Excavation
-
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
ప్రకాష్ను చంపేందుకు స్వామిజీతో కలిసి నాగమణి స్కెచ్.. క్షుద్రపూజలు!
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. ఏం జరిగిందంటే.. నల్లమాడ పోలీసు సర్కిల్ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న కొందరు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పట్టుబడింది వీరే.. గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం నివాసి నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్బాషా, మురుగన్, సురేష్, అనంతపురానికి చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. హత్య కుట్ర వెలుగులోకి పట్టుబడిన నిందితులను విచారణ చేయడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్, నాగమణి దంపతులు. ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడమే కాక, వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. దీంతో తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అనంతపురం పోలీసులకు బదిలీ చేశారు. కాగా, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నిరంజన్రెడ్డి, నల్లమాడ, ఓడీసీ, బుక్కపట్నం, అమడగూరు ఎస్ఐలు వలీబాషా, గోపీకుమార్, నరసింహుడు, వెంకటరమణ, సర్కిల్ సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ అభినందించారు. -
శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి
భోపాల్: మధ్యప్రదేశ్లోని ధార్లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్కి చెందినది. అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బెలూన్లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి) -
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్మినార్లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్మినార్ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్మినార్ కట్టడపు కాంప్లెక్స్లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్మినార్ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్మినార్ కాదు.. సూర్య గోపురం!! -
ధరలు చూసి ‘బోరు’మనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో... పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటున్నారా.. అయితే కనీసం రెండు, మూడు లక్షలు సిద్ధం చేసుకోవల్సిందే. ఎందుకంటే బోరు తవ్వకం చార్జీలు భారీ పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ధరలు సగటున యాభై శాతానికిపైగా పెరిగిపోయాయి. లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు, డీజిల్ ధరలు, లేబర్ చార్జీల పెరుగుదల తదితర అంశాలను చూపుతూ రిగ్ ఓనర్ల సంఘం బోరు తవ్వకం ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారీగా ధరల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ... మొత్తంగా ధరల పెంపు భారీగా ఉండడంతో బోరు తవ్వించాలనున్న వాళ్లు ధరలు చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యి ఫీట్లకు రూ.2లక్షల పైమాటే.... బోరు తవ్వేందుకు చార్జీల తీరు స్లాబుల ఆధారంగా ఉంటుంది. భూమిలోకి డ్రిల్ చేసే ప్రతి వంద ఫీట్లకు ఒక్కో ధర ఉంటుంది. లోతుకు వెళ్తున్న కొద్ది బోర్వెల్ మిషన్పై ఒత్తిడి పెరగడంతో ధరలను క్రమంగా పెంచుతారు. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్–19కు ముందు బోరు తవ్వేందుకు ప్రారంభంలో తొలి వంద ఫీట్లకు (అడుగులు) ఫీట్కు రూ.45 చొప్పున ఉండేది. క్రమంగా ప్రతి వంద ఫీట్లకు రూ.10 చొప్పున, 500 ఫీట్లు దాటిన తర్వాత రూ.20 చొప్పున, 800 ఫీట్లు దాటిన తర్వాత రూ.50 చొప్పున ధరలు పెంచేవాళ్లు. ప్రస్తుతం ఈ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రారంభంలో తొలి వంద ఫీట్ల వరకు ఫీట్కు రూ.70గా నిర్ధారించగా... ఆ తర్వాత వందకు రూ.80 చొప్పున తర్వాతి వంద ఫీట్లపై రూ.100... ఇలా పెంచుతూ 900–1000 ఫీట్లలోతు తవ్వేందుకు ధర రూ.360గా ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. 2019లో 900–1000 ఫీట్ల లోతు తవ్వేందుకు ధర రూ.200 చొప్పున మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.160 పెంచేశారు. మొత్తంగా వెయ్యి ఫీట్ల లోతుకు బోరు తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం గరిష్టంగా 1.25 లక్షలు (కేసింగ్, చార్జీలన్నీ కలిపి) కాగా... ప్రస్తుతం రూ.2.30 లక్షలు అవుతోంది. డీజిల్, కూలీల ధరలు పెరగడం వల్లే.. డీజిల్ ధరలు ఏడాదిన్నర క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదేవిధంగా లాక్డౌన్ తర్వాత లేబర్ షార్టేజీతో కూలీల ధరలు కూడా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బోరు తవ్వకం ధరలు పెంచాం. – జె.