Celebreties
-
ఫ్యాషన్ రంగంలో పాపులర్గా : సెల‘ప్రెట్టీ’ లుక్
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సోనమ్ కపూర్ ర్యాంప్వాక్ చేశారు. వావ్.. డ్రెస్.. హూ ఈజ్ ద డిజైనర్? ఇలా ప్రశ్నలకు ఓహ్.. షీ ఈజ్ జయంతిరెడ్డి ఫ్రమ్ హైదరాబాద్.. ఇలాంటి సమాధానాలలో నగరం పేరు వినిపించడం ముంబయి, ఢిల్లీ, చెన్నై, గోవా, బెంగళూరు.. తదితర చోట్ల సర్వసాధారణంగా మారుతోంది. ఒకప్పుడు సెలిబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజైనర్ అనగానే ముంబయి డిజైనర్ పేరు చెప్పేవారు. ఇప్పుడు నగరంలో టాప్ డిజైనర్లు సెలిబ్రిటీ డిజైనర్లుగా పేరొందారు. – సాక్షి, సిటీబ్యూరోనగర డిజైనర్ల విజయాలు ఔత్సాహిక డిజైనర్లకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు గెలుపు పాఠాలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు నగరానికి చెందిన పలువురు టాప్ సెలిబ్రిటీ డిజైనర్ల గురించిన విశేషాలను అందిస్తున్నారు. ‘సోమ్’.. ఫేమ్.. నగరానికి చెందిన డిజైనర్ శ్రియా సోమ్ ఆధునిక మహిళ డ్రీమ్ డ్రెస్సింగ్ను అందిస్తారు. సున్నితమైన హస్తకళ, క్లిష్టమైన అలంకారాలు, సొగసైన ఛాయాచిత్రాలకు ఆమె లేబుల్ శ్రియా సోమ్ ప్రసిద్ధి చెందింది. పీవీ సింధు, జాన్వీ కపూర్, లీసా హేడన్ తదితరులు ఆమె జాబితాలో ఉన్న కొందరు సెలిబ్రిటీలు.. అంతేకాక ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అందానికి వన్నెలు.. అనుశ్రీ.. క్లిష్టమైన పనితనం, ఆకర్షణీయమైన సిల్హౌట్లు ఉన్న ఎథెరియల్ లెహంగాలకు అనుశ్రీ రెడ్డి లేబుల్ పర్యాయపదంగా మారింది. లెహంగా సిల్హౌట్లు వాటి డీప్ కట్వర్క్ నెక్లైన్లు, ఎంబ్రాయిడరీ కట్వర్క్ అంచులతో ఉన్న దుపట్టాలకు ఆమె హాఫ్ శారీస్ ప్రసిద్ధి చెందాయి. అందమైన గులాబీలు, పాస్టెల్ల నుంచి రాయల్ వైలెట్లు, బంగారు పసుపు వరకూ రంగుల మిశ్రమాన్ని ఆమె చాకచక్యంగా ఉపయోగిస్తారు. ఇటీవలి లాక్మే ఫ్యాషన్ వీక్లో ఆమె కలెక్షన్స్.. అందమైన ఆర్గాన్జా, పూల ఎంబ్రాయిడరీ కట్వర్క్, తక్కువ చతురస్రాకార నెక్లైన్లు అన్ని షేడ్స్ న్యూడ్లు పింక్లతో మెరిపించాయి. ఆమె వర్క్ చేసిన సెలిబ్రిటీలలో అలియాభట్, కత్రినాకైఫ్, తాప్సీ పన్ను.. తదితరులు ఉన్నారు. ఆకా‘సమంత’.. అర్చన.. ఇటీవల నగరం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన డిజైనర్లలో అర్చనరావు ముందు వరుసలో ఉన్నారు. 2012లో లాక్మే ఫ్యాషన్ వీక్లో తన లేబుల్ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే ‘వోగ్ ఇండియన్ ఫ్యాషన్ ఫండ్’ను గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ప్రభాస్ కల్కి సినిమాకు ఆమె చేసిన వర్క్ ప్రశంసలకు నోచుకుంది. బాలీవుడ్ బాద్‘షా’.. నగరం నుంచి బాలీవుడ్ తారలకు డిజైన్లు అందించిన ఘనతను గౌరంగ్ షా సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల పనితనానికి పట్టం కడుతూ చేతితో నేసిన చీరలకు ప్రసిద్ధి చెందాడు. విద్యాబాలన్, సోనమ్ కపూర్, అదితీరావ్ హైదరీ సహా మరెందరో ఆయన డిజైన్లకు జై కొట్టారు. మహానటి సినిమా ద్వారా జాతీయ పురస్కారం అందుకున్నారు. మనదే ‘జయం’.. జయంతి రెడ్డి డిజైన్లు రాయల్ అద్భుత కథల వైబ్లను అందించడం ఖాయం. ఆమె డిజైన్Œలు సంప్రదాయ స్కర్ట్లు/లెహెంగాలతో జత చేసిన ఆధునిక క్రాప్–టాప్ సిల్హౌట్లు ఆసక్తికరమైన మిక్స్. గోల్డెన్, సిల్వర్జరీతో కూడిన ఆమె ఎంబ్రోయిడరీ వర్క్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్. అర్చనరావు డిజైన్ చేసిన న్యూడ్ కలర్ లేత గోధుమరంగు చీరకు బేబీ పింక్ కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజ్ మెటాలిక్ సిల్వర్ బెల్ట్తో జత చేసి, నటి సమంతా మెరిశారు. ఫెమినా వెడ్డింగ్ టైమ్స్లో ప్రదర్శించబడిన టూ–టోన్డ్ కార్సెట్ రఫిల్ డ్రెస్లో జాన్వీ కపూర్ మెరిశారు. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, డిజైనర్ శ్రియా సోమ్ మొదటి సోలో షో కోసం ర్యాంప్ వాక్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్లో షో స్టాపర్గా లీసా హేడన్ డిజైనర్ శ్రియా సోమ్ మెరిసే, పొడవాటి చేతుల చోళీ అద్భుతమైన లెహంగా ధరించి.. అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోనమ్ కపూర్ గౌరంగ్ షా డిజైన్ చేసిన పసుపు రంగు కుర్తా లెహంగా స్కర్ట్తో మ్యాచింగ్ దుపట్టా ధరించి ఒక ఈవెంట్కు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉత్సవాల్లో, బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ డిజైనర్ గౌరంగ్షా తీర్చిదిద్దిన ఆల్ ఇన్ ఆల్ అనార్కలీ సూట్ ధరించారు. ఓ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఈవెంట్కి రకుల్ ప్రీత్ సింగ్ అర్చనారావు డిజైన్లు ధరించి హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇదీ చదవండి: మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది! -
చెన్నైలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్.. హాజరైన కోలీవుడ్ సినీతారలు (పోటోలు)
-
హిట్ మూవీతో హిట్ కొట్టేసిన అందాల భామ నువేక్ష (ఫోటోలు)
-
తిరుమలలో సినీ ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్గా
ప్రస్తుతం స్పెయిన్లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్లు, బార్లు, కాఫీ హౌస్లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
పెళ్లి మూడ్లో బిగ్బాస్ బ్యూటీ సోనియా ఆకుల.. ప్రముఖులకు ఆహ్వానాలు! (ఫొటోలు)
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
సెలూన్ ఓపెనింగ్లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
లవ్ అండ్ లైట్ : ఫెస్టివ్ వైబ్స్తో కళకళలాడిపోతున్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
