breaking news
Bus fire accident
-
కర్నూలు ఘటనాస్థలి వద్ద షాకింగ్ దృశ్యాలు
వెల్దుర్తి: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి వస్తువులను తరలించారు. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో మహబూబ్నగర్కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలికి దగ్గరలోని ఓ కుంట వద్ద నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా.. వీళ్లు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూరప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపరుస్తోంది. -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా..
వింజమూరు (ఉదయగిరి): ‘కడసారిది వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు.. కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య ఊరంతా తరలివచ్చి.. కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన గోళ్ల రమేష్, భార్య అనూష, ఇద్దరు పిల్లలు మన్విత, శశాంక్ అంత్యక్రియలు సోమవారం గోళ్లవారిపల్లిలో విషణ్ణ వదనాల మధ్య నిర్వహించారు. భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా.. మేము చేసిన పాపం ఏమిటీ? కనికరం లేదా ఆ బిడ్డలైనా బతికించకూడదా అంటూ మృతుల బంధువులు రోదించడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కొని బొగ్గులైన మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ పగ వారికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ , భార్య, బిడ్డలకు డీఏన్ఏ టెస్ట్లు నిర్వహించి ఆదివారం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రాత్రికి గోళ్లవారిపల్లికి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా చేర్చారు. సోమవారం ఉదయం అంతమయాత్ర నిర్వహించారు.ఆ కుటుంబాలను ఆదుకుంటాంఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బాఽధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు. ఇప్పటికే టీడీపీ తరఫున రూ.10 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి రూ.5 లక్షలు, కాకర్ల ట్రస్టు తరఫున తాను రూ.3 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు వారు రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సుకు సంబంధించి బీమాతో పాటు మరికొంత సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడా నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఎంపీపీ మోహన్రెడ్డి, బండారు సత్యనారాయణ, మాజీ ఎంఈఓ జి.ఓబులరెడ్డి, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు ప్రమాదం తరహాలో కాలి బూడిదైన మరో బస్సు
-
నిజాలు దాచి.. ‘బెల్ట్’ ఫుటేజీ మాయం!
రోజూ ఉండే షాపు.. ఈ రోజులేదు లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్ షాపు ఈ రోజు లేదు. పేపర్లో ఆ షాపు ఫొటో రావడంతో మూసేసి వెళ్లిపోయారు. బెల్ట్ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధించాలి. – రాకేష్, లక్ష్మీపురంసాక్షి ప్రతినిధి కర్నూలు: లక్ష్మీపురంతోపాటు ఎన్హెచ్ 44 సమీపంలోని దాబాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం.. ఎక్కడా బెల్ట్షాపులు లేవ్..! తాజాగా ప్రభుత్వ ప్రకటన ఇదీ!! మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు.. వైన్ షాపు లేకున్నా, నాలుగు బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి!! బెల్ట్ షాపుల ఎదుట నిలుచుని లక్ష్మీపురం వాసులు చెబుతున్న నిఖార్సైన నిజాలివీ!! కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటన కనివీని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావడంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణ భూతమైంది. విచ్చలవిడిగా, వేళాపాళా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధ్రువీకరించారు. దీన్ని కప్పిపుచ్చుతూ... అది బెల్ట్ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ, అక్కడే కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. పెద్దటేకూరు సమీపంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్లో రాత్రి 7 గంటలకు, 8.20 గంటలకు రెండు దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్షాపులే లేవని ఎక్సైజ్ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తమ ఊరిలో బెల్ట్ షాపులు ఉన్నాయని, గత రెండు రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. దుర్ఘటన జరిగాక హడావుడిగా బెల్ట్ షాపులను మూసివేయడం, ఆ దుకాణాల ఎదుట సీసీ టీవీ ఫుటేజీని తొక్కిపెడుతుండటం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు రోజులుగా బెల్ట్షాపు మూత.. మాయమైన సీసీ టీవీ ఫుటేజీ..! బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకూ ఇద్దరూ మద్యం సేవిస్తూనే ఉన్నారు. మూడోసారి పెద్దటేకూరు వైన్షాప్ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం.. మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్ షాపును శనివారం మూసేశారు. ఆదివారం కూడా దుకాణం తెరవలేదు! ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ని ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజులుగా బెల్ట్షాపు మూతపడటం, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్ష్మీపురంలో తన తల్లిని చూసేందుకు ఎర్రిస్వామి వెళుతుంటాడు. మూడో దఫా లక్ష్మీపురం బెల్ట్షాపులో మద్యం సేవించారా? లేదా? అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది. లక్ష్మీపురంలో బెల్ట్షాపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు వెళ్లిన ‘సాక్షి’తో పలువురు మాట్లాడారు.