-
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
18 ఏళ్ల కుర్రాడిగా కనిపించాలని..! ఎంత ఖర్చు చేస్తున్నాడంటే..
వయసుపై బడే కొద్దీ అందంగా, ఫిట్గా కనిపించేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు కొందరు. అయితే.. ఈ మార్గాల్లో కాకుండా విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్న వాళ్లనూ తరచూ చూస్తున్నాం. రివర్స్ ఏజింగ్.. అంటే వయసు వెనక్కి తీసుకెళ్లడం. అసలు అది సాధ్యమేనా? అనే విషయం పక్కనపెడితే.. వైద్యసాంకేతిక విధానాల ద్వారా సుసాధ్యం చేయొచ్చనే ప్రయోగాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా.. అలాంటి ప్రక్రియతో వార్తల్లోకి ఎక్కిన ఓ సాఫ్ట్వేర్ మిలియనీర్ ప్రయత్నం గురించి బ్లూమ్బర్గ్ కథనం ఆధారంగా. బ్రయాన్ జాన్సన్.. వయసు 45 ఏళ్లు. బయోటెక్ మేధావిగా ఈయనకంటూ యూఎస్లో ఓ పేరుంది. పైగా సంపాదనతో మిలియనీర్గా ఎదిగాడు. అయితే 18 ఏళ్ల టీనేజర్గా కనిపించేందుకు ఈయనగారు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేశారు. మన కరెన్సీలో అది 16,29,68,990 రూపాయలు. ఈ ట్రీట్మెంట్లో భాగంగా.. శరీర తత్వం 18 ఏళ్లుగా కనిపించాలని, గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉండేలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తి ఉండేలా కనిపించేందుకు చికిత్సలు తీసుకుంటున్నాడట. అంతేకాదు.. ప్రతీరోజూ 30 మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు అతని శరీర పనితీరును పర్యవేక్షిస్తున్నారట. ఈ రివర్స్ ఏజింగ్ ప్రక్రియ మొత్తం 29 ఏళ్ల ఫిజిషియన్ ఒలీవర్ జోల్మాన్ నేతృత్వంలో జరుగుతోంది. విశేషం ఏంటంటో.. జోల్మాన్తో పాటు జాన్సన్కు కూడా వృద్ధాప్యం, దీర్ఘాయువు లాంటి అంశాలపై ఆసక్తి ఎక్కువట. అందుకే.. గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను నేరుగా తనపైనే చేయించుకునేందుకు ముందుకు వచ్చాడతను. అందుకోసం కాలిఫోర్నియా వెనిస్లోని తన నివాసాన్నే ప్రయోగశాలగా మార్చేశాడతను. అధికారికంగా యాంటీ ఏజింగ్ కోసం అతను చేస్తున్న ఖర్చు(వ్యక్తిగతంగా) ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పింది కూడా. ఒకవైపు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు.. రెగ్యులర్గా చేయాల్సిన ఎక్స్ర్సైజులు, తీసుకోవాల్సిన ఆహారం.. ఇలాంటివన్నీ షరామాములుగా కాకుండా వైద్యుల సమక్షంలోనే ప్రత్యేకంగా చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా.. 2 మిలియన్ డాలర్ల డబ్బు ఖర్చు చేశాడతను. ఈ ఏడాదిలో బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీలు, పళ్లు, చర్మం, జుట్టు, మర్మాంగం.. ఇతర అవయవాలన్నింటిని 18 ఏళ్ల వ్యక్తిగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాడతను. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా పర్వాలేదని, ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయితే నవయవ్వనంగా కనిపించాలనుకుంటున్న మనిషి కోరిక నెరవేరేందుకు ఒక మార్గం దొరుకుతుందని అంటున్నాడు బ్రయాన్ జాన్సన్. -
బొప్పాయి, దానిమ్మ.. రోజూ తింటే కలిగే లాభాలు! ముఖంపై ముడతలు.. ఇంకా
వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేకమైన కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్ప్యాక్లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం... బొప్పాయి దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్ప్యాక్లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆకు కూరలు ఆకు కూరల్లో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, బాదం పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్ ప్యాక్గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. చదవండి: Carrot Juice: క్యారట్ జ్యూస్ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే.. -
Health Tips: టొమోటాలు, సోయా, బెర్రీలు.. ఇంకా.. ఇవి తినండి... వయసు తగ్గించుకోండి!
సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు. అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం.. పాలు స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్ను కూడా తగ్గిస్తుంది. టొమోటాలు స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాల సోయా పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ను తింటే బలంగా ఉంటారు. క్యాన్సర్ను అడ్డుకునే బెర్రీలు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా! -
ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బెజోస్ అంతరిక్షయాత్రపై నెటిజన్లు తీవ్ర విమర్శలను గుప్పించారు. అంతేకాకుండా కొంతమంది తమ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఖాతాలను వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. కాగా తాజాగా జెఫ్ బెజోస్ మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! మానవుడు ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేందుకు చేస్తోన్న ప్రయోగాలకు ఊతం ఇస్తూ ఆయా కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆల్టోస్ ల్యాబ్స్ యాంటీ ఏజింగ్పై పరిశోధనలను చేస్తోంది. ఈ కంపెనీ వెనుక జెఫ్బెజోస్ ఉన్నట్లు ఏమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. మానవ కణాలను రిప్రోగ్రామ్ చేయడం ద్వారా మానవుడుకి వృద్దాప్యం దరిచేరకుండా ఆల్టోస్ ల్యాబ్స్ పరీక్షలను చేస్తోంది. ఆల్టోస్ ల్యాబ్లో జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్ చేసిన కొద్దిరోజులకు కంపెనీ భారీ వేతనాలతో పలు శాస్త్రవేత్తలను నియమించుకున్నట్లు ఎమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. ఈ విషయంపై జెఫ్బెజోస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ స్పందించలేదు. యాంటీ ఏజింగ్ పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో యూనిటీ టెక్నాలజీస్ అనే బయోటెక్ సంస్థలో కూడా ఏర్పాటు చేయనుంది. ఎమ్ఐటీ టెక్ రివ్యూ ప్రకారం యాంటీ ఏజింగ్ పరిశోధనలో భాగంగా ఆల్టోస్ ల్యాబ్స్ కణాల రీప్రోగ్రామింగ్ టెక్నాలజీపై దృష్టిసారించింది. 2012లో నోబుల్ అవార్డును గెలిచిన షిన్యా యమనాకా ఆల్టోస్ ల్యాబ్స్కు సైంటిఫింక్ అడ్వైజరీ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..? -
అవును వారు బామ్మలే..కానీ!
లండన్ : జుట్టు ముగ్గుబుట్టవడం..ముడతలు పడిన చర్మం..ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే. 60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి 70లు దాటితేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది. బోల్డర్ అనే వెబ్సైట్ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది. కృష్ణ రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70 ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్సైట్ పలుకరించగా వారి చురుకైన లైఫ్స్టైల్ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది. వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్ చేస్తున్నారు. వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పనిచేస్తుండటం గమనార్హం. తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు. వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భర దశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్ధితి తమ పరిశోధనలో వెల్లడైనట్టు ఆ వెబ్సైట్ పేర్కొంది. 87 ఏళ్ల వయసులో టెన్నిస్.. తాను ఇప్పటికి 70 ఏళ్లు పైగా టెన్నిస్ ఆడుతున్నానని కెనడాలోని ఒంటారియాకు చెందిన ముఫీ గ్రీవ్ (87) వెల్లడించి ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్కు గురిచేశారు.తాను 30, 40, 50 ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని, జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఎదో రంగంలో విజయం సాధిస్తే తమకు లభించే ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని ఆమె చెప్పుకొచ్చారు. తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్ ట్యూమర్తో బాధపడినా సానుకూల దృక్పథంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు. సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్ మైండ్తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు. గోల్ప్లో 90 స్కోర్ చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు. ఏడు పదుల వయసులో స్విమ్మింగ్ ఎలరీ మెక్గొవన్ ఏడు పదుల వయసు దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్లో పలు వరల్డ్ ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. రష్యాలో వింటర్ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో తనకు గాయమైనా రేస్ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు. తాను ప్రతివారం పైలేట్స్, స్పిన్ క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్వైన్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పకొచ్చారు. గత ఏడాది తన కుమారుడు జేమ్స్ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు. అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్ అని చెప్పారు. పదహారు ఫ్లోర్లు: అవలీలగా ఎక్కేస్తారు రీటా గిల్మోర్ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్లోని 16 ఫ్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు. మద్యం ముట్టకుండా..పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్గా ఉండటానికి కారణమనే రీటా రోజూ మేకప్ వేసుకోవడమే కాదు స్ధానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్గా వ్యవహరిస్తున్నారు. -
ఆయుష్షును పెంచే సరికొత్త మాత్ర!
