e-cycles
-
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
ఈ- సైకిల్ యమ క్రేజ్
పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం ఆదర్శంగా నిలుస్తామంటున్న టెకీలుసైకిల్ తొక్కడమంటే ఎవరికి ఇష్టముండదు? చిన్న పిల్లలు మొదలుకొని, పెద్దవారి వారకూ ఒకప్పుడు ఇదంటే యమ క్రేజ్.. అయితే రాను రాను పెట్రోల్ వాహనాల రాకతో సైకిల్ కాస్తా కనుమరుగైంది. అయితే ప్రస్తుతం మళ్లీ సైకిళ్లకు క్రేజ్ పెరుగుతోంది. దీనికి తోడు తయారీదారులు సైకిల్కి కొత్త హంగులద్ది.. ఈ సైకిల్స్గా మారుస్తున్నారు.. దీంతో ఓ వైపు పర్యావరణానికీ, మరోవైపు ఆరోగ్యానికీ మేలు చేకూర్చే ఈ–సైకిల్స్కి క్రేజ్ పేరుగుతోంది... ప్రస్తుతం భాగ్యనగరంలో ఇదో ట్రెండ్గా మారుతోంది.. అసలు ఈ–సైకిల్స్ కథేంటి? క్రేజ్ పెరగడానికి కారణమేంటి? తెలుసుకుందాం.. శ్వనగరంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్లో టెకీలు, ఉన్నత ఉద్యోగుల్లో కొన్ని వర్గాల వారు విద్యుత్తు ఆధారిత సైకిళ్లను నడిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. బిట్స్ పిలానీ హైదరాబాద్, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం ఆ్రస్టేలియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు ప్రశాంత్ సాహు, బందన్మ జుందార్, పరిశోధకుడు జుబివుల్లా ఈ సర్వే నిర్వహించారు. ఈ–సైకిల్.. పనితీరు ఇలా..ఈ– సైకిల్ తొక్కుతున్నపుడు ముందుకు వెళ్లే కొలది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. సైకిలిస్ట్కు అవసరం అనుకున్నపుడు బ్యాటరీ చార్జింగ్ వినియోగించి సైకిల్ను నడిపించొచ్చు. రోడ్డు అప్ ఉన్న ప్రాంతాల్లో ఈ చార్జింగ్ ఉపయోగపడుతుంది. సుమారుగా రూ.20 వేల నుంచి రూ.30 వేల రేంజ్లో ఈ–సైకిళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి.సర్వే చెబుతుంది ఇదే...మొత్తం 482 మంది ఈ–సైకిల్ నడిపిస్తున్న వారిని సంప్రదించగా.. ఒకొక్కరు తమ అభిప్రాయాలను వెళ్లడించారు. ప్రధానంగా మోటారు సైకిల్, కారు వినియోగించాలంటే ఇంధన ధరలు, వాయు, ధ్వని కాలుష్యం భారీగా పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, సాధారణ సమయంలో సైక్లింగ్కు అవకాశం లేకపోవడం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కారణాలతో ఈ–సైకిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ–బైక్ల వినియోగానికి ఇష్టపడుతున్నారట.60 శాతం ఈ–సైకిల్వైపు మొగ్గు..ఇదిలా ఉంటే నగర రహదారులపై ప్రయాణికులు ఈ–సైకిల్పై ప్రయాణించడం ఒక రోల్ మోడల్గా ఉండాలని ఎక్కువ మంది చూస్తున్నారు. చిన్నపాటి దూరం వెళ్లడానికే మోటారు సైకిల్, కారు వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ–సైకిల్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై సర్వే చేశారు. కాగా దాదాపు 60% మంది ప్రయాణికులు ఈ–సైకిల్ను నడపడానికి సిద్ధంగా ఉన్నారని అధ్యయన ఫలితాల్లో పేర్కొన్నారు. సర్వే చేసిన ప్రాంతాలు...హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు అధ్యయన పత్రాల్లో పేర్కొన్నారు. కాగా 482 మందిలో 48 శాతం పురుషులు ఉండగా, 52 శాతం మంది మహిళా ప్రయాణికులు దీనికి మొగ్గు చూపడం విశేషం. మహిళలు మెట్రో నుంచి ఇంటికి, ఆఫీస్కు వెళ్లి రావడానికి ఈ–సైకిల్స్ను వినియోగిస్తున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, బేగంపేట్, వివిధ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్కు వచ్చే వారిలో మొదటి, చివరి మైలు కోసం ‘ఫీడర్’ వాహనాలుగా ఈ–బైక్లను ఇష్టపడతారని అధ్యయనంలో తేలింది. సైకిల్ ట్రాక్స్ అవసరం...సుమారుగా 10కిలో మీటర్ల వరకు ప్రయాణించే వారి ఆలోచనలో మార్పు వస్తుంది. సైకిలింగ్పై చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగం, ఇంటి వద్ద వివిధ రకాల పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇటువంటి వారు ఈ–సైక్లింగ్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. నగరంలో భారీ సంఖ్యలో మోటారు సైకిళ్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ–సైకిళ్లు, ఈ–బైకుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. దీంతో ఓఆర్ఆర్ను ఆనుకుని సోలార్ సైక్లింగ్ మార్గాన్ని జీహెచ్ఎంసీ నిర్మించింది. కేబీఆర్ పార్కు చుట్టూ సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటైంది. అయినా వాటిపై వాహనాలను పార్కింగ్ చేయడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అనుకున్న లక్ష్యానికి ఆటంకంగా ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ ట్రాక్ల పర్యవేక్షణపై అధికారులు శ్రద్ధ వహించాలని పలువురు కోరుకుంటున్నారు. -
ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు!
