anushka agarwal
-
పతాన్ కుమార్ బెయిల్ పై విడుదల
-
'నన్ను ఎవరో చాకచక్యంగా ఇరికించారు'
హైదరాబాద్ : సైనిక రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసిన కేసులో రిమాండ్లో ఉన్న సైనికోద్యోగి పటన్ కుమార్ పొద్దార్ (40) గురువారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆగస్టు 3న అతన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయడం, బుధవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన మిలటరీ అధికారి మేజర్ రంజిత్ సంతకం చేసిన కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరాయి. ఈ డాక్యుమెంట్లను ఈ-మెయిల్ ద్వారా ఈ ఏడాది జూన్ 7న అనుష్క అగర్వాల్కు పటన్ పంపినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలోతేలింది. అనుష్క, పటన్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు ఎవరి పేర్లపై తీసుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కీలక ర హస్యాలను పటన్, అనుష్కకు చేరవేసినట్టు గుర్తించారు. ప్రతిఫలంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా మంగళ్గిరి ఎస్బీఐ బ్రాంచ్లో ఉన్న అతని అకౌంట్కు దశలవారీగా అనుష్క అగర్వాల్ డబ్బులు పంపినట్లు తేలింది. ఆమె ఆదేశాల మేరకు పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన ఆసీఫ్ అలీ మాత్రమే పోలీసులకు చిక్కాడు. మిగతా చోట్ల నుంచి పటన్ అకౌంట్లోకి డబ్బులు వేసిన వారు ఇంకా చిక్కలేదు. నన్ను ఇరికించారు: పటన్ నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తున్న తనను ఎవరో చాకచక్యంగా ఈ కేసులో ఇరికించారని జైలు నుంచి విడుదలైన పటన్ కుమార్ పొద్దార్ 'సాక్షి' వద్ద వాపోయాడు. తన అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారో తెలియదన్నారు. తనతో వెబ్ కెమెరాలో మాట్లాడినదీ, ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసినదీ ఒకే యువతని చెప్పాడు. కాగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు మన సైన్యానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చేరినట్టు తెలిసింది. దీంతో పాటు 'స్వీట్స్' అనే పదానికి అర్థాన్నీ మన పోలీసులు కనుగొన్నారు. దేశ సైనిక రహస్యాలను పాక్కు చేరవేసిన కేసులో పట్టుబడిన పటన్ కుమార్ పొద్దార్, పాక్ ఐఎస్ఐ ఉగ్రవాది అనుష్క అగర్వాల్ల ఈ మెయిల్ సంభాషణలను పరిశీలించి... 'స్వీట్స్' అనే పదానికి మన పోలీసులు అర్థాన్ని తెలుసుకున్నారు. సైనిక రహస్యాలను పంపినందుకు పటన్ బ్యాంక్ అకౌంట్కు అనుష్క అగర్వాల్ జూలై 22న 2014 సంవత్సరంలో రూ.20వేలు పంపించింది. అదే రోజు రాత్రి 11.30 గంటలకు చాటింగ్లో మాట్లాడుతూ తాను 'స్వీట్స్ పంపించాను చేరాయా?' అని అనుష్క అడిగింది. అందుకు పటన్ సమాధానం చెబుతూ సరే చూస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు తన అకౌంట్లో డబ్బులు ఉండడంతో ఆ విషయాన్ని చాటింగ్లో ఆమెకు చేరవేశాడు. ఈ సంభాషణతో 'స్వీట్స్' అనే పదానికి అర్థం 'డబ్బులు' అని తేలింది. -
హ్యాకింగ్తో పాక్కు రహస్యాలు