మానవ జీవితకాలాన్ని పొడిగించుకునే పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలలు మరో ముందడుగు వేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలోని అవయవాల పనితీరును తగ్గిస్తూ వచ్చే ప్రొటీన్ మాలిక్యూల్స్ జాడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జిఎస్కే -3 గా పిలవబడే ప్రొటీన్ మాలిక్యూల్ అవయవాల పనితీరు సామర్థ్యాన్ని తగ్గిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో జీఎస్కె 3ను నియంత్రించడం ద్వారా ఆయుష్షను పొడిగించుకోవచ్చని డాక్టర్ జార్జ్ ఇవాన్ క్యాస్టిల్లో-క్వాన్ నేతృత్వంలో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం మానవ ఆయుర్దాయాన్ని మరో 10 సంవత్సరాలు పెంచేలా ఓ చిన్న మాత్రను తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవయవాల పనితీరును నియంత్రిస్తున్న జీఎస్కె 3ని నివారిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని దీన్ని నేరుగా ప్రభావితం చేసే మాత్ర తయారీకి ఎంతో కాలం పట్టకపోవచ్చని జార్జ్ వ్యాఖ్యానించారు. తమ పరిశోధన ద్వారా అల్జీమర్స్ వ్యాధికి గురయ్యే వారి వయసును పొడిగించగలిగితే చాలా మంచి విషయమవుతుందన్నారు. 100 నుంచి 120 సంవ్సతరాల సుదీర్ఘ కాలం బతకాలని కాకుండా.. కనీసం బతికనన్నాళ్లు ఆరోగ్యవంతంగా జీవించడం అవసరమన్నారు. అన్ని యాంటీ ఏజింగ్ మందుల్లో లాగానే దీంట్లో కూడా లిథియం వాడుతున్నప్పటికీ, తక్కువ లిథియం మోతాదు, తక్కువ దుష్ఫలితాలతో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు తమ ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జీవితకాలం పొడిగింపు విషయంలో చాలా వివాదాలు ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవడం ముఖ్యమన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, మధుమేహం, పార్కిన్సన్, క్యాన్సర్ వంటి రోగాలను సైతం ఈ మాత్రతో దూరం చేయవచ్చని ఆయన తెలిపారు. 'జీఎస్కే-3ని కనుగొనడంతో మేమెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం. వయసుతో పాటే వచ్చే అన్ని రోగాల నుంచి ఇక విముక్తి లభించనుంది. మధ్య వయసులో ఈ మాత్రల ద్వారా చికిత్స తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అన్ని రకాల వ్యాధులు సమీప భవిష్యత్తులో నివారించవచ్చు' అని జార్జ్ పేర్కొన్నారు. లండన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ఫలిస్తే ఏడు నుంచి పది సంవత్సరాల జీవితం కాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. జర్నల్ సెల్ రిపోర్ట్స్ లో ప్రచురితమైన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ బయాలజీ, యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ లేబరేటరీ కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నట్టు తెలిపారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఉలిక్కిపడ్డ ఉద్యోగులు
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
Advertisement