balaji
-
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలాజీ వీర్నాల ప్రత్యేక ఇంటర్వ్యూ
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
విద్యుత్ షాక్తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్కు చెందిన వీరమాస గౌతమ్కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
మహేష్ అన్న ఫ్యామిలీ తో నాకున్న రిలేషన్ ఇదే..
-
మహేష్ పక్కన ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడలేరు..
-
విజయ నిర్మల ఆంటీ కోపం ఎలా ఉంటుందంటే...!
-
కృష్ణ అంకుల్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే...!
-
అన్నార్తులకు అండగా..
పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్ బాలాజీ. వీఎస్ఎస్ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు. అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్ పనులతోపాటు వాటర్ ఫ్యూరిఫైయర్ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలి బాధలు దూరం చేస్తూ.. యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్ఎస్ పురం, టీఆర్ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను. – బాలాజీ, వలంటీర్, వీఎస్ఎస్ పురం, తడుకు పంచాయతీ -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్
సాక్షి, హిందూపురం: హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి) -
నటుడు వడివేలు బాలాజీ కన్నుమూత
చెన్నై : నటుడు వడివేలు బాలాజీ (45) గురువారం చెన్నైలో కన్నుమూశారు. మదురై పూర్వీకం కలిగిన బాలాజి మిమిక్రీ ఆర్టిస్ట్గా జీవితాన్ని ప్రారంభించారు. విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న కలక్క పోవదు యార్ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందారు. ఈయన న టుడు వడివేలును అనుకరిస్తూ హాస్యాన్ని పండించడంతో వడివేలు బాలాజీగా పాపులర్ అయ్యారు. పలు టీవీ కార్యక్రమాల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బాలాజీ కోలమావు కోకిల వంటి కొన్ని చిత్రాల్లోనూ నటించారు. కాగా 15 రోజుల క్రితం గుండెపోటు, పక్షవాతానికి గురైన వడివేలు బాలాజి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తర్వాత స్థానిక రాజీవ్గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ వడివేలు బాలాజి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
అదే నా లక్ష్యం
‘‘నాది వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి 2016లో కలిగింది. ఏడు షార్ట్స్ ఫిల్మ్స్లో నటించిన తర్వాత ఇక సినిమాలు చేద్దామనుకున్నా. ఆ సమయంలో డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఏర్పడిన పరిచయంతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం చేశా’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా మొదటì పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా ‘సెబాస్టియన్’ని ఈరోజు ప్రకటిస్తున్నాం. బాలాజీ అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం నేను హీరోగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంలోనే ప్రమోద్, రాజుగార్లు ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. కల్యాణ మండపం నేపథ్యంలో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 1975 అని పెట్టడానికి కారణం కల్యాణ మండపం ఆ టైమ్లో కట్టిందని చెప్పడానికే. లవ్స్టోరీ, తండ్రీ కొడకుల మధ్య బంధం, స్నేహం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ఇందులోని పాత్రలన్నీ కడప జిల్లా యాసలోనే మాట్లాడతాయి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే ప్లాన్ చేశాం. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 40 శాతం అయ్యింది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్లో సాయికుమార్, తనికెళ్ల భరణిగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు శ్రీధర్కి ఇది తొలి సినిమా. ముందు ‘1991’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. నాలుగేళ్లుగా కలసి ప్రయాణం చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్గారు మా చిత్రానికి 6 మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ భాస్కరభట్లగారు రాశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్. -
ప్రగతి భవన్కు రండి
కెరమెరి (ఆసిఫాబాద్): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆపిల్ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ -
కేజీతండా వాసికి అరుదైన అవకాశం
జఫర్గఢ్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్ బాలాజీకి లండన్లోని మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్గఢ్లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్ ఉండి పూర్తి చేశాడు. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధించి హైదరాబాద్లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తయిన తర్వాత మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. -
‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది
‘‘ఊరంతా అనుకుంటున్నారు’ ట్రైలర్ చూస్తే నవీన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలకు అంకితం ఇస్తున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నవీన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి’’ అని నటుడు కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజి సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ విజయ్కృష్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇకపై గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘విజయ నిర్మలగారికి నవీన్ మంచి నటుడు కావాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే ‘నందిని నర్సింగ్ హోమ్’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊరంతా అనుకుంటున్నారు’తో నవీన్ కుటుంబ ప్రేక్షుకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు నరేశ్ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘నా కథకి నవీన్ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది’’ అన్నారు బాలాజి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మంగళంపల్లి అన్నారు. -
‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా
‘‘నా 55ఏళ్ల సినిమా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. అయినా, ఏ రోజూ నిరుత్సాహపడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు’’ అని సీనియర్ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి అన్నారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కార్యవర్గ సభ్యులను హైదరాబాద్లో బుధవారం ప్రకటించారు. ‘టి మా’ అధ్యక్షునిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్ రాథోడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ– ‘‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో నాకొక మంచి గుర్తింపునిచ్చారు. ఆ పాత్ర దొరకడం నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావడంలేదు. అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలకు ఒకటి, రెండు రోజుల కాల్ షీట్స్ అడుగుతున్నారు. ‘టి మా’ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్లో 85 సినిమాలకు సెన్సార్ పూర్తి చేశాం. ఎన్నో సినిమాల టైటిల్స్ను రిజిస్ట్రేషన్ చేయించాం. సభ్యులకు హెల్త్కార్డ్స్ అందిస్తున్నాం. తెలంగాణ ఫిలిం చాంబర్ కేవలం తెలంగాణ వారికి చెందినది మాత్రమే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చాంబర్లో ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ‘తెలంగాణ స్టేట్ ఫిలించాంబర్’ ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అది నలభై ఏళ్లుగా ఉంది కానీ అందులో పంపిణీదారులే ప్రముఖంగా ఉంటారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉపాధ్యక్షుడు గురురాజ్, సెక్రటరీ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ‘టి మా’ జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్ సెక్రటరీలుగా కిరణ్, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గుండు రవితేజ, ప్రేమ్, శ్రీశైలం, గీతాసింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి న్యూస్ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు. -
దాడి బాలాజీపై భార్య ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు దాడి బాలాజీపై అతని భార్య నిత్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లితెర యాంకర్, హస్యనటుడు దాడి బాలాజి అతని భార్య నిత్య మధ్య కొంత కాలం క్రితమే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. ఇద్దరు విడివిడిగా నివశిస్తున్నారు. నిత్య తన కూతురితో మాధవరం, శాస్త్రి నగర్లో నివశిస్తోంది. కాగా దాడిబాలాజి, నిత్య ఇద్దరూ ఆ మధ్య జరిగిన బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నారు. ఆ గేమ్ షోలో కూడా వీరిద్దరూ ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం మాధవరం పోలీస్స్టేషన్లో దాడి బాలాజీపై ఫిర్యాదు చేసింది. అందులో బాలాజీ మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని, గత జనవరి నెల 21న తాగి వచ్చి ఇంటి కిటికీలు పగులగొట్టి రగడ చేయడంతో పాటు ఫోన్లో అసభ్యంగా తిట్టి, హత్యాబెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అదే విధంగా తమ వివాహ రద్దు కేసు కోర్టులో ఉండగా బాలాజి మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా దాడి బాలాజీకి ఫోన్ చేయగా, అతని తాను షూటింగ్ నిమిత్తం వేరే ఊరికి వచ్చానని, తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
నువ్వు నాకు బా..గా నచ్చావ్!
శ్రీకాళహస్తి: ‘నువ్ అందంగా ఉంటావ్..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్లలో కొన్ని! ఆయనగారిలోని ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్లు బ్యాంకు మేనేజర్కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
క్వార్టర్స్లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: లిజౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–1, 3–6, 10–8తో కెచ్మానోవిచ్ (సెర్బియా)–జె లీ (చైనా) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్కు చేరగా... సుమీత్ నాగల్, రామ్కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 7–5తో జొహాన్ టాట్లోట్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... సుమీత్ 2–6, 3–6తో తత్సుమైతో (జపాన్) చేతిలో... రామ్కుమార్ 6–7 (3/7), 3–6తో డేవిడోవిచ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
గ్రామాల్లో ‘నయాగాడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’! కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్ షోరూమ్ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్లో ‘నయాగాడీ.కామ్’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత. రూ.4 కోట్లు; 80 వాహనాలు.. నయాగాడీలో బైక్లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒడిశా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20% కమీషన్ కూడా ఉంటుంది. నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి... నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరుల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో డీల్ చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం. రూ. 3 కోట్ల ఆర్డర్ బుక్.. ప్రతి వాహనం విక్రయంపై డీలర్ నుంచి 1 శాతం, బ్యాంక్ రుణం పొందితే బ్యాంక్ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్ను చేరుకోవాలి లకి‡్ష్యంచాం. పలువురు హెచ్ఎన్ఐలు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
మరోసారి వివాదాస్పదమైన ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వాకం
-
సినీ నటుడు బాలాజీని విచారించిన పోలీసులు
సాక్షి, బంజారాహిల్స్: తన భార్యకు కిడ్నీ ఇచ్చిన తనకు ఎలాంటి చికిత్స చేయించకుండా బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న సినీ నటుడు బాలాజీపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ నిమిత్తం బా లాజీని స్టేషన్కు పిలిపించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. తాము చట్ట ప్రకార మే లక్ష్మి నుంచి కిడ్నీని తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను అందజేశారు. మానవతా దృక్ఫథంతోనే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని భాగ్యలక్ష్మి తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై ఫోన్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ‘మా’ అసోసియేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు
-
సినీ నటుడు బాలాజీపై ఫిర్యాదు
సాక్షి, బంజారాహిల్స్ : సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ పీఎస్కు వచ్చిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు.. యూసూఫ్గూడలో ఉంటున్న తాను తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పులపాలైన తాను నటుడు బాలాజీ భార్యకు కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడన్నారు. 2016లో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని, అయితే రూ. 3 లక్షలు మాత్రమే ఇచ్చి తెల్లకాగితాలపై ఆస్పత్రిలో సంతకాలు చేయించుకుని డబ్బులు ముట్టినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఇబ్బందుల్లో ఉన్న తాను న్యాయం కోసం జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, ‘మా’ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమెకు సినిమా క్యారెక్టర్లు ఇప్పిస్తానని, తన ఇంటి పై పోర్షన్ రాసిస్తానని, జీవనోపాధి కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఆమెకు న్యాయం జరిగేవరకు తాను అండగా ఉంటానన్నారు. బాధల్లో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆమెకు డబ్బులు ముట్టినట్లు బాలాజీ చూపిస్తున్న పత్రాలు నమ్మదగ్గవిగా లేవన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రామాణిక వైద్యానికి మారుపేరు
హైదరాబాద్లో 2005లో పుట్టిన 108 సేవలు, 2006–7లో పురుడు పోసుకున్న 104 ఫోనుపై ఆరోగ్య సమాచారం, ప్రతి నెలా మీ వూరిలో అందించే ఆరోగ్య సేవలు అన్నీ డాక్టర్ అయితరాజు పాండురంగారావు అందించిన ఆలోచనలే. గడచిన నాలుగు సంవత్సరాల ప్రత్యేక ఉనికిలో తెలంగాణ తన ప్రజల భవిష్యత్తుకి అవసరమైన, ముఖ్యమైన కొన్ని విషయాలపై దృష్టి సారించి కీలకమైన పునాదిరాళ్ళు రూపొం దించుకుంది. అందులో ప్రత్యేకంగా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి వివిధ ప్రణాళికలకు ప్రాణం పోసింది. అట్లా రూపొందించిన చాలా ప్రణాళికలు దేశానికే నేడు కొత్త ప్రమాణాలుగా పేరు పొందినాయి. వీటిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టిఎస్ ఐపాస్ వంటివి మచ్చుకు కొన్ని. ఇవన్నీ కొన్ని సంవత్సరాలలోనే ప్రజలకు మెరుగైన ఫలాలు అందిస్తాయని మన అంచనా. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాంస్కృతి కంగా, ఆర్థికంగా అణగారిన తెలంగాణ ప్రస్తుతం విశిష్ట పథకాల సాక్షిగా కొత్త ఊపిరులు పోసుకొంటోంది. హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక సమాజానికి అంతే అవసరం అంటే అతిశయోక్తి లేదేమో. సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా విద్య, వైద్యం, కల్చర్ తల భాగాన ఉంటాయి. రోమ్ నగరం ఒక్క రోజులో కట్టలేదు అని ఒక ఆంగ్ల నానుడి. తెలంగాణ అభివృద్ధి కూడా కొన్ని రోజుల్లోనే సమకూరదు. ఐతే కావలసిన ప్రణాళికలు, పునాదిరాళ్ల ప్రక్రియలు ఇప్పుడే ఆలోచించుకోవాలి. విద్య, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి, రాష్ట్ర ప్రగతికి పనికివచ్చే ఉన్నత విద్యా ప్రమాణాలు, ప్రణాళికలు శోధించి వీలైనంత త్వరగా ఒక బ్లూప్రింట్ తయారుచేసి ఉంచుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై వైద్య రంగంలో గతంలో చేసిన కొన్ని విశిష్ట ప్రయోగాలు, ప్రయత్నాల గురించి, వాటి వెనుక తెర వెనుక ఉన్న తారలు తెరమరుగు కాక మునుపే మనం వారిని గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అశోక స్తంభం మీద ఉన్న నాలుగు సింహాల్లో మూడే కనిపిస్తాయి, నాలుగోది కనిపించదు. అయితే నాలుగో సింహం కనిపించదు కాబట్టి అది లేదనుకోవడం పొరపాటే! అటువంటి నాలుగో సింహమే తెలంగాణ వైద్యరంగ ఆణిముత్యం డాక్టర్ ఐతరాజు పాండు రంగారావు. 2005 సంవత్సరంలో హైద్రాబాదులో పుట్టిన 108 సేవలు, 2006–7లో పురుడు పోసుకున్న 104 (24/7) ఫోనుపై అందించే ఆరోగ్య సమాచారం, డాక్టర్ సలహాలు, ప్రతి నెలా మీ వూరి గడపలో అందించే ఆరోగ్య సేవలు Fixed Day Health Services) అన్నీ ఆయన అందించిన ఆలోచనలే. వాటిని ఆచరణలో పెట్టిన సైనికులలో నేనూ ఒక్కణ్ణి. ఈ సేవలే కాదు, ఇంకా ఎన్నో కొత్త తరహా ఆలోచనలకి, ఆలోచనల ఆచరణకి ఆనవాలం డాక్టర్ అయితరాజు. పోలియో చుక్కలు పోలింగ్ బూత్లో ఇప్పిస్తే ప్రజలు సునాయాసంగా సేవలు పొందవచ్చు అని ఆలోచించిన ఘనత కూడా డాక్టర్ రంగారావుదే. రాజస్థాన్ తరువాత జైపూర్ ఫుట్ని తయారుచేసిన నగరం హైదరాబాద్. డాక్టర్ సేథీ కనిపెట్టిన జైపూర్ ఫుట్ని ఆయనని ఒప్పించి, డి.సి గలడాని మెప్పించి, నిజాం ఇన్సి్టట్యూట్లో కార్ఖానా పెట్టించి మరీ, కాలు కోల్పోయిన తెలుగు ప్రజలకు జైపూర్ ఫుట్ సమర్పించింది ఆయనే! డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ ప్రొసీజర్ని కనిపెట్టిన పక్క రాష్ట్రంలోని ఇరువురు డాక్టర్లను హైదరాబాద్కు రప్పించి ఆ నూతన విధానాన్ని ఇక్కడ డాక్టర్లకు నేర్పించి కుటుంబ నియంత్రణకు సంబంధించి, 1990లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెర్టిలిటీ తగ్గించడానికి ప్రణాళికలు రచించి ఆచరణలో పెట్టించిన దూరదృష్టి కల డాక్టర్ పాండురంగారావు! చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఇంకా ఎన్నెన్నో కొత్త పుంతలు వైద్యరంగంలో తెలుగు గడ్డపై పుట్టడానికి కారణం ఆయన. ఇప్పటికీ ఏదైనా కొత్త సమస్య ఆయన ముందుం చితే, చిన్న పిల్లలముందు చాక్లెట్ పెడితే వాళ్ళ కళ్ళు ఎట్లా మెరుస్తాయో , అట్లా మెరుస్తాయి ఆయన కళ్ళు! గత సంవత్సరం అందించిన పద్మ అవార్డులలో అంబులెన్సు సేవలకు గాను గుజరాత్కి చెందిన ఒక డాక్టర్కి లభించింది. అప్పుడు అనుకున్నాము పనికి పద్మ అవార్డుకు సంబంధం అసలుంటుందా అని! ఏది ఏమైనా మన తెలంగాణ ఆణిముత్యాలని మనమే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బుకంటే, డంబాలకంటే ముఖ్యమైంది స్ఫూర్తి! రంగారావు, ఆయన మిత్రులు, ఆ తరం స్ఫూర్తి ప్రదాతలు, వారి త్యాగాలు, ప్రయోగాలు, ప్రయత్నాలు, వాళ్ళు వేసిన పునాదిరాళ్ళపై తెలంగాణ ముందుకు నడుస్తుందని, బంగారు తెలంగాణ నిర్మించుకుంటామని మనసావాచా నమ్మేవాళ్ళల్లో నేనొకణ్ణి! డాక్టర్ బాలాజీ ఊట్ల వ్యాసకర్త సీఈఓ, క్రియ హెల్త్ కేర్ మొబైల్ : 98665 04104 -
లక్ష జనాభా ఉంటే ‘బీ న్యూ’ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ విక్రయంలో ఉన్న ‘బీ న్యూ’ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగా వారానికి ఒక స్టోర్ తెరుస్తోంది. ప్రస్తుతం సంస్థకు 49 కేంద్రాలు ఉన్నాయి. ఈ వారం 50వ ఔట్లెట్ను విజయనగరంలో ప్రారంభిస్తోంది. కొద్ది రోజుల్లో కరీంనగర్, గుడివాడ, ప్రొద్దుటూరులో అడుగు పెడుతోంది. డిసెంబరులోగా తెలంగాణలో 60 స్టోర్లు రానున్నాయని ‘బీ న్యూ’ మొబైల్స్ వ్యవస్థాపకులు వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ఇందులో సగం హైదరాబాద్లో ఉంటాయని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరో 25 ఔట్లెట్లు ప్రారంభిస్తామని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డిసెంబరుకల్లా మొత్తం 135 కేంద్రాలను దాటు తామన్నారు. కంపెనీ విస్తరణ, భవిష్యత్ ప్రణాళిక ఆయన మాటల్లోనే.. విద్యార్థుల కోసం గ్యాడ్జెట్లు.. బీ న్యూ ఔట్లెట్లలో అన్ని ప్రముఖ కంపెనీల మొబైళ్లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్సెసరీస్ విక్రయిస్తున్నాం. త్వరలో ల్యాప్టాప్స్ అమ్మకాల్లోకి అడుగు పెట్టబోతున్నాం. అలాగే పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. దేశంలో ఏ కొత్త ఉత్పాదన వచ్చినా ప్రజలకు అందిస్తున్నాం. పాఠశాలల్లో డిజిటల్ బోధనకు ఉపయోగపడే ఎల్ఈడీ ప్రొజెక్టర్లు అందుబాటు ధరలో పరిచయం చేయబోతున్నాం. వినూత్న గ్యాడ్జెట్ల సేకరణలో మా టీమ్ నిమగ్నమైంది. సర్వీస్కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రిపేర్ అదేరోజు గనక కాకపోతే కస్టమర్కు స్టాండ్ బై ఫోన్ ఇచ్చేలా బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి మొబైల్పై బహుమతి.. మా ఔట్లెట్లలో రూ.499తో మొదలై రూ.1 లక్ష విలువ చేసే మోడళ్లనూ అమ్ముతున్నాం. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక బహుమతి ఖచ్చితంగా అందిస్తున్నాం. సీజన్నుబట్టి స్కూల్ బ్యాగ్ వంటి గిఫ్టులు ఇస్తున్నాం. ప్రస్తుతం రూ.1,599 విలువ చేసే మొబైల్పై టేబుల్ ఫ్యాన్ ఉచితంగా అందజేస్తున్నాం. వినియోగదార్ల సౌకర్యార్థం ప్రతి స్టోర్లో 100 మోడళ్ల వరకు డిస్ప్లే ఉంచుతున్నాం. ప్రస్తుతం నెలకు 50,000 యూనిట్ల ఫోన్లు అమ్ముతున్నాం. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 75 శాతముంది. ఒక్కో స్టోర్ ప్రాంతాన్ని బట్టి 500 నుంచి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. రెండు రెట్ల టర్నోవర్.. బాలాజీ వాచ్ కంపెనీ పేరుతో నెల్లూరులో 1990లో రిటైల్లో అడుగు పెట్టాం. రిటైల్లో 28 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్లో మొబైల్స్ ప్రవేశించిన నాటి నుంచే ఈ రంగంలో ఉన్నాం. ప్రముఖ బ్రాండ్ల సూపర్ డిస్ట్రిబ్యూషన్ సైతం చేపట్టాం. 2014లో ‘బీ న్యూ’కు శ్రీకారం చుట్టాం. తొలి కేంద్రం విజయవాడలో ప్రారంభించాం. 2017లో ఏకంగా 30 స్టోర్లు తెరిచాం. ఇప్పటి వరకు తెలంగాణలోని హన్మకొండ మినహా మిగిలిన ఔట్లెట్లన్నీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశాం. లక్ష జనాభా ఉన్నచోట స్టోర్ను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. విస్తరణతో 2018–19లో టర్నోవర్ రెండింతలకు చేరుకుంటుంది. 2019లో కర్ణాటకలో అడుగు పెట్టాలని నిర్ణయించాం. సంస్థ వద్ద 600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ప్రేమికుల రోజునే నటుడికి విడాకులు
సాక్షి, చెన్నై: ప్రేమికుల రోజునే నటుడు బాలాజీకి కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాదల్ చొల్లవందేన్, మెయ్ అళగి, పట్టాలం చిత్రాల్లో నటించిన బాలాజీ రెండేళ్ల క్రితం ప్రీతిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత కాలానికే వారి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ప్రేమికుల రోజైన బుధవారం విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ విషయాన్ని నటుడు బాలాజీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
‘ఊరంతా అనుకుంటున్నారు.!’ ఫస్ట్ లుక్ వీడియో
-
‘ఊరంతా అనుకుంటున్నారు..!’ ఫస్ట్లుక్
సీనియర్ నటుడు నరేష్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన హీరో నవీన్ కృష్ణ విజయ్. నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు నవీన్. ‘అమ్మానాన్న నాకు నడక నేర్పారు.. నడవడికను మా ఊరు నాకు నేర్పింది.. రామాపురం.. మరి మా కథ ఏంటో చూద్దామా.. నా రాబోయే చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’’ అంటూ ఆ సినిమా టైటిల్ లోగోను ఆసక్తికరంగా విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన రైతు కుటుబం సినిమాలోని ఊరంతా అనుకుంటున్నారు పాట పల్లవితో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, రావూ రమేష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతో పాటు తండ్రి నరేష్(సీనియర్)తో కలిసి విఠలాచార్య సినిమాలో నటిస్తున్నాడు నవీన్. -
కొబ్బరికొట్టులో కొలువుతీరిన బాలబాలాజీ
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ... కోనసీమవాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ బాల బాలాజీ స్వామి కొలువు తీరిన గ్రామం అప్పనపల్లి. పవిత్ర వైనతేయ గోదావరి నది సోయగాలతో నిత్యం వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణలతో అలరారుతున్న ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గ్రామ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు స్ఫురణకు వస్తాయి. బాలాజీ ఎక్కడున్నా నిత్యకల్యాణం పచ్చతోరణమే కదా... అప్పనపల్లి కూడా అదే సంప్రదాయాన్ని అందిపుచ్చుకుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ‘అప్పన్న’ అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివసాక్షాత్కారం పొందాడని, ఈ ‘అర్పణ’ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం ప్రచారంలో ఉంది. కొబ్బరి కొట్టులో కొంగుబంగారంగా... ఆలయ వ్యవస్థాపకుడు మొల్లేటి రామస్వామి పూర్వకాలం నుంచి కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం నష్టాలతో నడుస్తుండడంతో తిరుమల శ్రీవారికి వ్యాపారంలో వాటా పెడతానని మొక్కుకున్నారు. అప్పటినుంచి ఆ వ్యాపారం లాభాల బాటలో పయనించింది. దాంతో మొక్కుబడి ప్రకారం లాభంలో 10 శాతం వాటాను తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించేవారు. 1960వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకు వచ్చి కొబ్బరి కొట్టులో ప్రతిష్టించారు. లాభంలో కొంత వాటాను తిరుమల తిరుపతి తీసుకు వెళ్లి స్వామివారి పాదాల చెంత పెట్టేందుకు రామస్వామి ప్రయత్నించగా అర్చకులు అంగీకరించలేదు. అర్చకులతో వాదించి, వాదించి అలసి నిద్రిస్తున్న రామస్వామికి స్వప్నంలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి తానే అప్పనపల్లి వస్తానన్నాడట. అన్నమాట ప్రకారం ముద్దులొలికే బాలుడి విగ్రహ రూపంలో కొబ్బరికాయల మధ్యన కనిపించాడట. ఆ ముద్దుల బాలుని చూసి మైమరచిన రామస్వామి కొట్టులో ప్రతిష్టించిన స్వామి వారికి బాల బాలాజీగా నామకరణం చేశారు. ఆ విధంగా ప్రతిష్టించిన శ్రీబాల బాలాజీ స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చేవారు. వారి సంఖ్య క్రమేపి పెరిగి దిన దిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పోటెత్తడంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రామస్వామి. నూతన ఆలయ నిర్మాణం 1970 మార్చి18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కొబ్బరికొట్టులో ప్రతిష్టించిన శ్రీవారి చిత్రపటాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో నూతన ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. కొత్తగుడిపై చిత్రీకరించిన గోవు–గొల్లవాడు, గీతోపదేశం వంటి అద్భుత చిత్రాలు భక్తులను పరవశింపజేస్తాయి. 1991లో పద్మావతి, ఆండాళ్, గరుడాళ్వార్లను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించారు. అన్నదానానికి ఆదర్శంగా ఆ ఆలయం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయం అన్నదానానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అప్పనపల్లిలోనే అన్నదానానికి నాంది పలికారు. 1977వ సంవత్సరంలో ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి నిత్యాన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు. అన్నదానానికి అప్పనపల్లి ఆదర్శంగా నిలిచింది. నిత్యం బూరె, పులిహోర, మూడు రకాల కూరలు, పెరుగుతో అమలు చేస్తున్న అన్నదాన పథకం ఆలయ చరిత్రలో విశిష్టంగా నిలుస్తుంది. రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఆలయంలో భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. నిత్యం రెండు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శని, ఆదివారాలు ఈ సంఖ్య గణనీయంగా ఉంటోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులో అధిక శాతం మంది స్వామి వారి భోజనాన్ని అన్నప్రసాదంగా స్వీకరిస్తున్నారు. నిత్యం లక్ష్మీనారాయణ హోమం, ఉభయదేవేరులతో కల్యాణం, ఏడాదికోసారి దివ్య తిరుకల్యాణోత్సవాలు, అధ్యయనోత్సవాలతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ధనుర్మాస దీక్షలు భోగిరోజున జరిగే గోదా కల్యాణోత్సవంతో ముగియనున్నాయి. ఆలయానికి చేరుకునేది ఇలా... స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా తాటిపాక చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ఆలయానికి 70 కిలో మీటర్లు దూరం. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలోమీటర్లు. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఏర్పాటు చేశారు. – ఏడిద బాలకృష్ణారావు సాక్షి, మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా అద్భుతాలమయం భోగేశ్వరాలయం ఓరుగల్లు అనగానే కాకతీయులు నిర్మంచిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం (వేయిస్తంభాల గుడి), శ్రీ సిద్ధేశ్వర ఆలయం, శ్రీ పద్మాక్షి ఆలయం, శ్రీ భద్రకాళి ఆలయం వంటివి జ్ఞాపకం రావడం సహజం. అయితే, వాటితోపాటు వరంగల్లు, హన్మకొండల నడుమ మరో సుప్రసిద్ధమైన ఆలయం ఉంది. అదే శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం. మట్టెవాడ అనే ప్రదేశంలోని ఈ ఆలయం గర్భాలయంలోని ప్రధానలింగం ఎంతో విశిష్టమైనది. పానవట్టం పైన ఉన్న లింగభాగాన్ని పక్కకు జరపడానికి వీలుగా ఉంటుంది. పానవట్టం కింది భాగం బోలుగా ఉంటుంది. పానవట్టం అడుగుభాగంలో, శివలింగం కింద మేరుప్రస్తార రూపంలో ఉన్న ఒక శ్రీచక్రం ఉన్నదట. ఆ శ్రీచక్రం కింద సువర్ణలింగం ఉన్నదని ప్రతీతి. ఆ శ్రీచక్రం బిందుస్థానంలో మరొక చిన్న రాతి లింగం ఉన్నదట. అంటే అది అంతరలింగం అన్నమాట. ఆ శ్రీచక్రాన్ని కప్పివేస్తూ పానవట్టం ఉంటుంది. ఈ భోగేశ్వరలింగానికి అభిషేకం చేస్తే, ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. మరోవిశేషం ఏమిటంటే, ఈ శివలింగానికి ఎన్ని బిందెల నీళ్లతో అభిషేకం చేసినా, ఒక్క చుక్క నీరు కూడా సోమసూత్రం ద్వారా బయటకు రాదు. గుడికి నైరుతి భాగంలోని బావిలోకి పోతుందంటారు. శివలింగానికి వెనకవైపున వామాంకిత స్థితౖయెన గౌరీదేవితో సహా ఈశ్వరుని విగ్రహం, ఆ విగ్రహం పైభాగంలో ఒక తల ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి, గోడలపై చెక్కిన శిలాశాసనాలను బట్టి అది కాకతీయుల కాలం నాటిదని ఇట్టే చెప్పవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్కడ ఉంది? వరంగల్ స్టేషన్ నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ భోగేశ్వర ఆలయం ఉంది. వరంగల్ నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. -