ఐఎస్ఐ అధికారులకు సైన్యం గుట్టుమట్లు అనుష్కా ఐఎస్ఐ అధికారిణి అని గుర్తింపు ఇండియా సిమ్ కార్డు ద్వారానే సంభాషణలు పటన్ను విచారించిన ఆర్మీ అధికారులు హైదరాబాద్: పాక్కు సైనిక రహస్యాల చేరవేత ఉదంతంలో వురికొన్ని వివరాలు బయుటపడ్డారుు. బ్రౌజింగ్ హ్యాకింగ్తోనే మిలటరీ అధికారుల కంప్యూటర్ హార్డ్డిస్క్లలో ఉన్న రహస్యాలు పాక్కు చేరారుు. అనుష్కా అగర్వాల్గా పటన్కు పరిచయుమైన వుహిళ పాక్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చెందిన అధికారిణిని అని తేలింది. మన దేశ మిలటరీ అధికారులకు మహిళల పేరుతో ప్రేమిస్తున్నట్లు నటించి వలలో వేసుకునే కొత్త పద్దతికి ఐఎస్ఐ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఓ ఐఎస్ఐ మహిళా అధికారిణి పటన్కుమార్ పొద్దార్ను టార్గెట్ చేసింది. వీరి వుధ్య జరిగిన ఛాటింగే కొంప ముంచింది. కంప్యూటర్లో పటన్ ఈ-మెయిల్ తెరవగానే అనుష్కా బ్రౌజింగ్ హ్యాకింగ్ ద్వారా ఈ కంప్యూటర్ హార్డ్ డెస్క్లో ఉన్న మిలటరీకి చెందిన రహస్య పత్రాలను ఇతర కీలక వివరాలను తస్కరించింది. ఇండియాకు చెందిన సిమ్కార్డులనే ఉపయోగించిన అనుష్కా పాక్, భారత్ సరిహద్దులోకి వచ్చి మాట్లాడేదని తేలింది. భారత ఆర్మీ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా పాక్ రాబట్టుకోవడాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుష్కా ఉదంతంతో అప్రమత్తమైన రక్షణ శాఖ మిలటరీ అధికారుల కంప్యూటర్లకు లాక్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సెంటర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. చంచల్గూడ జైలులో ఉన్న పటన్ను ఆర్మీ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగింది. ఆర్మీ బ్రిగేడియర్ సిద్దన్న బృందం పటన్ను నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. పటన్ ఏఏ అధికారి కార్యాలయాల కంప్యూటర్లను ఉపయోగించాడనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. -
అనుష్కతో ఫోన్లోనే పరిచయం
పాకిస్థాన్ నుంచి ఆమె పంపిన డబ్బులనే పటన్ అకౌంట్లో వేశా పటన్ వివరాలిచ్చింది అనుష్కనే రెండోరోజు విచారణలో ఆసిఫ్అలీ హైదరాబాద్ : ‘పాకిస్థాన్ ఏజెంట్ అనుష్క అగర్వాల్తో నాకు నేరుగా పరిచయం లేదు.. కేవలం ఫోన్లోనే ఆమె నాతో మాట్లాడేది..’ అని ఆర్మీ రహ స్యాల బహిర్గతం కుట్ర కేసులో నిందితుడైన ఆసిఫ్అలీ నగర నేర పరిశోధక విభాగం అధికారుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్ అనుష్కకు వెల్లడించిన సికింద్రాబాద్ ఆర్మీ సుబేదార్ పటన్కుమార్ పొద్దార్ కేసులో మరో నిందితుడైన ఆసిఫ్అలీని చంచల్గూడ జైలులో సీసీఎస్ దర్యాప్తు అధికారుల బృందం ఏసీపీ జోగయ్య నేతృత్వంలో మంగళవారం రెండోరోజు విచారించింది. మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్న అలీని సీసీఎస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు అతన్ని జైల్లోనే విచారించడానికి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో సోమ, మంగళవారాల్లో దర్యాప్తు అధికారులు ఆయన్ను చంచల్గూడ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో విచారించారు. కాగా, ఈ విచారణ కోసం వారు ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నా రు. ఇంతకుముందు విచారించిన పటన్కుమార్ నుంచి రాబట్టిన కొన్ని అంశాల్ని క్రోడీకరించిన అధికారులు అలీని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటూ, మరికొన్నిసార్లు కాదు.. అని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. పటన్తో ఫోన్లో, మెయిల్లో చాటింగ్ చేసిన అనుష్క వివరాలను అలీ నుంచి రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. పటన్ వివరాలు, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని కూడా ఆమే ఇచ్చినట్లు విచారణలో అలీ వెల్లడించినట్లు సమాచారం. ఆమె సూచనల మేరకే తాను పటన్ అకౌంట్లో రూ.70 వేలు వేసినట్లు అలీ తెలిపాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. చేసిన పనికి ప్రతిఫలంగా తనకూ డబ్బులు అందాయని చెప్పిన అలీ.. ఆ డబ్బులు ఎంత అనేది ఒక్కోసారి ఒక్కోరీతిగా చెప్పినట్లు సమాచారం. విచారణ మరో రెండురోజులు ఇదిలా ఉండగా ఆసిఫ్అలీ ఆనారోగ్యం కారణంగా అతన్ని విచారించడానికి తమకిచ్చిన గడువు సరిపోలేదని, మరో రెండురోజులు పొడిగించాలని సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టును మంగళవారం కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి మరో రెండురోజులు (బుధ, గురువారం) విచారణ గడువును పొడిగించారు. దీంతో ఈ రెండురోజులు మరింత పకడ్బందీగా అలీని ప్రశ్నించడానికి సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పాక్ ఏజెంట్గా పేర్కొంటున్న అనుష్క అగర్వాల్ ఎవరు.. ఆమె అసలు పేరేమిటి?, ఆమె వలలో ఆసిఫ్అలీ పడటానికి కారణమేమిటి.. ఇంకా ఇందులో ఎవరెవరికి సంబంధాలున్నాయి? కేవలం డబ్బుల కోసమే అలీ ఈ పనికి ఒప్పుకున్నాడా.. మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణాల నుంచి సీసీఎస్ దర్యాప్తు ముందుకు సాగనుందని తెలిసింది. కాగా, పీటీ వారెంట్పై మీరట్ నుంచి తీసుకొచ్చిన అలీని 18వ తే దీ రాత్రి సీసీఎస్ అధికారులు మళ్లీ అక్కడికే తరలించనున్నారు. ఇదిలావుండగా, ఆర్మీ అధికారులు రెండురోజులపాటు పటన్ను విచారించేందుకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు చంచల్గూడ జైల్లో ఎప్పుడైనా.. ఏరోజైనా అక్కడి సూపరింటెండెంట్ అనుమతిలో పటన్ను విచారించుకోవచ్చని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశించింది. -
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని ...సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్పై అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ యూనిట్లో ఆసిఫ్ అలీ ఆర్మీ జవాన్. కాగా పతన్ కుమార్ పోద్దార్ను అనుష్క అగర్వాల్ మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది ఆసిఫ్ అలీయేనని పోలీసుల విచారణలో తేలిన విషయం విదితమే. పోద్దార్తో ఫోన్లో మాట్లాడే మహిళ ఆసిఫ్అలీ భార్య అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆసిఫ్ అలీ భార్య పాకిస్తాన్కు చెందిన మహిళగా విచారణలో తేలింది. దాంతో అసిఫ్ అలీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అనుష్క కాదు అలీ!