శోకసంద్రంలో మలైకా అరోరా, తరలి వచ్చిన బీటౌన్ పెద్దలు (ఫొటోలు)
-
సెలబ్రిటీలు.. వారి గ్రాండ్ పేరెంట్స్ మరిచిపోలేని బంధం (ఫోటోలు)
-
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
ఎక్కువ ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్లోని శివాజీ పార్క్లో సచిన్కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్గా , గ్లోబల్ అఫైర్స్లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్లో ట్రైనర్గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్గా పనిచేశాడట. -
సినీ ప్రముఖులతో మహేశ్ బాబు కుమార్తె సితార పోజులు.. ఫోటోలు చూశారా?
-
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
అనంత్-రాధిక పెళ్లిలో.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
'అనంత్, రాధిక' సంగీత్ ఫంక్షన్.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్సిరీస్గా తీశాడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
మాదాపూర్ లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ISPL 2024: ఐఎస్పీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
Valentine's Day లేటు వయసులో సెలబ్రిటీల ప్రేమ కూడా సెన్సేషనే!
ప్రేమ బంధానికి వయసుతో సంబంధం ఏముంది.. నువ్వే నా శ్వాసా..మనసున నీకై అభిలాషా ..ప్రియతమా ఓ ప్రియతమా.. ఇదేగా ఇరు మనుసులకు బాసట...ఊరట. లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ప్రముఖులు లిస్ట్ కూడా చాలా పెద్దది. అలాంటి వారిని ఒకసారి పరిశీలిద్దాం.! మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరు గాంచిన బిల్ గేట్స్ (Bill Gates) లేటు వయసులో ప్రేమలో పడ్డాడు. తొలి భార్య మిలిందాతో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్తో ప్రేమలోపడ్డాడు. అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రియురాలు లేటు వయసులో తన ప్రేయసి లారెన్ సాంచెజ్ప్రేమలోపడ్డాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్ భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరితనాన్ని జయించేందుకు తోడు వెతుక్కున్నారు. 91 ఏళ్ల వయసులో ప్రేమను మళ్లీ పొందానని స్వయంగా ప్రకటించిన ఆయన జీవితంలో మనిషికి భాగస్వామి అవసరాన్ని నొక్కి చెప్పారాయన. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ 61ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో నాలుగోసారి ప్రేమాయణం వార్తకూడా గత ఏడాది వార్తల్లో నిలిచింది. రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఇద్దరూ చాలా ఈవెంట్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా వీరి ప్రేమే లేటెస్ట్ సెన్సేషన్. ఇక టాలీవుడ్లో పరిచయం అవసరం లేని ప్రేమ జంట నరేష్, పవిత్రా లోకేష్. పెళ్లి చేసుకున్నాం ఆశీర్వదించండి అంటూ ‘మళ్లీ పెళ్లి’ సినిమా పెళ్లి వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసిన సంచలనం రేపిన ఈ జంట లీగల్ సమస్యల కారణంగా ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్కు చెందిన తేజస్వినితో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం తేజస్విని-దిల్ రాజు దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. టాలీవుడ్లో ప్రముఖ గాయని సునీత పెళ్లి ముచ్చటను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి, ఇద్దరు బిడ్డలు, ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. విడాకుల తరువాత చాలా కాలానికి మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని సునీత టీనేజ్ పిల్లలు అర్థం చేసుకోవడమే కాదు, దగ్గరుండి మరీ మనసారా వీరి పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం గొప్ప విశేషం. వీరే కాదు.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అమ్మకు, భార్యను కోల్పోయిన తండ్రులకు కన్నబిడ్డలే పెళ్లిళ్లి చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. జీవితాలను త్యాగం చేసి, ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమను పెంచి, ప్రయోజకుల్ని అమ్మా, నాన్నల ఒంటరితనాన్ని ప్రేమతో నింపి వారి రుణం తీర్చుకున్నారు. -
'సాక్షి ఎక్సలెన్స్' అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
నవ్వుతూ ఉండాలి
‘సీతారామం’లోని సీత.. మృణాల్ ఠాకూర్.. భారీ సక్సస్ సాధించినప్పటికీ సెలెక్ట్డ్గా సినిమాలు చేస్తూ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్నే ఫ్యాషన్లోనూ చూపిస్తోంది.మా నాన్నే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎన్ని సమస్యలున్నా హాయిగా నవ్వుతూ ఉండాలని నేర్పించారు. మంచి ఫలితాలకు సమయం పడుతుందని, సహనంతో వేచిచూడాలని చెబుతుంటారు. దాన్నే నమ్ముతాను! – మృణాల్ ఠాకూర్ మృణాళినీ రావ్.. ఇండియన్ టాప్ డిజైనర్స్లో ఒకరైన మృణాళినీ రావ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే! చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకుంది. పెద్దయ్యాక ఫ్యాషన్పై ఆసక్తి కలిగింది. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే డిజైన్స్ను తయారుచేసి, వీకెండ్స్లో ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించేది. 2014లో ‘మృణాళినీ’ పేరుతో ఓ బొటిక్ను ప్రారంభించి, అతికొద్ది కాలంలోనే సెలబ్రిటీస్కు డిజైన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అందుకే, ఈ బ్రాండ్ ధరలు హై రేంజ్లోనే ఉంటాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లలో లభిస్తాయి. చీర బ్రాండ్: అర్పితా మృణాళినీ రావ్,రూ.1,79,000, బ్లౌజ్ ధర: రూ. 