ప్రేమ విఫలమై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాంనగర్ ప్రేమ విఫలమై శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే బాలాజీ ప్రతాప్ అనే యువకుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి అంగీకరించక పోవడంతో మనస్థాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాలాజీ ఆత్మహత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోర్టు మెట్లెక్కిన నటుడి భార్య
పెరంబూరు: హాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించింది. దాడిబాలాజీ బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. తన భార్యను ఒక సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు ఫేస్బుక్ ద్వారా తన భార్యకు పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. తాను భార్యతో కలిసి జీవించడానికి ఆ ఇద్దరు అడ్డు పడుతున్నారని, వారి నుంచి తన భార్యను కాపాడాల్సిందిగా కోరారు. బాలాజీ ఆరోపణలు ఖండించిన నిత్య, బాలాజీ తనకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడని మండిపడ్డారు. ఆతని ఆరోపణలతో సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడి కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను ఇకపై భర్తతో కలిసి జీవించలేనని, అందుకే చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. -
శ్రీపుష్పయాగంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు అప్పనపల్లి,(మామిడికుదురు) : శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ కనులపండువలా సాగిన శ్రీబాలబాలాజీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్ప సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలబాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉ«భయ దేవేరులతో కొలువు తీరిన బాలబాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. ముందుగా సుప్రభాత సేవతో ఐదోరోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజచినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. బాలభోగం, నివేదన, వేదపారాయణం హృద్యంగా ఆలపించారు. నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఈఓ పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
పులకించి‘నది’
వైభవంగా శ్రీవారి చక్రస్నానం వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు అప్పనపల్లి(మామిడికుదురు) : శ్రీబాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు గోవిందా... గోవిందా...గోవింద... అంటూ భక్తులు గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠి, ధ్వజారోహణ, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు బోర్డు సభ్యులు కంకిపాటి సుబ్బారావు, సుందరనీడి వీరబాబు, బోనం బాబు, వాసంశెట్టి వెంకట్రావు, పోతుమూడి రాంబాబులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటితో ముగియనున్న కల్యాణోత్సవాలు శ్రీబాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపుష్పయాగం, రుత్విక్ సన్నానంతో ముగుస్తాయని ఆలయ ఈఓ పి.బాబూరావు తెలిపారు. నేటి కార్యక్రమాలు.. ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ 6 గంటలకు సహస్రనామార్చన, 7 గంటలకు బాల భోగం నివేదన, 7.30కు వేదపారాయణం, నిత్యహోమం, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి రాత్రి 7 గంటలకు నిత్యారాధన ఉత్సవాలు, నిత్య హోమం, 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం(పవళింపు సేవ), మంగళశాసనం, రుత్విక్ సన్మానం, తీర్ధ ప్రసాద గోష్ఠి -
లోక కల్యాణార్థం ఘనంగా వేద సదస్యం
ఘనంగా మూడో రోజు కార్యక్రమాలు అప్పనపల్లి(మామిడికుదురు) : బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో మూడో రోజు మంగళవారం భక్తుల కోలాహలంతో ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాల బోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం) వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు అంతర్వేది, వాడపల్లి, మురముళ్ల, భీమవరం, ఆచంట, ద్వారకా తిరుమల, మందపల్లి, దవళేశ్వరం తదితర ఆలయాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, జగత్ రక్షణ కోసం వేద సదస్యం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెదపట్నం గ్రామానికి చెందిన పుచ్చల తాతారావు, మొగలికుదురుకు చెందిన ఉప్పులూరి సుబ్బారావు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఆలయ ఈఓ పొలమూరి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నేటి కార్యక్రమాలు... ఉదయం ఐదు గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ, ఆరు గంటలకు శ్రీవారికి సహస్రనామార్చన, ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన, 7.30 గంటలకు వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, 10 గంటలకు శ్రీవారికి చక్రస్నానం, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం ఏడు గంటలకు ధ్వజా అవరోహణ, మంగళాశాసనం, తీర్థ ప్రసద గోష్ఠి -
అంగరంగ వైభవంగా బాలబాలాజీ కల్యాణోత్సవం
పులకించిన భక్తజనులు అప్పనపల్లి(మామిడికుదురు) : భక్తుల కోలాహలం, గోవిందనామ స్మరణ, మంగళవాయిద్యాలు, నయనానందకరంగా అలంకరించిన పూల మండపంలో అప్పనపల్లి పుణ్యక్షేత్రంలో బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తం రాత్రి 9.02 గంటలకు ఉభయ దేవేరులను బాలబాలాజీ స్వామి పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ నిర్వహించిన రాయబార ఉత్సవం (ఎదుర్కోలు సన్నాహం) కడు రమణీయంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పలు రకాల పుష్పాలతో సుందరంగా రూపొందించిన మంటపంలో శ్రీదేవి, భూదేవిలతో కొలువు తీరిన బాలాజీ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆలయం తరఫన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి, అంతర్వేది లక్ష్మీనర్శింహస్వామి ఆలయాలకు చెందిన వేద పండితులు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. రావులపాలేనికి చెందిన మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు కుటుంబ సభ్యులు మంచి ముత్యాలు, పగడాలు తలంబ్రాలుగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దాల తిరుమల శింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిçష్యులు చమలచెర్ల మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఆద్యంతం కనుల పండువలా నిర్వహించారు. కల్యాణోత్సవంలో 260 మంది దంపతులు కర్తలుగా పాల్గొన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఆర్డీఓ కె.గణేష్కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యులు విత్తనాల మాణిక్యాలరావు, గంగుమళ్ల కాశీఅన్నపూర్ణ తదితరులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. -
నవవరునిగా బాలబాలాజీ
-వార్షిక దివ్యతిరుకల్యాణోత్సవాలకు శ్రీకారం -నేటి రాత్రి 9.02 గంటలకు పరిణయ వేడుక మామిడికుదురు (పి.గన్నవరం) : భక్తజనమనోరంజకంగా వైనతేయ తీరాన కొలువైన బాలబాలాజీ నవవరుడయ్యాడు. వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూరాగరు సుగంధ వీచికల నడుమ స్వామి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల శుభ ముహూర్తాన పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాలబాలాజీతో పాటు ఉభయ దేవేరుల బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలుగా తీర్చిదిద్దారు. కల్యాణోత్సవాలు నిరాటంకంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన నిర్వహించారు. తదుపరి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమం, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు కల్యాణోత్సవాలు కనుల పండుగలా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. నేటి కార్యక్రమాలు -ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ -ఆరు గంటలకు స్వామి వారికి సహస్రనామార్చన -ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన -ఎనిమిది గంటలకు చతుస్ధానార్చనలు - 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి -సాయంత్రం 4 గంటలకు బాల బాలాజీ స్వామి వారి తిరువీధి ఉత్సవం -ఆరు గంటలకు చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ -రాత్రి 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) -9.02 గంటలకు దివ్య తిరు కల్యాణోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి -
బాలాజీ ఆలయానికి కల్యాణశోభ
నేటి నుంచే తిరు కల్యాణోత్సవాలు సోమవారం రాత్రి 9.02 గంటలకు కల్యాణం అప్పనపల్లి (మామిడికుదురు) : నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతూ, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే పరంధాముడిగా పూజలందుకుంటున్న బాల బాలాజీ స్వామి దివ్య క్షేత్రం వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతులు, కర్పూర పరిమళాలతో శ్రీవారి ఆలయం కల్యాణ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామి వారి తిరు కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 9.02 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు తెలిపారు. గ్రామ చరిత్ర: మూడున్నర దశాబ్ధాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం. నూతన ఆలయ నిర్మాణం: 1970 మార్చి 18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1991 జూలై నాలుగో తేదీన టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్, సబ్సిడీపై కొనుగోలు చేసిన పద్మావతిదేవి, ఆండాళ్తాయార్, గరుడాళ్వార్ల విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఆలయానికి చేరుకునేది ఇలా... స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి తాటిపాక చేరుకోవాలి. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలో మీటర్లు. ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. -
చిలుకూరు బాలాజీకి ఉత్సవ శోభ
మొయినాబాద్: వీసా దేవుడిగా పిలుచుకునే చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా ఉగాది పండుగ అనంతరం చైత్ర శుక్ల దశమి నాడు ప్రారంభమై చైత్ర బహుళ విధియ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కొనసాగడం ఆనవాయితీ. ఈ నెల 6న ఉదయం సెల్వర్కుత్తుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. 7న ధ్వజారోహణం, సాయంత్రం శేష వాహనం, 8న ఉదయం గోప వాహనము, సాయంత్రం హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న ఉదయం సూర్య ప్రభ, సాయంత్రం గరుడ వాహనం, రాత్రికి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీదేవి, భూదేవి, బాలాజీల కల్యాణోత్సవం ఉంటుంది. 10న వసంతోత్సవం, గజ వాహనంపై ఊరేగింపు, 11న పల్లకి సేవ, రాత్రికి రథోత్సవం జరుగుతుంది. 12న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వ వాహనము, దోప్ సేవ, పుష్పాంజలి, 13న బాలాజీ బ్రహ్మోత్సవాల చివరి రోజున ధ్వజారోహణం, ద్వాదశారాధనము, చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. మెహిదీపట్నం, లక్డీకపూల్, రాణిగంజ్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, హయత్నగర్, అఫ్జల్గంజ్, రాజేంద్రనగర్ ప్రాంతాల మీదుగా సర్వీసులు నడుస్తాయి. -
తిరుమలలో పుష్ప వైభవం
-
బాత్రూము బండ విరిగిపడి బాలుడి మృతి
ఓడీ చెరువు : ఇంటిముందు బాత్రూము కోసం ఏర్పాటు చేసుకున్న నల్లబండ విరిగి మీద పడటంతో బాలాజీ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్లో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు.. క్రాసింగ్లో నివాసముంటున్న నాగరాజు, అనూష దంపతులకు బాలాజీ, కార్తీక్ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురూ కలిసి శనివారం ఉదయం టిఫిన్ చేశారు. నాగరాజు కూలి పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. ఇంటిముందు చుట్టూ బండలు పాతి ఏర్పాటు చేసుకున్న బాత్రూము వద్ద పెద్ద కుమారుడు బాలాజీ ఆడుకుంటున్నాడు. ఆ బండల వద్ద కూర్చోవడానికి వీలుగా పెట్టిన ఓ రాయి ఎక్కి బండను పట్టుకుని ఆ పక్కనే ఉన్న చిన్న కానుగచెట్టు ఎక్కబోయాడు. ఆ బండ విరిగి మీదపడింది. ఆ శబ్ధం విన్న అనూష అరుస్తూ పరుగున బయటకు వచ్చింది. ఆమె అరుపుతో చుట్టుపక్కలవారు కూడా అక్కడికి వచ్చి బాలుడిపై పడిన బండను తొలగించారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాలాజీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. -
బాలాజీ, తరుణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: విజయానంద్ సీసీ బ్యాట్స్మెన్ బాలాజీ రెడ్డి (108), తరుణ్ సాయి (103) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా సఫిల్గూడ సీసీతో జరిగిన మ్యాచ్లో విజయానంద్ 263 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విజయానంద్ సీసీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు చేసింది. బాలాజీ రెడ్డి, తరుణ్ సాయిలతో పాటు అభిషేక్ (72) ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్ష్ 4, రుత్విక్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫిల్గూడ సీసీ జట్టు... తేజ (5/8), అభిషేక్ (5/6) ధాటికి 21.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్ల స్కోర్లు గన్రాక్ సీసీ: 202/7 (ఆకాశ్ 50, లక్ష్మణ్ 54; రితేశ్ 5/25), హెచ్పీఎస్: 203/7 (సారుురెడ్డి 37 నాటౌట్; చిరంజీవ్ 5/30). గోల్కొండ సీసీ: 257 (ఎజాజ్ 86, చిరంజీవి 53; రంగస్వామి 5/48), హైదరాబాద్ డిస్ట్రిక్ట్: 253 (సౌభిక్ 113; చిరంజీవి 4/48). రుషిరాజ్ సీసీ: 177 (రాజేశ్ 55, జీయ 38; జితేందర్ 5/20), అంబర్పేట్ సీసీ: 179 (రామకృష్ణ 50, భరత్ 50; తహ్సీన్ 4/30). పికెట్ సీసీ: 318/6 (ప్రద్యుమ్న 75, శాశ్వత్ 81; సారుుకృష్ణ 4/85), లక్కీ ఎలెవన్: 124 (అశ్విత్ 68 నాటౌట్; సందీప్ గౌడ్ 3/18, నితీశ్ 3/37). సత్య సీసీ: 224 (ప్రజ్వల్82, సారుు హర్ష 52; తేజస్ 3/67, అబ్దుల్ హఫీజ్ 3/61), టైమ్ సీసీ: 36 (అక్షయ్ 4/14, రిత్విక్ 5/10). నటరాజ్ సీసీ: 205/7 (వరుణ్ 52 నాటౌట్; ఫైజాన్ 3/20), సన్షైన్ సీసీ: 206/8 (అక్షయ్ 37, సారుు తేజ 4/55, అచ్యుత్ 3/49). సూపర్ స్టార్: 213/9 (రోహిత్ 90, విక్రవర్ధన్ 43), విజయ్ సీసీ: 75 (యశ్వంత్ 3/32, రోషన్ 3/18). ఎంపీ బ్లూస్: 311/6 (రాజు 118, యేసుదాస్ 76, స్వామి 40), అను సీసీ: 236 (నవల్ 51, నకుల్ 40; సిద్ధాంత్ 3/36). హైదరాబాద్ వాండరర్స్:219 (పటేల్ 74; కౌస్తుబ్ 3/49), రిలయన్స సీసీ: 168 (అఖిల్ 54; అనికేత్ 4/36, జితేందర్ 3/47) -
ఇద్దరి దుర్మరణం
= ఐచర్, బొలెరో ఢీ = మూగజీవాలను తప్పించబోయి ప్రమాదం ముదిగుబ్బ/తనకల్లు : ముదిగుబ్బ మండలంలో ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న మూగ జీవాల ను తప్పించబోయి రెండు నిండు ప్రాణాలు బల య్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మండలకేంద్రంలోని ఎన్ఎస్పీ కొట్టాల జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటు చే సుకుంది. వివరాలు.. తనకల్లు మండలం చీకటిమానుపల్లి నుంచి ఐచర్ వాహనంలో చిత్తూరు జిల్లా పీలేరుకు వెళ్లి బ్రాయిలర్ కోళ్లను ముదిగుబ్బకు సరఫ రా చేసేందుకు గొల్ల జగదీష్(21), కొండకమర్ల బాబాజీ(30) సహా ఐదుగురు బయలు దేరారు. వా హనం ఉదయాన్నే ఎన్ఎస్పీ కొట్టాల వద్దకు వేగం గా వచ్చింది. రహదారిపై అదే గ్రామానికి చెందిన ఆదెప్ప అనే వ్యక్తి పశువులు సమూహం (గుర్రాలు, కుక్కలు) రోడ్డు దాటించేందుకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పశువుల సమూహాన్ని సకాలంలో గుర్తించ ని ఐచర్ డ్రైవర్ ఉన్నఫలంగా వాటిని తప్పించేం దుకు యత్నించాడు. దీంతో వాహనం అదుపుతప్పి పశువులతో పాటు ఎదురుగా వస్తున్న బొలెరో వా హనాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఐచర్ వాహనం బోల్తా కొట్టింది. ఐచర్లో ఉన్న జగదీష్, బాబాజీ అక్కడికక్కడే మృతి చెందారు. బొలేరో డ్రైవర్ నాగరాజు, ఐచర్లో ప్రయాణిస్తున్న గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఐచర్లో వందల సంఖ్యలో ఉన్న కోళ్లు, రోడ్డుపై ఉన్న ఒక గుర్రం, 3 కుక్కలు మృతి చెందాయి. సమాచారం తెలిసిన నల్లమాడ సీఐ శివరాముడు, ఎస్ఐ జయానాయక్, ఏఎస్ఐ విజయభాస్కర్రాజు క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయడపడిన గణేష్, నాగరాజు ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి చీకటిమానుపల్లికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. -
మహిషాసురమర్దిని సైకత శిల్పం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : దుర్గాష్టమిని పురస్కరించుకుని కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన సైకతశిల్పి ఆకునూరి బాలాజీవరప్రసాద్ ఆదివారం బందరు మండలం మంగినపూడి బీచ్ ఒడ్డున శ్రీమహిషాసురమర్దిని సైకితశిల్పాన్ని రూపొందించారు. 12 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున ఈ శిల్పాన్ని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ విజయవాడ ఆధ్వర్యంలో తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిచూపుతున్నారు. బాలాజీ గతంలో వినాయచవితిని పురస్కరించుకుని శైవlగణనాథుడి సైకత శిల్పాన్ని రూపొందించి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల మన్ననలు అందుకున్నారు. -
దర్శనంతో ఎంతో ప్రశాంతత
ఇప్పటి వరకూ 14 సార్లు తిరుమల బాలాజీని దర్శనం చేసుకున్నా. ఆనంద నిలయంలో స్వామివారిని కళ్లారా చూడగానే...చెప్పాలనుకున్నవన్నీ మర్చిపోతాం. మనస్సు అద్భుత భావంతో పులకించి పోతుంది. తిరుమల గాలిలోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు....అడిగినవన్నీ బాలాజీ ఇచ్చేస్తాడు. -
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక చిన్నరావూరి పార్కు సమీపంలో ఉండే బాలాజీ, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. అనుమానం పెంచుకున్న బాలాజీ తరచూ జ్యోతితో గొడవ పెట్టుకునే వాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో కోపంతో ఉన్న బాలాజీ భార్యను రోకలిబండతో మోది చంపాడు. ఆపై తను కూడా ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన చిన్నారులు ఏడుస్తూ స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
హొసూరు (తమిళనాడు): తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా చెక్కినాంపట్టి గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన నాలుగు టన్నుల ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రొంపిచర్లలో మాస్ (35) అనే ఎర్రచందనం స్మగ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. రొంపిచర్ల ఇన్స్పెక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు బృందంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చెక్కినాంపట్టి గ్రామంలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అప్పటికే స్మగ్లర్ కృష్ణమూర్తి పరారీ అయ్యాడు. అతని ఇంటి యజమాని రామకృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బాలాజీతో కలిసి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
కొడుకు ప్రేమ తెచ్చిన తంటా