పెట్రోల్ బంక్లో శివశంకర్ ఉన్న సీసీ ఫుటేజీ విడుదల చేసిన అధికారులు... లక్ష్మీపురంలో అతను మద్యం కొన్నాడని స్థానికులు చెబుతున్నా... అక్కడి సీసీ ఫుటేజీని బయటపెట్టలేరా? గుడి, బడి పక్కన బెల్ట్ షాపులు లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్ షాపులున్నాయి. ఒకవైపు సీఎం బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తానని చెబుతున్నారు. వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగి బైక్ నడపడంతోనే రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. – నారాయణరెడ్డి, లక్ష్మీపురం 24 గంటలు మందు అమ్ముతున్నారు మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు. వైన్ షాపు లేకున్నా నాలుగు బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు. రోడ్ల పక్కనే తాగుతుండడంతో రాకపోకల సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చారు. – రాజమోహన్రెడ్డి, లక్ష్మీపురం మా ఊరి బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది మా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది. అర్ధరాత్రైనా, మధ్యరాత్రైనా, తెల్లవారుజామునైనా మందుకు కరువు ఉండదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. – పేరిపోగు ప్రతాప్, లక్ష్మీపురంఎక్కడా తనిఖీలు చేయడం లేదుమా ఊరు పరిధిలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ వాళ్లు కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు అవేమి జరగడంలేదు. నేరుగా వైన్ షాపు వారే మద్యాన్ని తెచ్చి బెల్ట్ షాపులకు ఇచ్చిపోతున్నారు. ఎక్కడ తనిఖీలు చేయడంలేదు. అందుబాటులో ఉండడంతో విచ్చల విడిగా మందు తాగుతున్నారు. బ్రిడ్జిలు, స్కూళ్లు, పార్కుల్లో తాగుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదు. – సత్యంరెడ్డి, గ్రామస్తుడు, లక్ష్మీపురం చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు లక్ష్మీపురంలో మద్యం అమ్మకాలు పబ్లిక్గా జరుగుతున్నాయి. ఏకంగా వైన్ షాపు వారే వచ్చి ఇళ్లలో అమ్మే వారికి బాటిళ్లు ఇచ్చిపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. చిన్న పిల్లలు కూడా మద్యం తాగి పెడదారి పడుతున్నారు. – నేసే శేఖర్, లక్ష్మీపురం ఈ రోజు తెరవలేదు... లక్ష్మీపురంలో నీళ్లకు ఇబ్బంది ఉంది కానీ మందుకు ఇబ్బంది లేదు. వైన్ షాపు లేకున్నా ఎప్పుడు చూసినా బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు ఒక్క షాపు కూడా తెరవలేదు. – తెలుగు సుంకన్న, లక్ష్మీపురం బెల్ట్ షాపులను నిర్మూలించాలిమహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్ట్ షాపులను నిర్మూలించాలి. ప్రభుత్వం తరచూ తనిఖీ చేస్తే కట్టడి చేయవచ్చు. ఆ పని చేయడంలేదు. తాగిన మైకంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదు. మందు తాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపులపై పునరాలోచన చేయాలి. – దూడల తిరుపాలు, లక్ష్మీపురం అనర్థాలపై అవగాహన కల్పించాలి మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కలి్పంచాలి. అదే సమయంలో బెల్ట్ షాపులను తొలగించాలి. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మందు తాగుతుంటే కాలం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. – మాసుంసాహెబ్, లక్ష్మీపురం మద్యం ఖాళీ సీసాలతో హంద్రీ కలుషితంపబ్లిక్ ప్లేసుల్లో మందు తాగడాన్ని అరికట్టాలి. హైవే పక్కన, స్కూళ్ల సమీపంలో మందు తాగడంపై నిఘా వేసి ఉంచాలి. ఇళ్ల మధ్య కూడా రాత్రిళ్లు తాగుతున్నారు. హంద్రీనది మద్యం ఖాళీ సీసాలతో కలుషితం అవుతోంది. – చంద్రశేఖర్, లక్ష్మీపురం -
మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్ జగత్ సింగ్ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ వేపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025 -
అలాగే ప్రమాదం జరిగి.. అనూహ్యంగా తప్పించుకుని..
రాంచీ: రెండూ బస్సు అగ్ని ప్రమాదాలే. రెండు బస్సులను రహదారులపై అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒక ఘటనలో బస్సు బుగ్గిపాలై 19 మందిని బలితీసుకుంటే మరో ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా ప్రమాదఘటన సుఖాంతంగా ముగిసింది. ఒకటి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంకాగా మరోటి జార్ఖండ్లోది. డ్రైవర్ అప్రమత్తత, రెప్పపాటులో ప్రతిస్పందనలతో ఎలాంటి పెను ప్రమాదం నుంచైనా అవలీలగా తప్పించుకోవచ్చని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాదం ఘటన నిరూపించింది. రెండు బస్సుల్లోనూ దాదాపు ఒకే సంఖ్యలో ప్రయాణికులు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే? జార్ఖండ్లోని రాంచీలో శనివారం సాయంత్రం అత్యంత వేగంగా రహదారిపై పరుగుల తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది రాంచీ–లోహార్దగా జాతీయరహదారిపై మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ రెప్పపాటుకాలంలో బస్సును ఆపేశాడు. ప్రయాణికులు అందర్నీ అప్రమత్తంచేసి అందర్నీ కిందకు దింపేశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని ఆర్పేశారు. వీళ్లకు స్థానిక దుకాణదారులు సైతం సాయపడి తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన వివరాలను మందార్ పోలీస్స్టేషన్ ఆఫీసర్–ఇన్చార్జ్ మనోజ్ కర్మాలీ వెల్లడించారు. ‘‘బస్సులో అక్రమంగా రసాయన పదార్థాలను తరలిస్తున్నారు. దాంతో అవి హఠాత్తుగా మండి బ్యాటరీబాక్స్ సమీపంలో షాట్ సర్క్యూట్కు కారణమయ్యాయి. దీంతో అగ్గిరాజుకొని బస్సును చుట్టుముట్టాయి. ఘటన తర్వాత బస్సును పోలీస్స్టేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చాం. ప్రయాణికులందర్నీ తమతమ గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేశాం. బస్సులో అగ్నిమాపక ఉపకరణాలు లేవు. దీనిపై విచారణకు హాజరురావాలని బస్సు యజమానికి సమన్లు జారీచేశాం’’అని మనోజ్ కర్మాలీ చెప్పారు. అప్రమత్తత ఎలాంటి పెనువిషాదం నుంచైనా కాపాడుతుందని జార్ఖండ్ బస్సు అగ్నిప్రమాద ఘటన రుజువుచేసిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
కొంపలు ముంచింది 'బెల్ట్షాపు మద్యమే'?