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో అనుష్క అనే మహిళే లేదని సైనికాధికారుల విచారణలో తేలింది. పటన్ కుమార్ను మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది అసిఫ్ అలీ అనే మరో సైనికుడేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మీరట్ సైనిక విభాగంలో పని చేస్తున్న అలీని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. అలీ భార్య పాకిస్థాన్కు చెందిన వ్యక్తి. ఆమె ద్వారా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అలీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క అనే పేరుతో సికింద్రాబాద్లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన పటన్కుమార్ పొద్దార్ నాయక్ను పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు అతని బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తూ ఉండేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వీరి మధ్య ఫేస్బుక్ సంభాషణే ఎక్కువగా జరిగేది. ఒక్కసారి మాత్రం ఫోన్లో మాట్లాడారు. అయితే అప్పుడు అలీనే ఓ మహిళతో మాట్లాడించాడు. ఆ మహిళ అలీ భార్యగా భావిస్తున్నారు. అలీ భార్య పాకిస్తాన్కు చెందిన మహిళ. అలీనే మహిళగా చెప్పి, తరచూ డబ్బు ఇస్తూ పటన్కుమార్ నుంచి దేశ మిలటరీకి సంబంధించిన కీలకమైన రహస్యాలను తెలుసుకున్నాడు. ఏడాది కాలంగా పటన్ 104 పేజీల రహస్యాలను పంపినట్లు విచారణలో తేలింది. అయితే అలీకి సంబంధించి, అతని భార్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మిలటరీ, పోలీసు అధికారులు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. -
అనుష్క అనుచరుడు అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి అనుష్క అగర్వాల్ అనుచరుడు అసిఫ్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ మోజులోపడి పటన్ మిలటరీ రహస్య పత్రాలు ఆమెకు పంపిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదుపులోకి తీసుకున్న అసిఫ్ అలీని పీటీ వారెంట్పై 15 రోజుల కస్టడీకి సీసీఎస్ డీసీపీ కోరారు. దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న విషయాలను పటన్ అనుష్కకు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అతను పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. -
ఐఎస్ఐ చేతికి ఆర్మీ మిస్సైల్స్ డేటా
* పటన్ అరెస్టుతో వెలుగుచూస్తున్న వాస్తవాలు * మిలటరీకి చెందిన ఫొటోలు, డాక్యుమెంట్లు అందజేత * మహిళా ఉగ్రవాది నుంచి పటన్ అకౌంట్కు రూ. 74 వేలు * ఉన్నతాధికారి కంప్యూటర్ నుంచి రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలు పాక్ ఉగ్రవాదులకు చేరవేసిన సైనిక అధికారి పటన్కుమార్ అరెస్టుతో దిమ్మతిరిగే విషయాలు గురువారం వెలుగు చూశాయి. పటన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వేసిన పిటిషన్పై నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ముద్దాయి తరఫున న్యాయవాది లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేజిస్ట్రేట్ వెల్లడించారు. ముద్దాయి వాదన వినకుండా కస్టడీకి ఇవ్వలేమని, అతనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. దీంతో పోలీసులు చంచల్గూడ జైలులో ఉన్న పటన్కు కస్టడీ పిటిషన్ విషయంపై వివరించారు. ఇలావుండగా పటన్ నుంచి 4 కంప్యూటర్లు, ల్యాప్టాప్, బ్లూటూత్, 3 సెల్ఫోన్లు, నాలుగు పెన్డ్రైవ్లు, 10 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్డిస్క్ను డీకోడ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ అధికారులు శ్రమిస్తున్నారు. డీకోడ్ అయితే పటన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్కు వెల్లడించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. పటన్కుమార్ను సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖకు ఆర్మీ అధికారులు సమాచారాన్ని అందజేసినట్లు తెలిసింది. పటన్కుమార్ వ్యవహార శైలిపై