కుమారుడి ప్రేమ వ్యవహారంపై కేసు.. తండ్రి ఆత్మహత్య ఆరు రోజుల క్రితం పరారైన ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు మనస్తాపంతో ప్రేమికుడి తండ్రి ఆత్మహత్య మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా కేవీబీపురం వుండలం వూరప్ప రెడ్డి కండ్రిగకు చెందిన యువతి, సదాశివపురం గ్రావూనికి చెందిన రంజిత్ ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేయూలని తల్లిదండ్రులు నిశ్చయించారు. దీంతో వారం క్రితం ప్రేవుజంట ఇంటి నుంచి పారిపోయింది. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి రంజిత్ కుటుంబసభ్యులతో విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రంజిత్ తండ్రి తలారి బాలాజి(42) బుధవారం ఉదయుం ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట పారిపోయింది. యువతి తల్లిదండ్రులు పోలీసులు, గ్రామ పెద్దలను ఆశ్రయిం చారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికుడి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కేవీబీపురంలో బుధవారం జరిగింది. కేవీబీపురం(పిచ్చాటూరు): కేవీబీపురం వుండలం వూరప్ప రెడ్డి కండ్రిగకు చెందిన గోవింద రాజు కువూర్తె(17), సదాశివపురం గ్రావూనికి చెందిన బాలాజి కువూరుడు రంజిత్(17) నాగలాపురం జూనియుర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. వీరు ప్రేమించుకుంటున్నారు. ప్రేవు వ్యవహారం కొన్ని రోజుల క్రితం యువతి పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఆమెకు వురొక వ్యక్తితో పెళ్లి చేయూలని నిశ్చరుుంచడంతో ప్రేమికులు గత గురువారం ఇంటి నుంచి పారిపోయారు. యువతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు తవు కువూర్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రంజిత్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను విచారించారు. వురో వైపు గ్రావు పెద్దలు పంచారుుతీ పెట్టారు. యువకుడి తంత్రి మనస్తాపం చెంది... ఈ క్రమంలో మనస్తాపం చెందిన రంజిత్ తండ్రి బాలాజి(42) బుధవారం ఉదయుం ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయుత్నించాడు. గమనించిన బంధువులు అతన్ని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలిస్తుం డగా వూర్గవుధ్యంలో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించి న బంధువులు, గ్రామస్తులు సుమారు 2 వేల మంది బాలాజి మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తలారి బాలాజిని పోలీసులు, పెద్ద వునుషులు తీవ్రంగా వేధించారని ఆరోపించారు. అందువల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితులను శిక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగభూషణం, పుత్తూరు, నగరి, సత్యవేడు సీఐలు సారుునాథ్, వుల్లికార్జునగుప్త, నరసింహులు, 10 వుంది ఎస్ఐలు, 70 వుంది పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 17 వుందిపై కేసు నమోదు చేయుడంతో పాటు, వుృతుని ఉద్యోగాన్ని అతని కువూరునికి ఇప్పిస్తావుని స్థానిక తహసీల్దారు ప్రకాష్బాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇంత జరుగుతున్నా ప్రేవుజంట ఆచూకీ తెలియుకపోవడం గవునార్హం. నిజ నిర్ధారణకు కమిటీ..: డీఎస్పీ ఈ కేసుకు సంబంధించి నిజ నిర్ధారణకు కమిటీని నియుమించనున్నట్లు పుత్తూరు డీఎస్పీ నాగభూషణ రావు తెలిపారు. ఈ కమిటీ కేసులో పేర్కొన్న 17 వుందిని విచారించి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాలాజీ మృతిలో మా తప్పేమీ లేదని తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజిత్ తండ్రి, బంధువులు, స్నేహితులను విచారించాం. -
బాలాజీకి హైకోర్టులో ఊరట
సీబీఐ కోర్టులో విచారణ నిలుపుదల సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చేసిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న హబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస బాలాజీకి ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో ఆయనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేసింది. అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునూ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని, అప్పటివరకు సీబీఐ కోర్టులో విచారణ ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ శ్రీనివాస బాలాజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.విజయసేన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లేపాక్షి నాలెడ్జ హబ్లో పిటిషనర్ కేవలం ఉద్యోగి మాత్రమేనన్నారు. కంపెనీ లావాదేవీలతో బాలాజీకి సంబంధం లేదని, ఈ విషయాన్ని సీబీఐ చార్జిషీటే చెబుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉక్రెయిన్ యువతితో వేలూరు యువకుడి వివాహం
వేలూరు : ఉక్రెయిన్ యువతిని వేలూరు యువకుడు ప్రేమించి... హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కాట్పాడికి చెందిన బలరామన్ కుమారుడు బాలాజీ జర్మనీలో ఐటీ కంపెనీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఉక్రెయిన్ దేశానికి చెందిన లసియా అనే యువతి కూడా పని చేస్తోంది. భారతీయ సంప్రదాయంపై మక్కువ కలిగిన లసియా తరచూ ఆ విషయాలను బాలాజీని అడిగి తెలుసుకునేది. ఈ సందర్భంగా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని బాలాజీ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు అంగీకరించారు. వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. -
కాల్వలో దిగి ఇద్దరు చిన్నారులు మృతి
డక్కిలి : అప్పటి వరకు కంటి ముందు తిరిగిన అన్నదమ్ములు ఆడుకొనేందుకు వెళ్లి శవాలై తిరిగొచ్చారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ సంఘటన డక్కిలి మండలంలోని వెలికల్లు ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వెలికల్లు అరుంధతీయవాడకు చెందిన లచ్చా పోలయ్య, వెంకటరమణమ్మలు దంపతులు. పోలయ్య కూలి పనిచేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాలాజీ (7), రెండో కుమారుడు కుమార్ (5) స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడి కావడంతో ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు. తల్లికి మూగ, చెవుడు కావడంతో.. బాలాజీ, కుమార్ ఇంట్లో కొంతసేపు ఉన్న తర్వాత ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నామని తల్లికి చెప్పారు. అయితే వెంకటరమణమ్మకు మూగ, చెవుడు ఉండటంతో పిల్లలు చెప్పిన విషయం ఆమెకు అర్థంకాలేదు. తండ్రి ఈ సమయంలో కూలికి వెళ్లి ఉండటంతో ఎవరూ అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు. ఇద్దరూ కాలనీ సమీపంలోని తెలుగు గంగ మూడో బ్రాంచి కాలువ వద్దకు ఆడుకొనేందుకు వెళ్లారు. కొంతసేపటికి ప్రమాదవశాత్తు అన్నదమ్ములు కాలువలో పడి మృతిచెందారు. అటుగా పొలాల్లోకి వెళ్తున్న ఓ మహిళ కాలువలో పిల్లల మృతదేహాలు తేలుతుండటం గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి ఇంటికి తీసుకొచ్చారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు : చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కడుపుకోతతో తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిం చారు. వెంకటరమణమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మూగ, చెముడు ఉన్నప్పటికీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆమె బాధ స్థానికుల చేత కన్నీరు పెట్టించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ : ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతిచెందారనే విషయాన్ని తెలుసుకొన్న వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఏఎస్సై నారాయణ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా బాధిత తల్లిదండ్రులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను అప్పగించేందుకు ఇష్టపడలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆగని ఆడశిశు హత్యలు
ఇద్దరు ఆడ కవలలు పుట్టారని ఒక పాపను గొంతు కోసి చంపిన విషయం నెల్లికుదురు మండలం వావిలాల శివారు మద్దు తండాలోబుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన వాంకుడొతూ బాలాజీ, సరితలకు ముగ్గురు సంతానం. మొదటి సంతానంగా బాబు పుట్టగా, రెండో సంతానంగా కవల ఆడ పిల్లలు పుట్టారు. దీంతో ఆవేదన చెందిన తండ్రి ఒక పాపను గొంతు కోసి చంపి పూడ్చిపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సరితను విచారించారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండో రౌండ్లో సాకేత్
* సోమ్దేవ్, బాలాజీ కూడా * చెన్నై ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ చెన్నై: భారత్లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని, సోమ్దేవ్ దేవ్వర్మన్, శ్రీరామ్ బాలాజీలు క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో హైదరాబాద్కు చెందిన సాకేత్ మైనేని భారత్కే చెందిన సనమ్ సింగ్పై 6-2, 6-4తో విజయం సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ ఎనిమిది ఏస్లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్ను ఒకసారి కోల్పోయాడు. ఇతర మ్యాచ్ల్లో సోమ్దేవ్ 6-2, 6-3తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)పై, శ్రీరామ్ బాలాజీ 6-2, 6-4తో హాన్స్ కాస్టిలో (చిలీ)పై నెగ్గారు. మరోవైపు శనివారం మెయిన్ ‘డ్రా’ను విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. భారత ప్లేయర్ రామ్కుమార్ తొలి రౌండ్లో డానియల్ గిమెనో (స్పెయిన్)తో ఆడతాడు. ప్రధాన టోర్నీ సోమవారం మొదలవుతుంది. -
ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలి
స్వర్ణముఖి నదిలోమునిగిన విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలయ్యాడు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖి నదిలో 20 అడుగులకు పైగా ఇసుకను తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీరు ప్రవహించింది. సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు వైష్ణవి నగర్కు చెందిన బాలుడు ఈత కోసమని వెళ్లి గుంతలో మునిగిపోయాడు. తిరుచానూరు : తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం గ్రామం వినాయకనగర్కు చెందిన ఆర్ముగం, గుణవతీలకు ముగ్గురు సంతానం. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు బాలాజీ(13) తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటర్వెల్ ఇవ్వడంతో మరో 8 మంది విద్యార్థులతో కలిసి ఈత కొట్టేందుకు స్వర్ణముఖి నదికి వెళ్లాడు. నది మధ్యలో పెద్ద గుంత ఉండడంతో మునిగిపోయాడు. విద్యార్థులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం కోసం గాలింపు గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రూరల్ తహశీల్దార్ యుగంధర్, ఎంపీడీవో రవికుమార్నాయుడు, డీఎస్పీ రవిశంకర్రెడ్డి, పంచాయతీ ఈవో ఎం.జనార్థన్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శంకర్ప్రసాద్ తన బృందంతో కలిసి అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహం కోసం గాలించారు. మృతదేహం లభ్యంకాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మిన్నంటిన రోదనలు విద్యార్థి మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బాలాజీ తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకైన బాలాజీ బాగా చదువుకుని పెద్దవాడై కష్టాల నుంచి కడతేరుస్తాడని నమ్ముకున్న ఆ కుటుంబానికి నదిలో కడతేరి విషాదం మిగిల్చాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుండడంతో కొందరు అక్రమార్కులు స్వర్ణముఖి నది నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలు గుంతల్లో ఈతకొట్టేందుకు వెళ్లి మృతిచెందుతున్నారు. -
దేశం కోసం గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నాడు..