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రమాదం జరిగిన రోజు పోలీసులు, అధికారులు భావించినట్లు బస్సు.. బైకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారిగా తేలింది. బైకర్ శివ శంకర్ తన స్నేహితుడితో కలిసి బెల్ట్షాపులో పూటుగా మద్యం సేవించి బైక్ నడిపాడు. బస్సు ప్రమాదానికి 13 నిమిషాల ముందు బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో పెను ప్రమాదం సంభవించి బస్సు దగ్ధమైంది. శివశంకర్తో పాటు బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రమాదానికి అసలు కారణం తేలింది. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే.. ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతివ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశ వ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ.. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏదీ అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం, బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి.. ఆపై పల్సర్ బైక్పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక.. మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ‘తప్పతాగి డ్రైవ్ చేసే వారు సూసైడ్ బాంబర్లు (ఆత్మాహుతి దళాలు).. టెర్రరిస్టులు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకం. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. ఎన్నో కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసే డ్రైవింగ్ వల్ల ఇతరులకే ఎక్కువ హాని జరుగుతుంది’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల చెప్పిన మాటలను ప్రజలు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇలా విచ్చలవిడిగా వేళాపాళా లేకుండా ఎక్కడబడితే అక్కడ మద్యం దొరికేలా చేసిన ప్రభుత్వమే ఈ ప్రమాదంలో అసలు ముద్దాయని నెటిజన్లు అదే సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తుండటం వైరల్ అయ్యింది. 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి మద్యం మహమ్మారే కారణమని తెలుసుకుని ప్రజలంతా నివ్వెరపోతున్నారు. మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష్య నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 16 నెలలుగా ప్రభుత్వ పెద్దల స్వార్థానికి ఫలితం ఈ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తప్పతాగి బైక్పై ప్రయాణంకర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదం ఘటనలో అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మహమ్మారే ఈ ప్రమాదానికి అసలు కారణమని నిగ్గు తేలింది. కర్నూలు వాసి శివశంకర్, తుగ్గలి మండలం రాంపల్లి వాసి చాకలి ఎర్రిస్వామి అలియాస్ నాని ఇద్దరూ శుక్రవారం రాత్రి నేషనల్ హైవే పక్కనే ఉన్న లక్ష్మీపురంలో మద్యం సేవించారు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించిన తర్వాత ఎర్రిస్వామిని రాంపల్లిలో వదిలేందుకు రాత్రి 2 గంటలకు పూర్తి మద్యం మత్తులో శివశంకర్ పల్సర్ బైక్లో బయలు దేరాడు. వారిద్దరూ లక్ష్మీపురం నుంచి బయలు దేరారని జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. పెట్రోల్ కోసం కియా షోరూం ఎదురుగా ఉన్న శివప్రసాద్ ఫ్యూయల్ స్టేషన్కు అర్ధరాత్రి 2.22 గంటలకు 6వ పంప్ వద్దకు వెళ్లి ఆపాడు. పెట్రోలు కోసం సిబ్బందిపై కేకలు వేశారు. ఒకటో పంపు వద్దకు రావాలని సిబ్బంది చెప్పడంతో బైక్ను ఒంటిచేత్తో రౌండ్లు తిప్పి వేగంగా నడిపాడు. అక్కడే కిందపడిపోవాల్సింది తృటిలో తప్పించుకున్నాడు. రూ.300 పెట్రోలు పోయించుకుని 2.26 గంటలకు వెళ్లిపోయాడు. పెట్రోలు బంకు నుంచి సరిగ్గా 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బైక్ అదుపు తప్పడంతో కుడి వైపు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎగిరిపడిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రిస్వామి డివైడర్ మధ్యలోని ఖాళీ స్థలంలో ఉన్న గడ్డిలో పడ్డాడు. దీంతో బతికిపోయాడు. వీరు లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపులో మద్యం తీసుకుని, అర్ధరాత్రి వరకూ తాగి ఆ తర్వాత బైక్లో బయలుదేరినట్లు తెలుస్తోంది.రోడ్డుపై పడిపోయిన బైక్ను ఢీకొట్టడంతోనే..శివశంకర్ బైక్ పై నుంచి కిందపడిపోయిన తర్వాత గుండెలపై ఒత్తి బతికించేందుకు ఎర్రిస్వామి యత్నించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డుకు ఎడమ వైపునకు లాగాడు. ఆ తర్వాత బైక్ను లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు వేగంగా వస్తూ రోడ్డుపై మనిషి ఉండటం చూసి డ్రైవర్ హారన్ కొట్టడంతో ఎర్రిస్వామి పక్కకు పరుగెత్తాడు. మనిషి పక్కకు వెళ్లిపోయాడని అదే వేగంతో బస్సు వచ్చింది. అయితే మనిషి ముందు బైక్ ఉందనే సంగతి డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించలేకపోయాడు. దీంతో బైక్ను ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయి, రోడ్డుపై రాపిడికి గురై మంటలు చెలరేగడం, బైక్ పెట్రోల్ ట్యాంకు పగలడంతో భారీగా మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ విషయాలను ఎర్రిస్వామి పోలీసుల విచారణలో స్వయంగా వెల్లడించాడు.