గంగారెడ్డి, బోర్వెల్ నిర్వాహకుడు, బీఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్ రెండేళ్లలో డబుల్ ఖర్చయ్యింది నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం బోరు తవ్వించా. దాదాపు 900 ఫీట్లు వేశారు. అప్పుడు రూ.80 వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పూర్తిగా వరి వేయాలను కోవడంతో ఒక్క బోరు సరిపోదని 15 రోజుల క్రితం మరొకటి తవ్వించా. ఇదివరకు తవ్విన వ్యక్తే 950 ఫీట్లు తవ్వి రూ.1.92 లక్షల బిల్లు చేతిలో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో డబుల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. – డి.లక్ష్మణరావు, రైతు, మాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
రోమ్ : ఇటలీలోని పాంపెలో అతి పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుగు చూశాయి. 2019లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. శనివారం వీటికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రాచీన రోమన్లు భోజన ప్రియులన్న సంగతిని ఇది తెలియజేస్తోందని పాంపె ఆర్కియలాజికల్ పార్క్ చీఫ్ మాస్సిమో ఒసన్నా అన్నారు. వారు బయట తినడానికి కూడా ఇష్టపడేవారని, దాదాపు 80 రకాల ఫాస్ట్ ఫుడ్స్కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని తెలిపారు. ఇలాంటివి దొరకటం ఇదే మొదటిసారని అన్నారు. దీనిపై ఆంథ్రోపాలజిస్ట్ వలెరియా ఎమోరెట్టి మాట్లాడుతూ.. ‘‘ ఆ ఫాస్ట్ ఫుడ్ కోర్టులు చాలా విశాలంగా మొత్తం ఇటుకలతో నిర్మించి ఉన్నాయి. ( 2021: ప్రపంచం అతలాకుతలమేనట! ) ఆహార పదార్థాలు వేసుకోవటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడి ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గోడలపై అందమైన చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అక్కడ దొరికే పదార్ధాల గురించి తెలిపే విధంగా చిత్రాలు ఉన్నాయి. కోడి, బాతు, మేక, పందులు, చేపలు, నత్తలకు సంబంధించిన ఆహారం అక్కడ దొరికేది. ఆహారం రుచిగా ఉండటానికి అందులో వైన్ కలిపేవార’’ని తెలిపారు. -
పాక్లో 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం!
ఇస్లామాబాద్: దాయాది దేశాలైన పాకిస్తాన్-భారత్లు ఒకప్పుడు ఒకే భూభాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాలుగా విడిపోక ముందు భారత్కు వాయువ్యంలో ఉన్న కరాచి కొంత భాగం పాకిస్తాన్, మరికొంత భాగం భారత్లో ఉండేది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్లోని కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన హిందూ దేవాలయం బయటపడింది. పాకిస్తాన్, ఇటాలీయన్ పురావస్తు శాఖ స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఈ తవ్వకాలను చేపట్టింది. ఈ క్రమంలో గురువారం 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం వెలుగు చూసినట్లు పాక్ పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. అయితే ఇది శ్రీమహావిష్ణువు ఆలయంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం దాదాపు 1300 ఏళ్ల నాటిదని, హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: ఆరేళ్లుగా వీడని మిస్టరీ.. తనను మిస్సవుతున్నా!) క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు వాయువ్య భారత ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర కూడా చెబుతోంది. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారంట. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా పిలుచుకునేవారని, ఈ రాజ్యవంశీయులే మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించి ఉంటారని అధికారులు తెలిపారు. అంతేగాక ఈ ఆలయానికి మరోవైపు పరిసర ప్రాంతాల్లో కంటోన్మెంట్, వాచ్ టవర్ వంటి జాడలను కూడా పురావస్తు శాఖ కనుగొంది. అయితే స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఎన్నో పురావస్తు వస్తువుల బయటపడ్డాయని ఫజల్ ఖాలిక్ అన్నారు. అయితే హిందూషాహీల నాటి జాడలు మాత్రం మొదటిసారిగా బయటపడ్డాయని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: సౌదీ నోటుపై భారత్ సరిహద్దు వివాదం పరిష్కారం) -