పట్టణాలు, నగరాల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. మార్కెట్లో దొరుకుతున్న ఈ–సైకిళ్లు, ఈ–మోపెడ్స్, ఈ–స్కూటర్స్కు భిన్నంగా కాలిఫోర్నియాకు చెందిన ‘సిక్స్త్రీజీరో’ ఇటీవల మూడుచక్రాల ఈ–సైకిల్ను ‘ఎవ్రీజర్నీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 250 వాట్ రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఏడుస్థాయిల్లో దీని వేగాన్ని మార్చుకోవచ్చు. రోడ్డు బాగుంటే, పవర్ ఆఫ్ చేసుకుని మామూలు సైకిల్ మాదిరిగానే పెడల్స్ తొక్కుకుంటూ కూడా పోవచ్చు. ఒకసారి దీని బ్యాటరీని చార్జ్ చేసుకుంటే, 50 కిలోమీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించగలదు. ముందువైపు ఒక చక్రం, వెనుకవైపు రెండు చక్రాలు, వెనుక ఉన్న రెండు చక్రాల మధ్య సరుకులు పెట్టుకోవడానికి అనువైన బుట్టతో చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మూడుచక్రాల ఈ–సైకిల్ ధర 3,999 డాలర్లు (రూ.3.27 లక్షలు) మాత్రమే! -
ఈ- వాహనాలకు మేలు చేసిన కరోనా!
లండన్: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ వాహనాలు క్రమంగా మాయం అవుతున్నాయి. ఆ స్థానంలో ఈ–కార్లతోపాటు ఈ–బైకులు, ఈ–సైకిళ్లు వస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, అలవాట్లకు అనుగుణంగా వీటిలో వేల మోడల్స్ వస్తున్నాయి. 2020, ఏప్రిల్ నెల నాటికి ఇంగ్లండ్ రోడ్లపైకి దాదాపు మూడు లక్షల ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతోన్న ఎలక్ట్రానిక్ వాహనాలకు మాత్రం కరోనా కారణంగా మేలే జరిగింది. ఈ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కరోనా వైరస్కు వాతావరణ కాలుష్యం కూడా తోడై ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అవుతుండడంతో ఎలక్ట్రానిక్ వాహనాల రంగానికి పలు దేశాల ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో టార్గెట్లు ముందుకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్లోని అతిపెద్ద సైక్లింగ్ కంపెనీ ‘హాల్ఫోర్డ్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల సర్వీసు రంగంలో అనూహ్యంగా దూసుకుపోయింది. ‘హాల్ఫోర్డ్స్’కు దేశంలో 300లకు పైగా ఆటోసెంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఏ కంపెనీకి లేనివిధంగా ఈ కంపెనీ 30 ఈ బైకుల మోడల్స్ను తీసుకొచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న ‘గ్జివోమి ఎం 365’ ఈ స్కూటర్ ఈ కంపెనీకి చెందినదే కావడం విశేషం. ఈ సైకిళ్లకు, సాధారణ సైకిళ్లకు పెద్ద తేడాలేదు, ఓ చిన్న బ్యాటరీ, దాంతో తిరిగే చిన్న మోటారు తప్ప. పైగా ఇన్సురెన్స్ అవసరం లేదు. రోడ్డు పన్ను అసలే లేదు. చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!? -
మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు
ధరలు రూ.18,990-19,290 రేంజ్లో న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఏవియర్ మోడల్లో రెండు ఈ-సైకిళ్లను బుధవారం మార్కెట్లెకి తెచ్చింది. వీటి ధరలను రూ.18,990, రూ.19,290గా (ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) నిర్ణయించామని హీరో గ్రూప్ మేనేజిండ్ డెరైక్టర్ నవీన్ ముంజాల్ తెలిపారు. యువ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన ఈ సైకిళ్లు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నైల్లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు. ఢిల్లీతో పోల్చితే ఈ నగరాల్లో ఈ సైకిళ్ల ధర అధికంగా ఉంటుందని వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఎలాంటి వ్యాట్ను విధించడం లేదని, అందుకే అక్కడ ధరలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. లిధియమ్ బ్యా టరీలతో తయారైన ఈ ఏవియర్ ఈ-సైకిళ్లలో ఆరు గేర్లు ఉన్నాయని, 5 నుంచి 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే గంటకు 25 కిమీ గరిష్ట వేగాన్ని అందుకోగలవని వివరించారు. వీటిని ఆన్లైన్లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు.