-
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్సిరీస్గా తీశాడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
మాదాపూర్ లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ISPL 2024: ఐఎస్పీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
Valentine's Day లేటు వయసులో సెలబ్రిటీల ప్రేమ కూడా సెన్సేషనే!
ప్రేమ బంధానికి వయసుతో సంబంధం ఏముంది.. నువ్వే నా శ్వాసా..మనసున నీకై అభిలాషా ..ప్రియతమా ఓ ప్రియతమా.. ఇదేగా ఇరు మనుసులకు బాసట...ఊరట. లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ప్రముఖులు లిస్ట్ కూడా చాలా పెద్దది. అలాంటి వారిని ఒకసారి పరిశీలిద్దాం.! మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరు గాంచిన బిల్ గేట్స్ (Bill Gates) లేటు వయసులో ప్రేమలో పడ్డాడు. తొలి భార్య మిలిందాతో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్తో ప్రేమలోపడ్డాడు. అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రియురాలు లేటు వయసులో తన ప్రేయసి లారెన్ సాంచెజ్ప్రేమలోపడ్డాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్ భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరితనాన్ని జయించేందుకు తోడు వెతుక్కున్నారు. 91 ఏళ్ల వయసులో ప్రేమను మళ్లీ పొందానని స్వయంగా ప్రకటించిన ఆయన జీవితంలో మనిషికి భాగస్వామి అవసరాన్ని నొక్కి చెప్పారాయన. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ 61ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో నాలుగోసారి ప్రేమాయణం వార్తకూడా గత ఏడాది వార్తల్లో నిలిచింది. రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఇద్దరూ చాలా ఈవెంట్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా వీరి ప్రేమే లేటెస్ట్ సెన్సేషన్. ఇక టాలీవుడ్లో పరిచయం అవసరం లేని ప్రేమ జంట నరేష్, పవిత్రా లోకేష్. పెళ్లి చేసుకున్నాం ఆశీర్వదించండి అంటూ ‘మళ్లీ పెళ్లి’ సినిమా పెళ్లి వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసిన సంచలనం రేపిన ఈ జంట లీగల్ సమస్యల కారణంగా ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్కు చెందిన తేజస్వినితో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం తేజస్విని-దిల్ రాజు దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. టాలీవుడ్లో ప్రముఖ గాయని సునీత పెళ్లి ముచ్చటను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి, ఇద్దరు బిడ్డలు, ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. విడాకుల తరువాత చాలా కాలానికి మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని సునీత టీనేజ్ పిల్లలు అర్థం చేసుకోవడమే కాదు, దగ్గరుండి మరీ మనసారా వీరి పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం గొప్ప విశేషం. వీరే కాదు.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అమ్మకు, భార్యను కోల్పోయిన తండ్రులకు కన్నబిడ్డలే పెళ్లిళ్లి చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. జీవితాలను త్యాగం చేసి, ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమను పెంచి, ప్రయోజకుల్ని అమ్మా, నాన్నల ఒంటరితనాన్ని ప్రేమతో నింపి వారి రుణం తీర్చుకున్నారు. -
'సాక్షి ఎక్సలెన్స్' అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
నవ్వుతూ ఉండాలి
‘సీతారామం’లోని సీత.. మృణాల్ ఠాకూర్.. భారీ సక్సస్ సాధించినప్పటికీ సెలెక్ట్డ్గా సినిమాలు చేస్తూ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్నే ఫ్యాషన్లోనూ చూపిస్తోంది.