో విషాదఛాయలు అలముకున్నా యి. ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి, యువ కుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో బంధువర్గాలు తల్లిడిల్లిపోతున్నాయి. పోలీసుల సమగ్ర దర్యాప్తు కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మాట్లాడు తూ కావ్యతో సురేష్రెడ్డి చాటింగ్ చేశాడని, అయితే ఆమె మాత్రం తిరిగి చాటింగ్ చేయలేదని తెలిపారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వాధినం చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పిస్టల్ చుట్టూ క్రైమ్ స్టోరీ నడుస్తోంది. సురేష్రెడ్డి పిస్టల్ ఎక్కడ సంపాదించాడు? ఎవరి వద్ద పిస్టల్ కొనుగోలు చేశాడనే కోణంలో ప్రధానంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్పై ‘మేడిన్ యూఎస్ఏ’ ఉంది. కావ్య అంటే ఇష్టంతో.. కావ్య, సురేష్రెడ్డిలది ఇద్దరిది ఒకే ఊరు. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్రెడ్డి ఏడాది కాలంగా తల్లిదండ్రుల ద్వారా ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కావ్య కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కావ్య తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతించలేదు. బహుశా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉండడంతో ఒప్పుకోలేదని గ్రామస్తుల అభిప్రాయం. కానీ సురే‹Ù రెడ్డి పట్టు వదలకుండా కావ్యతోనే తన పెళ్లి జరగాలని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒంటిరి తనాన్ని అలవాటు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి తెగబడినట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఘోరం ఊహించలేదు ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మా గ్రామంలో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. అన్యాయంగా నా మనమరాలిని హత్య చేశాడు. ఏ పాపం తెలియని అమ్మాయి బలికావాల్సి వచ్చింది. – పలుకూరు మస్తాన్రెడ్డి, కావ్య తాత పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు మా అబ్బాయి సురేష్రెడ్డికి పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు. మా దురదృష్టం కొద్ది ఈ ఘటన జరిగింది. ఇంట్లో మా వాడు బాగానే ఉండేవాడు. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియడం లేదు. మాకు పుత్రశోకం మిగిల్చి వెళ్లాడు. – మాలపాటి పరమేశ్వరి, సురేష్రెడ్డి తల్లి -
ప్రేమను నిరాకరించింది.. ఇనుప కడ్డీకి తాడుతో..
సాక్షి,ఉరవకొండ( అనంతపురం): యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండలోని అంబేడ్కర్ నగర్కు చెందిన షణ్ముఖ (25).. నాలుగేళ్లుగా స్థానిక ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురైన షణ్ముఖ... నిర్మాణంలో ఉన్న షాదీఖానాలో ఇనుప కడ్డీకి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ రమేష్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లై ఏడాది కూడా అవ్వలేదు.. వివాహిత ఆత్మహత్య -
నా చావుకు ఎవరూ కారణం కాదు..!
సాక్షి, చందంపేట(నల్లగొండ): ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని గువ్వలగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావత్ భూర్య, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నాల్గో కుమారుడు సపావత్ నరేశ్(32) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ పూర్తిచేశాడు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన నరేశ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గాని శనివారం తెల్లవారుజామున నరేశ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో నరేశ్కు ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసిన సూసైడ్ నోట్ లభించిందని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
జిమ్ ట్రైనర్ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా..
బనశంకరి: ప్రేమ ఫలించలేదని జిమ్ శిక్షకుడు వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజరాజేశ్వరినగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారప్పలేఔట్ కు చెందిన కార్తీక్ (29) అనే యువకుడు జిమ్ ట్రైనర్గా ఉంటున్నాడు. ఇతను గత మూడేళ్లు నుంచి ఓ యువతి ని ప్రేమిస్తున్నాడు. కానీ ఇటీవల యువతి దూరం కావడంతో కార్తీక్ కుంగిపోయినట్లు తెలిసింది. ఈ తరుణంలో అతనికి తల్లిదండ్రులు ఒక సంబంధం చూశారు. ఆదివారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. కానీ శనివారం రాత్రి ఇంట్లో తన ప్రేమ వైఫల్యం గురించి సెల్ఫీ వీడియో తీసుకుని షీట్ హ్యాంగర్ కు ఉరివేసుకున్నాడు. స్థానిక పోలీసులు కార్తీక్ మొబైల్ను స్వా«దీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. (చదవండి: రిక్షా కార్మికుడిని రూ.3 కోట్లు టాక్స్ కట్టాలన్న ఐటీ అధికారులు) -
లవ్ ఫెయిల్యూర్: రన్నింగ్ బస్సు దిగి.. హస్సేన్సాగర్లో దూకి..
సాక్షి, రాంగోపాల్పేట్: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు హుటాహుటిన రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన 23 సంవత్సరాల ఓ యువకుడు మౌలాలిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ యువకుడిని మందలించారు. చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ.. దీంతో తీవ్ర భయాందోళనకు గురై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో వెళుతూ రన్నింగ్ బస్సులో నుంచి కిందకు దిగాడు. వెంటనే అంతే వేగంగా వెళ్లి హుస్సేన్సాగర్లోకి దూకాడు. వెంటనే అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి నీళ్లలోకి దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులను పిలిపించిన ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించారు .ఆ యువకుడిని కాపాడిన లేక్ కానిస్టేబుళ్లు అభిలాష్, రాజులను ఇన్స్పెక్టర్ అభినందించారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత -
'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అమీర్పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్కుమార్ కుటుంబం మధురానగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్ (26)ఓ యువతిని ప్రేమిచాడు. చదవండి: సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్ వెళ్లి విశాల్ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. సెనైడ్ ఎలా వచ్చింది? సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ సెనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే విశాల్కు సెనైడ్ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ తూర్పు) : ప్రేమ వివాహం జరగకపోగా ప్రియుడు తన నుంచి దూరమయ్యాడనే మనస్తాపంతో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణాజిల్లా తిరువూరు మండలం, రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఉంటోంది. సీఏ చదువుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా ప్రసేన్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. కానీ, ప్రసేన్ కుటుంబ సభ్యులు వారిద్దరి ప్రేమ వివాహానికి నిరాకరించారు. సింధు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు.. సింధు, ప్రసేన్ మధ్య కూడా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. దీంతో సింధు విజయవాడ గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. అటు సొంత కుటుంబ సభ్యులు, ఇటు ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో.. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రులు విజయవాడ చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్రసేనే పొట్టన పెట్టుకున్నాడు తన కూతురు ఉరి వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయనన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. సింధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే తాను ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్ హత్యచేసి ఉంటాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రేమించిన యువతితో వరుస కాదనడంతో.. ఇంటి నుంచి వెళ్లి..
సాక్షి, చిత్తూరు: మండలంలోని గుండ్లూరు గ్రామం కొర్నమిట్టపల్లె చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబసభ్యుల కథనం మేరకు... కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు కే.అశోక్ బాబు(23) తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో తన సమీప బంధువుల అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో నీకు వరుసలేదని, వద్దని మందలించారు. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొర్లకుంట గ్రామం టి.మాదిగపల్లె సమీపంలోని అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు అశోక్బాబుగా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఆత్మహత్యకు పాల్పడిందని తమ కుమారుడేనని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సుబ్బరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మెట్రో స్టేషన్ పిల్లర్ పై నుంచి దూకే ప్రయత్నం
-
దారుణం: ప్రేమించిన యువతి దక్కలేదని..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హమిర్పూర్ జిల్లా జాఖరీ గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసాద్ ప్రజాపతి అనే యువకుడు రాజస్థాన్లోని అల్వాల్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో, తను ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే, లక్ష్మీ ప్రసాద్ ప్రేమను అతని, తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారిని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. తాను ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుందనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో నేరుగా వ్యవసాయ భూమికి చేరుకున్నాడు. అక్కడ, తీవ్ర ఆవేదనకు లోనై ఏడుస్తూ.. సెల్ఫీవీడియో తీసి బంధువులకు, తన మిత్రులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, యువకుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా ఉన్న సదరు యువకుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలం: లవర్తో సెల్ఫోన్లో మాట్లాడుతూనే..
సిద్దిపేటకమాన్: ప్రేమ విఫలమై యవకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం వెలుగు చూసింది. సిద్దిపేట వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న మనోజ్కుమార్ (33) పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మనోజ్కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దలు ఇరువురికి రాజీ కుదుర్చారు. ఈ క్రమంలో మనోజ్కుమార్ బుధవారం రాత్రి అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. సర్జికల్ బ్లేడ్తో చేతి మణికట్టు, ఆపై గొంతు భాగంలో కొసుకున్నాడు. వెంటనే అమ్మాయి మనోజ్కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపింది. దీంతో మనోజ్ కుటుంబీకులు హుటాహుటిన అతడి గదికి వెళ్లి చూడగా రక్తం మడుగులో పడి ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మనోజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ విఫలం.. వైద్య విద్యార్థి బలవన్మరణం
సిద్దిపేట: ‘ఒక అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాను.. కొద్దిరోజులుగా ఆమె నా ప్రేమను నిరాకరిస్తోంది. అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మెగావత్ సంతోష్ కుమార్ (21) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్నాడు. మూడ్రోజుల క్రితం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా ఒక పరీక్ష పూర్తయింది. గురువారం మైక్రో బయాలజీ పరీక్ష రాసేందుకు ఉదయం 9 గంటలకు మిత్రులంతా వెళ్లారు. దీంతో గదిలో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయాల్సిన సంతోష్ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటిమిత్రులు సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెళ్లి చూడగా సంతోష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, రూరల్ ఎస్ఐ శంకర్ ఘటనా స్థలికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు బోరున విలపించారు. అనంతరం ఘటనపై సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
ఆమె కోసం అన్నదమ్ముల పచ్చబొట్టు, చివరికి పట్టాల పైకి
జైపూర్: ఇద్దరు అన్మదమ్ములు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఆమెతోనే జీవితం అనుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్లోని బుంది జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం..కేశవ్పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్రాజ్ గుర్జర్(23) వరుసకు అన్నదమ్ములు. అయితే ఒకరికి తెలయకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ప్రేయసి ఆశా పేరును ఇద్దరు అన్నదమ్ములు పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత గానీ తెలియలేదు ఇద్దరూ ప్రేమిస్తుంది ఒకరినే అని. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఫోన్ సంభాషణలు, వాట్సప్ మెసేజ్ల ఆధారంగా ఇద్దరూ ఆ యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ ట్రాక్ నడిపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత యువతి కనిపించకుండా పోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకునే ముందు తమ చావుకు ఎవరూ కారణం కాదని చెబుతూ ఓ వీడియోను రికార్డ్ చేశారు. అంతేకాకుండా తాము ఇద్దరం ప్రేమిస్తున్న యువతికి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని, వ్యక్తిగత నిర్ణయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు యువకులు వీడియోలో పేర్కొన్నారు. మా చావుకు ఎవరినీ నిందించవద్దని కోరారు. చదవండి : (మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై) (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా) -
ప్రేమ విఫలం, ట్రాన్స్జెండర్ ఆత్మహత్య
కడప అర్బన్: కడప నగరంలోని ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న శ్రీలేఖ అలియాస్ ప్రసాద్ (18) అనే ట్రాన్స్జెండర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సహచరుల, స్థానికుల సమాచారం మేరకు.. ట్రాన్స్జెండర్, ఓ యువకుడిని ప్రేమించింది. తనకు యువకుడి ప్రేమ దక్కలేదని, మానసిక వేదనకు గురై ఈనెల 4వ తేదీ రాత్రి పురుగుల మందు సేవించింది. స్థానికులు రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. -
ప్రేమ విఫలం: క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే!