మంచి చదువు, ఉద్యోగాల కోసం ఫారెన్ కంట్రీస్ కు వెళ్ళి.. అక్కడే గ్రీన్ కార్డును సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళ గురించి విన్నాం... కొన్నాళ్ళ తర్వాత సంపాదించిన దానికి సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి.. దేశంలోని పేదలకు, అనాధలకు చేయూతనందించేవారినీ చూస్తుంటాం.... ఏకంగా మాతృభూమి కోసం తన స్టేటస్ ను, పౌరసత్వాన్ని వదులుకొని ఇండియాకు వచ్చేశాడో ఎన్నారై. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు కావలసిన విద్యను కూడా అభ్యసించి... మానవత్వాన్ని చాటుతూ భారతదేశాన్ని విపత్తు స్థితి స్థాపకంగా చేయడమే ధ్యేయంగా తనవంతు సాయం అందించేందుకు నడుం బిగించాడు. అమెరికాలోని ఇంటర్నేషనల్ హోటల్ చైన్ జనరల్ మేనేజర్ గా పూర్తిస్థాయి వృత్తిని, పౌరసత్వాన్ని వదిలి ఇండియాకు వచ్చేసిన హరి బాలాజీ.. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్ ఉదంతం సమయంలో జూరిచ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోకి రెండు జెట్ లైనర్స్ దూసుకెళ్ళిన ఘటనలో దాదాపు మూడు వేలమంది మృతి చెందగా... ఆమెరికా నడిబొడ్డున టెర్రరిస్టుల దాడితో అల్లకల్లోలం అలుముకుంది. అదేరోజు జురిచ్ నుంచి అట్లాంటా బయల్దేరిన హరి ప్రయాణిస్తున్నవిమానం ఉన్నట్టుండి దారి మళ్ళించారు. ప్రయాణీకులెవరికీ ఏం జరిగిందో తెలియలేదు. చివరికి జురిచ్ లోని హోటల్ రూమ్ కు చేరిన హరికి... వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ గురించి తెలిసింది. మానవ నిర్మిత విపత్తుపై స్వానుభవమైంది. ఆతర్వాత న్యూయార్క్ మేయర్ గిలియానీ గెట్ మోటివేటెడ్ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు హరిని ప్రేరేపించాయి. దీంతో విపత్తు సంసిద్ధత గురించి వాస్తవాలను అధ్యయనం చేసేందుకు హరి ఆకర్షితుడయ్యారు. ఇండియాలోని చెన్నైకి చెందిన హరి బాలాజీ... స్విజ్జర్లాండ్ లోని స్విస్ హోటల్ మేనేజ్ మెంట్ లో చదివి, భారత్, స్విజ్జర్లాండ్, కువైట్ సంయుక్త ప్రముఖ బ్రాండ్లకు అనేక నిర్వహణ హోదాల్లో పనిచేశాడు. లూసియానాలో ఉన్నప్పుడు సహజ విపత్తు అయిన హరికేన్ ను కళ్ళారా చూసి, తీవ్రంగా స్పందించాడు. ఇలా సునామీ వంటి పలు ప్రకృతి బీభత్సాలను చూసిన హరి... డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై స్వంత దేశంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యుల మద్దతుతో గ్రీన్ కార్డ్ రద్దు చేసుకున్నాడు. భారతదేశానికి పూర్తిగా తరలివచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత హరి ఆరోగ్య సంప్రదాయ విద్యను చెన్నై శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. హాస్పిటల్ అండ్ హెల్త్ సిస్టమ్స్ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ చేశాడు. కోర్సులో భాగంగా చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో విపత్తుల అంచనాపై అధ్యయనం చేశాడు. చెన్నై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో ఓ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా పనిచేశాడు. పలు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్వహిస్తూ విపత్తు నిర్వహణలో స్వతంత్ర కార్ఖానాలు నిర్వహించడం ప్రారంభించాడు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సమయాల్లో వ్యూహాలపై తాను నిర్వహిస్తున్న కార్ఖానాల్లో దృష్టి పెట్టారు. భౌతిక నష్టాన్నే కాక, మానసికంగా కూడ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కావలసిన శిక్షణ ఇవ్వడంపై అవగాహన కల్పించాడు. ఒక్క విపత్తులపైనే కాక హరి బాలాజీ... మానవత్వాన్ని చాటుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణాకు గురౌతున్న మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం, వివక్షను నిర్మూలించే ప్రయత్నాలతో పాటు... విపత్తు సమాయాల్లో ఎదుర్కొనే పలు సమస్యలపై దృష్టి సారిస్తూ... అడుగు ముందుకేస్తున్నాడు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఇన్సెంటివిటి తరగతులను కూడ నిర్వహిస్తున్నారు. విపత్తు నిర్వహణలో ప్రపంచంలోనే భారత్ ముందుండేందుకు కృషి చేస్తూ... ప్రత్యేక కార్యక్రమాలతో ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు. -
ప్రతి రాష్ట్రంలో ఆలయం నిర్మిస్తాం
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బాలాజీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలయం కోసం స్థలాన్ని కేటాయించింది.. నిర్మాణానికి సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మీడియాకు తెలిపారు. డిజైన్లు, ఆలయ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని.. అతి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఇప్పటికే హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మితమైతున్న బాలాజీ ఆలయం మరో ఆరునెల్లో సిద్దమైతుందని తెలిపారు. టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు టీటీడీ లేఖ రాసినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి మహరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నైల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవం మరో వైపు ఈనెల 31 నుంచి నవంబర్ 8 వరకూ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం' నిర్వహించనున్నారు. ఢిల్లీ లో తొలి సారి వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. -
నేనిక్కడివాడినే..
రాజమండ్రి : ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్.. అంటూ సినీరంగంలో అవకాశాలకోసం వేచి చూసేవారు ఎందరో ఉంటారు. అదే తరహాలో ఒక్క అవకాశం కోసం చెన్నై వెళ్లి.. అది దక్కిన తర్వాత వెనుతిరిగి చూడని నటుడు బాలాజీ. ప్రతినాయకుడిగా, హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రతిభ నిరూపించుకున్న నటుడు ఆయన. మన జిల్లాకే చెందిన బాలాజీ ఓ సినిమా నిర్మాణం కోసం మంగళవారం రాయవరం వచ్చారు. ఈ సందర్భంగా తన సినీ జీవిత విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నేను ఈ జిల్లావాసినే. మండపేట మండలం ఇప్పనపాడులో పుట్టి పెరిగాను. ప్రాథమిక విద్య ఇప్పనపాడు, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ తాపేశ్వరంలో, పదో తరగతి నుంచి ఇంటర్ వరకూ అనకాపల్లిలో, డిగ్రీ నెల్లూరులో చదివాను. అనంతరం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఓ ఆడది.. ఓ మగాడు’ సినిమాలో ప్రతినాయకుడి అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలోనే ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’లో హీరోగా చేశాను. ఇప్పటివరకూ తెలుగు, తమిళ భాషల్లో 100 సినిమాల్లో నటించాను. లంచావతారం, మగమహారాజు, మంగమ్మగారి మనవడు, ప్రతిధ్వని, కథానాయకుడు, అగ్నిపుత్రుడు, ధృవనక్షత్రం, కృష్ణగారడీ తదితర చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం ‘నాంది’ సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం టీవీ రంగంలో బాగా బిజీ అయ్యాను. బుల్లితెరకు బాలాజీ ఎంటర్ప్రైజస్ బ్యానర్పై సొంతంగా పలు సీరియల్స్ నిర్మించాను. నా బ్యానర్పై ఎండమావులు, కైలాసంలో కంప్యూటర్, వినాయక విజయం తదితర సీరియల్స్, టెలిఫిల్మ్స్ చేశాను. అంతరంగాలు, పవిత్రబంధం, ఎండమావులు, ఇది కథ కాదు, రాజుగారి కూతుళ్లు, సుఖదుఃఖాలు తదితర 40 సీరియల్స్లో నటించాను. తెలుగు, తమిళంలో ‘రుద్రుడు’ నిర్మించాను. సాయి సంతోష్ ఆర్ట్ ప్రొడక్షన్స్పై ‘సోల్జియర్’ అనే సినిమాను విజయనిర్మలగారి దర్శకత్వంలో నిర్మించాను. సినిమాలతో పాటు పలు సీరియల్స్ కూడా నిర్మించాను. వీటితోపాటు ఒక టీవీ చానల్కు సీఈవోగా, ‘వజ్రం’ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్గా పని చేస్తున్నాను. నా భార్య కృష్ణవేణి గృహిణి. కుమారుడు రోహన్ హీరోగా రాబోతున్నాడు. ‘అవంతిక’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఊపిరున్నంత వరకూ నటుడిగా కొనసాగాలన్నదే నా జీవితాశయం. మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడాలనుంది. -
శ్రీవారికి హనుమంత సేవ
తిరుమలలో సోమవారం ఉదయం హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితుడైన శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన దివ్య రూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. -
విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ (ఎఫ్-10) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో నగరానికి చెందిన విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. షామీర్పేట్లోని లియోనియా రిసార్ట్స్లో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు-శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడి 6-4, 6-2 స్కోరుతో ఎస్కాఫీర్ ఆంటోన్-గ్రెనీర్ హ్యుగో (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో విష్ణు 7-6(7), 5-7, 6-4 తేడాతో భారత్కే చెందిన జీవన్ నెడుంజెళియన్ను ఓడిం చాడు. మరో వైపు ఫ్రాన్స్ ప్లేయర్ ఎస్కాఫీర్ ఆంటోన్ ఫైనల్కు చేరుకున్నాడు. సెమీస్లో అతను 6-4, 6-2, 6-3తో భారత ఆటగాడు బాలాజీ శ్రీరామ్పై గెలుపొందాడు. -
చేనత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం (అనంతపురం): అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బాలాజీ (35) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం వెలుగు చూసింది. బంధువుల కథనం మేరకు.. స్థానిక శివానగర్కు చెందిన బాలాజీ రెండు మగ్గాలను నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. పెరిగిన ముడిపట్టు ధరల కారణంగా మూడేళ్లుగా మగ్గాల నిర్వహణలో నష్టాలు రావడంతో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. రుణదాతల ఒత్తిళ్లు అధికమవడంతో ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్థానిక కేశవనగర్లోని తన పాత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. బాలాజీకి భార్య హారిక, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
యువకుడి దారుణ హత్య
నందలూరు (వైఎస్సార్ జిల్లా): ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పీలేరు నదిలో పూడ్చారు. ఈ విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా నందలూరు మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని ఆడాపూర్కు చెందిన బాలాజీ (26) మూడు రోజులుగా కనిపించడం లేదు. బాలాజీ ఆచూకీ తెలుసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పీలేరు నదిలో బాలాజీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 'రెండ్రోజుల క్రితమే హత్య చేసి నదిలో పూడ్చారు. అయితే దుండగులు మృతదేహాన్ని సరిగా ఖననం చేయకపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టాం' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కిడ్నాపైన బాలుడి మృతి
-
కిడ్నాపైన బాలుడి మృతి