బీహార్, పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పని చేసిన విభాగాల్లో అతని ప్రవర్తన, తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. అనుష్క అగర్వాల్ పేరిట చాటింగ్ చేసిన ఆ యువతి అసలుపేరు ఏమిటనేది తేలాల్సి ఉంది. పంపిన రహస్యాలు ఇవే ఆర్మీ మిస్సైల్స్ నిల్వ కర్మాగారాల వివరాలతో పాటు కీలక విభాగాల్లో ఉన్న 40 మంది ఆర్మీ అధికారుల వివరాలను పటన్ పంపినట్లు తెలుస్తోంది. ఆర్మీ డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా పంపించాడు. దేశంలో ఉన్న 12 ఆర్మీ యూనిట్ల బ్రిగేడ్ల పేర్లు, ఆ ప్రదేశాల వివరాలు, పశ్చిమ సరిహద్దులోని ఆర్మీ సమాచారాన్ని ఫోన్లో అనుష్కకు చెప్పాడు. సైన్యం కదలికలు, ఎత్తుగడలు, కీలక స్థావరాలను ఆమెకు వెల్లడించాడు. జీ మెయిల్ ఐడీ ‘ప్రియాన్షూ1995’తో ఈ మెయిల్ సృష్టించిన పటన్ దాని ఐడీని అనుష్కకు చేరవేశాడు. పలు వివరాలను ఈ మెయిల్కు పంపగానే ఆమె వాటిని డౌన్లోడ్ చేసుకుంది. కాగా పాక్ మహిళా ఉగ్రవాదికి పలు రహస్యాల చేరవేతపై ఆర్మీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారికి చెందిన కంప్యూటర్ను పటన్ ఉపయోగించాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆ అధికారి కంప్యూటర్ కోడ్ పటన్కు తెలియడంతో ఆ వివరాలను అనుష్కకు పంపినట్లు తెలిసింది. రహస్యాలకు పారితోషికం ఇక్కడి సమాచారాలు అనుష్కకు అందించినందుకు గాను మొదటిసారిగా 2013 మేలో బీహార్లోని ఎస్బీఐలో ఉన్న పటన్ బ్యాంక్ అకౌంట్లోకి పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ఎస్బీఐ (మంగల్వాడి బ్రాంచి) నుంచి రూ.9,000ను అనుష్క పంపించింది. ఇలా ఏడాది కాలంలో రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.20 వేల చొప్పున రూ.74 వేలు వేసింది. తాను అడిగిన రహస్యాలు పంపితే హైదరాబాద్కు వచ్చి స్వయంగా కలుస్తానని, లండన్కు కూడా పంపిస్తానని చెప్పింది. తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసాడని పటన్ను నమ్మించింది. పటన్ చిక్కాడిలా పటన్ సెల్కు ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది చేసిన సెల్ నంబర్ టవర్ లొకేషన్ను పోలీసులు గుర్తించారు. ఆమె వాడిన సెల్ఫోన్ ప్రదేశం పాక్ సరిహద్దుల్లోదని తేలింది. దీంతో ఆమె పాకిస్థాన్ నుంచే ఆర్మీ రహస్యాలను రాబట్టిందని విచారణలో తేలింది. పాక్ సరిహద్దుల్లో సెల్ఫోన్లను ఐబీ అధికారులు ట్రాప్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయని గ్రహించారు. ఐబీ అధికారులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో పటన్ గుట్టు రట్టయ్యింది. 15 రోజులు టాస్క్ఫోర్స్ పోలీసులు శ్రమించి పటన్ను పట్టుకోగలిగారు. పటన్ నేపథ్యమిదీ బీహార్ రాష్ట్రానికి చెందిన పటన్కుమార్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇతని కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థిరపడింది. 1996లో క్లర్క్గా ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో నిర్వహించాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. 2006 నుంచి 2012 వరకు జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని ఆర్మీ సెంటర్లో పనిచేశాడు. 2012లో సికింద్రాబాద్కు బదిలీ అయ్యాడు. అతని భార్య, పిల్లలు మాత్రం బీహార్లోనే ఉంటున్నారు. అనుష్క ఎఫ్బీలో సైనికాధికారుల ఫొటోలు కాగా అనుష్క ఫేస్బుక్లో 20 మంది సైనికాదుకారుల పేర్లు, ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. వారి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్మీ పీఆర్ఓ వివరణ పటన్ ఈఎంఈలో పనిచేయడం లేదని అతను ఆర్మీ ఆర్టిల్లరీ విభాగానికి చెందిన వాడని ఆర్మీ పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సికింద్రాబాద్లోని 151 ఎంసీ/ఎంఎఫ్ డిటాచ్మెంట్ వి భాగంలో పనిచేస్తున్నట్లు అందులో పేర్కొంది. -
అనుష్క పది లక్షలు ఇచ్చిన తర్వాతే..!
-
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలు!