53,760 జ్యూలరీ బ్రాండ్: ఎ జ్యూయెల్స్ బై అన్మోల్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎ జ్యూయెల్స్ బై అన్మోల్.. 1986లో ఈశూ దత్వానీ అన్మోల్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కేవలం వారి వద్ద తయారైన ఆభరణాలను మాత్రమే విక్రయించేవాడు. అంతర్జాతీయ స్థాయి డిజైన్స్ అందించటానికి విదేశీ డిజైనర్స్తోనూ కలసి పనిచేయటం మొదలుపెట్టాడు. శిల్పా శెట్టీ, లారా దత్తా, మలైకా అరోరా, ఊర్వశి ఇలా పలు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీస్ వారి పెళ్లి నగలను ఇక్కడే డిజైన్ చేయించుకున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. -దీపిక కొండి -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్వర్క్తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతమైన కెరీర్కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
డైరెక్టర్ మారుతి కూతురు ఆర్ట్ గ్యాలరీ.. సందడి చేసిన సినీతారలు (ఫొటోలు)
-
బోనాలు స్పెషల్.. అమ్మవారి సేవలో ప్రముఖులు (ఫోటోలు)
-
బాలీవుడ్ నిర్మాత మధు మంతెనా-ఇరా త్రివేది మెహందీ వేడుక (ఫొటోలు)
-
వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్
సాక్షి,ముంబై: ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్లను వెరైటీగా చూపించారు. బాలీవుడ్ నటులు మహిళలుగా చాలా అందమైన ఏఐ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. పెదవులపై లిప్స్టిక్, కొన్ని అందమైన ఆభరణాలతో ఈ సూపర్స్టార్లంతా మహిళలుగా గుర్తించలేని విధంగా మారిపోయారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) అంతేకాదు వారి పేర్లను కూడా మార్చేశాడు. అమితాబ్ బచ్చన్ కాస్తా అమితా బచ్చన్ అయ్యారు. షారూఖ్ ఖాన్ షాజాదీ ఖాన్గా, వరుణ్ ధావన్ వర్షా ధావన్గా, రాజ్పాల్ యాదవ్ రాజ్రాణి యాదవ్గా, అమీర్ ఖాన్ అమీరా ఖాన్, టైగర్ ష్రాఫ్ ఫిమేల్ వెర్షన్ టైగ్రెస్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ సల్మా ఖాన్, అక్షయ్ కుమార్ అక్షయ కుమారి, పంకజ్ త్రిపాఠి, షాహిద్ కపూర్ షాహిదా కపూర్ అయిపోవడం విశేషంగా నిలిచింది. (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) దీంతో ఫ్యాన్స్ పలు కమెంట్లతో సందడి చేశారు. అమితాబ్ బచ్చన్ అచ్చం రేఖలా ఉన్నారని ఒకరు, సల్మాన్ ఖాన్ అయితే చిత్రాంగద సింగ్ లా కనిపిస్తున్నాడని మరొకరు కమెంట్ చేశారు. ఇక షారూక్ ఖాన్ అయితే అచ్చం ఆయన భార్యలా కనిపిస్తున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఏఐ కళాకారుడు సాహిద్ మిడ్జర్నీ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న కళారూపాలను రూపొందించి సోషల్మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్ఎంఏసీసీ ఆరంభోత్సవానికి పలువురు రాజకీయ, వ్యాపార వర్గాల, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకల్లోఅంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు మెరిసారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్ఖాన్, వరుణ్ ధావన్, భార్య మీరాతో కలిసి షాహిద్ కపూర్ రాజ్పుత్ ఉన్నారు. ఇంకా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటతోపాటు శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనం కపూర్, అలియాభట్, కొత్త జంట సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా తదితర అతిరధమహారథులంతా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇంకా టీవీ ప్రముఖులలో రాహుల్ వైద్య, దిశా పర్మార్ , తారక్ మెహతా కా ఊల్తా చష్మా, జెతలాల్ ఏకేఏ దిలీప్ జోషిగాయని శ్రేయా కూడా కనిపించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుటుంబం, అమృత ఫడ్నవీస్తో దేవేంద్ర ఫడ్నవిస్, ఎస్బీఐ మాజీ మాజీ చీఫ్ అరుంధతి భట్టాచార్య,సద్గురు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. గ్రాండ్ ఓపెనింగ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కొత్త శకానికి నాంది: అంబానీ నీతా చిరకాల స్వప్నం నెరవేరడంపై స్పందించిన ముఖేశ్ అంబానీ స్పందిస్తూ ఇది భావి భారతానికి కళలు , సంస్కృతికి కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లేదా ఎన్ఎంఏసీసీ అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. గ్రాండ్ లాంచ్కి పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Priyanka Chopra and Nick Jonas at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@priyankachopra @nickjonas pic.twitter.com/6UveIg2XFX — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023 -
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసింగ్లో ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
నిర్మాత రమేష్ తరుణి కూతురు పెళ్లిలో సినీ తారల సందడి (ఫోటోలు)
-
CM YS Jagan Birthday Special: జన హృదయనేత జగనన్న
-
వెన్నెల వెలుగుల్లో కర్వా చౌత్ (ఫొటోలు)
-