ఇక ఇసుకకు ఇబ్బందుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు భవన నిర్మాణ రంగం పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. రెండు నెలల పాటు పనులు నిలిపేసిన నిర్మాణ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నిర్మాణ సామగ్రిలో అత్యంత కీలకమైన ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే కోవిడ్తో నష్టపోయిన నిర్మాణదారులు వానాకాలం ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో ఇసుక కొరత తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ ఇసుక సరఫరాలో అంతరాయం లేకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది అనుభవంతో..! గతేడాది కూడా వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా టీఎస్ఎండీసీ ముందస్తుగా స్టాక్ యార్డుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ప్రణాళిక అమల్లో ఆలస్యంతో పాటు భారీ వర్షాల మూలంగా ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19 జిల్లాల పరిధిలోని 52 స్టాక్ యార్డుల్లో 41.18 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటికే నిల్వ ఉండగా, 34 రీచ్ల్లో ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లోని నిర్మాణ రంగం కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్మెట్, భౌరంపేటలో టీఎస్ఎండీసీ సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసింది. సబ్ స్టాక్ యార్డుల్లోనూ వానాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తోంది. అదనపు స్టాక్ యార్డులు.. కొత్త రీచ్లు వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ఈ ఏడాది స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు పెంచడంతో పాటు, రీచ్లకు వెళ్లే మార్గాలను మెరుగు పరిచాం. మెరుగైన రోడ్డు వసతి ఉన్న చోట కొత్త స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో ఉన్న ఇసుక డిమాండును దృష్టిలో పెట్టుకుని సబ్ స్టాక్ యార్డుల్లోనూ నిల్వ చేస్తున్నాం. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 ఇసుక రీచ్ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు లభించాయి. మరో 31 ఇసుక రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – జి.మల్సూర్, వీసీ అండ్ ఎండీ, టీఎస్ఐఐసీ -
ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!
ఢిల్లీ: తెలంగాణలోని గోదావరినదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగినట్లు నివేదికల్లో స్పష్టంమవుతోదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించింది. అయితే సుమారు నాలుగు కోట్ల పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా.. ఎలా తవ్వుతారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల్లో పూడికతీతలో భాగంగా ఇసుకను తీశామని తెలిపింది. కాగా అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు పూరైనప్పటికీ.. వాటిలో పూడికతీత ఎలా సాధ్యమైందని నిలదీసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి చట్టం ఏర్పాటు చేయలేదా అని ఎన్జీటీ మండిపడింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
రాజధాని చరిత్రలో కొత్త వెలుగు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని చరిత్రలోకి కొత్త వెలుగు రానుంది. ఢిల్లీ నగరం నడిబొడ్డున ‘పురాణ ఖిల్లా’లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో చరిత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలు, వివరాలు తెలియనున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ చరిత్ర మనకు మౌర్యుల కాలం నుంచే అందుబాటులో ఉంది. కానీ, తాజాగా బయటపడిన ఆధారాలు ఢిల్లీకి అంతకు ముందే మరో 300 ఏళ్ల చరిత్ర ఉందనే విషయాన్ని చెప్పబోతున్నాయి. ఢిల్లీ 300 ఏళ్ల ముందుకు.. ఏ జాతి చరిత్ర తెలియాలన్నా.. ఆ కాలంలోని కుండలు, మట్టి పాత్రలు, ఇతర కట్టడాల పరిశీలన అవసరమని తవ్వకాలు చేపట్టిన చండీగఢ్ సర్కిల్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్ స్వరణ్కర్ చెబుతున్నారు. మౌర్యుల కాలాన్ని నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ (పాలిష్ చేయబడిన నల్లని మట్టి పాత్రలు) తెలుపుతున్నాయని వివరించారు. పురాణ ఖిల్లా తాజా తవ్వకాల్లో మౌర్యుల కాలపు కళాఖండాలు లభించిన మట్టి పొర కిందే కొన్ని బూడిద, ఎరుపు రంగు పాత్రలు లభించాయని వెల్లడించారు. ఈ పాత్రలు మౌర్యుల పూర్వపు కాలాన్ని వెల్లడించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వాటిని కార్బన్ డేటింగ్కు పంపించి నిర్ధారించుకుంటామని ఆయన చెప్పారు. ఇక లభించిన మట్టి పాత్రలు క్రీ.