గుంటూరు ఈస్ట్: ప్రేమ విఫలమైందంటూ అరండల్పేట బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేస్తున్న విద్యార్థిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని ప్రాణాలు కాపాడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అరండల్పేట ఎస్హెచ్ఓ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి నికి చెందిన ఓ యువకుడు గుంటూరులో సీఏ ఇంటర్ పూర్తి చేశాడు. విశాఖపట్నంలోనే ఓ సంస్థలో ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరులో సీఏ చదివే సమయంలో తోటి విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సీఏ పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట సదరు విద్యార్థి గుంటూరు వచ్చాడు. అయితే శుక్రవారం ఉదయం హోం మంత్రి రూట్ బందోబస్తు నిమిత్తం అరండల్పేట ఫ్లై ఓవర్పై ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా ఆ విద్యార్థి ఫ్లైఓవర్పై వేచి చూస్తూ రైలు వచ్చే సమయానికి కిందకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ట్రాఫిక్ హోంగార్డు శేఖర్, కానిస్టేబుల్ శివనాగేశ్వరావు అతనిని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో విద్యార్థి తప్పించుకుని కిందికి దూకేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న ఏఏస్ఐ రాధ, హెడ్ కానిస్టేబుల్ శేఖర్బాబు విద్యార్థిని నిలువరించి అరండల్పేట పోలీస్టేషన్కు తరలించారు. ఎస్హెచ్ఓ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సమయస్ఫూర్తిని ప్రదర్శించి విద్యార్థి జీవితాన్ని కాపాడిన సిబ్బందిని తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. -
పెళ్లికి ప్రియుడు ఒప్పుకోలేదని..
పటాన్చెరు టౌన్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి విషయం వచ్చేసరికి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని ప్రియుడు చెప్పడంతో మనస్తాపం చెంది న ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి ఇద్దరు కూతుర్లు. రెండో కూతురు శ్రావణి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటుంది. శ్రావణి అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అలియాస్ విక్కీ ప్రేమించుకున్నారు. శ్రావణి మామ రాజశేఖర్రెడ్డి.. వెంకట్రామిరెడ్డితో పెళ్లి గు రించి మాట్లాడగా, శ్రావణి తో పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే శ్రావణి వెంటపడొద్దని మందలించడంతో, అప్పటి నుంచి వెంకట్రామిరెడ్డి శ్రావణిని కలవలేదు. గతేడాది శ్రావణి మామ రాజశేఖర్రెడ్డి మృతిచెందడంతో మళ్లీ వెంకట్రామిరెడ్డి శ్రావణిని ప్రేమిస్తున్నానని వెంటపడటం ప్రారంభించాడు. ఇది గమనించిన శ్రావణి తల్లి విజయలక్ష్మి తన కూతురుతో మాట్లాడొద్దని విక్కీని మందలించింది. ఈ క్రమంలో ఈనెల 10న విజయలక్ష్మి పెద్దనాన్న చనిపోవడంతో కుటుంబసభ్యుల తో కలసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం శ్రావణి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. సాయంత్రం కుటుంబసభ్యులు కార్యక్రమం ముగించుకొని ఇం టికి వచ్చేసరికి శ్రావణి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే తన కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. -
ప్రేమకు గుర్తుగా పుస్తకం రాసినా పట్టించుకోలేదని..
సాక్షి, సూర్యాపేట: ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తర్వాత సదరు యువకుడు అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. వివరాలు.. సూర్యాపేటకు చెందిన ఇరుగు రామన్ హైదరాబాద్లో మల్టీ మీడియా రంగంలో వెబ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. మునగాల మండలానికి చెందిన అనూష అనే యువతితో పరిచయం ఏర్పడింది. 10 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కాగా అనూష సూర్యపేట జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చిన తరువాత అనూష తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్తాపానికి గురయ్యాడు. అయితే అనూషతో 10 సంవత్సరాల ప్రేమకు గుర్తుగా ఒక పుస్తకాన్ని రాసి దానిని తన మిత్రులకు పంచిపెట్టాడు. పుస్తకాలు పంచి పెట్టి, కాల్ రికార్డింగ్లు వెబ్ సైట్ లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని అనూష రామన్పై చివ్వేంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రామన్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే వెంటనే స్పందించిన పట్టణ పోలీసులు రామన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నైన్త్లోనే ప్రేమలో పడ్డ టాప్ హీరోయిన్!
తొలి ముద్దు, తొలి ప్రేమ ఎప్పుడు గుర్తు చేసుకున్నా తెలియని అనుభూతికి లోనవడం సహజం. సామాన్యులకు అయినా సెలబ్రిటీలకైనా ఆ ఫీలింగ్ ఒకేలా ఉంటుంది. ఇటీవల ఓ సందర్భంలో తాప్సీ ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తాప్సీ ప్రేమలో పడ్డారట. వన్ ఫైన్ డే బాయ్ఫ్రెండ్ దగ్గర ఆ విషయం చెప్పారట కూడా. మొదట ఆ అబ్బాయి తనకు ఇష్టమే అని చెప్పి, తాప్సీని మురిపించాడు. కొన్నాళ్లకు నేను బాగా చదువుకోవా లని చెప్పి తాప్సీకి దూరంగా ఉండ టం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీ ఫస్ట్ క్రష్ అలా మటాష్ అయింది. ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్బూత్కు వెళ్లి అతనికి కాల్ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ అన్నారు. -
ఫ్లైఓవర్పై నుంచి దూకి యువతి ఆత్మహత్య
సాక్షి, చిలకలగూడ : ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ సమాచారం మేరకు... సీతాఫల్మండీ జోషి కంపౌండ్ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు. రెండవ కుమార్తె పూజిత (19) ఇంటరీ్మడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి మూడేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని పూజిత తరుచు ఒత్తిడి తెచ్చేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీతాఫల్మండీ ఫ్లైఓవర్ పైకి రావాలని చెప్పడంతో ప్రదీప్ మరో మిత్రునితో కలిసి వచ్చాడు. పూజిత, ప్రదీప్లు కొంతసేపు మాట్లాడుకున్నారు. మరోమారు వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. మరి మరికొన్నాళ్లు ఆగితే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో క్షణికావేశానికిలోనైన పూజిత పరిగెత్తుకుంటూ కొంతదూరం వెళ్లి ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకింది. రాత్రి 11 గంటల సమయంలో పెద్దశబ్ధం రాడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో యువతి పడుంది. భయకంపితులైన ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పూజితను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే పూజిత మృతి చెందింది. పూజిత తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఉస్మానియా మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్పై కేసు నమోదు చేశామన్నారు. -
ఒకేసారి చనిపోవాలనుకున్నా..!
పేదింట పుట్టినా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘రోజూ చనిపోవడం కంటే ఒకసారే చనిపోవాలనుకున్నాను’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం హృదయాలను కలిచివేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ సమాచారం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకబోయిన గాలయ్య, నాగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు వంకరబోయిన శ్రీనివాసులు(27) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్టవేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే అన్న కృష్ణమూర్తితో కలిసి సుదర్శన్నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!) ఎంత పిలిచినా తమ్ముడు శ్రీనివాసులు పలుకలేదు. దీంతో తలుపు విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కాల్ చేయగా 108 వచ్చి చూసి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్తో పాటు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు ‘తన చావుకు ఎవరు కారణం కాదని... బతకాలని లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... రోజు చావడం కంటే ఒకే సారి చస్తున్నా’నని సూసైడ్ నోట్లో రాశాడు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమ విఫలమే కారణమా? మేస్త్రీ పని చేసే గాలయ్య, కూలీ పనులు చేసే నాగమ్మల చిన్న కొడుకు శ్రీనివాసులు ఉన్నత చదువు చదివి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సోదరుడు కృష్ణమూర్తి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆరు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. లాక్డౌన్ సమయంలో ఊరికి వెళ్లిన సోదరుడు ఇంటి నుంచే కొద్ది రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేశారని తెలిపారు. యువతి కుటంబ సభ్యులతో తాను వెళ్లి మాట్లాడతానని చెప్పినా తన తమ్ముడు శ్రీనివాసులు అంగీకరించలేదన్నారు. మూడు నెలల క్రితం నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుదర్శన్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని మరువలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై న్యూస్ చానల్ ఉద్యోగిని ఆత్మహత్య
బన్సీలాల్పేట్: ప్రేమ విఫలమై మానసిక ఆందోళనకు గురైన ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ సమాచారం మేరకు... సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ చానల్లో పనిచేస్తున్నది. కళ్యాణి అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడిని ప్రేమించిందని పోలీసులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమ కొనసాగుతున్నది. అయితే ఇటీవల కళ్యాణి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకోవాలని కోరింది. ఆ యుకువడు నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్తో కలిసి బోలక్పూర్లో ఉంటున్నారు. ఓ బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగుచూసింది. వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్ వివరించారు. -
చనిపోయేముందు టిక్టాక్లో వీడియో తీసి..
సాక్షి, కామారెడ్డి : ప్రేమ విఫలమైందనే కారణంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కామారెడ్డి పట్టణం అశోక్నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. అశోక్ నగర్ కాలనీకి చెందిన సంతోష్(23) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్న సంతోష్, సదరు యువతి ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. కాగా సంతోష్ చనిపోయే అరగంట ముందు టిక్టాక్లో వీడియో తీశాడు. దానిని అప్డేట్ చేసి తన స్టేటస్గా పెట్టుకున్నాడు. సంతోష్ స్వస్థలం కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి కాగా కొంతకాలంగా తల్లితో కలిసి అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు.గతంలో సంతోష్ తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, తాజా ఘటనతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది. -
ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి..
మహబూబ్నగ,బల్మూర్ (అచ్చంపేట): ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని గర్భం చేసి.. ఇప్పుడు కులం పేరుతో అన్యాయం చేస్తున్నాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి బుధవారం దీక్ష చేపట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన రోహిణి(25), అదే గ్రామానికి చెందిన సురేశ్రెడ్డి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకోగా రెండేళ్ల క్రితం గర్భం దాల్చింది. దీంతో అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావటంతో మీరు దళితులని.. ముఖం చాటేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో జిల్లాకేంద్రంలోని సఖి కేంద్రంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కౌన్సెలింగ్ ఇచ్చి గడువు ఇచ్చారని.. ఈలోపే మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలియటంతో తనకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో కలిసి దీక్షకు పూనుకున్నట్లు బాధితురాలు వాపోయింది. కాగా రోహిణి తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని సురేశ్రెడ్డి తెలిపారు. అధికారులకు తప్పడు సమాచారం అందించి తనను మానసిక వేదనకు గురిచేయటంతో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడి ఈ మధ్యనే కొలుకున్నట్లు చెప్పకొచ్చాడు. ఈ విషయమై ఎస్ఐ వీరబాబును వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాలను విచారించామన్నారు. లాక్డౌన్ పర్యవేక్షణ నేపథ్యంలో వారికి రెండురోజుల గడువు ఇచ్చామని తెలిపారు. దీక్షకు కూర్చున్న విషయం తెలియదన్నారు. -
లవ్ ఫెయిల్యూర్; టిక్టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్టాక్లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
ప్రేమను చంపుకోలేక..
ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేకపోయాడు. నిశ్చితార్ధమయిన యువతితో పెళ్లికి సిద్ధం కాలేకపోయాడు. వంచన సరికాదని భావించాడు. క్షమాపణ కోరడానికి భయపడ్డాడు. దీంతో తానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో యువకుడు..తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. కన్న తండ్రిని ఒంటరి చేసి మృత్యు ఒడి చేరాడు. వైఎస్ఆర్ జిల్లా,ఖాజీపేట: ప్రేమ..పెళ్లి మధ్య నలిగిన ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేమను చంపుకోలేక మరొకరితో పెళ్లికి సిద్ధం కాలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిశ్చితార్ధమైన యువతికి క్షమాపణ చెప్పడానికి బయలుదేరి మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్న వైనమిది. వివరాలివి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన కోపూరి గంగాధర్(27) ఇంటర్ వరకు చదువుకున్నాడు, బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయం తెలియని తండ్రి లక్షుమయ్య తన కుమారునికి పోరుమామిళ్ల మండలం కవలకుంట్లలో ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. గతనెలలో నిశ్చితార్థం కూడా జరిగింది. తొందరలోనే వివాహానికి ముహూర్తం పెట్టుకోవాలనుకున్నారు. ఈ తరుణంలో గంగాధర్ తన ప్రేమ సంగతిని తండ్రికి చెప్పాడు. లక్షుమయ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. పునరాలోచనలో పడ్డాడు. నిశ్చితార్ధం చేసుకున్న వారింటికి వెళ్లి కుమారునితో క్షమాపణలు చెప్పించాలని భావించాడు. ఈనేపథ్యంలో గంగాధర్ను తీసుకుని మంగళవారం కవలకుంట్ల బయలుదేరాడు. ప్రేమను దాచి నిశ్చితార్ధమయ్యాక క్షమాపణ అడగడం విషయంలో గంగాధర్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. దారిలో తండ్రిని విడిచి పరారయ్యాడు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రిగాలించి విఫలమయ్యాడు.(జైలులో ఆత్మహత్య చేసుకున్న తండ్రి) రావులపల్లె చెరువులో మృతదేహం రావులపల్లె చెరువులో బుధవారం ఉదయం గంగాధర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. మృతుని జేబులో సెల్ఫోను, ఒక పేపర్ పోలీసులకు కనిపించింది. పేపరుపై తండ్రి సెల్ఫోన్ నెంబరు రాసి ఆయనకు తన మృతదేహాన్ని అప్పగించాలని గంగాధర్ కోరాడు. పేపరుమీద ఉన్న నెంబరుకు పోలీసులు సమాచారమివ్వడంతో లక్షుమయ్య చెరవుగట్టుకు చేరుకున్నా డు. చెట్టంత కుమారుడు నిర్జీవంగా కనిపించేసరికి కన్నీరు మున్నీరయ్యాడు. మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. నిశ్చితార్థం అయిన అమ్మా యి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరితే వారు ఏమంటారో అని గంగాధర్ బాగా మానసిక ఆందోళనకు.. ఒత్తిడికిగురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. వృద్ధాప్యంలో లక్షుమ య్య ఒంటరయ్యాడు. పెళ్లి చేసుకుని జీవిత చరమాంకంతో తోడుగా నిలుస్తాడనుకున్న కొడుకు అకాల మరణంతో ఆ వృద్ధుడు తేరుకోలేకపోతున్నాడు. 2012లో అనారోగ్యంతో ఇతని భార్య చనిపోయింది. గంగాధర్ ఒక్కడే కుమారుడు. నన్ను ఒంటరిని చేసే వెళ్లిపోతావా అంటూ రోదిస్తుంటే అక్కడున్నవారి హృదయాలు చలించిపోయాయి. -
ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమవ్యవహారం
మంచిర్యాలక్రైం: ఓ యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాల మీదకే తెచ్చింది. ఓ బాలికను వెంటపడి వేధిస్తుండగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లారు. దీనిని గమనించిన సదరు యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. సీఐ ముత్తి లింగయ్య కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మల్యాల సాగర్ (22) కొద్ది కాలంగా మంచిర్యాలలోని చున్నంబట్టివాడలో ఉంటూ పేయింటర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను కొంతకాలంగా ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆదివారం సదరు బాలిక ఇంటికి వెళ్లిన సాగర్.. ఇంటిముందు గొడవకు దిగాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో సాగర్ ఉంటున్న రూమ్కు వెళ్లి మందలించినట్లు తెల్సింది. దీంతో సాగర్ తనపై పోలీస్ కేసు అవుతుందన్న భయంతో వారికంటే ముందుగానే పోలీసులను కలిసేందుకు స్టేషన్కు బయల్దేరాడు. అప్పటికే బాలిక కుటుంబ సభ్యులు ఠాణాలో ఉండడంతో భయాందోళనకు గురై వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన సీఐ డ్రైవర్ లక్ష్మణ్, డ్యూటీ ఆఫీసర్ తిరుపతి సాగర్పై గొంగడి కప్పి మంటలను ఆర్పివేశారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి ఆసుపత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సాగర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎందుకో.. ఏమో?
పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మేఘావత్ మంత్రునాయక్ (23)గ్రామ సమీపంలో రోడ్డు పక్కనున్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ హుటాహుటిన నల్లగుంట్లకు చేరుకుని కేసు విచారణ చేపట్టారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మంత్రునాయక్ తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి సాధునాయక్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి, సవతి తల్లి శ్రీశైలంలో నివాసం ఉంటున్నారు. మంత్రునాయక్ తన తల్లిదండ్రులతో పాటు వెళ్లకుండా నల్లగుంట్లలో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఆటోలు, ట్రాక్టర్లకు బాడుగలకు వెళ్తూ తద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. వివాద రహితుడిగా, ఎటువంటి గొడవల్లో తలదూర్చని మంత్రునాయక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతుడి చేతిపై గతంలో ఏర్పడిన గాట్ల ఆధారంగా ప్రేమ వ్యవహారమే అతడి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మరొకరు కూడా.. వేటపాలెం: ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. వేటపాలెం చుండూరిలొంపకు చెందిన యాసం వెంకటస్వామి (42) కుందేరు రోడ్డులోని తన సిమెంటు ఖార్ఖానాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి సన్నిహితులు, బంధువులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరికి సుపరిచితుడైన వెంకటస్వామి అకాల మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టారు. -
పరిచయం + ప్రేమ + పెళ్లి = మోసం
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: రైల్లో ఆ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఆమెను గర్భిణిని చేసింది. ఆ తర్వాత ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని మనువాడాడు. ఇప్పుడు తక్కువ కులం దానివంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో దిక్కుతోచని ఆమె తనకు న్యాయం చేయాలని గురువారం టెక్కలి పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం మేరకు... టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో విజయనగరం కోచింగ్ నిమిత్తం వెళ్తుండగా, అదే రైలులో వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. ఈయన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఐడీ కార్డును ఆమె వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. వివాహ సర్టిఫికెట్ ,పెళ్లి రోజు ఫొటో ఆ తర్వాత ఈ కార్డు అతడికి అవసరమైనదని గుర్తించి దానిపై ఉన్న నంబర్కు ఆమె ఫోన్ చేసింది. అయితే తను కావాలనే వదిలి వెళ్లానని, ఆమెను ప్రేమిస్తున్నానని, రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెబుతూ రోజూ ఫోన్ చేసేవాడు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నెల రోజుల తర్వాత ఆమె కూడా రాజమండ్రి బీఈడీ కోచింగ్కు వెళ్లింది. దాంతో ఇరువురు కలుసుకోవడంతో ప్రమీల గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో గత నెల 4న పెళ్లి చేసుకున్నారు. 15 రోజులపాటు కాపురం చేసిన వెంకటేష్ ఆ తర్వాత తన నాన్న కరువులు దగ్గరకు వచ్చేశాడు. అప్పటి నుంచి గర్భం తొలిగించుకోవాలని ఒత్తిడి చేసేవాడు. దానికామె తిరస్కరించగా ఏలుకోనని తేల్చి చె ప్పాడు. తక్కువ కులం దానివంటూ దూషించడంతో బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి టెక్కలి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం బాధితురాలు ఐదు నెలల గర్భిణి కావడంతో న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
ఇక్కడే ఉంటూ యూఎస్లో ఉన్నట్టు కాల్స్
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ మారుతున్న ఆధునిక సాంకేతికతతోనే సైబర్ వేధింపులను సరికొత్త మార్గంలో చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫేస్బుక్, ట్విట్టర్, అర్కుట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, యువతులను వేధిస్తున్న సైబర్ స్టాకర్స్ రూటు మార్చారు. మెదడుకు పదునుపెట్టి సరికొత్త రీతిలో ఆన్లైన్ వేధింపులు చేస్తున్నారు. నిందితుడు హైదరాబాద్లోనే ఉంటూ అమెరికా ఫోన్ నంబర్ ద్వారా అక్కడి నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్టగా నమ్మించేలా చేసిన కేసు రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాలో తొలిది నమోదైంది. పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ మొబైల్ నంబర్ కనిపెట్టడంతో నిందితుడు నిజాంపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కోట్ల మాధవ్రావును రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం గురువారం అరెస్టు చేసింది. అమెరికా నుంచే వేధింపులు చేస్తున్నట్టుగా... మాధవ్రావు డిగ్రీ క్లాస్మేట్ అయిన బాధితురాలి అక్కకు 2015 సంవత్సరంలోకాంటాక్ట్లోకి వచ్చాడు. గతంలో ఉన్న కాస్తా పరిచయంతో స్నేహితులుగా మారారు. కొన్నిరోజులకే ప్రేమిస్తున్నానంటూ మాధవ్రావు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. కొన్నిరోజుల తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిన మాధవ్రావు తన ప్రేమను తిరస్కరించిన యువతిపై కక్ష కట్టాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో గూగుల్ ప్లేస్టోర్లోని ఓ యాప్ ద్వారా అమెరికా ఫోన్ నంబర్ (వర్చువల్ నంబర్ ఎవరూ ఉపయోగించనిది) డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ వినియోగించడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపాడు. వీడియోలు కూడా పంపాడు. శారీరక వాంఛ తీర్చాలంటూ రకరకాల మెసేజ్లు వాట్సాప్ చేశాడు. ఈ వేధింపులు తారాస్థాయికి వెళ్లడంతో బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం టెక్నికల్ టీమ్తో బాగా అధ్యయనం చేసి చివరకు నిందితుడు మాధవరావును పట్టుకున్నారు. వర్చువల్ నంబర్ ఉపయోగించి వాట్సాప్ వేధింపుల వేధించిన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు. -
పెళ్లి పేరుతో మోసం
కర్నూలు, ఆస్పరి: ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరం తీర్చుకున్నాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతడి చేతిలో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కైరుప్పల గ్రామానికి చెందిన చిట్టెమ్మ, గోనెగండ్లకు చెందిన గంజెల్లి రంగ దగ్గరి బంధువులు. రెండేళ్ల క్రితం చిట్టెమ్మకు ప్రేమ పేరుతో రంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న చిట్టెమ్మ శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ట్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. విచారణ చేసి, న్యాయం చేస్తామని ఎస్ఐ నాగేంద్ర హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరిగింది. -
ప్రేమ విఫలమైంది.. బతుకు ఆగమైంది..