అమ్మాయి.. అమెరికా నుంచి రాగానే చెట్టుతో పెళ్లి!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! పోస్టుల వరకే... అమెరికా కోర్టు తీర్పుకు స్పందనగా ఎన్నారై అయిన బాంద్రా (ముంబయి) అమ్మాయి ‘నా శరీరం, నా నియమాలు’ అని పోస్టులు పెడుతూవుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రులేమో ఆమె ఇక్కడికి వచ్చీరాగానే కుజదోషం పోవడానికి చెట్టుతో పెళ్లి చేయడానికి యోచిస్తూవున్నారు. – అభిజిత్ గంగూలీ, కమెడియన్ ఇదెక్కడి సమస్య? అత్యాచారానికి పడే శిక్ష కంటే, అత్యాచారానంతర అబార్షన్కు ఎక్కువ శిక్ష పడేట్టయితే– ఇంక దాన్ని మనం మహిళల మీద జరుగుతున్న యుద్ధం అనుకోవాలి. – మహమ్మద్ సాఫా, యాక్టివిస్ట్ మన చేతుల్లో లేవు అంటే, ఈ వారంలో అమెరికా సుప్రీంకోర్టు వైఖరిని బట్టి మనం ఇలా అనేసుకోవచ్చు: జీవితం అనేది గర్భధారణతో మొదలై, మాస్ షూటింగ్తో అంతం అవుతుందన్నమాట! – ఆరియానా హఫింగ్టన్, మీడియా అధినేత్రి అతిపెద్ద నిపుణులు మీరు కోటీశ్వరులైనా అవండి, లేకపోతే ప్రభువులు అయినా కండి. అప్పుడు మీకు ఇంకే అర్హత లేకపోయినా మీరు కోవిడ్, గ్లోబల్ వార్మింగ్, జీఎంఓ లాంటి వాటిమీద మాట్లాడే నిపుణులు అయిపోతారు. – ఎవీ డస్కాలూ, స్కిన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ మాయమవుతోంది నేను 2017లో జర్మనీ బుక్ టూర్ చేస్తున్నప్పుడు, హిట్లర్ కాలంలో పిల్లాడిలా ఉన్న ఒక జర్మనీ పోలీస్ డిటెక్టివ్, ‘‘చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యం ముందు అంగుళాల కొద్దీ మాయమవుతూ, తర్వాత వెంటనే లేకుండా పోతుంది’’ అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది నమ్మాను, ఇప్పుడు మనం చూస్తున్నాం. – జెన్నా బ్లూమ్, రచయిత్రి కదా! దేవుడు ఎంత ఆలోచనాత్మకంగా కొన్నింటిని ఏర్పాటు చేస్తాడంటే– నువ్వు ఎక్కడైతే పుడతావో, ఆ స్థానిక మతమే మిగిలిన అన్నింటికంటే అసలైన మతం అయి తీరుతుంది. – రిచర్డ్ డాకిన్స్, బయాలజిస్ట్, రచయిత రెండూ జతగా... పిల్లలన్నాక ఏడుస్తారు. విమానంలో పిల్లలు ఏడవడంలో మీకు సమస్య ఉంటే దాన్ని ఎదుర్కోక తప్పదు. అంతేగానీ తల్లివైపు తేరిపార చూడటం, ‘ప్చ్’ అని పెదవులు ఆడించడం వల్ల లాభం లేదు. గుక్కపెట్టి ఏడ్చే పిల్లల్ని ఊరడించే తల్లులను మీరు అలా చూసేట్టయితే ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్టూ వాడకపోతే మంచిది. ఈ అంకుల్స్ ఇయర్ఫోన్స్ లేకుండా వీడియోలు, రీల్స్ చూస్తుంటారుగానీ పసిపిల్లలు మాత్రం ఏడవకూడదంట! – నిశా సుబ్రమణియం, టీచర్ ఒప్పుకోవాలి ఎమర్జెన్సీ, ‘1984’... ఈ రెండు తప్పులనూ కాంగ్రెస్ అంగీకరించి ముందుకు సాగాలి. అయితేలూ, కానీలూ వద్దు. – అశోక్ స్వైన్, ప్రొఫెసర్ -
తగ్గేదేలే అంటున్న కరోనా
-
Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు
సాక్షి, హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సిరివెన్నెల మరణం తీరని లోటంటూ సంతాపం వెలిబుచ్చారు. Heartbroken After my Father,he was d only 1 who wud scold,Correct or appreciate me rightfully Wil miss U Dearest Uncle Lov U & ThankU 4 all d Magical Lyrics dat decorated my Tunes & 4 Encouraging my Lyrics U r Irreplaceable — DEVI SRI PRASAD (@ThisIsDSP) November 30, 2021 'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు — Chiranjeevi Konidela (@KChiruTweets) November 30, 2021 ప్రముఖ నటుడుప్రకాశ్ రాజ్, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు దేవ కట్టా, అనిల్ రావిపూడి ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?... విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. అలాగే నా తండ్రి తరువాత నన్నునడిపించిన ఏకైక వ్యక్తి మీరు .. మిస్ యూ అంకుల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. (Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే) ‘పదం ఆయన ఆస్తి... జ్ఞానంతో ఆయనకు దోస్తీ ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (Sirivennela Seetharama Sastry చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’) "మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు" - మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?...విశ్వాత్మలో కలిసిపోయావా? — dev katta (@devakatta) November 30, 2021 జగమంత కుటుంబం మీది మీరు లేక ఏకాకి జీవితం మాది... Unbearable loss thank you for the poetic perceptions which added meaning in to our lives .. YOU WERE THE BEST GURUJI తెలుగు సాహిత్య శిఖరం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి..... కన్నీటి వీడ్కోలు ...... ,, — Anil Ravipudi (@AnilRavipudi) November 30, 2021 — Prakash Raj (@prakashraaj) November 30, 2021 The Lyrical Legend. It's deeply saddening to hear the demise of Sirivennela Seetharama Sastry Garu. There will never be one like him. There will never shine another star like the way he did. May his soul rest in peace — v e n u u d u g u l a (@venuudugulafilm) November 30, 2021 His words, his songs and his magic will live forever. ఆయన సాహిత్యం లోని సిరివెన్నెల మన మనసుల మీద ఎప్పటికీ అలానే వుంటుంది. వీడుకోలు గురువు గారూ.. — Nani (@NameisNani) November 30, 2021 Thank you #SirivennelaSeetharamaSastry Garu for your unparalleled contribution to our industry. You shall forever be remembered and missed. Honoured to have known you and worked with you. Rest in peace sir. — RAm POthineni (@ramsayz) November 30, 2021 -
Terrific Road Accidents: తీరని విషాదాలు
-
తీవ్ర విషాదం నింపుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: అతివేగమో, మద్యం మత్తో, రేసింగ్ పిచ్చో, ఎదుటి వారి నిర్లక్క్ష్యమో కారణం ఏదైతేనేమి ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చెట్టంత ఎదిగిన బిడ్డలు కళ్లముందే తిరిగి రాని లోకాలకు తరలిపోతోంటే కన్నవారి గుండెలవిసిపోతున్నాయి. ఆ మానసిక క్షోభ జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు బాబూ మోహన్ భావోద్వేగం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తోంది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి అంటూ ఆయనిచ్చిన సందేశం యువతలో ఆలోచన రేపుతోంది. వాహనాలు నడిపేటపుడు వాహదారులు పాటించాల్సిన నిబంధనల ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. -