బైక్పై రెండో వ్యక్తి ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..ప్రమాద స్థలి సమీపంలో రోడ్డుకు ఓ వైపు శివశంకర్ శవం, బస్సు కింద బైక్ ఉంది. డ్రైవర్ కూడా బైక్ను ఢీకొట్టానని చెప్పాడు. దీంతో హోం మంత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ వరకూ అందరూ ప్రమాదానికి ఇదే కారణమని నమ్మారు. అయితే పోలీసుల పరిశోదనలో అర్ధరాత్రి శివశంకర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలని యత్నించారు. అతడి ఆధార్ కార్డు ఆధారంగా తల్లి, సోదరుడిని గుర్తించి శివశంకర్ ఫోన్ నంబరు తెలుసుకుని కాల్ డేటా తీశారు. ఫోన్ చేస్తే శివశంకర్ ఫోన్ కూడా తుగ్గలి మండలం రాంపల్లిలో ఉంది. అది ఎర్రిస్వామి వద్ద ఉండటం గుర్తించారు. దీంతో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఘటన జరిగిన తీరును ఎర్రిస్వామి స్పష్టంగా వివరించాడు. బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లడం, కళ్లముందే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి దూకడం, ఆపై బస్సు తగలబడటం ఎర్రిస్వామి చూశాడు. ఘటన తర్వాత సీఐ అక్కడికి రావడం, ఫైర్ ఇంజన్ను రప్పించే ప్రయత్నాలు చేస్తుండటం. బస్సులో జనాలు అగ్నికి ఆహుతి అవ్వడం.. ఇదంతా తమ బైక్ వల్లే జరిగిందని, దీంతో తనకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడి అక్కడి నుండి పారిపోయాడు.అబద్ధాలతో పోలీసులను మభ్యపెట్టిన డ్రైవర్ లక్ష్మయ్య ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే లక్ష్మయ్య వాస్తవం చెబితే తన తప్పుతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తుందని పోలీసులకు అబద్ధాలు చెప్పాడు. తొలుత బైక్ వెళుతుంటే బస్సు ఢీకొట్టిందని, బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో రాపిడికి గురై మంటలు రేగి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆపై బైక్ తనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగిందని చెప్పాడు. చివరకు ఎర్రిస్వామిని విచారించిన తర్వాత తిరిగి డ్రైవర్ను విచారిస్తే అసలు నిజం ఒప్పుకున్నాడు. బైక్ రోడ్డుపై పడి ఉందని, తాను గుర్తించలేక ఢీకొట్టానని చెప్పాడు. లక్ష్మయ్య వాస్తవం ముందే చెప్పి ఉంటే ప్రమాదానికి అసలు కారణం మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన శివశంకరే కారణమని శుక్రవారమే తేలేది.ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రమాదంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించింది. ఎర్రిస్వామి చెప్పింది నిజమేనా.. ఎక్కడ కిందపడ్డారు.. బస్సు ఎన్నిమీటర్లు బైక్తో దూసుకొచ్చింది.. అనే అంశాలను పరిశీలించి రికార్డు చేశారు. శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ లక్ష్మీపురంలో మద్యం సేవించి మద్యం మత్తులోనే నేషనల్హైవే పైకి వచ్చినట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు తేల్చారు. అలాగే బస్సు నిర్మాణం, ఫిట్నెస్ను ఎంవీఐలు నాగరాజు నాయక్, సుధాకర్రెడ్డిల బృందం పరిశీలించింది. గతుకుల హైవే కూడా పెను ప్రమాదాలకు కారణమే!ఎన్హెన్–44లో గుత్తి నుంచి డోన్, కర్నూలు వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. భారీగా గుంతలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్లు వేశారు. కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. కర్నూలు–డోన్ మధ్య భారీగా గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే వీటిలో నీరు నిలబడి రోడ్డు కూడా కన్పించని పరిస్థితి. రాత్రి వేళల్లో బెంగళూరు–హైదరాబాద్కు బస్సులు, కార్లు, లారీలు వేల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. గుంతల రోడ్డులో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదానికి గురవుతున్నాయి. కొంతమంది వాహనదారులు రోడ్డు బాగోలేదని టోల్ ఫీజు చెల్లించమని గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్హెచ్ అధికారులు రోడ్డు బాగుపై దృష్టి సారించాలి. ఆదాయం కోసం సుప్రీంకోర్టునే సవాల్ చేసిన మద్యం వ్యాపారులునేషనల్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని 2016లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఇబ్బంది వస్తుందని ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అండతో మద్యం వ్యాపారులు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేశారు. దీంతో తిరిగి సుప్రీం రివ్యూ చేసి 2017లో మరో తీర్పు ఇచ్చింది. నేషనల్ హైవే.