గచ్చిబౌలి: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోవర్ధన్ రెడ్డి కథనం ప్రకారం.. కృష్ణ జిల్లా గుడివాడకు చెందిన మల్లిరెడ్డి నాగ సుబ్రహ్మణ్యం రెడ్డి (24) ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. గచ్చిబౌలి ఏపీహెచ్బీ కాలనీలోని ప్లాట్ నంబర్ 161లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి కుటంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం ఉదయం కూడా స్పందించకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో సోదరి, బావ, మామ కలిసి అతడు నివాసముంటున్న చోటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా పలకకపోవడంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. ఓ యువతిని ప్రేమించగా ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డానని, దీనిపై దర్యాప్తు చేయవద్దని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్నోట్లో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మరుగుజ్జును వివాహమాడిన యువతి
టీ.నగర్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మరుగుజ్జును యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. కరూర్ సమీపంలోని తేరూరుకు చెందిన విఘ్నేశ్వరన్ (25) నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాడు. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్లో శివగంగైకు చెందిన ఫార్మసీ విద్యార్థిని పవిత్రతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపాయి. ఇలా ఉండగా బుధవారం కరూర్ ఈశ్వరన్ ఆలయంలో పవిత్రను విఘ్నేశ్వరన్ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు భద్రత కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. -
తమ ప్రేమను అంగీకరించడం లేదని..
కుల్కచర్ల: వరుసకు ఇద్దరూ అక్కాతమ్ముడు. అయినా, వారి మనసులు కలిశాయి. కొంత కాలంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు.. వరుస సరికాదు.. వద్దని వారించి సర్దిచెప్పారు. తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరించడం లేదని మనోవేదనకు గురైన యువతి, యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కామునిపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రశాంత్ (19) అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20) పదో తరగతి వరకు చదివారు. యువతి ఇంటి వద్దే ఉంటోంది. వీరిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు. ప్రశాంత్ తల్లిదండ్రులు నగరంలో ఉంటూ సెంట్రింగ్ పనిచేస్తున్నారు. యువకుడు వారికి సాయంగా ఉంటే అక్కడే ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రశాంత్, యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు విషయం తెలుసుకొని వారించారు. వరుస సరికాదని వద్దని సర్దిచెప్పి హెచ్చరించారు. అయినా, యువతి, యువకుడు తమ ప్రేమను కొనసాగించారు. ప్రశాంత్ సోమవారం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున యువతితోపాటు ప్రశాంత్ తన ఇంట్లో ఒకే ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొరుగింటి వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ప్రేమ వ్యవహారమే ఇంటర్ విద్యార్థిని మృతికి దారి తీసిందని.. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి.. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విలేకర్లకు మంగళవారం వెల్లడించారు. ఆత్మహత్యకు కారణమైన బాలుడ్ని అరెస్టు చేసి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆత్యహత్యగా నిర్ధారించడంతో మిస్టరీ వీడింది. అసలేం జరిగింది.. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జనవరి 26న గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్పై శవంగా కనిపించింది. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును పలాస రైల్వే పోలీసులు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 8 రోజులపాటు అన్ని కోణాల్లో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కూడా రావడంతో దర్యాప్తు వేగవంతమైంది. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం కావడంతో హత్య కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య కోణంపై దర్యాప్తు సాగింది. మొత్తం 50 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఇంటర్ విద్యార్థిని ప్రశ్నించారు. కాల్ డేటా, మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్లు పరిశీలించారు. ఈ విద్యార్థి వ్యవహారం వల్లే బాలిక మృతి చెందినట్లు భావించారు. నిందితుడిపై సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వేణుగోపాలరావు నిన్ను ప్రేమించడం లేదు.. ప్రియుడిగా అనుమానిస్తున్న విద్యార్థితో బాలికకు మూడు నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత నెల 23వ తేదీన చివరి సందేశంలో ‘నేను ప్రేమించడం లేదు. చస్తే చావు’ అని చేప్పాడు. ప్రేమించడం లేదని చెప్పడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 25న అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్భూమికని వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి విద్యార్థిని అరెస్టు చేశామని, విద్యార్థి మైనర్ కావడంతో జువైనల్ కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్రావు సిబ్బంది ఉన్నారు. బంధువులు, గ్రామస్తుల ఆందోళన విద్యార్థిని జువైనెల్ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల అదుపులో వారం రోజులకుపైగా స్టేషన్లోనే ఎందుకు ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బాలుడ్ని చూపించడంతో పట్టువిడిచారు. అనంతరం శ్రీకాకుళం కోర్టుకు వాహనంలో తరలించారు. -
మూడు లక్షల జీతం సంపాదించేవాడు కావాలి!
నాకు ఆ అమ్మాయి కావాలి ,కానీ వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయిని నెలకు 3 లక్షల సంపాదించే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఉంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. కలిసి బ్రతకాలి అంటే కులం అడ్డు కాకపోయినా నువ్వు చేసే ఉద్యోగం మా నాన్నకు నచ్చదు. ప్రేమించడం వరకు ఐతే నా చేతిలో ఉంది కానీ, పెళ్లి చేసుకోవడం మాత్రం మా నాన్న గారు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి తను వెళ్ళిపోయింది. చాలా తేలికగా నన్ను ఇక నుంచి గుర్తుకు తెచ్చుకొని బాధ పడకుండా ఇంత కంటే మంచి ఉద్యోగం చూసుకొని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని కూడా చెప్పింది. వెతికితే మంచి అమ్మాయి, నచ్చిన ఉద్యోగం వస్తుంది ఏమో కానీ నువ్వు నా లైఫ్ లో ఉండవు కదా బుజ్జి. అప్పుడు అర్ధమయ్యింది మధ్య తరగతి అబ్బాయిలు గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళని ప్రేమించకూడదు అని. నేనింకా నీ కోసమే వేచి చూస్తున్న బుజ్జి మనిషి ప్రేమ కంటే నెలకి 3 లక్షలు తెచ్చే వాడు అవసరం లేదు అని నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వస్తావు అని. ఇట్లు నీ శివ -
నా ప్రాణం పోయినట్లు అనిపించేది!
సరిగ్గా అది 2017వ సంవత్సరం. నాకు ఫేసుబుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. వాళ్ళది మా ఊరి పక్కనే. కానీ వాళ్ళు నల్గొండలో సెటిల్ అయ్యారు. తను నర్సింగ్ చదువుతూ ఉండేది. మేమిద్దరం రోజు మెస్సేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మేమిద్దరం కాల్ చేసుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. తనకోసం వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్లేవాడిని. చాలా సరదాగా ఉండేవాళ్ళం. మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. నేను ఒకరోజు తనకి ప్రపోస్ చేశాను. తను ఒప్పుకోలేదు. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. చాలా రిక్వెస్ట్ చేశాను. అప్పటికీ తాను మాత్రం ఒప్పుకోలేదు. చాలా ఏడ్చాను. కొన్ని రోజుల తరువాత తను నా లవ్ను ఒప్పుకుంది. ఆ టైం లో చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. తనకోసం కాలేజీ దగ్గరికి వెళ్ళేవాడిని. తనని చూసినప్పుడు ఏదో తెలియని సంతోషం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. తన కోసం బస్టాండ్కు వెళ్ళేవాడిని. మేము ఇద్దరం కలిసి బస్లో నల్గొండకు వెళ్లే వాళ్లం. బస్లో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఆ టైంలో నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు. తన లేకపోతే నేను ఉండలేను అనేంత ప్రేమ ఎక్కువైంది. నేను జాబ్ కోసం అని హైదరాబాద్ వచ్చేశాను. తను కూడా చదవు ముగించుకొని హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వచ్చేసింది. మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. తను హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను కొంచెం పనిమీద మాఊరికి వెళ్ళాను. తను సడన్గా కాల్ చేసి నాకు జాబ్ నచ్చడం లేదు, నేను మా ఇంటికి వెళ్తున్న అని చెప్పింది. ఆ టైంలో నాకు చాలా బాధవేసింది. తను చదివిన కాలేజీ లోనే జాబ్ చేస్తోంది. తనకోసం నేను హైదరాబాద్ నుంచి ఆమె పనిచేసే హాస్పిటల్ దగ్గరకి వెళ్లి కలిసేవాడిని. ఆమెను చూడడానికి కనీసం నెలకు ఐదుసార్లు వెళ్ళేవాడిని. తనంటే నాకు ప్రాణాలు ఇచ్చేంత ఇష్టం.సడన్గా తనకి ఇంట్లో పెళ్లి బంధాలు చూస్తున్నారు అని నాకు చెప్పింది. మేమిద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో తనంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెంచుకున్నారు.ఆమెకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం. నా బంగారాన్ని అంత ప్రేమగా చూసుకున్నారు. తను లేకుంటే వాళ్ళ నాన్న ఉండలేరు అని తెలిసింది. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తునారు. ఆయనకు తన కూతురిమీద ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. కావాలని తనని దూరం చేస్తూ వచ్చాను. నేను మంచివాడిని కాదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పించాను. నాకు చెడు అలవాట్లు ఉన్నాయని కూడా చెప్పించాను. తను మాత్రం నమ్మలేదు. నాకు కాల్ చేస్తే కట్ చేస్తూ ఉండేవాడి. ఎందుకు అలా చేశానంటే నాతో తను వస్తే వాళ్ల నాన్న బతకలేరు. వాళ్ల నాన్నకు హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. నా వల్ల వాళ్ల ఫ్యామిలీ కి ఏం కావద్దు అని కావాలని దూరం చేస్తూవచ్చాను. కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అవాయిడ్ చేస్తుంటే నా ప్రాణం పోయినట్టు ఉంది. చాలా అంటే చాలా ఏడ్చాను. అలా కొన్ని రోజులు గడిచాక ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలిసింది. ఆ టైంలో ఎంత ఏడ్చానంటే అది మాటల్లో చెప్పలేను. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడి సొంతం అవుతుంది అని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. 10 నెలల దాకా మనిషిని కాలేదు. తనని నేను బ్రతికి ఉన్నంత వరకు మర్చిపోలేను. సారీ బంగారం నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఐ లవ్ యూ బంగారం, ఐ మిస్ యూ. జగదీష్ ( నల్గొండ). -
టిక్టాక్ వైపరీత్యం..ప్రేమించలేదని..