మా నాన్నే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ ఉండాలని నేర్పించారు. మంచి ఫలితాలకు సమయం పడుతుందని, సహనంతో వేచిచూడాలని చెబుతుంటారు. దాన్నే నమ్ముతాను! – మృణాల్ ఠాకూర్ మృణాళినీ రావ్.. ఇండియన్ టాప్ డిజైనర్స్లో ఒకరైన మృణాళినీ రావ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే! చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకుంది. పెద్దయ్యాక ఫ్యాషన్పై ఆసక్తి కలిగింది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే డిజైన్స్ను తయారుచేసి, వీకెండ్స్లో ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళినీ’ పేరుతో ఓ బొటిక్ను ప్రారంభించి, అతికొద్ది కాలంలోనే సెలబ్రిటీస్కు డిజైన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకే, ఈ బ్రాండ్ ధరలు హై రేంజ్లోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లలో లభిస్తాయి. చీర బ్రాండ్: అర్పితా మృణాళినీ రావ్,రూ.1,79,000, బ్లౌజ్ ధర: రూ. 53,760 జ్యూలరీ బ్రాండ్: ఎ జ్యూయెల్స్ బై అన్మోల్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎ జ్యూయెల్స్ బై అన్మోల్.. 1986లో ఈశూ దత్వానీ అన్మోల్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కేవలం వారి వద్ద తయారైన ఆభరణాలను మాత్రమే విక్రయించేవాడు. అంతర్జాతీయ స్థాయి డిజైన్స్ అందించటానికి విదేశీ డిజైనర్స్తోనూ కలసి పనిచేయటం మొదలుపెట్టాడు. శిల్పా శెట్టీ, లారా దత్తా, మలైకా అరోరా, ఊర్వశి ఇలా పలు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీస్ వారి పెళ్లి నగలను ఇక్కడే డిజైన్ చేయించుకున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. -దీపిక కొండి -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్వర్క్తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతమైన కెరీర్కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
డైరెక్టర్ మారుతి కూతురు ఆర్ట్ గ్యాలరీ.. సందడి చేసిన సినీతారలు (ఫొటోలు)
-
బోనాలు స్పెషల్.. అమ్మవారి సేవలో ప్రముఖులు (ఫోటోలు)
-
బాలీవుడ్ నిర్మాత మధు మంతెనా-ఇరా త్రివేది మెహందీ వేడుక (ఫొటోలు)
-
వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్
సాక్షి,ముంబై: ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్లను వెరైటీగా చూపించారు. బాలీవుడ్ నటులు మహిళలుగా చాలా అందమైన ఏఐ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. పెదవులపై లిప్స్టిక్, కొన్ని అందమైన ఆభరణాలతో ఈ సూపర్స్టార్లంతా మహిళలుగా గుర్తించలేని విధంగా మారిపోయారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) అంతేకాదు వారి పేర్లను కూడా మార్చేశాడు. అమితాబ్ బచ్చన్ కాస్తా అమితా బచ్చన్ అయ్యారు. షారూఖ్ ఖాన్ షాజాదీ ఖాన్గా, వరుణ్ ధావన్ వర్షా ధావన్గా, రాజ్పాల్ యాదవ్ రాజ్రాణి యాదవ్గా, అమీర్ ఖాన్ అమీరా ఖాన్, టైగర్ ష్రాఫ్ ఫిమేల్ వెర్షన్ టైగ్రెస్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ సల్మా ఖాన్, అక్షయ్ కుమార్ అక్షయ కుమారి, పంకజ్ త్రిపాఠి, షాహిద్ కపూర్ షాహిదా కపూర్ అయిపోవడం విశేషంగా నిలిచింది. (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) దీంతో ఫ్యాన్స్ పలు కమెంట్లతో సందడి చేశారు. అమితాబ్ బచ్చన్ అచ్చం రేఖలా ఉన్నారని ఒకరు, సల్మాన్ ఖాన్ అయితే చిత్రాంగద సింగ్ లా కనిపిస్తున్నాడని మరొకరు కమెంట్ చేశారు. ఇక షారూక్ ఖాన్ అయితే అచ్చం ఆయన భార్యలా కనిపిస్తున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఏఐ కళాకారుడు సాహిద్ మిడ్జర్నీ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న కళారూపాలను రూపొందించి సోషల్మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు రాజకీయ, వ్యాపార వర్గాల, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు మెరిసారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్ఖాన్, వరుణ్ ధావన్, భార్య మీరాతో కలిసి షాహిద్ కపూర్ రాజ్పుత్ ఉన్నారు. ఇంకా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటతోపాటు శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనం కపూర్, అలియాభట్, కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా, జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్బీఐ మాజీ మాజీ చీఫ్ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కొత్త శకానికి నాంది: అంబానీ నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన ముఖేశ్ అంబానీ స్పందిస్తూ ఇది భావి భారతానికి కళలు , సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. గ్రాండ్ లాంచ్కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Priyanka Chopra and Nick Jonas at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@priyankachopra @nickjonas pic.twitter.com/6UveIg2XFX — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023 -
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసింగ్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
నిర్మాత రమేష్ తరుణి కూతురు పెళ్లిలో సినీ తారల సందడి (ఫోటోలు)
-
CM YS Jagan Birthday Special: జన హృదయనేత జగనన్న
-
వెన్నెల వెలుగుల్లో కర్వా చౌత్ (ఫొటోలు)
-
అమ్మాయి.. అమెరికా నుంచి రాగానే చెట్టుతో పెళ్లి!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పోస్టుల వరకే... అమెరికా కోర్టు తీర్పుకు స్పందనగా ఎన్నారై అయిన బాంద్రా (ముంబయి) అమ్మాయి ‘నా శరీరం, నా నియమాలు’ అని పోస్టులు పెడుతూవుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రులేమో ఆమె ఇక్కడికి వచ్చీరాగానే కుజదోషం పోవడానికి చెట్టుతో పెళ్లి చేయడానికి యోచిస్తూవున్నారు. – అభిజిత్ గంగూలీ, కమెడియన్ ఇదెక్కడి సమస్య? అత్యాచారానికి పడే శిక్ష కంటే, అత్యాచారానంతర అబార్షన్కు ఎక్కువ శిక్ష పడేట్టయితే– ఇంక దాన్ని మనం మహిళల మీద జరుగుతున్న యుద్ధం అనుకోవాలి. – మహమ్మద్ సాఫా, యాక్టివిస్ట్ మన చేతుల్లో లేవు అంటే, ఈ వారంలో అమెరికా సుప్రీంకోర్టు వైఖరిని బట్టి మనం ఇలా అనేసుకోవచ్చు: జీవితం అనేది గర్భధారణతో మొదలై, మాస్ షూటింగ్తో అంతం అవుతుందన్నమాట! – ఆరియానా హఫింగ్టన్, మీడియా అధినేత్రి అతిపెద్ద నిపుణులు మీరు కోటీశ్వరులైనా అవండి, లేకపోతే ప్రభువులు అయినా కండి. అప్పుడు మీకు ఇంకే అర్హత లేకపోయినా మీరు కోవిడ్, గ్లోబల్ వార్మింగ్, జీఎంఓ లాంటి వాటిమీద మాట్లాడే నిపుణులు అయిపోతారు. – ఎవీ డస్కాలూ, స్కిన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ మాయమవుతోంది నేను 2017లో జర్మనీ బుక్ టూర్ చేస్తున్నప్పుడు, హిట్లర్ కాలంలో పిల్లాడిలా ఉన్న ఒక జర్మనీ పోలీస్ డిటెక్టివ్, ‘‘చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యం ముందు అంగుళాల కొద్దీ మాయమవుతూ, తర్వాత వెంటనే లేకుండా పోతుంది’’ అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది నమ్మాను, ఇప్పుడు మనం చూస్తున్నాం. – జెన్నా బ్లూమ్, రచయిత్రి కదా! దేవుడు ఎంత ఆలోచనాత్మకంగా కొన్నింటిని ఏర్పాటు చేస్తాడంటే– నువ్వు ఎక్కడైతే పుడతావో, ఆ స్థానిక మతమే మిగిలిన అన్నింటికంటే అసలైన మతం అయి తీరుతుంది. – రిచర్డ్ డాకిన్స్, బయాలజిస్ట్, రచయిత రెండూ జతగా... పిల్లలన్నాక ఏడుస్తారు. విమానంలో పిల్లలు ఏడవడంలో మీకు సమస్య ఉంటే దాన్ని ఎదుర్కోక తప్పదు. అంతేగానీ తల్లివైపు తేరిపార చూడటం, ‘ప్చ్’ అని పెదవులు ఆడించడం వల్ల లాభం లేదు. గుక్కపెట్టి ఏడ్చే పిల్లల్ని ఊరడించే తల్లులను మీరు అలా చూసేట్టయితే ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్టూ వాడకపోతే మంచిది. ఈ అంకుల్స్ ఇయర్ఫోన్స్ లేకుండా వీడియోలు, రీల్స్ చూస్తుంటారుగానీ పసిపిల్లలు మాత్రం ఏడవకూడదంట! – నిశా సుబ్రమణియం, టీచర్ ఒప్పుకోవాలి ఎమర్జెన్సీ, ‘1984’... ఈ రెండు తప్పులనూ కాంగ్రెస్ అంగీకరించి ముందుకు సాగాలి. అయితేలూ, కానీలూ వద్దు. – అశోక్ స్వైన్, ప్రొఫెసర్ -
తగ్గేదేలే అంటున్న కరోనా
Pagination
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
మోదీ కొత్త క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్లోకి చొరబడేందుకు..
ప్రపంచ ఆర్థిక వేదిక జాబితాలో భారత కంపెనీలకు చోటు
పార్లమెంట్ లోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’
మూడోసారి సునీత అంతరిక్ష ప్రయాణం
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
రెడ్ డ్రస్లో మెస్మరైజ్ చేస్తున్న'చాందిని చౌదరి' లేటెస్ట్ (ఫొటోలు)
Advertisement