bel company
-
‘ఏరో ఇండియా 2025’ బీఈఎల్ కొత్త ఉత్పత్తులు
బెంగళూరులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతున్న ‘ఏరో ఇండియా 2025’లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందించడంలో బీఈఎల్ సేవలందిస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న ఎగ్జిబిషన్లో కంపెనీ అధునాతన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.కమ్యూనికేషన్ సిస్టమ్స్..బీఈఎల్ ఏరో ఇండియా 2025లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇందులో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో (ఎస్డీఆర్), రేడియో ఆన్ ది మూవ్ (ఆర్ఓఎం), హై కెపాసిటీ రేడియో రిలే (హెచ్సీఆర్) టెక్నాలజీలున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ అధునాతన ఉత్పత్తులు సైనిక కార్యకలాపాలకు విశ్వసనీయ, సురక్షితమైన కమ్యూనికేషన్ మార్గాలను అందించడానికి రూపొందించినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు అసాల్ట్ రైఫిల్స్ కోసం అన్ కూల్డ్ థర్మల్ ఇమేజర్ సైట్, పాసివ్ నైట్ విజన్ గాగుల్స్, బోర్డర్ అబ్జర్వేషన్ సర్వైలెన్స్ సిస్టమ్తో సహా ఎలక్ట్రో-ఆప్టిక్ పరికరాలను బీఈఎల్ ప్రదర్శిస్తుంది.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుహెలికాప్టర్ల కోసం స్టాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, నావల్ ప్లాట్ఫామ్ల కోసం వ్యూహాత్మక డేటా లింక్ వంటి ఎయిర్బోర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఏవియానిక్స్ డొమైన్లో ప్రత్యేక ఉత్పత్తులను బెల్ ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలు విమానాలు, నౌకల భద్రతను, వాటి పనితీరును మెరుగుపరచడానికి రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. షిప్ బోర్న్ సిస్టమ్స్లో పాసివ్ హైడ్రోఫోన్ ఎలిమెంట్ (లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ), HUMSA-NG ట్రాన్స్ డ్యూసర్ ఎలిమెంట్, షిప్ ఆధారిత SIGINT EW సిస్టమ్లను బెల్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలు నీటి అడుగున నిఘాకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం అధునాతన సామర్థ్యాలను అందిస్తాయి. -
భెల్ గయా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ భెల్ పరిశ్రమ మూతపడనుంది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటనతో ఈ విషయం రూఢీ అయింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా నష్టాలు చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ మూసివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇదంతా తెలిసినా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు కనీసం స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో నెలూరు, చిత్తూరు జిల్లాల్లోని నిరుద్యోగులు, రియల్టర్లతో పాటు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల గుండెలు గుభేల్మంటున్నాయి. వెంకటగిరి: నెల్లూరు, చిత్తూరు జిల్లా వాసుల బతుకుతెరువు ప్రాజెక్ట్ మన్నవరం భెల్. వెంకటగిరి ప్రాంత అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతాయని ఆశించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందరో ఆశలను వమ్ము చేస్తూ.. కలలను కల్లలు చేస్తూ మూతపడే దశకు చేరుకుంది. 2010 సెప్టెంబర్ 1వ తేదీన అప్పటి భారతప్రధాని మన్మోహన్సింగ్ వెంకటగిరి సమీపంలోని చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సంయుక్తగా నిర్మించే ఎన్బీపీపీఎల్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ సాధనకు ఎంతో కృషి చేశారు. దురదుష్టవశాత్తు ఆయన అకాలంగా కాలం చేయడంతో ప్రారంభానికి కొంతకాలం జాప్యం జరిగింది. వైఎస్సార్ కలలను సాకారం చేసేందుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆయన స్మారకంగా మన్నవరానికి వైఎస్సార్పురంగా నామకరణం చేసి ఆ ప్రాజెక్ట్ను కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు తరలిపోతుందని రెండేళ్ల క్రితం వదంతులు వచ్చాయి. దీంతో