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా, మండల కేంద్రాల మీదుగా వెళుతుంటే అక్కడ మాత్రం మద్యం షాపులు పెట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో నేషనల్ హైవేలు ఉంటే అక్కడ 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టకూడదని చెప్పింది. దీంతో నేషనల్ హైవేలపై విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటయ్యాయి. నేషనల్ హైవేలకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. రోడ్డుపై మద్యం దుకాణం బోర్డు పెట్టి, సమీపంలో దుకాణం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు మందు సేవించి హైవే ఎక్కుతున్నారు.నేషనల్ హైవే పక్కనే భారీగా మద్యం దుకాణాలు⇒ ఈ ఫొటోలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉంది. హైవేపై అటు, ఇటూ వెళ్లే వారికి కన్పించేలా బిల్డింగ్పై భాగంలో ఈగల్ బార్ అని రాశారు. నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులు ఇక్కడ ఆగి మద్యం సేవించి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకుని హైవే ఎక్కుతున్నారు. ⇒ ఈ ఒక్క బెల్ట్ షాపు, బార్ మాత్రమే కాదు.. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్గేట్ నుంచి అనంతపురం జిల్లా సరిహద్దు పోతుదొడ్డి వరకు ఎన్హెచ్–44 పక్కన 10 మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. పుల్లూరు నుంచి పోతుదొడ్డి వరకూ 88 కిలోమీటర్లు ఉంది. ఈ 88 కిలోమీటర్ల మధ్యలోని పల్లెల్లో బెల్ట్షాపులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు! పైగా పెద్ద పంచాయతీల్లో రెండు నుంచి నాలుగు వరకు బెల్ట్షాపులు కూడా ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పల్లెల్లో బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా వెలిసినా ఆబ్కారీ అధికారులు నిస్సహాయంగా ఉన్నారు. పైగా టీడీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు ఆదాయ మార్గాలకు అలవాటు పడి తూగుతున్నారు. దీంతో నేషనల్ హైవే పొడవునా విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే ఎన్హెచ్–44పై ఇలాంటి మద్యం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఇట్టే తెలుస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్హెచ్–44 పక్కన ఉన్న మద్యం దుకాణాలునిరీక్షణ వైన్స్, పంచలింగాల త్రీపెగ్స్, శ్రీ చక్ర ఆస్పత్రి సమీపంలో, కర్నూలుజీవీఆర్ వైన్స్, చెన్నమ్మ సర్కిల్పీఆర్ వైన్స్, షరీన్ నగర్ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్సుంకులమ్మ వైన్స్, కృష్ణానగర్మధులోక్ వైన్స్, చిన్న టేకూరురేణుకా యల్లమ్మ వైన్స్, పెద్దటేకూరుమహేశ్ వైన్స్, ఉలిందకొండబాలాజీ వైన్స్, కంబాలపాడు సర్కిల్, డోన్మంజీర వైన్స్, కొత్తపల్లిఈ ఘటనతో ప్రభుత్వం మేల్కొంటుందా? బస్సు ప్రమాదానికి కారణమైంది లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపు. ఎక్కడ బెల్ట్షాపులు ఉన్నా ఉపేక్షించమని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని ప్రతీ పల్లెలో విచ్చలవిడిగా బెల్ట్షాపులు వెలిశాయని తెలియదా? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్షాపు లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుపై వెళ్లే వాహనదారుడు మందు కావాలంటే 10 నిమిషాల్లో మద్యం షాపు, బెల్ట్షాపు కన్పించే పరిస్థితి. దీంతోనే శివశంకర్ మద్యం తాగి బైక్ నడిపాడు.. అదుపు తప్పి చనిపోయాడు. తనతో పాటు మరో 19 మందిని బలితీసుకున్నాడు. నిజానికి బైకర్ సహా 20 మంది చావుకు అసలైన కారణం మద్యం.. బెల్ట్షాపు. ఈ రెండూ లేకపోతే బస్సు ప్రమాదం జరిగేది కాదు. 20 మంది చనిపోయేవారు కాదు. చనిపోయిన ఏడు రాష్ట్రాల్లోని వారి కుటుంబాలు ఈ రోజు హాయిగా నవ్వుతూ ఉండేవి. కేవలం ప్రభుత్వం, టీడీపీ నేతలు ఆదాయం కోసం విచ్చలవిడిగా నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలు, పల్లెల్లో బెల్ట్షాపులు ఏర్పాటు చేయడంతో మందు బాబులకు సులువుగా మద్యం దొరుకుతోంది. ఫలితంగా తప్పతాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్లనే అని స్పష్టమైంది. నేతల ఆదాయం కంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. -
బస్ ఫైర్ ప్రమాదానికి కారణం అయిన వ్యక్తి
-
‘స్లీపర్’లోనే ఎందుకీ ప్రమాదాలు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తుసుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. డిజైన్ సురక్షితమేనా?స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా ఉంటుంది. రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో అందుకే నిషేధించారా?చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి:కర్నూలు శివారులో ఘోరం.. -
కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల షాకింగ్ నిజాలు
-
కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం రియాక్షన్
-
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
సాక్షి, కర్నూలు: ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024) నుంచి అక్టోబర్ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్లో ఉంది. హైస్పీడ్, డేంజర్ డ్రైవింగ్ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. -
Kurnool Bus Incident: 2 నిమిషాలు.. 22 ప్రాణాలు..!