పూ. 6 - 4 శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నామన్నారు. అదే నిజమైతే ఢిల్లీకి మరో 300 ఏళ్ల చరిత్ర తోడవుతుందని స్వరణ్కర్ పేర్కొన్నారు. ఆ లెక్కన మహా జనపదాల కాలంలో ఢిల్లీ ప్రాంతం ఉనికిలో ఉన్నట్టేనన్నది రుజువవుతుంది. గతంలోనూ తవ్వకాలు... 1970, 2013-14 సంత్సరాల్లో పురాణ ఖిల్లాలో భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. అయితే అక్కడ ఎలాంటి కట్టడాలు, మట్టి పాత్రలు లభించలేదు. కానీ విరివిగా మట్టిపెంకులు బయటపడటంతో మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ‘పురాణ ఖిల్లాలో తవ్వకాలు చేపట్టేందుకు మాకు 2013లో అనుమతి వచ్చింది. కానీ అప్పటి తవ్వకాలలో మౌర్యుల పూర్వపు ఆధారాలేమీ లభించలేదు. అయినా చివరి ప్రయత్నంగా ఈ ఏడాది మళ్లీ ఇక్కడ తవ్వకాలు ప్రారంభిచాం’అని స్వరణ్కర్ తెలిపారు. అయితే కాల్పనిక నగరం ఇంద్రప్రస్థానికి చెందిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఆయన అన్నారు. షేర్షాతో ధ్వంసం.. పురాణ ఖిల్లాకి 2500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతంపై సూర్ రాజైన షేర్ షా దండెత్తి నాశనం చేసినట్లు చరిత్ర చెబుతోంది. పర్యాటకుల సందర్శన కోసం తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ప్రస్తుతం పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. -
ఈ పాచిక వయసు రెండువేల ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో రాష్ట్ర పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) తాజాగా చేపట్టిన తవ్వకాల్లో ఈ వస్తువులు వెలుగు చూశాయి. ఐదు దశాబ్దాల కాలంలో ఇక్కడ మూడు నాలుగు పర్యాయాలు తవ్వకాలు జరిపారు. అప్పట్లో వేల సంఖ్యలో శాతవాహన, రోమన్సహా పలు దేశాల నాణేలు వెలుగు చూశాయి. దీంతో ఇది శాతవాహనకాలం నాటి ప్రధాన వర్తక కేంద్రంగా భావిస్తున్నారు. నాణేల ముద్రణ కేంద్రం కూడా అయి ఉంటుందన్న అనుమానాలూ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే తవ్వకాలు మొదలు కాగా, కొన్ని మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు, నాటి గోడల ఆనవాళ్లు కనిపించాయి. కానీ రెండు రోజుల క్రితం అలనాటి పాచిక, ఓ రాగి నాణెం వెలుగుచూశాయి. నాణెం చాలాకాలం మట్టిలో ఉండటంతో దానిపై ముద్రలు, అక్షరాలు చెదిరిపోయి స్పష్టంగా కనిపించటం లేదు. గత నెల పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ తవ్వకాలు ప్రారంభించారు. ఆ శాఖ సహాయ సంచాలకులు రాములు నాయక్ నేతృత్వంలో జరుగుతున్న తవ్వకాలను శాఖ విశ్రాంత ఉప సంచాలకులు రంగాచార్యులు, సహాయ సంచాలకులు నాగరాజు, విశ్రాంత అధికారి భానుమూర్తి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిపిన తవ్వకాల్లో, వేల ఏళ్లనాడే ఇక్కడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్టు గుర్తించారు. నీటి వనరులకోసం ప్రత్యేక ఏర్పాటు, నీటి తరలింపు చానళ్లు కనిపించాయి. వాటికి వాడిన ఇటుకలతోపాటు, అత్యంత నునుపుగా పాత్రల తయారీని బట్టి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కానీ తవ్వకాలు చాలా పరిమితంగా నిర్వహించటంతో పెద్దగా చారిత్రక ఆధారాలు దొరకలేదు. ఇది అతి చిన్న మట్టిపాత్ర. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న గురిగి (చిన్న మట్టిపాత్ర) కంటే పరిమాణంలో చిన్నగా ఉన్న ఈ పాత్ర కూడా శాతవాహనుల కాలం నాటిదే. రెండు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ఈ పాత్ర కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. విలువైన ఆధారాలు దొరికే అవకాశం ‘‘ఇక్కడ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి నాణేల కోసం వెదుకుతున్నాం. నాణేలతో కొత్త కోణాలు వెలుగు చూస్తాయి. ఇక నాటి వస్తువులు, నిర్మాణ పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, పాత్రలు, సాహిత్యానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకవచ్చు. రెండుమూడు నెలల పాటు తవ్వకాలు జరుగుతాయి’’ – విశాలాచ్చి, సంచాలకురాలు -
అక్రమ తవ్వకాలను నిలిపివేయండి
-
మహాభారతం నిజంగా జరిగిందా?