చెన్నై, టీ.నగర్: ప్రేమించలేదని ఓ పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రేమికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం సమీపానగల కలూరు ప్రాంతానికి చెందిన ఇవా డేనియల్ ప్లస్టూ విద్యార్థిని. ఈమెకు అతే ప్రాంతానికి చెందిన సబర్షా అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇలావుండగా వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడంతో ఆమె అతనితో మాట్లాడడం నిలిపేసింది. ఇలావుండగా మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇవా డేనియల్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు విచారణ జరపగా సబర్షా పనిచేస్తున్న వర్క్షాపులో నిలిపి ఉంచిన కారు మాయమైంది. దీంతో ఇవా డేనియల్ను సబర్షా కిడ్నాప్ చేసి ఉండొచ్చని భావించిన పోలీసులు కారు తమిళనాడుకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం సాయింత్రం కారు వాల్పారై వద్ద వస్తుండగా పోలీసులు కారును అటకాయించారు. అయితే కారులో విద్యార్థిని కనిపించలేదు. దీంతో సబర్షా వద్ద విచారణ జరపగా ఆమెను హత్య చేసి ఓ ప్రాంతంలో పారేసినట్లు తెలిపారు. దీంతో సబర్షాను అరెస్టు చేసిన పోలీసులు ఘటనా ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్లి ఇవా డేనియల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. టిక్టాక్ వైపరీత్యం: టిక్టాక్ వైపరీత్యం కారణంగా ప్రియురాల్ని హత్య చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్యాకుమారి జిల్లా కేరళ సరిహద్దులో కారకోణం ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయిని 19 ఏళ్ల కుమార్తె ఆసికా. ఈమె టిక్టాక్లో పోస్టులు చేస్తుంటుంది. దీనిద్వారా అను అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి అతనితో సంబంధాన్ని తెంచుకుంది. సెల్ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో అను నేరుగా ఆసికాకు బెదిరిస్తూ వచ్చాడు. సంఘటన జరిగిన రోజున ఆసికను కత్తితో హతమార్చిన అతను తను కూడా గొంతుకోసుకుని మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఒకే రోజు ఏడుగురి బలవన్మరణం
హైదరాబాద్ నగరంలో ఒకే రోజు వేర్వేరు కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఓ యువతి సహా ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రేమ విఫలమై.. యువకుడు.. మారేడుపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనర్సయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్లో నివాసముంటున్న రవిచైతన్య (21) బేగంపేట్లోని ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను గత కొంత కాలంగా ఓల్డ్ మారేడుపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతి అతడి ప్రతిపాదనను తిరస్కరించడంతో మనస్తాపానికి లోనైన రవి చైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాలవ్యాపారి.. దూద్బౌలి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ పాల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చార్మినార్ డీఐ నరేశ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ప్రాంతానికి చెందిన అమిత్ గుప్తా (40) నగరానికి వలస వచ్చి కుటుంబంతో సహా శివరాంపల్లిలో ఉంటున్నాడు. నాలుగు నెలలుగా అతను చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోతీబేగం మసీదు వద్ద పాలు, పాల పదార్థాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి రూ.12 లక్షల అప్పులు ఉండటంతో వీటిని తీర్చలేక మనస్తాపానికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం దుకాణాన్ని తెరిచిన అమిత్ గుప్తా మధ్యాహ్నం దుకాణంలోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య సరళ గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకుని యువతి.. గచ్చిబౌలి : గెస్ట్ హౌస్లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం, గుర్గావ్ ప్రాంతానికి చెందిన మౌనికరావు (25) గచ్చిబౌలిలోని ఓయోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ రాజరాజేశ్వరీ కాలనీలోని కాకతీయ రెసిడెన్సీలో ఉంటోంది. ఆదివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన ఆమె బయటికి రాలేదు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె స్నేహితుడు రీహాన్ అక్కడికి వెళ్లాడు. డోర్ దగ్గరకు వేసి ఉండడంతో తలుపు తీసి చూడగా మౌనిక చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. రీహాన్ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె సోదరుడు అమీత్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో గొడవపడి యువకుడు.. గచ్చిబౌలి : భార్యతో గొడవపడి మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ దేవేందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా, గట్టురయపాకల గ్రామానికి చెందిన గౌనీ బొగురయ్య (30) ఎనిమిదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గచ్చిబౌలి, అంజయ్యనగర్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి అదే ప్రాంతంలో ఉంటున్న అత్తవారింట్లో ఫంక్షన్కు వెళ్లాల్సి ఉండగా తాను రానని చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో భార్య పద్మ, మామ వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అతడి భార్య కిటికీలో నుంచి చూడగా బొంగురయ్య సీలింగ్ రాడుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా సోమవారం ఉదయంభార్యభర్తల మధ్య గొడవ జరిగిందని ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమను నిరాకరించిందని.. మైలార్దేవ్పల్లి: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ విశాఖ జిల్లాకు చెందిన కోటేశ్వరరావు(25) తన తండ్రితో కలిసి మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని బాబుల్రెడ్డినగర్లో పదిహేనేళ్లుగా నివాసముంటున్నాడు. అతడు ఆర్కేస్ట్రా మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో అతడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నూతన సంవత్సర వేడుకల్లో ఆమెను కలిసిన కోటేశ్వరరావు ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకుని మహిళ.. అల్వాల్: ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, మల్లేపల్లికి చెందిన రవి,రాజేశ్వరి(33) దంపతులు నగరానికి వలసవచ్చి అల్వాల్, మంగాపురం కాలనీలో ఉంటున్న దామోదర్రెడ్డి వద్ద పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజేశ్వరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కులాయప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై హిజ్రా ఆత్మహత్య
చెన్నై,అన్నానగర్: ఈరోడ్ సమీపంలో మంగళవారం ప్రేమ ఓటమి వల్ల హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ సమీపం మూలప్పాలైయమ్ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్ అనే సుస్మితా (22) హిజ్రా. ఈమె తన అమ్మ చిన్నపొన్నుతో నివసిస్తూ వచ్చింది. సుస్మితాకి, ఈరోడ్ వీరప్పన్ చత్రమ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత సుస్మితా ఆ యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. అనంతరం సుస్మితా, ఆ యువకుడి వద్ద తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందువల్ల సుస్మితా కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఎవరు ఇంట్లో లేని సమయంలో సుస్మితా ఫ్యాన్కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్నిచూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి, స్థానికుల సహాయంతో రక్షించి చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్క డ పరిశోధన చేసిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు. యువకుడు తన సెల్లో ప్రియురాలి నంబరు బ్లాక్ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ నంబరు ప్రియుడు బ్లాక్ చేయడంతో సూసైడ్ మెసేజ్ అతని ఫ్రెండ్ ఫోన్కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని, ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది. -
ప్రేమలో విఫలమై మనస్తాపంతో..
పశ్చిమగోదావరి, తాళ్లపూడి: ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన నవీన్ శుక్రవారం ఉదయం తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లిన నవీన్ అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతనిని చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లి విషయమై యువతి నిరాకరించడం వల్లే నవీన్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసింది. నవీన్ తన మొబైల్లో “తాను మోసపోయానని.. ఇంక ఎవరిని ఇలా మోసం చేయవద్దు’ అని పోస్టు పెట్టడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్ చెప్పారు. వైసీపీలో చురుకైన యువనేత వైఎస్సార్ సీపీలో నవీన్ చురుగ్గా వ్యహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేశారు. అదేవిధంగా జైభీమ్ యూత్లో పాల్గొంటూ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు నవీన్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రేమలో ఫెయిల్ అయ్యారా? ఇలా చేయండి!
‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ ఈ మూడు మాటల్ని ఎదుటి వ్యక్తికి చెప్పటానికి అల్లాడిపోయేవారు చాలా మందే ఉన్నారు. తమ ప్రేమను చెప్పగానే ఆవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారన్నదే ఓ పెద్ద ప్రశ్న! చాలా మందిని కలవరపెట్టేది కూడా ఈ పశ్నే. ‘‘ నువ్వు అవునంటే ఆకాశంలోకి.. కాదంటే పాతాళంలోకి’’ అన్నట్లు ఆలోచిస్తుంటారు. ప్రేమలో గెలిచినవారి సంగతి పక్కన పెడితే.. ఒడిపోయిన, ముఖ్యంగా ఆదిలోనే తిరస్కరణకు గురైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొంతమంది మానసికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవటమో, ప్రయత్నించటమో, తమను తాము తరుచు బాధించుకోవటమో చేస్తుంటారు. మరికొంతమంది ఆ బాధనుంచి బయటపడలేక, ఎలా బయటపడాలో తెలియక కృంగిపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. 1) జ్ఞాపకాలను చెరిపేయండి ప్రేమ చేసిన గాయం మానాలంటే అందుకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయటం ప్రధానం. ముందుగా భౌతికమైన వాటిని వారికి సంబంధించినవి ఏవైనా( వారిని గుర్తు చేసేవి)వాటిని కంటికి కనిపించనంత దూరంగా ఉంచండి. 2) బిజీగా ఉండండి మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు ఎదుటి వ్యక్తి ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి వేధిస్తుంటాయి. అందుకని ఎప్పుడూ ఏదో పనిలో నిమజ్ఞమై ఉండండి. ఒంటరిగా కాకుండా మిత్రులతో, కుటుంబసభ్యులతో సమయం గడపటానికి ప్రయత్నించండి. 3) ప్రతికూల(నెగిటివ్) ఆలోచనలు ఎట్టి ప్రరిస్థితిలో ప్రతికూల ఆలోచనలు చేయకండి. అలాంటి ఆలోచనలే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి. ఆ బాధనుంచి బయటపడగలమనే ధృడ సంకల్పంతో ఎల్లప్పుడూ ఉండండి. 4) వ్యాయామం మనసు గట్టిపడాలంటే ముందుగా మన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆరోగ్యవంతమైన శరీరమే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయగలదు. వ్యాయామం చేయటం ద్వారా శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి రోజుకు కనీసం ఓ అరగంటేనా వ్యాయామం చేయటం మంచిది. 5) మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మనల్ని మనం ప్రేమించుకోవటం అన్నది ప్రధానం. ఇతరులు మన మనసును బాధపెట్టారని, మనల్ని మనం బాధించుకోవటం మంచిది కాదు. కోరుకున్న వ్యక్తి ప్రేమే జీవితం కాదు! వారి ప్రేమ మన జీవితంలో ఓ చిన్న భాగంగా గుర్తించాలి. జీవితం వారి ప్రేమతోటే ముగియదని, మరొకరి రూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుందని తెలుసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా ప్రేమించినపుడే ఎదుటివ్యక్తిని సంపూర్తిగా ప్రేమించగలము. 6) కొంచెం నవ్వండి ! ఇలాంటి సమయంలో నవ్వు నాలుగు వందల విధాల మేలు! అని కచ్చితంగా చెప్పొచ్చు. నవ్వు మానసికంగానే కాదు శారీరకంగానూ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. నవ్వినపుడు ముఖంలో కదిలే కండరాల కారణంగా కొన్ని నరాలు ప్రభావితమవుతాయి. తద్వారా మనకు ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్న వారిలా ప్రతిక్షణం దిగాలుగా ఉండకుండా కొద్దిగా నవ్వటానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నమే నవ్వులకు మనల్ని మరింత దగ్గర చేస్తుంది. -
రెండు కుటుంబాల్లో ప్రేమ విషాదం
కర్ణాటక, మండ్య : ప్రేమకథ రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన జిల్లాలోని నాగమంగల తాలూకాలో మంగళవారం వెలుగు చూసింది. తాలూకాలోని మంచనహళ్లి గ్రామానికి చెందిన కాంచన (16) సమీపంలోని హొన్నెహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే యువకుడి మధ్య కొద్ది కాలం క్రితం ప్రేమ చిగురించింది. ఈ విషయం తల్లితండ్రులకు తెలియడంతో మనస్తాపం చెందిన కాంచన ఈనెల 5వ తేదీన విషం తాగింది. దీంతో కడుపు నొప్పి తాళలేక ఉరేసుకోవడానికి యత్నించింది. ఇది గమనించిన కాంచన తల్లితండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలంటూ వైద్యులు తల్లితండ్రులకు సూచించారు. దీంతో దిక్కుతోచని తల్లితండ్రులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించసాగారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి యశ్వంత్ కారణమంటూ కాంచన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యశ్వంత్ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళూరులో డ్రైవర్గా పని చేస్తున్న యశ్వంత్ తండ్రి సోమశేఖర్ ఈనెల 10వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనవరాలిని చూడడానికి వచ్చిన కాంచన తాత చంద్రు (65) మనవరాలి పరిస్థితి చూసి గుండెపోటుతో ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంచన సైతం ఈనెల 20వ తేదీన చికిత్స ఫలించక మృతి చెందింది. ఇలా ఒక ప్రేమకథ రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. -
అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...
