తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
పాట్నా: తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. జేడయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో ఏర్పడిన కూటమి బీటలు పాయనిదని, శక్తిమంతమైనదని చెప్పారు. ఈ పార్టీలను కలుపుకొని ఎన్సీపీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. రెండు రోజుల పార్టీ జాతీయ మండలి సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.