మురిసిపోతున్న సెలబ్రిటీలు: సంబరాలు మామూలుగా లేవుగా!
టోక్యో ఒలింపిక్స్ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. గురువారం జర్మనీతో జరిగిన పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయం సాధించి యావత్దేశాన్ని ఎనలేని ఆనందంలో ఓలలాడించింది. ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్ మహీంద్ర, కిరణ మజుందార్ షా లాంటి వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు భారత హాకీ జట్టు ఘనతను పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు కల నిజమైందంటూ మురిసిపోతున్నారు. మెన్ ఇన్ బ్లూ.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ స్పందిస్తూ వావ్ !! భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన మ్యాచ్ అంటూ షారూఖ్ పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయం! అద్భుత ప్రదర్శన 41 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఒలింపిక్ పతకం.. అంటూ టీమిండియాకు అభినందనలు తెలిపారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా. మరోవైపు పురుషుల హాకీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా మణిపూర్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంపాల్లో హాకీ ఆటగాడు నీలకంఠ శర్మ కుటుంబం సంతోషానికి హద్దే లేకుండా పోయింది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులంతాచేరి నృత్యాలతో సందడి చేశారు. అటు పంజాబ్లో అమృత సర్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. గుర్జంత్ సింగ్ కుటుంబ సభ్యులు డాన్స్లతో భారత జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒలింపిక్స్లో పురుషుల హాకీలో టీం కాంస్య పతకం ఖాయం కావడంతో పంజాబ్కు భారత హాకీ ఆటగాడు మన్ దీప్ సింగ్ కుటుంబం సంబరాలు చేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం పతకం సాధించింది. ఈ విజయంపై తనకు మాటలురావడం లేదంటూ మన్ దీప్ తండ్రి రవీందర్ సింగ్ ఆనందాన్ని ప్రకటించారు. Yeaaa! What a win for our men in blue - after 41 years we get to stand on the podium for Olympic Hockey! Jai Hind! 👏👏👍 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) August 5, 2021 -
టిక్టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: పాపులర్ వీడియో-షేరింగ్ ప్లాట్ ఫాం టిక్టాక్ ను ప్రభుత్వం నిషేధించడంతో పలువురు సెలబ్రిటీలతోపాటు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఖాతాలు కూడా చిన్నబోయాయి. బాలీవుడ్ నటులు నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలు డేటా భద్రతపై అవగాహనకోసం దీన్నిఇప్పటిదాకా విరివిగా ఉపయోగించుకున్నాయి. ప్రధానంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాధి విస్తరణపై ప్రజల్లో సందేహాలను, భయాలను తొలగించేందుకు, మరింత అవగాహన కోసం దీన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే తాజా నిషేధంతో ఇవి ఒకింత నష్టపోయినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. (నిషేధంపై టిక్టాక్ స్పందన) టిక్టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు అయోమయంలో పడిపోయారు. టిక్టాక్ భారీ క్రేజ్ ను సొమ్ము చేసుకున్న సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్ కోసం ఈ యాప్ ను బాగా వాడుకున్నారు. అలాగే అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటూ వచ్చారు. బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొనె నుంచి సారా అలీఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ ఈ వరుసలో ప్రముఖంగా ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి కొంతకాలం కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధానికి ముందు, ఇటీవల టిక్టాక్ నుంచి తొలగించకముందు సుమారు పది లక్షల మంది ఫాలోవర్స్ తో చాలా యాక్టివ్ గా ఉన్న ప్రభుత్వ యాప్ మై గవర్నమెంట్ ఇండియా. అధికారిక మైగోవ్ ఒక్కటే కాదు, దీంతోపాటు కర్ణాటక ప్రభుత్వం, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ వంటి అనేక సంస్థలు కోవిద్-19పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దీన్ని వినియోగించుకుంటున్నాయి. అలాగే భారత-చైనా ఉద్రిక్తత, ప్రధానమంత్రి సందేశాలను ప్రచారంలోకి తెచ్చెందుకు ప్రెస్ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ యాప్ ని వినియోగించుకునేది. మరోవైపు చైనా కంపెనీతో సిగ్నలింగ్ కాంట్రాక్టును ఇటీవల రద్దు చేసుకున్న రైల్వే శాఖకూ టిక్టాక్ అకౌంట్ ఉండటం గమనార్హం. అటు టిక్టాక్ నిషేధంపై సాధారణ ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. టిక్టాక్ నిషేధంతో వికృత వీడియోల బెడద తప్పిందని కొందరు భావిస్తోంటే, నిజమైన దేశభక్తులుగా చైనా యాప్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందని కొంతమంది విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. -
సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్ కోహ్లి