కర్ణాటక, యశవంతపుర: సోషల్ మీడియా ప్రేమలు ముక్కుపచ్చలారని బాలలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మరోసారి వెల్లడైంది. సిలికాన్ సిటిలో 10వ తరగతి బాలిక ఒకరు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితున్ని వెతుకుతూ విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది. అతడు కూడా మైనర్ దాటని బాలుడే కావడం గమనార్హం. చివరకు శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలికకు నచ్చజెప్పి బెంగళూరుకు తీసుకురావడంతో సుఖాంతమైంది. ఏం జరిగిందంటే వివరాలు.. బెంగళూరులో ఓ ధనవంతుని కుమార్తె కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్మార్ట్ఫోన్, కంప్యూటర్లో తరచూ సోషల్మీడియాలో చురుగ్గా ఉండేది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు చెందిన ఒక కుర్రవానితో ఫేస్బుక్లో పరిచయం కుదిరింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియటంతో బాలికను మందలించారు. ఒకవైపు తల్లిదండ్రు లు ఆగ్రహించడం, మరోవైపు ప్రియున్ని కలవాలన్న భావనలో ఆ బాలిక బెంగళూరు విమానశ్రయం నుండి విమానంలో భోపాల్కు వెళ్లిపోయింది. భోపాల్లోని ప్రేమికుని ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు చూస్తే గొడవ అవుతుందని ఆ అబ్బాయి బాలికను ఒక హోటల్కు తీసుకెళ్లాడు. ఇంతదూరం ఎందుకు వచ్చావంటూ బుద్ధిమాటలు చెప్పి బెంగళూరుకు వెళ్లాలని సూచించాడు. ఇందుకు బాలిక ససేమిరా అంది. తాను ఇక్కడే ఉంటానని బాలిక మారాం చేయడంతో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. బాలికకు కౌన్సెలింగ్ ఇంతలో బాలిక మిస్సయిన సంగతి తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ జరిపి భోపాల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గాలించి మైనర్ ప్రేమజంటను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. బాలల సంరక్షణ సమితి ఆ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫేస్బుక్ స్నేహితున్ని కసిసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. తండ్రితో గొడవపడిన బాలిక కొద్దిరోజుల పాటు కాల్ సెంటర్లో పని చేసి వచ్చిన డబ్బులతో భోపాల్కు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి బాలికను క్షేమంగా బెంగళూరుకు తీసుకొచ్చారు. -
ఏడేళ్లు చిన్నవాడైనా నిజాయితీ చూసి ఓకే చేశాను.
హాయ్ సార్! నాకొక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నాకంటే ఏడేళ్లు చిన్నవాడైనా తన ప్రేమలో నిజాయితీ చూసి ఓకే చేశాను. కలిసి ఇద్దరం ఫోర్ ఇయర్స్ ఉన్నాం. మా అమ్మని కూడా ఒప్పించాడు. వాళ్ల ఫాదర్ చనిపోవడంతో ఆయన గవర్నమెంట్ జాబ్ తనకి వచ్చింది. తర్వాత వన్ ఇయర్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అవాయిడ్ చెయ్యడం మొదలుపెట్టాడు. నిలదీసి అడిగితే ‘ఏం లేదు’ అన్నాడు. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేశాడనే నిజం నాకు తెలిసిపోయింది. వాళ్లు కలిసి తిరగడం, కలిసి దిగిన ఫొటోస్ అన్నీ చూశాను. ‘ఏంటిదంతా?’ అని వాళ్ల ఆఫీస్కి వెళ్లి అడిగాను. దాంతో తను రివర్స్ అయిపోయాడు. ‘నీకు అనుమానం.. నువ్వు నాకు వద్దు’ అని తిట్టడమే కాకుండా మా అమ్మకి ఫోన్ చేసి.. ‘మీ అమ్మాయికి అనుమానం ఎక్కువ. తను నాకొద్దు’ అని చెప్పి నన్ను శాశ్వతంగా వదిలేశాడు. తను రాడని నాకు తెలుసు. కానీ త్రీ ఇయర్స్గా తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా సంబంధాలు కాదనుకున్నాను. అమ్మ నన్ను ఏం అనలేక బాధపడుతోంది. నాకు కొంచెం ధైర్యం చెప్పండి అన్నయ్యా ప్లీజ్. – ధరణి వాడొక పెంట రాస్కెల్!! ప్రేమ బ్యాండ్ వేసి వాడుకునే దుర్మార్గుడు!! ఇంత చిన్నవయసులోనే అంత మోసం నేర్చుకున్నాడంటే..వాడిని నమ్మి.. వాడి కోసం వెయిట్ చేసి.. వాడే నా లవ్ అనుకుని.. నువ్వు నీ లైఫ్ని దుర్భరం చేసుకోవడం వెరీ సిల్లీ బంగారం!! లవ్ చాలా పవిత్రమైనది! లవ్ చాలా పవర్ఫుల్! లవ్ చాలా గ్రేట్! ఒకరోజు నీకు వాడు చేసిన అన్యాయానికి..మూల్యం చెల్లించక తప్పదు.. ఒక దరిద్రుడు నీ జీవితంలో నుంచి వెళ్లిపోయాడని కాలర్ ఎగరేసుకుని ముందుకు సాగిపో..!! ‘సార్ అమ్మాయిలు కాలర్ ఉన్న డ్రెస్లు తక్కువగా వేసుకుంటారు సార్!’ అయితే తలెత్తుకుని లైఫ్ని మళ్లీ హ్యాపీగా జీవించమను నీలూ!! ‘అవును ధరణీ..! వాడొక యాక్.... థూ!! గాడు.. బీ స్ట్రాంగ్!!’ lovedoctorram@sakshi.com -
తనను ప్రేమించట్లేదని వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, స్టేషన్ఘన్పూర్ : వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఇంటి యజమాని ఎడ్ల రాజు, స్టేషన్ఘన్పూర్ సీఐ రాజిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవాపూర్కు చెందిన నరేందర్, అనిత దంపతుల కుమారుడైన సాయికృష్ణ(22)కు రెండేళ్ల క్రితం అతడి తాత ఉప్పలయ్యకు చెందిన వీఆర్ఏ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. వీఆర్ఏగా విధుల్లో చేరిన అతను ప్రస్తుతం ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో అతడి తల్లిదండ్రులు విడిపోగా తండ్రి హైదరాబాద్లో ఉంటున్నాడు. సాయికృష్ణ తల్లి కరీంనగర్లో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ప్రస్తుతం సాయిక్రిష్ణ తనతో పాటు వీఆర్ఏగా పనిచేస్తున్న ఎం.వెంకటస్వామితో కలిసి స్టేషన్ఘన్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఉన్న కాలనీలో ఓ గదిలో ఆరునెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడ అద్దెకు ఉంటూ సెలవుల్లో కరీంనగర్లోని అమ్మ వద్దకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో కరీంనగర్కు చెందిన ఓ అమ్మాయితో అతడు ప్రేమలో పడినట్లు తెలిసింది. తరచూ ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం, సెల్లో చాట్ చేసేవాడు. గురువారం రాఖీ పౌర్ణమి పండుగ రావడంతో వెంకటస్వామి హైదరాబాద్లోని తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాడు. గదిలో ఒంటరిగా ఉన్న సాయికృష్ణ రాత్రి మద్యం ఫుల్బాటిల్ తెచ్చుకుని తాగాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో తన ప్రియురాలితో పాటు తల్లి, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అర్థరాత్రి దాటాక అతడు గది పైకప్పుకు ఉన్న కొండికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హైదరాబాద్కు వెళ్లిన అతడి రూంమెట్, తోటి వీఆర్ఏ వెంకటస్వామి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఘన్పూర్కు వచ్చాడు. వారి గదికి వెళ్లేసరికి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సాయికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించగా ఇంటియజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి కు టుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీఆర్ఏ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సీఐ తెలిపారు. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీఆర్ఏ మృతిపై రెవెన్యూ అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’
న్యూఢిల్లీ: ‘తనకు మరొకరితో వివాహం జరుగుతుందనే ఊహనే భరించలేకున్నాను. తను లేకుండా నేను బతకలేను. తను నాకు దూరమవుతుందనే బాధ నా గుండెను మెలిపెడుతుంది. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఉద్యోగం కూడా పోయింది... తను లేని జీవితం నాకు వద్దు. అందుకే చనిపోతున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి’ అంటూ ఆగ్రావాసి ఒకరు ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆగ్రాకు చెందిన శ్యామ్ సికార్వార్ అలియాస్ రాజ్(22) అనే వ్యక్తి కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. దాంతో రాజ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఆలయానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోవడానికి గల కారణాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా పంచుకున్నాడు రాజ్. అంతేకాక తన చావుకు ఎవరిని బాధ్యుల్ని చేయవద్దని పోలీసులను కూడా కోరాడు. దాంతో పాటు నాలుగు పేజీల సూసైడ్ నోట్ను కూడా రాశాడు రాజ్. దానిలో తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నందుకు క్షమించమని కోరడమే కాక తన అవయవాలను దానం చేయాల్సిందిగా కోరాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు వివాహానికి ఒప్పుకోలేదని..
చెన్నై ,అన్నానగర్: ప్రియుడు వివాహాం చేసుకోవడానికి అంగీకరించలేదని మంగళవారం దిండుగల్ కలెక్టర్ ఇంటి ముందు యువతి ఆత్మాహుతి చేసుకోవడానికి యత్నించింది. మంగళవారం యువతి సహా ముగ్గురు వ్యక్తులు కలెక్టర్ ఇంటి ముందు వచ్చారు. అనంతరం ఆ యువతి హఠాత్తుగా బాటిల్లో ఉన్న పెట్రోల్ను తన శరీరం మీద పోసుకుని మంటలు పెట్టుకోవడానికి యత్నించింది. వెంటనే స్థానికులు ఆమెపై నీళ్లు పోసి రక్షించారు. దీంతో ఆ మహిళతో సహా ఆ ముగ్గురు నేలపై కూర్చొని ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ముగ్గురిని పోలీసుస్టేషన్కు తరలించారు. ఆత్మాహుతికి యత్నించిన యువతిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో ఆమె దిండుక్కల్ మేట్టుపట్టికి చెందిన దివ్యరోస్లిన్ (24) అని తెలసింది. ఆమె వెంట వచ్చిన వారు తండ్రి ప్రాన్సిస్, తల్లి జెమినామేరి అని తెలిసింది. పోలిసుల దివ్యరోస్లిన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘దిండుక్కల్– పళణి రోడ్డులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కశాశాలలో నేను బీఈ చదివాను. అదే కళాశాలకి చెందిన పళణి తిరునగర్కు చెందిన ఓ యువకుడిని ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ప్రస్తుతం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. కాబట్టి ప్రియుడితో వివాహాం జరిపించమని దిండుగల్ మహిళ పోలీసుస్టేషన్లో, కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీయకపోవడం వలన విరక్తితో ఆత్మాహుతికి యత్నించాను.’’ అని దివ్యరోస్లిన్ చెప్పింది. ఫిర్యాదు ఆధారంగా దిండుగల్లో మహిళా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సాక్షి, తగరపువలస(విశాఖపట్టణం) : జీవీఎంసీ భీమిలి జోన్ 10వ వార్డు గ్రంథాలయం వీధికి చెందిన మాదాబత్తుల ప్రసాద్(23) 5వ వార్డు కొత్తపేటలోని తన స్నేహితుడు ఇస్పరి జగదీష్ ఇంట్లో శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితుని ఇంటికి మాట్లాడడానికి వచ్చిన ప్రసాద్ కొంతసేపు అక్కడే గడిపాడు. తరువాత జగదీష్ అతడిని కూర్చోబెట్టి స్నానానికి వెళ్లిపోయాడు. తరువాత ప్రసాద్.. జగదీష్ స్నానం చేస్తున్న గదికి బయట నుంచి గడియపెట్టి వరండాలో లుంగీ తీసుకుని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. స్నానానికి వెళ్లిన జగదీష్ బయట గడియ పెట్టి ఉండటంతో తలుపులు బాదగా పక్కింటి వారు వచ్చి చూసేసరికి ప్రసాద్ ఉరి వేసుకుని కనిపించాడు. సీమెన్గా ఎంపికైన ప్రసాద్ మార్కెట్లో అరటి పండ్ల వ్యాపారం చేసుకునే మాదాబత్తుల వెంకటరావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నెల రోజులు క్రితం పెద్ద కుమారుడు గణేష్కు వివాహమైంది. రెండో కుమారుడైన ప్రసాద్ సీమెన్గా ఎంపికై ఈ నెల 18న ముంబయిలో విధుల్లో చేరనున్నాడు. దీనికోసం తల్లిదండ్రులు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ప్రసాద్ భీమిలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడని, ఆమె ఇంట్లో కోసం వస్తువులు కొని కూడా ఇచ్చాడని, తీరా ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అతని స్నేహితులు చెబుతున్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై...
వర్ధన్నపేట: యువతి యువకుడు ప్రేమించుకుని ఆ ప్రేమ విఫలమై యువతి ఇంటిలోకి వెళ్లిన ఆ యువకుడు కాలిన గాయాలతో బయటకు రావడం, యువతిపై కిరోసిన్ పడి ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు దుబ్బ యాకయ్య అదే గ్రామానికి చెందిన యువతి గత కొందీ కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇటీవల ఇరువరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పెద్ద మనుషుల సమక్షంలో ఎవరికీ సంబంధం లేకుండా తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడి వంటిపై కిరోసిన్తో మంటలు అంటుకోగా యువతి వంటిపై కూడా కిరోసిన్ పడింది. అయితే ఈ ఘటనలో యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటిచే ప్రయత్నం చేశాడా.. లేక యువతి ఆ పని చేసిందా.. అనే విషయం పోలీసు విచారణలో స్పష్టం కానుంది. మంటలతో గాయపడిన యువకుడు యాకయ్యను హుటాహుటిన 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
వాణికి చెడు అలవాట్లు ఉన్నాయంటూ..
మారేడుపల్లి : పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి, శేషాచల కాలనీకి చెందిన జార్జి అలియాస్ జెర్రి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోయినపల్లిలో ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన వాణికి 2015లో లయోలా కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో తన స్నేహితురాలి ద్వారా జార్జితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేసినట్లు తెలిపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. జార్జి త్వరలో మరో యువతిని వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో శేషాచలకాలనీలోని అతడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. బాధితురాలికి మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. బాధితురాలితో సంప్రదింపులు జరిపిన జార్జి కుటుంబ సభ్యులు మూడురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వాణి తెలిపింది. ఇదిలా ఉండగా జార్జి మాత్రం వాణిని ప్రేమించలేదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. వాణికి చెడు అలవాట్లు ఉన్నందున ఆమెకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు. -
ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..
అమీర్పేట: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది చేసిందని మనస్తాపానికిలోనైన ఓ సాఫ్ట్వేర్ కంపనీ ఎండీ ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మంగళవారం అమీర్పేట్లో చోటు చేసుకుంది. నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్రెడ్డి (27) అమీర్పేట ధరంకరం రోడ్డులోని శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల నిఖిల్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె తిరస్కరించింది. దీంతో మనస్తాపానికిలోనైన అతను మంగళవారం తెల్లవారుజామున తన చాంబర్లో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం దీనిని గుర్తించిన సిబ్బంది ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరళించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజయ్కుమార్ తెలిపారు. -
కొంపముంచిన ఫేస్బుక్ ప్రేమ
టెక్కలి రూరల్: ఫేస్బుక్లో యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఏడాదికి పైగా చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగారు. యువతి పెళ్లి విషయం ప్రస్తావించడంతో యువకుడు ముఖం చాటేశాడు. మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రావివలస గ్రామానికి చెందిన యువతి డిప్లామో పూర్తిచేసి విశాఖపట్నంలో డేటా ఆపరేటర్గా పనిచేస్తోంది. అక్కడ తన స్నేహితురాలి ఫేస్బుక్లో విజయనగరం జిల్లా మొదవలస గ్రామానికి చెందిన గిరిడి రాకేష్కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి యువకుడు ముఖం చాటేస్తూ తిరిగాడు. చివరకు నిలదీసే సరికి తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్ఐ షేక్ఖాదర్ బాషా వివరాలు సేకరించారు. -
నీవు లేక నేను లేను..
సనత్నగర్: ప్రియురాలు ఆత్మహత్యతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రియుడు సైతం నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సనత్నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కుటుంబం కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. యాదగిరి కుమార్తె రిషిత (18) కూకట్పల్లిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన వెంకటేష్ కుమారుడు రమేష్ (26) జగద్గిరిగుట్టలో ఉంటూ కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఫతేనగర్లో ఉండే మేనమామ ఇంటికి రమేష్ తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ ఇంటికి సమీపంలోనే ఉండే రిషితతో ఏర్పడిన పరిచయం ఇరువురి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రిషిత సోదరుడు వీరి ప్రేమను వ్యతిరేకించడమే కాకుండా తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రిషిత ఈ నెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రేమికుడు రమేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. తన ప్రేయసి రిషిత లేని జీవితం తనకు వద్దంటూ అయినవారు, స్నేహితుల వద్ద చెప్పాడు. ఇదే క్రమంలో అందరూ చూస్తుండగా ఈ నెల 29న సాయంత్రం నాలుగతంతస్తుల భవనంపైకి ఎక్కి కిందకు దూకాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రియురాలు ఆత్మహత్యను జీర్ణించుకోలేక మనోవేదనతోనే రమేష్ ప్రాణాలు తీసుకున్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! మా మతాలు వేరు గానీ.. మా నేపథ్యాలు ఒకటే. వాళ్ల పేరెంట్స్ వాళ్ల మత పద్థతిలోనే పెళ్లి చేస్తామన్నారు. రెండు లక్షలు కట్నం ఇస్తామన్నారు. మా పేరెంట్స్ మొదట్లో ఒప్పుకోలేదు. నేనే కష్టపడి ఒప్పించాను. తను మా ఇంటికి వచ్చాక కూడా వాళ్ల మతాన్నే పాటిస్తాను అంటోంది. దానికి మా వాళ్లు ఒప్పుకోవడం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకు అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇద్దరం కలిసి చాలా బాగుండేవాళ్లం. తనకి అన్యాయం చెయ్యడం ఇష్టం లేదు. దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్!– కృష్ణ ప్రేమకు మతం లేదు, కులం లేదని చెప్పినా నీకు ఎక్కదు! కట్నం తీసుకోవడం నేరమని చెప్పినా నీకు అర్థం కాదు!! ఏదైనా పెళ్లికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి అంటే విసుక్కుంటావు! నీకు అమ్మాయి నచ్చిందంతే! అంటే.. రూపం నచ్చిందంతే...!! అమ్మాయి కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ల పీకల మీద కూర్చుని పెళ్లికి ఒప్పించావు. ఇప్పటికైనా మారు అన్నయ్యా ప్లీజ్!! నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో! తన మతాన్ని గౌరవించు..!! తన పద్ధతులను గౌరవించలేనివాడివి.. తనను మనస్ఫూర్తిగా అంగీకరించలేవు. నీ కోసం అమ్మాయి చెయ్యని త్యాగం లేదు. నీ కోసం తన వాళ్లని వదిలి నీ నమ్మకం మీద వచ్చింది..!! నువ్వు ఆ నమ్మకం మరిచి.. ఈ నమ్మకాల కోసం గింజుకుంటున్నావు..!! వద్దు అన్నయ్యా! అలా చెయ్యకు. ఏ నమ్మకమైనా నేర్పించేది ప్రేమే..!! నువ్వు ప్రేమనే నమ్మకం చేసుకో..!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమికులూ.. 'ఆత్మహత్యలకు పాల్పడవద్దు’
మన్సూరాబాద్: ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని లవ్ ఫెయిల్యూర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సతీష్గౌడ్ సూచించారు. ఎల్బీనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఇటీవల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందన్నారు. ఆ జంటకు కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. వారి ఇంట్లో పెద్దలకు నచ్చజెప్పి ఈ నెల 10న ఆర్య సమాజ్లో వివాహం జరిపించినట్లు తెలిపారు. ప్రేమే జీవితం కాదనే సత్యాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల ప్రేమజంటల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, వీటిని నిరోధించటానికి అసోసియేషన్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రేమికులు 81065 87621 నంబర్ను సంప్రదిస్తే ఇంట్లోని పెద్దలను ఒప్పించి పెళ్లి జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. -
కూతురి ప్రేమ విఫలం.. తండ్రి ఆత్మహత్య
కృష్ణరాజపురం : కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంజయ్గాంధీ నగర్కు చెందిన ఉదయ్ అదే ప్రాంతానికి చెందిన యువతి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అప్పటికే వివాహమైన ఉదయ్ తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టి ప్రేమ నాటకాన్ని కొనసాగించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తండ్రి గతనెల 30వ తేదీన వారి వివాహానికి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. మహూర్తానికి సమయం మించిపోతున్నా ఉదయ్ రాకపోవడంతో గాలింపు చేపట్టగా హఠాత్తుగా ఆ యువతి ఇంటివద్ద ప్రత్యక్షమైన ఉదయ్ భార్య విషయం మొత్తం బయటపెట్టింది. కూతురు ప్రేమలో మోసపోవడం, పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక ఆ యువతి తండ్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని లేఅవుట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! ఈ మధ్యనే ఒక అబ్బాయిని కలిశాను. కలిసిన కొద్దిరోజుల్లోనే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. కానీ తన జీవితంలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. నన్ను ప్రస్తుతానికి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. – కృప మనం ముచ్చటగా మూడో లవ్ స్టోరీ అయ్యామా చెల్లీ..? ఎందుకమ్మా అంత తొందరపాటు?? వాడు ఇద్దరికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు... వాళ్ల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి కన్సిడర్ చెయ్యమ్మా... ఒట్టి పెంటగాడు.. వాడితో చెయ్యి కలిపితే.. మనకు అంటుకుంటుంది ఆ పెంట వాసన! ఈ సమాజం ఆ పెంట వాసన చూసి.. నిన్నూ రెస్పెక్ట్ చెయ్యదు!! ‘సార్..! కానీ ఫస్ట్, సెకండ్ లవ్ స్టోరీలు వర్కౌట్ కాక.. కృపతోనే లవ్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్???’ నీలూ..! రెండు చోట్ల రిజెక్ట్ అయిన కాండిడేట్ నా చెల్లెలికి ఎందుకు? అసలు ఇలాంటి ఫెయిల్యూర్ కాండిడేట్ మీద అనవసరంగా సింపతీ చూపించి.. దాన్ని లవ్ అనుకుని, ఆ కన్ఫ్యూజన్లో హార్ట్ పారేసుకుని.. ఆ తర్వాత వీడు నెక్ట్స్ ఫిట్టింగ్ కోసం వెళ్లిపోతే.. కృప ఏం కావాలి??? అసలే స్టెబిలిటీ లేని యూజ్లెస్ ఫెలో వాడు.. మనకు వద్దే వద్దు!!‘విన్నావుగా కృప.. బీ కేర్ఫుల్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
మియాపూర్: ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగానాయక్ సమాచారం మేరకు... వైజాగ్ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్లోని సిన సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్ ఆల్విన్కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు పెళ్లికిఒప్పుకోలేదని ఆత్మహత్య..