హైదరాబాద్: తీగలాగితే డొంక కదిలినట్లు మిలటరీ అధికారి పటన్ కుమార్ పొద్దార్ నాయక్ను ప్రశ్నిస్తుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో జమ్మూకాశ్మీర్, నాసిక్లలో పనిచేసిన పటన్ పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు తెలిపాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు అనుష్క అగర్వాల్ అనే మహిళా ఉగ్రవాది ద్వారా దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సికింద్రాబాద్లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన పటన్కుమార్ పొద్దార్ నాయక్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు: పొద్దార్ నాయక్కు అనుష్క అగర్వాల్తో 2013 నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాడు. ఆర్మీ మిస్సైల్, ఆయుధ నిల్వల కర్మాగారం వివరాలను, ఫోటోలను పంపాలని అనుష్క అతనిని కోరింది. ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలు, అధికారుల కదలకలను అతను అనుష్కకు పంపాడు. 40 మంది కీలక విభాగాల్లో అధికారుల వివరాలను కూడా అతను ఆమెకు తెలిపాడు. పతాన్ అకౌంట్లో ఆమె 5 సార్లు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది. దేశంలో ఉన్న 12 యూనిట్ల బ్రిగేడియర్ల పేర్లు, వారు ఉండే ప్రదేశాల వివరాలను ఆమెకు పంపాడు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఆర్మీ సమాచారాన్ని కూడా నాయక్ ఫోన్లో ఆమెకు చెప్పాడు. భారత ఆర్మీ కీలక వివరాలు వెల్లడిస్తే లండన్ తీసుకెళ్తానని అతనికి అనుష్క చెప్పింది. పటన్ మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంటాడు. చైనాలో విదేశీ రాయబార కార్యాలయంలో ఉండే ధరమ్వీర్ సింగ్, సుబేదార్ బీఎస్ రెడ్డిలు అతనిని ఎమ్ఎల్ఎమ్ సెక్యూర్డ్ లైఫ్ వ్యాపారంలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పోద్దార్ నాయక్ నుంచి పోలీసులు కంప్యూటర్లు, ల్యాప్టాప్, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలోని 3 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 3,4,5 సెక్షన్లు,1977 ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ బాన్నింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్తో ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమె భారత్కు చెందిన వ్యక్తా? లేక పాకిస్తాన్కు చెందిన వ్యక్తా? అనేది తెలియవలసి ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతునట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. -
ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు
ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్కుమార్ పొద్దార్ నాయక్ (40)ను తమకు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు ఏడాది కాలం నుంచి అపరిచిత వ్యక్తితో పతన్కుమార్కు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని, మూడు నాలుగు నెలల నుంచి వీరిమధ్య ఫేస్బుక్లో చాటింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పతన్కుమార్ నుంచి రెండు కంప్యూటర్లు, ల్యాప్టాప్, పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించామని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే.. ఇంతకీ అసలా అపరిచిత వ్యక్తి పాకిస్థాన్ వ్యక్తా, ఇండియా వ్యక్తా అనేది తేలాల్సి ఉందన్నారు. కాగా ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు కూడా పతన్ కుమార్ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్న విషయం తెలిసిందే. -
'అనుష్క నా అకౌంట్లో 10 లక్షలు జమ చేసింది'
హైదరాబాద్ : పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్మీ అధికారి పటన్కుమార్ పొద్దార్ నాయక్ (40) విచారణలో సరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాక్ మహిళ అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు పటన్ కుమార్ వెల్లడించారని చెప్పారు. అలాగే అనుష్క తన అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేసిందని చెప్పాడన్నారు. భారత్ - పాక్ సరిహద్దుల్లోని పూంచ్ సెక్టర్లో ఆర్మీ కదలికలపై అనుష్కకు సమాచారం అందించాడన్నారు. అయితే పటన్కుమార్ చెందిన రెండు అకౌంట్ల నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పటన్ కుమార్ను తమకు అప్పగించాలని నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు పటన్ కుమార్ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్నాయని తెలిపారు. పోలీసుల విచారణలో పొద్దార్ నాయక్ వెల్లడించిన విషయాలను పోలీసులు వెల్లడించారు. అనుష్క అగర్వాల్తో గత మూడు నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్తో ఉందని పోలీసులు వెల్లడించారు. -