అప్పట్లో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు, శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి తదితర నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు స్పందించి ప్రాజెక్ట్ను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ స్వరూపం ఇదీ విద్యుత్ ఉపకరణాల పరిశ్రమ అయిన ఎన్బీపీపీఎల్ను రూ.6000 కోట్లతో నిర్మించాలని అప్పట్లో అంచనా వేశారు. ఈ పరిశ్రమ ద్వారా 6వేల మందికి ఉద్యోగావకాశం కల్పించాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్కు అనుబంధంగా మరో 400 చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ద్వారా సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావించారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే ఉపకరణాలు తయారు కాకపోవడం వల్ల మార్కెటింగ్ లక్ష్యం నీరుగారిపోయింది. ఈ పరిశ్రమను రూ.6000 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వినియోగించే టర్బయిన్లు, బాయిలర్లతో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్పీ) వాటర్ సిస్టంను తయారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం రూ.130 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్లో హైడ్లర్ రోలర్లు మాత్రమే తయారు చేయడం వల్ల తగినంత వార్షిక ఆదాయం సాధించలేక నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు 763.85 ఎకరాల్లో ఏర్పాటు కావాల్సిన భారీ పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్ధాంతరంగా మూత పడిపోనుంది. భూముల ధరలు భారీగా పతనం 2010 సంవత్సరంలో వెంకటగిరి సమీపంలోని మన్నవరం వద్ద భెల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుండటంతో అప్పట్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో ఎకరా రూ.కోటి వరకూ పలికింది. అనంతరం మన్నవరం భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుందని, పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం లేదని సమాచారం అందడంతో ఒక్కసారిగా భూముల ధరలు బాగా తగ్గాయి. దీంతో రియల్ ఎస్టేట్ యజమానులు రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేసి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం భెల్ పరిశ్రమ పూర్తిగా మూతపడుతుందన్న సమాచారం. రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
అచ్చం సినిమా షూటింగ్ను తలపించిన ప్రమాదం నెల్లూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదం ఆద్యంతం సినిమా షూటింగ్ను తలపించింది. వివరాలు.. మరమ్మతుకు గురైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బెంగళూరులోని బెల్ కంపెనీలో అప్పగించేందుకు బీహార్ నుంచి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ షకీల్ అహ్మద్ఖాన్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మంజిగార్సింగ్, కానిస్టేబుళ్లు కమల్ అక్మల్ఖాన్, సంజిత్కుమార్ పాశ్వాన్, అజిత్కుమార్, అశోక్కుమార్సింగ్, డ్రైవర్ సంతోష్కుమార్ ఇన్నోవా కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి వాహనం నెల్లూరుకు సమీపంలోని సుందరయ్య కాలనీ వద్ద గల జాతీయ రహదారిపై పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో గాయపడిన అక్మల్ఖాన్ను ఆస్పత్రికి తరలించేందుకు నెల్లూరుకు చెందిన 108 వాహనం వచ్చి ఇన్నోవా ముందు ఆగింది. వీరికి సాయం చేసేందుకు సుందరయ్యకాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి మధుప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నాగేశ్వరరావు వచ్చారు. అక్మల్ఖాన్ను అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సమయంలో చెన్నై నుంచి హర్యానా వెళుతున్న కంటైనర్ ట్రాలీ వేగంగా వచ్చి ఇన్నోవాను ఢీకొట్టడంతో పాటు అక్కడున్న వారిపై దూసుకుపోయింది. ఇన్నోవా వెళ్లి అంబులెన్స్ను ఢీకొనడంతో అది డివైడర్ను దాటి చెన్నై మార్గంలో వెళుతున్న మరోట్రాలీని ఢీకొంది. దీంతో మంజిగార్సింగ్, అక్మల్ఖాన్, సంజిత్కుమార్పాశ్వాన్, నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మధుప్రభాకర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.