గజపతినగరం రూరల్: గజపతినగరం ఠానా వీదికి చెందిన కర్రి గీత (22) మనస్తాపంతో బుధవారం ఇంటిలోనే ఉరివేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండల కేంద్రానికి చెందిన గవిరెడ్డి క్రాంత్ అనే యువకుడిని గీత ప్రేమించింది. క్రాంత్ ప్రస్తుతం జమ్మూలో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తుండగా... గీత పాలిటెక్నికల్ కోర్సు పూర్తి చేసింది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని గీత పలుమార్లు క్రాంత్ను ప్రశ్నించగా.. తర్వాత చేసుకుందాంలే అని బదులివ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను గజపతినగరం సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గీత మృతితో తల్లిదండ్రులు ఈశ్వరరావు, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
అల్వాల్: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ అల్వాల్కు చెందిన రాజ్యం సుజాత కుమారుడు సాయికిరణ్(27) బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలల క్రితం సదరు యువతితో మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో మనస్తాపానికిలోనైన సాయికిరణ్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రాజ్యం సుజాత ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తాళిబొట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ..
మంగళగిరి: మూడేళ్లుగా ఆ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటాడనుకుని నమ్మి మోసపోయింది. కొంతకాలంగా వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు పోలీసుల వద్దకు వెళ్లి తనకు ప్రేమించిన వాడితో వివాహం చేయించాలని కోరింది. కొద్ది రోజులుగా తనకు ఈ రోజు వివాహం అంటూ తాళిబొట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. యువకుడిపై కేసు వద్దని తనతో వివాహం చేసుకునేలా ఒప్పిస్తే చాలని పోలీసులను కోరింది. ఎన్నిసార్లు బతిమాలినా యువకుడి మనస్సు కరగకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి చివరకు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కేవలం కుల జాడ్యం కారణంగానే తన లాంటి యువతులు మోసపోతున్నారని ఆవేదనతో రాసిన ఏడు పేజీల లేఖ సమాజంలో కుల అసమానతలపై మరోసారి ప్రశ్న లేవనెత్తింది. ‘‘అమ్మా... నేను ఇలా మోసపోతానని అనుకోలేదు.. ఏనాడూ మీకు చెడ్డ పేరు తేవాలని అనుకోలేదు.,. అయినా మోసపోయాను ఇక నేను బతకలేను.. నన్ను క్షమించండి..నా చివరి కోరిక మేరకు ప్రతి ఏడాది నా తరఫున కల్వరి సిరి మందిరంలో ప్రార్థనలు జరిగేలా చూడండి.’’ అంటూ రాసిన యువతి చివరి లేఖ మరోసారి కులాల అసమానతలపై ఆలోచన రేకెత్తించింది. సేకరించిన వివరాల మేరకు మండలంలోని నవులూరు ఉడా కాలనీలో నివసిస్తున్న గుడిసె లోయదాసు అన్నపూర్ణమ్మలకు ఇద్దరు సంతానం. నాగరాణి పెద్ద అమ్మాయి కాగా రమేష్ అనే కుమారుడు ఉన్నారు. లోయదాసు గతంలోనే మృతి చెందగా కృష్ణాజిల్లా నుంచి 12 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం ఇక్కడకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగరాణి మండలంలోని యర్రబాలెంలో కల బ్రిక్స్ ఇండస్ట్రీలో కూలి పనికి వెళ్తోంది. బాపనయ్యనగర్లో నివాసముంటున్న బల్లా నాగార్జున అదే బ్రిక్స్ ఇండస్ట్రీలో పనిచేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో నాగార్జున తల్లితండ్రులు వివాహానికి ససేమిరా అనడంతో నాగార్జున కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నాగరాణి పది రోజుల కిందట రూరల్ పోలీసులను ఆశ్రయించింది. నాగార్జునను పిలిపించి తమకు వివాహం జరిపించాలని కోరడంతో నాగార్జునను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. నాగరాణి ఏరోజుకా రోజు పోలీసులు తనకు నాగార్జునతో పెళ్లి జరిపిస్తారని ప్రతిరోజు తాళిబొట్టుతో సహా స్టేషన్కు వెళుతోంది. తన ఆశలు నెరవేరకపోవడంతో చివరకు ఈనెల 26న తన నివాసంలో తన మనస్సులోని ఆవేదనంతా ఏడు పేజీల లేఖలో రాసి పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మంగళగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నాగరాణి తల్లి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు నాగరాజును అదుపులోకి తీసుకోగా గుంటూరు ఆసుపత్రిలో ఉన్న నాగరాణి నాగార్జునను కలవాలని మరోసారి పోలీసులను కోరింది. దీంతో పోలీసులు నాగార్జునను ఆసుపత్రికి తీసుకువెళ్లి అరగంట పాటు మాట్లాడించారు. చివరగా నాగార్జునతో మాట్లాడిన నాగరాణి అనంతరం పరిస్థితి విషమించడంతో ఈనెల 29 వతేదీ తెల్లవారుజామున కన్నుమూసింది. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం మంగళవారం మృతదేహాన్ని నవులూరు ఉడా కాలనీలోని నివాసానికి తరలించారు. తన కుమార్తె మోస పోయిందని తల్లి చేస్తున్న ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని కంట తడి పెట్టించాయి. దళిత సంఘాల నేతలు కారుమంచి రామారావు, ఎం.రవి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ రాంప్రసాద్, రూరల్ సీఐ శరత్బాబు, ఎస్ఐ నాగుల్మీరా వివరాలు సేకరించారు. రూరల్ సీఐ శరత్బాబు మాట్లాడుతూ యువతి తల్లి ఫిర్యాదు మేరకు నాగార్జునను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి అందవలసిన పరిహారం అందజేయడంతో పాటు నాగరాణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నా! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను చూస్తుంటే తనూ చూడటం స్టార్ట్ చేసింది. అలా కొన్నిరోజుల తర్వాత తన ఫోన్ నంబర్ అడిగాను. ఇచ్చింది. ఫోన్లోనే ప్రపోజ్ చేశాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఓకే అంది. బాగానే మాట్లాడుకున్నాం. అన్నీ షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులకి మా మధ్య క్యాస్ట్ గురించి చర్చ వచ్చింది. మా కులాలు వేరని తెలిసింది. దాంతో ‘మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడితో వదిలేద్దాం’ అంది. సరే..! నీకే లేనప్పుడు నాకెందుకని ఫోన్లు, మెసేజులు చెయ్యడం మానేశాను. తర్వాత కొన్ని రోజులకి తన నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాను. ‘మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ‘మనం వెళ్లిపోతే మన ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది. వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. తను వినట్లేదు. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటోంది. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను’ అని బెదిరిస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా ఒక్కడికే కాకుండా ఇద్దరికీ హెల్ప్ అయ్యే సలహా ఇవ్వండి ప్లీజ్. – ప్రవీణ్ బెదిరిస్తోందా????‘సార్..! ‘‘బెదిరిస్తోందా..దా..దా..?’’ అని దీర్ఘం తీస్తున్నారంటే అమ్మాయి నిజంగా ఏం చేసుకోదని లైట్గా తీసుకుంటున్నారా సార్? మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్! ఎవరైనా సూసైడ్ చేసుకుంటున్నారని అంటారా సార్? మనకు లవ్ వర్కౌట్ కాకపోతే ఇంక వేరే మార్గమే లేదని మీ చెల్లెలు వాపోతుంటే ఏంటి సార్ మీ సెటైర్లు..?? ‘‘బెదిరిస్తోందా.. దా..దా’’?? అని అంటున్నారు. టూ మచ్ సార్!’అది కాదు నీలూ! ముందేమో తాను క్యాస్ట్ సేమ్ కాదు.. లవ్ స్టాప్ చేద్దామంటే.. తనకేనా పొగరు నేను కూడా కట్ ఆఫ్ చేసేస్తా.. అని పోజ్ కొట్టాడు ప్రవీణ్. లవ్ లేకపోయినా బతకొచ్చు అనుకుంటున్నాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణం సైతం వదిలేస్తా ప్రేమ కోసం అని బాధపడుతుంటే.. పారిపోవడానికి కూడా రెడీ అంటుంటే... మనవాడు స్లో మోషన్లో మనకు ఉత్తరం రాస్తున్నాడని కొంచెం ఫీలయ్యి వెక్కిరించా నీలాంబరి. ‘‘బెదిరిస్తుందా..దా..దా?’’ అని.‘మరి ఇప్పుడు ఏం చెయ్యాలి సార్?’ప్రవీణ్ వాళ్ల ఇంట్లో కన్విన్స్ చేసి మమ్మీ డాడీలను తీసుకెళ్లి అమ్మాయి పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోవాలి!!‘తంతారేమో సార్!?’బెదిరిస్తున్నావా నీలూ???? ‘లేదు సార్! ప్రవీణ్ ఈజ్ స్ట్రాంగ్. మీరు చెప్పినట్లే చేస్తాడు!!’ ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ lovedoctorram@sakshi.com -
ప్రియురాలు మాట్లాడటం లేదని ఓ మైనర్..
చాంద్రాయణగుట్ట: ప్రియురాలు మాట్లాడటం లేదని మనస్థాపానికి గురైన ఓ మైనర్ బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ టి.సాయి కుమార్ గౌడ్ తెలిపిన మేరకు.. ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్కు చెందిన యాదయ్యకు ఒక కుమారుడు బి.నరేష్(16), ఇద్దరు కుమార్తెలు. నరేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 23న ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన నరేష్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నైట్ షిప్ట్ కూడా డ్యూటీ ఉందని...ఇంటికి రావడం లేదని తెలిపాడు. బుధవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వారి వారి పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న నరేష్ ఇంటి పైకప్పు రేకుల పైప్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తలుపులు నెట్టినా రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా నరేష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఓ బాలికతో నరేష్ ప్రేమలో ఉన్నాడని....ఇటీవల ఆ బాలిక మాట్లాడకపోవడంతో వారం రోజుల నుంచి ముభా వంగా ఉన్నాడని....ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నైట్ డ్యూటీ అని చెప్పి...ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన నరేష్.. తాను నైట్ డ్యూటీ చేస్తున్నానని ఇంటికి ఫోన్ చేసిన నరేష్....స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్నేహితులంతా కలిసి మంగళవారం రాత్రి విందు చేసుకొని బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరుగా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. నరేష్ ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి అతని స్నేహితులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎప్పుడు చూసినా స్నేహితులు...స్నేహితులంటూ వెళ్లేవాడని...చెడు స్నేహం కారణంగానే తమకొడుకును పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.