మహాభారతం.. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత విలువైనది. ఇది కల్పన అని కొందరు.. కాదు వాస్తవం అని మరికొందరు.. దశాబ్దాలనుంచి వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. మీరట్ : ఉత్తర ప్రదేశ్లోని మీరట్ ప్రాంతం దగ్గర పాండవులు నివసించి లక్షాగృహం ఉందని కొన్నేళ్లుగా వాదనలు ఉన్నాయి. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పురాతత్వ శాస్త్రవేత్తలు, స్థానిక చరిత్రకారుల అభ్యర్థనల మేరకు.. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (భారత పురావస్తు శాఖ పరిశోధనా సంస్థ) తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది. లక్షాగృహం ఉందని భావిస్తున్న ప్రాంతం.. ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్ జిల్లాలోని బర్నవా ప్రాంతంలో ఉంది. బర్నవా ప్రాంతంపై మాజీ పురాతత్వ శాఖ ఉన్నతాధికారి కేకే శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ లక్షాగృహం ఉందనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మహాభారాతాన్ని మలుపు తిప్పడంలో లక్షాగృహానిది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. బర్నావా ప్రాంతాన్నే మహాభారతంలో వరుణవిరాట్ అని పిలుస్తారని చెప్పారు. బర్నవా ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు అందాయని.. అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, పురావస్తు తవ్వకాల శాఖ సంయుక్తంగా పరిశోధనలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నెల మొదటి వారంలో తవ్వకాలను మొదలు పెడతామని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (తవ్వకాల విభాగం) డైరెక్టర్ జితేందర్ నాథ్ తెలిపారు. దీనిపై ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయడం సముచితం కాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే ముంజాల్ తెలిపారు. చండయాన్ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న సమయంలో ఎరుపురాయితో కూడిన పూసలు, రాగి కిరీటం బయటపడిందని ఆయన చెప్పారు. ఈ కిరిటాన్ని స్థానిక పురావస్తు శాఖ అధికారి అమిత్ రాయ్ కనుగొన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో బురదతో కూడిన పెద్ద నీటి మడుగు, దాని కింద భారీ సొరంగం ఉన్నాయని అమిత్ రాయ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సొరంగం ద్వారానే పాండవులు లక్షాగృహం నుంచి తప్పించుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎస్కే ముంజాల్ తెలిపారు. -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
బొగ్గు భాగ్యాలు
చింతలపూడి : భూగర్భంలోని బొగ్గు నిల్వల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్ల బంగారం వెలికితీతకు ఇటీవల మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS కార్పొరేష¯ŒS లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్ప్లొరేష¯ŒS ట్రస్ట్ (ఎ¯ŒSఎంఈటీ)లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి అన్వేషణ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే బొగ్గును వెలికితీయాలనిప్రభుత్వం నిరీక్షిస్తోంది. ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగనున్నాయి. మరిన్ని ప్రదేశాల్లో పాయింట్లు పెట్టి అన్వేషణ సాగించాలని భావించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) సూచనల మేరకు జిల్లాలోని చింతలపూడి మండలం శెట్టివారిగూడెం, కృష్ణా జిల్లాలోని సోమవరం ప్రాంతాల్లో మరోమారు డ్రిల్లింగ్ ప్రారంభించారు. గత గురువారం నుంచి సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ శెట్టివారిగూడెం ప్రాంతంలో డ్రిల్లింగ్ చేపట్టింది. ప్రస్తుతం 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేస్తోంది. ఈ 120 పాయింట్లలో 65 వేల మీటర్ల లోతున తవ్వి బొగ్గు అన్వేషణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచి జీఎస్ఐ ఇంజినీర్లు చేపట్టిన తొలిదశ బొగ్గు అన్వేషణ పనులు మూడు నెలల క్రితమే పూర్తయ్యాయి. సుమారు 700 మీటర్లకుపైగా లోతులో డ్రిల్లింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. జీఎస్ఐ ఆరునెలల పాటు చేపట్టిన అన్వేషణలో ఈ ప్రాంతంలో 200 మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేల్చారు. సింగరేణి ప్రాంతంలో లభించే బొగ్గు కన్నా ఇక్కడ నాణ్యమైన నిల్వలు ఉన్నాయని తేల్చారు. 