సైనికాధికారి దేశద్రోహం
-
సైనికాధికారి దేశద్రోహం
* అరెస్టు చేసిన హైదరాబాద్పోలీసులు * మహిళా ఉగ్రవాది ట్రాప్లో పడి సైనిక రహస్యాల చేరవేత సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐ సంస్థకు చెందిన ఓ మహిళా ఏజెంట్ మిలటరీ అధికారిని తన ఫేస్బుక్ ద్వారా ట్రాప్లోకి దింపింది. అతని ద్వారా మిలటరీ స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల సారాంశం, వారి రాకపోకల వివరాలను రాబట్టింది. ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ దేశద్రోహిని అరెస్టు చేసి నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు బుధవారం హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి మరిన్ని రహస్య సమాచారాలు రాబట్టేందుకు ఏడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన పటన్కుమార్ పొద్దార్ నాయక్(40) సికింద్రాబాద్లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చిపోయే మిలటరీ అధికారులకు ఆహ్వానం పలకడం, వీడ్కోలు తెలపడం లాంటి విధులు నిర్వహించేవాడు. మిలటరీ అధికారులకు రిజర్వేషన్ టికెట్లు కూడా సమకూర్చేవాడు. ఏడాది క్రితం అనుష్క అగర్వాల్(పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ మహిళా ఉగ్రవాది, ఏజెంట్)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఆమె తన నగ్న ఫోటోలను, నగ్న చిత్రాలను పటన్కు పంపింది. ఆమె వలలో పడ్డ పటన్ ఈమెయిల్, ఫేస్బుక్, ఫోన్ ద్వారా దేశానికి చెందిన మిలటరీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉన్నతాధికారుల సమావేశాల తేదీలు, సమావేశాల సారాంశాలు, అధికారులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. అతనిపై అనుమానం వచ్చిన మిలటరీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కేసును డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్రెడ్డిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్కు డీజీపీ తెలియజేశారు. పటన్పై దేశద్రోహంతో పాటు అధికార రహస్య రక్షణ చట్టం -1923 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం.... పటన్ గురించి మరింత సమాచారం కోసం డీజీపీ అనురాగ్శర్మ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అతన్ని ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సీసీఎస్ పోలీసులు పిటిషన్ వేశారు. అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు పటన్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఉలిక్కిపడ్డ మిలటరీ వర్గాలు... నిన్న మొన్నటి వరకు తమతో పాటు విధులు నిర్వహించిన ఉద్యోగి పటన్కుమార్ పొద్దార్ నాయక్ (40) దేశద్రోహానికి పాల్పడి పట్టుబడడంతో సికింద్రాబాద్, మెహదీపట్నం, కంటోన్మెంట్లోని మిలటరీ కేంద్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇక్కడి స్థావరాల వివరాలు, అధికారుల పేర్లు, సెల్ నంబర్లు పాకిస్థాన్లోని మహిళా ఉగ్రవాదికి చేరడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ఢిల్లీలోని మిలటరీ ఉన్నతాధికారులు గురువారం నగరానికి రానున్నట్లు సమాచారం. మరోపక్క దర్యాప్తులో భాగంగా నగర పోలీసులు పటన్ వాడిన కంప్యూటర్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్డిస్క్ను డీకోడ్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మిలటరీ అధికారులు రాకపోకలు సాగించే సమయంలో ఇతని వెంట ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉండేవారా అనే కోణంలో స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి పటన్.. మహిళా ఉగ్రవాదితో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అతని సెల్ఫోన్ కాల్డేటా తీసిన అధికారులకు అందులో కీలకమైన కొన్ని సెల్ నంబర్లు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నంబర్లు ఉగ్రవాదులకు చెందినవా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన ఫోన్ నంబర్లు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. అతని గదిలో కీలకమైన కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది. అలాగే సెక్యూర్డ్ లైఫ్ అనే కంపెనీ పేరుతో మనీ సర్క్యులేషన్ నెట్వర్క్ను కూడా నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతనిపై మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. పటన్ మిలటరీ రహస్యాలను అందించింది అనుష్క అగర్వాల్ అనే మహిళకని, ఆమె పాకిస్థాన్కు చెందిన మహిళా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. ఈమె తన పేరును మార్చి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో నివాముంటున్నట్లు ఫేస్బుక్ తెరిచింది. ఈ ఫేస్బుక్తోనే పటన్ను ఆమె వలలో వేసుకుంది.