ఫోర్బ్స్ ఎంటర్టైన్మెంట్ రంగంలో టాప్-100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారికున్న క్రేజ్ను బట్టి స్థానాలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్లను వెనక్కునెట్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, దీపిక పదుకునే టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ఖాన్ను వెనక్కునెట్టి కిలాడీ అక్షయ్ కుమార్(రూ.293.25 కోట్లు) రెండో స్థానం సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అగ్ర స్థానంలోనే కొనసాగుతూ వచ్చిన సల్మాన్ఖాన్(రూ.229.25కోట్లు) ఈ యేడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీలు అలియా భట్, దీపిక పదుకునే 8, 10 స్థానాల్లో పాగా వేశారు. ‘కౌన్ బరేగా కరోడ్పతి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన బిగ్బీ అమితాబ్ బచ్చన్ రూ.239.25 కోట్లతో నాలుగో తర్వాతి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. గతేడాది ఈ జాబితాలో పేరు కానరాని డార్లింగ్ ప్రభాస్(రూ.35 కోట్లు) ఈ సారి ఏకంగా 44వ స్థానంలో ఉన్నాడు. నిరుడు 33వ స్థానంలో ఉన్న టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు(రూ.35 కోట్లు) 54వ స్థానానికి పరిమితమయ్యారు. తొలిసారిగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్(రూ.21.5 కోట్లు) 77వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడు సెలబ్రిటీల ఆదాయం 22 శాతం పెరిగినట్టుగా ఫోర్బ్స్ వెల్లడించింది. -
మణిరత్నం సహా 50మందిపై కేసు నమోదు
ముజఫర్పూర్: దేశ రాజకీయాల్లో ఆసక్తిరేపిన 50మంది సెలబ్రిటీల లేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం సహా పలువురు మేధావులపై దేశద్రోహం కేసు నమోదయింది. మూకుమ్మడి దాడులు, హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన 50 మంది సెలెబ్రెటీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకుగాను రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్ణా సేన్ తదితరులపై దేశద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదయింది. దాదాపు మూడు నెలల క్రితం దేశంలో అసహనం పెరిగిపోతుందని, మాబ్ లించింగ్ మితిమీరు తున్నాయంటూ అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యాం బెనగల్ అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ, శుభ ముద్గల్ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రధాని మోదీనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. అయితే దీనికి నిరసనగా సుధీర్కుమార్ ఓజీ బీహార్ లోని బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను మంటకలిపారని, ప్రధాని అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసిన లేఖపై 50 మంది ప్రముఖులు సంతకాలు చేశారని ఆరోపిస్తూ ఓజా కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ను అంగీకరించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆగస్టు 20న ఈ ఉత్తర్వులిచ్చారనీ, ఈ మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని ఓజా చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఏకంగా ప్రధాన మంత్రినుద్దేశించి బహిరంగ లేఖ రాసిన 50 మంది లేఖ రాయడం, ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని కాషాయదళం, దానికి అనుబంధంగా మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి లాంటి పరిణామాలు తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకులు శ్యాంబెనగల్, అనురాగ్ కశ్యప్ -
సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై స్పందించిన నగ్మా
రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా ‘సుల్తాన్’ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు. సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్నచూపు చూడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన పని తప్పే అయినా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతని క్యారెక్టర్ ను శకించడం తగదని అన్నారు. బహుశా రేప్ బాధిత మహిళల జీవితం గురించి చెప్తూ ఇలా అని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇక రేప్ అనేది చిన్న విషయం అనే భావనను సల్మాన్ ప్రజల్లోకి పంపారని దీనిపై ఆయన క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదని ప్రముఖ కాలమిస్ట్ అన్నా ఎమ్. వెట్టికడ్ పేర్కొన్నారు. సల్మాన్ పై తనకు ఎలాంటి దురాభిప్రాయం లేదని కానీ, ఇలాంటి సంఘటనల్లో పురుషులకు వెన్నుదన్నుగా నిలబడటం ములాయం లాంటి వాళ్లకు సాయం చేసినట్లేనని, వాళ్లు అబ్బాయిలు వాళ్లు తప్పులు చేస్తూనే ఉంటారని అన్నావెట్టికాడ్ అన్నారు. మహిళలపై సల్మాన్ వ్యాఖ్యలు అతని మైండ్ సెట్ ను తెలియజేస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం అన్నారు. సల్మాన్ లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. రేప్ అనే విషయాన్ని సల్మాన్ చిన్నవిషయంగా భావించలేదని, అయితే ఈ విషయంపై దేశమంతా ఇప్పుడు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని పూజా బేడీ వ్యాఖ్యానించారు. -
ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో టాలీవుడ్ ప్రముఖులు పలువురు కనువిందు చేశారు. ఫిలింనగర్లోని దైవసన్నిధానంలో మరో మూడు కొత్త ఆలయాలు రూపుదిద్దుకోనున్నాయి. వీటి పనులను స్వరూపానందేంద్ర స్వామి బుధవారం ప్రారంభించారు. మూడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ నూతన ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. మురళీమోహన్, వెంకటేష్, నాగార్జున, చాముండేశ్వరీనాథ్, నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
తారలు దిగి వస్తే వెలుతురే!