2వేల మిలియ¯ŒS టన్నుల బొగ్గు నిల్వలు మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియ¯ŒS టన్నుల నల్ల బంగారం నిల్వలు ఉన్నట్లు తాజా సర్వేల ద్వారా వెల్లడైంది. అవికూడా భూమి ఉపరితలానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నాయని నివేదికలో గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2013లోనే నిర్ధారణ లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు కనుగొంది. ఇతర రాష్ట్రాల్లో లభ్యమయ్యే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అవీ భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపులోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచింది. 6 నెలలపాటు అన్వేషణ అధునాతన యంత్రాలతో 6నెలల పాటు బొగ్గు అన్వేషణ కొనసాగుతుంది. అన్వేషణ పూర్తయ్యాక ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రిగ్గులు వచ్చాయి. మొత్తం 120 రిగ్గులు రప్పిస్తున్నాం. – దాశరథి సుదర్శనం, సూపర్వైజర్, సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ -
తవ్వకాల్లో బయటపడిన విగ్రహం
రహీమ్ఖాన్గూడెం (బీబీనగర్) : మండలంలోని రహీమ్ఖాన్గూడెంలోని ప్రాచీన దేవాలయం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం తవ్వకాలు జరుపుతుండగా జగన్నాథస్వామి ఆకారంలో గల విగ్రహం బయటపడింది. ఆలయ పూజారి నడివాడ వెంకటనర్సింహాచారి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలోని సుబ్రమణ్యేశ్వరస్వామిని ప్రతిష్ఠించేందుకు గద్దె నిర్మాణం చేయడం కోసం తవ్వకాలు జరిపామని, ఈ క్రమంలో జగన్నాథస్వామి ఆకారంలో గల సుద్ద మట్టితో తయారు చేసి ఉన్న ఐదు ఇంచుల విగ్రహం బయటపడిందని తలిపారు. ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఆలయం కావడం, భూమిలో విగ్రహం లభ్యం కావడంతో గ్రామస్తులు ఆలయానికి చేరుకుని చూసి వెళ్తున్నారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సుండుపల్లి మండలం మడితాడు పంచాయతీపరిధిలోని పరిబండ శివాలయం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపారు. తవ్వకాలకు ముందు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విషయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. -
ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉందని తవ్వకాలు
- అల్లిఖానుడిపాలెంలో ఉత్కంఠ అనకాపల్లి: మండలంలోని అల్లిఖానుడిపాలెం గ్రామస్థులు ముత్యాలమ్మతల్లి విగ్రహం కోసం తవ్వకాలు ప్రారంభించారు. కొద్ది వారాలుగా గ్రామంలోని వేపచెట్టు నుంచి పాలు కారుతుండటంతో పాటు అమ్మవారు పలువురిని ఆవహించి ఇక్కడ విగ్రహం ఆనవాళ్లు చెప్పినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. దీంతో బుధవారం రాత్రి వేపచెట్టుకు పూజలు చేసి, గోతులు తీశారు. ఉదయం నుంచి స్థానికులంతా అక్కడకు చేరుకొని అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు ప్రారంభించారు. అమ్మవారి విగ్రహం దొరికిన వెంటనే ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అమ్మవారి పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి విగ్రహం కోసం గ్రామానికి చెందిన పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు ఎదురుచూడటంతో ఉత్కంఠ నెలకొంది. -
తవ్వకాల్లో బైటపడ్డ సొరంగం