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
పాసెంజర్స్ ని వదిలేసి పారిపోయిన డ్రైవర్, క్లీనర్
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. YS జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
డ్రైవర్ తప్పించుకున్నాడు.. బస్సు డోర్ ఓపెన్ కాలేదు.. కలెక్టర్ షాకింగ్ నిజాలు
-
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
-
Kurnool Bus Fire Accident: సజీవ దహనం..
-
ప్రమాదం ఎలా జరిగిందంటే.. విస్తుపోయే నిజాలు
-
కాలిపోయిన బస్సు వద్ద కుటుంబం కోసం వెతుకులాట
-
బస్సులో మంటలు.. 71 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘన్లో వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. ఇటీవల ఆప్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో, వారంతా స్వదేశానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వలసదారులతో వెళ్తున్న బస్సు, మోటారు సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.🚨BREAKING: At least 71 people died in Afghanistan’s Herat province when a bus carrying deported migrants crashed into a truck and a motorcycle. pic.twitter.com/HdQxk36CzC— World Source News 24/7 (@Worldsource24) August 19, 2025ఇక, ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. అఫ్గాన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ (Pakistan) భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚡️🇦🇫 At least 71 people including 17 children were killed when a bus carrying deported migrants collided with a truck and motorcycle in Herat province, Afghanistan, before catching fire. pic.twitter.com/vapzIvuqPO— Lala News & Stuff (@lala515711) August 19, 2025 -
మంటల్లో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు
-
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం
-
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
ఆరెంజ్ ట్రావెల్స్: రెండు బస్సులు దగ్ధం
హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రైవేట్ బస్సులు షార్ట్ సర్య్కూట్ కారణంగా దగ్ధమైన సంఘటన శుకవ్రారం చోటు చేసుకుంది. బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు దగ్ధమైన సంఘటన కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారణంగా బాలానగర్ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మదీనాగూడ చౌరస్త్తాలో.. మియాపూర్: కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం బీరంగూడ నుంచి కూకట్పల్లి వైపు వస్తుండగా మదీనాగూడ ప్రాంతంలో బస్సు ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన స్థానికులు, వాహనదారులు బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో అతను బస్సును జాతీయ రహదారి పక్కన ఆపి ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. -
18 మందితో వెళ్తున్న మినీ బస్లో మంటలు.. క్షణాల్లో..!
లఖ్నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. #Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP — Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022 ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం -
మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం
కరాచీ: పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది. సింధ్ ప్రావిన్స్ కరాచీ-హైదరాబాద్-జామ్షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్వేపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ సెక్రెటరీ సిరాజ్ ఖ్వాసిం వెల్లడించారు. దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
కాకినాడ ఇంద్ర ఏసీ బస్లో అనూహ్యంగా మంటలు ...
-
కాకినాడలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల కారణంగా బస్సులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో బస్సు సగం వరకు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు. -
రోడ్డు ప్రమాదం: బతుకు జీవుడా..!
రాయగడ: ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిందికి దిగి ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక హలువ గ్రామానికి సమీపంలో గల తరణి మందిరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో అగ్నికీలలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ పూర్తిగా కాలిబూడిదైంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ నుంచి గంజాం జిల్లాలోని పొలసరకు వెళ్తున్న బొర్షా పేరుగల ప్రైవేట్ బస్సు 42 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొశాగుమడలో బయలు దేరింది. రాయగడకు చేరేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండగా హలువా గ్రామానికి దగ్గర గల తరణి మందిరం వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రయాణికులు హెచ్చరించినా.. కొశాగుముడ నుంచి బయలు దేరిన బస్సు రాయగడకు సుమారు 43 కిలోమీటర్ల దూరంలో గల కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ చేరేసరికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పటికే బస్సు వెనుక నుంచి ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు డ్రైవర్కు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో తరణి మందిరం వద్దకు చేరేసరికరి బస్సు వెనుక టైరు పేలిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో బయటకు వచ్చేశారు. ఇంతలో బస్సులో మంటలు ఎక్కువ కావడంలో ప్రయాణికులు వారి లగేజీ తీయలేకపోయినా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బస్సు నుంచి బయట పడ్డారు. సంఘటన జరిగిన తరువాత డ్రైవర్ పరారయ్యాడు. చుట్టుపక్కల గల గ్రామస్తులు చేరుకుని విషయాన్ని ప్రమాద విషయమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అరగంట తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు అందులొ గల ప్రయాణీకుల సామాన్లు,లగేజీలు కాలిబూడిదయ్యాయి. అనంతరం పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో వాహనంలో రాయగడకు తరలించారు. పొలీసులు కేసు నమెదు చేశారు. -
బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. ఐజీ డాక్టర్ అఫ్తాబ్ పఠాన్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 13 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో ఐదుగురి పరస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాలిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని' పోలీసులు వెల్లడించారు. -
అగ్నికీలల్లో ఆర్తనాదాలు
సాక్షి, బళ్లారి: బస్సు బెంగళూరుకు పరుగులు తీస్తోంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సులో అగ్నికీలలు. కొందరికి మెలకువ వచ్చి బస్సులో నుంచి దూకేశారు. డ్రైవర్ బస్సును నిలిపేసి పారిపోయాడు. డ్రైవర్ వెనుక సీట్లో ›కూర్చున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కవిత(28), ఆమె అక్క శీలా (33), వారి ముగ్గురు పిల్లలు స్పర్శ (8), సమృద్ధి(5), నిశ్చిత(3)లు మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా కేఆర్హళ్లి వద్ద జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున 3–4 సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయపుర(బీజాపూర్) నుంచి బెంగళూరుకు వెళ్తున్న కుక్కేశ్రీ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. పై ఐదుగురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడటంతో చిత్రదుర్గ, హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కవిత, ఎస్పీ రాధికలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిద్రలోకి జారుకొన్న వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలుకాకపోగా ముగ్గురు చిన్నారులు కావడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలియక క్షణాల్లో కాలిబూడిదయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. -
బతుకు జీవుడా..!
ఒక్కసారిగా పెద్ద కుదుపుతో బస్సు ఆగింది.. నిద్దట్లోనే ఒకరిపై ఒకరు పడ్డ ప్రయాణికులకు కాసేపు ఏమైందో అర్థం కాలేదు.. చుట్టూ అంధకారం.. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదం జరిగిందని తెలుసుకొని బిలబిలమంటూ దిగిపోయారు.. ఆ షాక్ నుంచి తేరుకొని సామాన్లు తెచ్చుకొనేలోపే కళ్ల ముందే బస్సు దగ్ధమైంది. ఆకాశాన్నంటిన అగ్ని కీలలను చూసి వారెవరికీ నోట మాట రాలేదు. రణస్థలం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బస్సులోనివారంతా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వస్తున్న టూరిస్టులు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. రణస్థలం: రోడ్డు ప్రమాదం ఒక షాక్.. మంటల్లో బస్సు దగ్ధం మరో షాక్.. అంతసేపు తాము ప్రయాణించిన వాహనమేనా ఇలా కాలి బూడిదైందని తలచుకుంటేనేఒళ్లు గగుర్పొడిచే సంఘటన అది.. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు వెంటనే సహాయ చర్యలందించడంతో వారు కాస్తంత తేరుకున్నారు.. అయితే సామాన్లన్నీ కాలిబూడిద కావడంతో ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో మిగిలారు. ఉత్తరాఖండ్ వాసులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో దగ్ధమైంది. ముందు వెళుతున్న వరిశాం శ్యాం పిస్టన్స్ పరిశ్రమకు చెందిన బస్సు హఠాత్తుగా కుడివైపునకు మలుపు తిరగడంతో వెనుక వేగంగా వస్తున్న టూరిస్టు బస్సును గుద్ది అవతల రోడ్డులో ఉన్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 45మంది ఉన్నారు. నిద్దట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచి బస్సు దిగిపోయారు. ఇంతలో షార్ట్సర్క్యూట్ అయి బస్సు వారి కళ్ల ముందే పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా చకచకా బస్సు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ కొద్దిమంది పర్యాటకులు, శ్యాం పిస్టన్స్ ఉద్యోగులు, లారీ డ్రైవర్కు లావేరు, రణస్థలం నుంచి వచ్చిన 108 వాహనాల్లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరబిందో పరిశ్రమ, ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. హిందీలో ఆర్తనాదాలు ప్రమాదం జరిగిన వెంటనే హిందీలో ఆర్తనాదాలు వినిపించాయి. బస్సు యాక్సిడెంట్ యువా.. బస్సు జల్ గయ్... తూరంత్ బహార్ ఉతరో... ఉతరో (బస్సుకు ప్రమాదం జరిగింది. వెంటనే బయటకు దిగిపోండి) అంటూ హాహాకారాలతో ఉత్తరాఖండ్వాసులు బస్సు దిగిపోయారు. కొద్దికొద్దిగా మంటలు వ్యాపిస్తుండగా బస్సులో ఉన్న 45 మంది ఎమర్జన్సీ గేటు, ప్రధాన గేటు నుంచి బట్టలు, బ్యాగులు వదిలేసి హడావుడిగా దిగిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్టులను విశాఖ పంపించింది. అక్కడి నుంచి వారు రైలు తదితర రవాణా సాధనాల ద్వారా స్వస్థలానికి వెళతారు. నెల రోజులపాటు కాశీ, పూరి, రామేశ్వరం, కన్యాకుమారి వంటి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులు రెండు బస్సుల్లో బయలుదేరారు. అందులో ఒక బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడినప్పటికీ డబ్బులు, ఏటీఎం కార్డులతో సహా సామాను దగ్ధం కావడంతో టూరిస్టులు కట్టుబట్టలతో మిగిలారు. అధికారులు, స్థానికుల చొరవకు ప్రశంసలు సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై అశోక్బాబు, ఫైర్ అధికారులు, ఆర్డీవో ఎం.వి.రమణ, తహసిల్దార్ ఎం.సుధారాణి స్పందించారు. స్థానిక మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు, అరబిందో యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానికులు టూరిస్టులకు సపర్యలు చేశారు. సకాలంలో స్పందించి భోజనాలు, తాగునీరు, టూరిస్టులు విశాఖపట్నం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సమస్తం బూడిదైంది... నెల రోజులపాటు దైవ క్షేత్రాలు తిరిగేందుకు సుఖియాంచల్ ట్రావెల్స్ తో మాట్లాడుకున్నాం. పూరి చూసుకొని వస్తున్నాం. ప్రస్తుతం రామే శ్వరం వెళుతున్నాం. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దుస్తులు, నగదు, ఆధార్, పాన్కార్డులు, ఏటీఎం కార్డులు సమస్త కాలిపోయాయి. తిరిగి వెళ్లేందుకైనా డబ్బులు లేవు. – రావత్ బహుగుణ్, టూరిస్టు -
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం
సాక్షి, చెన్నై : నగరంలోని కోయంబేడు బస్టాండ్లో శనివారం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేందుకు నిలిచి ఉన్న బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చేశారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో కోయంబేడులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. -
నారాయణ కాలేజీ బస్సులో మంటలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్స్టేషన్ సెంటరులో నారాయణ విద్యా సంస్థల కళాశాల బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో బస్సులోని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విద్యార్థులను ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ కొద్ది దూరం వెళ్లగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ బస్సును ఆపాలంటూ డ్రైవర్కు చెప్పడంతో బస్సును నిలిపివేశారు. వెంటనే విద్యార్థులు కిందకు దూకి రోడ్డుపైకి పరుగులు తీశారు. కూతవేటు దూరంలోనే జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సంఘటన జరిగిన బస్సులో 30 మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం, ఫిట్నెస్ లేకుండానే బస్సుకు అనుమతులిచ్చిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మార్చురీ వద్దే పడిగాపులు
ఉస్మానియా ఆస్పత్రి వద్ద బస్సు దుర్ఘటన మృతుల బంధువుల నిరీక్షణ గుర్తించిన మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకోలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందినవారికి సంబంధించిన వివరాలుగానీ, మృతుల వస్తువులకు సంబంధించిగానీ ఏదైనా వివరాలు కావాలంటే హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గానీ, ఉస్మానియా ఆస్పత్రిలోని పోలీస్ హెల్ప్లైన్ కేంద్రంలోగానీ సంప్రదించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు.. కొందరు మృతుల బంధువులు శుక్రవారం ఉస్మానియా మార్చురీ వద్దకు తరలివచ్చారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం అయిన వారి దుఃఖంతో కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువులు కొందరు రెండు రోజుల నుంచీ మార్చురీ వద్దే నిరీక్షిస్తున్నారు. ఆభరణాలు, వస్తువులను బట్టి తమవారి మృతదేహాలను గుర్తించామని, వాటిని తమకు అప్పగించాలని విన్నవిస్తూనే ఉన్నారు. కాగా.. అఫ్జల్గంజ్ పీఎస్ను నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలో ఉన్నా అవి పోలీసుల అధీనంలోనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో 42 మృతదేహాలున్నాయని, వాటిని కోడ్ నంబర్లతో భద్రపరిచామని పేర్కొన్నారు. మృతదేహాల శాంపిళ్లకు, బంధువుల డీఎన్ఏ నమూనాలు సరిపోలి.. పోలీసులు అనుమతించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. వైద్య విద్య డెరైక్టర్ ఈ మృతదేహాలకు సంబంధించిన నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు. కాగా.. గురువారం 41 మంది మృతులకు సంబంధించిన బంధువులు వారి డీఎన్ఏ నమూనాలు ఇవ్వగా... మిగతా ఒక్క మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన గ్లాస్ కాంట్రాక్టర్ అజయ్ చౌహాన్ సోదరుడు వినోద్ చౌహాన్ శుక్రవారం డీఎన్ఏ శాంపిల్ ఇచ్చారు. దీంతో డీఎన్ఏ నమూనాల సేకరణ ముగిసినట్లు మహబూబ్నగర్ ఓఎస్డీ ఆపరేషన్స్ బి.కమలాకర్రెడ్డి ప్రకటించారు. డీఎన్ఏ పరిశీలన నివేదిక రావడానికి వారం రోజులకు పైనే పడుతుందని, ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ విజయకుమార్ రాజు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం తామే బంధువులకు ఫోన్ద్వారా సమాచారం ఇస్తామని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. వారం రోజులు ఎక్కడుండాలి..? బస్సు దుర్ఘటనలో మరణించిన అజయ్ చౌహాన్ మృతదేహం కోసం వచ్చిన ఆయన సోదరుడు వినోద్ చౌహాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన మృతదేహాన్ని ఇచ్చేవరకూ ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అజయ్ మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. డీఎన్ఏ పరీక్షల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. కూలి పనులు చేసుకుని జీవించే వాళ్లం. మృతదేహాన్ని ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. అంతవరకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. ప్రభుత్వాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్యం.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో యోగేష్ గౌడ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సమి తెలిపారు. ఆయనకు అమర్చిన వెంటిలేటర్ను శుక్రవారం ఉదయం తొలగించామని, ఆయన స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉత్తరప్రదేశ్కు చెందిన జైసింగ్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. క్లీనర్ అయాజ్పాషాతో పాటు క్షతగాత్రులు శ్రీకర్, రాజేష్, మజార్పాష ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.