మాచవరం(గుంటూరు జిల్లా): రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలాజీ (8) మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. మాచవరం మండలంలోని మల్లవోలు గ్రామానికి చెందిన తిరుమలరావు ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బాబుకూని కృష్ణ మనవడు బాలాజీ (8)ని తిరుమలరావు శనివారం కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలుడి తాతకు ఫొన్ చేసి రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలుడి తాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు తిరుమలరావును ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం పూస గుచ్చాడు. బాలుడిని తన ఇంటిలోనే నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టిపడేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త పుస్తకాలు
సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీవితం- కవిత్వం రచన: వాహెద్ పేజీలు: 212; వెల: 100 ప్రచురణ: కవిసంగమం బుక్స్ ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు; రచయిత ఫోన్: 7396103556 ఇన్సైడ్ ద ప్రిజన్ (షార్ట్ స్టోరీస్) తెలుగు మూలం: వట్టికోట ఆళ్వారుస్వామి ఇంగ్లిష్: ఎలనాగ పేజీలు: 66; వెల: 100 ప్రతులకు: డా.గంటా జలంధర్ రెడ్డి, 1-4-19/8, ప్లాట్ 11, స్ట్రీట్ 7, హబ్సిగూడ, హైదరాబాద్-7; ఫోన్: 9848292715 తెలంగాణ రైతాంగ పోరాట భూమిక చాకలి ఐలమ్మ రచన: ఎలికట్టె శంకర్రావు పేజీలు: 72; వెల: 50 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలతోపాటు, ఎన్.ఎస్.అరుణ, నోముల సాహిత్య సమితి, సాయి టవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ, తెలంగాణ; ఫోన్: 7799114349 రెల్లు (కథలు) రచన: బి.పి.కరుణాకర్ పేజీలు: 128; వెల: 80 ప్రతులకు: బి.కె.ప్రసాద్, డి-304, అనురాధ సదన్, అడిక్మెట్, హైదరాబాద్-44; ఫోన్: 9290828575 గంధ యాజ్ఞవల్క్యశర్మ కథలు పేజీలు: 230; వెల: 175 ప్రతులకు: స్ఫూర్తి పబ్లిషింగ్ హౌస్, 2/2, బ్రాడీపేట, గుంటూరు; ఫోన్: 9246830320 ఏం లేదు! (కథలు) రచన: నాయుని కృష్ణమూర్తి పేజీలు: 160; వెల: 100 ప్రతులకు: వి ఎన్ ఆర్ బుక్ వరల్డ్, చౌడేపల్లె, చిత్తూరు జిల్లా-517257 ఫోన్: 08581-256234 చిగురించే మనుషులు (కథలు) రచన: పలమనేరు బాలాజీ పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: కె.ఎన్.జయమ్మ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010 -
రెండోరోజు జడ్పీ వద్ద ఉత్కంఠే
ఒంగోలు: జిల్లా పరిషత్లో నెలకొన్న ఉత్కంఠ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు ఉదయం 10 గంటలకే ఈదర హరిబాబు చేరుకున్నారు. గురువారం ఎదురైన అనుభవమే శుక్రవారం కూడా సాక్షాత్కరించింది. అయితే తొలిరోజు కనీసం కుర్చీ కూడా లేకుండా మెట్లమీదనే కూర్చోగా, శుక్రవారం జెడ్పీ సిబ్బంది మాత్రం ఒక బల్ల, కుర్చీ ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్ ఛాంబర్తోపాటు సీఈవో గదికి కూడా తాళాలు వేసి ఉండడంతో ఈదర హరిబాబు తన నిరసనను రెండో రోజు కూడా మెట్లమీదనే నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన సమయం వరకు కూడా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. దీనిపై ఈదర హరిబాబు మాట్లాడుతూ తాను కోర్టు ఉత్తర్వులను ఇచ్చినపుడే తాను జెడ్పీ చైర్మన్ కాదని సీఈవో స్పష్టం చేసి ఉంటే తాను జెడ్పీ కార్యాలయం వద్దకు కూడా వచ్చి ఉండేవాడిని కాదన్నారు. కానీ ఆ సమయంలో తనకు చెప్పకపోగా రెండుసార్లు తన అనుమతితో శెలవు తీసుకున్నారని, అందువల్ల తాను జిల్లా పరిషత్ చైర్మన్గా గుర్తించినట్లే అన్నారు. కానీ నేడు న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవించకపోగా, తాను జెడ్పీ చైర్మన్గా ఉన్న జెడ్పీలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తట్టుకోలేకే తాను మెట్లమీదనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నానన్నారు. తనను రాజకీయంగా హత్య చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనకు కలెక్టర్ భవనం నుంచి వచ్చిన ఉత్తర్వులతోటే గ్రహణం పట్టిందని, అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తనకు గ్రహణం వీడిందన్నారు. కానీ సూర్యగ్రహణం వీడినా ఇంకా చంద్రగ్రహణం వీడలేదంటూ ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ, అధికారులు సహకరించి తనకు అవకాశం కల్పించి తనకు పరిపాలన చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు నూకసాని బాలాజీతోపాటు పోలీసులు కూడా జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకొని చైర్మన్ ఛాంబర్కు ఈదర హరిబాబు వేసిన తాళం తీపిస్తారంటూ ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున జనం కూడా గుమికూడారు. -
'ఇంటిలిజంట్ ఇడియట్స్' స్టిల్స్
-
రేపట్నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు!
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్తను అందించింది. భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం అయ్యేందుకు ఆగస్టు 20 తేది నుంచి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ద్వారా ప్రారభించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఇంటర్నెట్తోపాటు రాష్ట్రంలో ఉన్న 9 శ్రీదర్శిని కౌంటర్స్లో టిక్కెట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తొలివిడతగా 5000 టిక్కెట్లను అడ్వాన్స్ రిజర్వేషన్ ద్వారా భక్తులకు కేటాయించనున్నట్టు టీటీడీ ఈవో తెలిపారు. 300 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో రేపటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు. రేపు టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆగస్టు 27 తేదిన దర్శనం చేసుకోవచ్చని ఈవో తెలిపారు. -
ఘాట్రోడ్డులో ప్రమాదం ఇద్దరి దుర్మరణం
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్, మరొక యువకుడు మృతి చెందారు. తిరుమల టూ టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం బాలాజీ(35), తిరుమలలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద వ్యాపారంచేసే కుమార్రెడ్డి(23) ఆదివారం తిరుపతిలో ఓ పార్టీకి హాజరయ్యారు. తిరిగి రాత్రి 8.30 గంటలకు ద్విచక్రవాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ద్విచక్రవాహనం రోడ్డుపక్కనే ఉన్న నీటితొట్టెను ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీటీసీ అంబులెన్స్, వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మద్యంమత్తులో వాహనాన్ని అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ బాలాజీకి వివాహమై ఓ పాప ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
ఇంటలిజెంట్ ఇడియట్స్ మూవీ స్టిల్స్ & పోస్టర్స్
-
వెంకన్నకు బాలాజీ నెయ్యి
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి అవసరమయ్యే నెయ్యిని తిరుపతిలోని బాలాజీ డెయిరీ నుంచి కొనుగోలు చేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకరించింది. ఆదివారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. అవి... శ్రీవారి ఆలయంలో నిత్యం 2.5 లక్షల లడ్డూలు, నిత్యాన్న ప్రసాదాల తయారీ కోసం రోజుకు 9 వేల కిలోలనెయ్యి వాడతారు. ఇందుకుగాను రెండు నెలలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి నుంచి రోజుకు ఓ ట్యాంకర్ (10 వేల కిలోలు) నెయ్యిని కిలో రూ. 273.95 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసమే అన్నట్టుగా రాజకీయ ఒత్తిళ్లతో నెయ్యి కాంట్రాక్టును బరేలీ డెయిరీకి అప్పగించారని టీటీడీపై విమర్శలొచ్చాయి. అంతేగాక నెయ్యి లో నాణ్యత లోపించిందని ఇటీవల 2 ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఈ క్రమంలో విమర్శలు ఎక్కువకావడంతో, సహకార వ్యవస్థలోని తిరుపతి బాలాజీ డెయిరీ నుంచి కూడా తిరుమలకు అవసరమయ్యే నెయ్యిలో నాలుగో వంతును కొనుగోలు చేస్తారు. అవసరాన్నిబట్టి కొనుగోలును పెంచుతారు. బరేలీ డెయిరీతో కుదుర్చుకున్న ఏడాది నెయ్యి కాంట్రాక్టు యథావిధిగా కొనసాగుతుంది. మరికొన్ని తీర్మానాలు.. తిరుమలలో పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు 1,520 వాహనాలకు సరిపోయే విధంగా రూ. 50 కోట్ల అంచనాతో రెండు భారీ మల్టిపుల్ పార్కింగ్ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. శ్రీవారికి ప్రతి శుక్రవారం వస్త్రాలంకార సేవ కోసం రూ. 50 వేలతో కొనుగోలు చేసే మేల్చాట్ వస్త్రాన్ని ఇకపై భక్తుల నుంచే విరాళంగా స్వీకరిస్తారు. రూ. 5.59 కోట్లతో 81 వేల కిలోల చక్కెర, రూ. 5 కోట్లతో 37వేల డబ్బాల సూర్యకాంతి నూనె, రూ. 2.20 కోట్లతో 22 లక్షల కొబ్బరికాయలు, రూ. 2.57 కోట్లతో 20 వేల కిలోల యాలకులు, సుమారు రూ. 3 కోట్లతో రూ. 2 కోట్ల లడ్డూ పాలీథిన్ సంచులు కొనుగోలు చేస్తారు. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వక్షస్థల లక్ష్మికి రూ. 64 లక్షల ఖర్చుతో నూతన బంగారు గొడుగులు అమర్చనున్నారు. తలనీలాలను భద్రపరిచేందుకు రూ.6 కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్ నిర్మిస్తారు. నల్గొండ జిల్లా మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ. 1.40 కోట్లతో యాత్రీసదన్ నిర్మించనున్నారు. రూ. 3 కోట్ల పైబడిన టెండర్ల షెడ్యూల్డ్లను జాతీయ స్థాయిలో మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి నియోజకవర్గంలోని కోటపల్లెలోని వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం రూ. 65 లక్షల గ్రాంటుకు ఆమోదించారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ తిరుమల, న్యూస్లైన్: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం సెలవుదినం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,346 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనంకోసం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న రూ.300 టికెట్ల వారికి 3 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు 7 కంపార్ట్మెంట్లలో ఉన్నా రు. వీరికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. -
శ్రీకృష్ణుని అవతారంలో ఆదిదేవుడు
-
స్వర్ణరధం పై ఊరేగిన శ్రీనివాసుడు
-
గరుడ సేవకు పోటెత్తిన భక్తులు
-
భారతి సిమెంట్స్ తరఫున బాలాజీని అనుమతించలేం: సీబీఐ కోర్టు
వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుల జాబితాలోనున్న భారతి సిమెంట్స్ (రఘురామ్స్) తరఫున ఆ కంపెనీ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ అధినేత హోదాలో వైఎస్ జగన్ను సీబీఐ నిందితునిగా చేర్చింది. అయితే ఇతర చార్జిషీట్లలో భారతి సిమెంట్స్ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ హాజరుకు ఇదే కోర్టు అనుమతించిందని, ఈ నేపథ్యంలో ఈ చార్జిషీట్లోనూ కోర్టు విచారణకు బాలాజీ హాజరుకు అనుమతించాలని భారతి సిమెంట్స్ న్యాయవాది విన్నవించారు. ఇందుకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. బాలాజీ తమ తరఫున సాక్షిగా ఉన్న నేపథ్యంలో భారతి సిమెంట్స్ ప్రతినిధిగా ఆయన హాజరుకు అనుమతించరాదని కోర్టును కోరింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు... భారతి సిమెంట్స్ తరఫున బాలాజీ హాజరుకు అనుమతించలేమని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.