హృదయం ఉండాల్సిన చోటే ఉన్న కొందరు సెలబ్రిటీలు మెల్లగానే అయినా స్థిరంగా రైతు ఆత్మహత్యలపై అడుగు ముందకు వేస్తుండటం మంచి పరిణామం. ఐదుగురు అగ్ర స్థాయి సెలిబ్రిటీలు విదర్భ, మరాఠ్వాడా లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నాలుగు లేదా ఐదు రోజులు పర్యటిస్తే జాతీయ చర్చ రైతు ఆత్మహత్యలపైకి మరలుతుంది. ఏదైనా టీవీ చానల్ సెలబ్రిటీలను అలా ఎందుకు తీసుకెళ్లదో నాకు అర్థం కాదు. సరిహద్దుల్లోని సైనికులను కలుసుకోడానికి సెలబ్రిటీలను తీసుకెళ్లగలిగినప్పుడు... వారు రైతులతో కలిసి గడిపేలా ఎందుకు చేయలేరు? జై జవాన్ అనే గానీ, జైకిసాన్ అని ఎందుకు అనొద్దు? రైతు ఆత్మహత్యల్లోని బాధను, విషాదాన్ని వ్యక్తం చేసేలా ఓ పాటను పాడాలని కొన్నేళ్ల క్రితం నేను సుప్రసిద్ధ పాకిస్తాన్ గాయని రేష్మాను కోరాను. ‘‘భాయ్ సాబ్, రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడు తున్నా రు? సిగ్గుతో నా తల కిందకు వాలిపోతోంది’’ అంటూ అపరాధ భావనను ధ్వనించే గొంతుతో ఆమె అడి గారు. మంచి, శక్తివంతమైన గీతాలను ఇవ్వమని ఆమె కోరారు. ఆమెకు చెల్లించగలిగేటంత డబ్బు నా వద్ద లేదని, అయినా సాధ్యమైనంత ఇస్తానని అన్నప్పు డామె..‘‘మీ దగ్గర ఓ చెప్పుందా?’’ అన్నారు. నేనేదో చెప్పేలోగానే ‘‘రైతుల కోసం నేను డబ్బులు అడిగితే చెప్పు తీసినా తలపై కొట్టండి’’ అన్నారు. అయితే శాయ శక్తులా ప్రయత్నించినా నేను శక్తివంతమైన గీతాలను ఆమెకు అందించలేక పోయాను. రైతుల కోసం నానా పాటేకర్... అందుకే నానా పాటేకర్ రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్న తీరుపట్ల ఆవేదనను వెలిబుచ్చడం చూసి మాటల కందని విధంగా చలించిపోయాను. అంతేకాదు, ఆయన ఆత్మహత్యలకు పాల్పడ్డ పలువురు రైతుల భార్యలకు రూ. 15,000 చెక్కులను ఇచ్చారు. ఆయన నెలకొల్సిన ఫౌండేషన్ ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ. 80,000 వసూలు చే సింది. ‘‘రైతులు తమ ప్రాణాలు తామే తీసు కోగలుగుతున్నారంటే వారు ఇతరులను కూడా చంపగ లుగుతారు. ‘విప్లవం’ అనే ఆలోచన గట్టిగా పట్టిందంటే రైతులు నక్సలైట్లుగా మారుతారు.’’ ఇది, దేశ హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఓ టీవీ కార్యక్రమంలో అన్న మాటలను నాకు జ్ఞప్తికి తెచ్చింది. ‘‘నక్సలిజానికి అడ్డగించే అత్యుత్తమ రక్షణ కవ చం వ్యవసాయమే. వ్యవసాయాన్ని మీరు ఎంతగా ధ్వం సం చేస్తే, నక్సలిజం అంతగా పెరుగుతుంది’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విధానకర్తలు ఇంత సరళమైన వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారనేది ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతూనే ఉన్నాను. విధానపరమైన తప్పుడు దిశానిర్దేశన కథ దాని చుట్టూనే తిరుగుతోంది. సినిమా నటుడు అక్ష య్ కుమార్ కూడా నానా పాటేకర్లాగే ముందుకు వచ్చారు. ఆయన బృందం (అక్షయ్ అక్కడ లేరు కాబట్టి) మరాఠ్వాడాలోని బీడ్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడ్డ 30 మంది రైతుల భార్యలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులను అంద జేశారని వార్తా కథనాల సమాచారం. కుటుంబ పెద్దను కోల్పోయిన 180 రైతు కుటుంబాల కోసం ఆయన రూ. 90 లక్షలను తీసి పెట్టారు. ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా భర్త చేస్తున్న పనిని మెచ్చుకుంటూ, ఇతరులు కూడా ఆయనతో కలవాలని ఒక ట్వీట్లో కోరారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతులకు సహాయంగా మరో సెలబ్రిటీ?, క్రికెట్ ఆటగాడు అజింక్యా రహానే కూడా ముందుకొచ్చారు. హృదయం ఉండాల్సిన చోటే ఉన్న కొందరు సెలబ్రిటీలు(ప్రముఖులు) మెల్లగానే అయినా, స్థిరంగా మరో అడుగు ముందకు వేయడానికి వస్తున్నారని తెలు సుకోవడం కచ్చితంగా ఉత్సాహం కలిగిస్తోంది. వారిలో కొందరు సినిమాల్లో రాబిన్ హుడ్ వంటి పాత్రలను పోషించినవారు. నిజ జీవితంలో కూడా అంతే దయను చూపుతున్నారు. బాగా పెద్ద తారల్లో కొందరు తమ సాటివారు రోజుకు రెండు పూటలు కడుపు నింపుకోలేని స్థితిలో, బతుకు ఈడ్వలేక పెనుగులాడుతుండటాన్ని ఇంకా పట్టించుకోకుండా ఉండటం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది కూడా. సెలబ్రిటీలు పల్లెబాట పడితే ... ఇది తెలిసే నాకు సినీ ప్రపంచం నుంచి, క్రికెట్ క్రీడల నుంచి, ప్రజాజీవితం నుంచి ఐదుగురు అగ్రస్థాయి సెల బ్రిటీలు విదర్భ, మరాఠ్వాడా లేదా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో ఏకధాటిగా నాలుగు లేదా ఐదు రోజులు పర్యటించడమనే ఆలోచన పుట్టుకొచ్చింది. దాని గురిం చి ఒక స్వయం సహాయక సంస్థతో కూడా చర్చించాను. ఆ పర్యటన ద్వారా ఈ నిరంతర మృత్యు నర్తనపైకి దేశం దృష్టిని మరల్చవచ్చు. ఈ పర్యటనల్లో వాళ్లు రైతు కుటుంబాలను కలుస్తారు, రైతులతో మాట్లాడుతారు, పంట పొలాలను చూస్తారు, వారితో కలసి తింటారు, సాధ్యమైతే వారితో పాటే ఒకటి లేదా రెండు రాత్రులు ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. కొందరు సెలబ్రిటీలు ఆశించే గౌరవ ప్రతిఫలాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించి, అలాంటి పర్యటనకు ఎంత భారీ వ్యయమవుతుందనే నేనీ విషయంలో ఇంతకు మించి ముందుకు పోలేకపోతున్నాను. జైకిసాన్ అని ఎందుకు అనొద్దు? ఈ ప్రతిపాదన ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షించడానికి, తద్వారా దేశ అంతరాత్మను తాకడానికే. మీడియా గునుక దీన్ని దీన్ని 24/7 సమస్యగా చూస్తే, మరపున పడిపోయిన ఈ సమస్యపైకి అది జాతీయ స్థాయి చర్చను మరలుస్తుంది. విధానకర్తలు, అధికా రంలో ఉన్నవారు దీన్ని గమనించాల్సిన స్థితి ఏర్పడు తుంది. ఏదేమైనా ఒక మీడియా చానల్ సెలబ్రిటీలను తీసుకుని మరాఠ్వాడా లేదా విదర్భలకు ఎందుకు తీసు కెళ్లదో నాకు అర్థం కాదు. సరిహద్దుల్లోని సైనికులను కలు సుకోడానికి సెలబ్రిటీలను తీసుకెళ్లగలిగినప్పుడు... అలాగే వారు రైతులతో కలిసి గడపడానికి ఎందుకు ప్లాన్ చేయలేరు? జై జవాన్ మాత్రమేగానీ జైకిసాన్ అని ఎందుకు అనొద్దు? సెలబ్రిటీలు ధార్మిక కార్యకలాపాలను దాటి ఇంకా ముందుకుపోయి, వ్యవసాయం చేయడం తిరిగి గర్వకారణం అయ్యేలా చేయడానికి అవసరమైన వ్యవ స్థాగతమైన మార్పుల దిశగా ఆలోచింపజేస్తే ఆ కృషి అత్యంత విలువైనదే అవుతుంది. అందుకు వాళ్లు వ్యవ సాయ సమస్యలను అర్థం చేసుకోవడం కోసం కొంత సమయాన్ని వెచ్చించి, కొన్ని పౌర సమాజ సంస్థలతో కలసి ఈ కృషిని ఇంకా ముందుకు తీసుకుపోతే అది కూడా జరుగుతుంది. సినిమా నిర్మాత మహేష్ భట్ ‘‘పాయిజన్ ఆన్ ద ప్లాటర్’’ (కంచంలో కాలకూట విషం) డాక్యుమెంటరీ ద్వారా అదే చేశారు. ఆమిర్ ఖాన్ తన సొంత శైలిలో ఇలాంటి సమస్యలపై జాగరూకతను పెంపొందింపజేస్తున్నారు. రానున్న నెలల్లో ఇంకా మరిం త మంది ఈ సమస్యపై ముందుకు వస్తారని ఆశిస్తున్నా ను. సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి మద్దతు పలకడం వల్ల పట్టణ జనాభాకు తిరిగి గ్రామీణ భారతంతో తిరిగి సంబంధం ఏర్పడటమే దీని వల్ల కలిగే మరో అత్యుత్తమ ఫలితం. (వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ మెయిల్ : hunger55@gmail.com) - దేవీందర్శర్మ