Funny
-
చంద్రబాబు పాలనపై ‘కూన రవికుమార్’కు ఫోన్
శ్రీకాకుళం: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు(Kuna Ravikumar) మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ క్యాడర్తో మాట్లాడుతుండగా.. ఓ ఫోన్కాల్(Phone call) వచ్చింది. లిఫ్ట్ చేసి చూస్తే అవతలి వారు ‘ఏపీలో చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉంది.. ఆమదాలవలస ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది..?’ అని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన అందరి ముందు స్పీకర్లో మాట్లాడారు. ‘ఆమదాలవలస ఎమ్మెల్యే మంచివారేనా’ అని అడిగిన ప్రశ్నకు ఆయన మంచివారు కాదని సమాధానం చెప్పారు. ‘మీకు పెళ్లయ్యిందా..? వయసు ఎంత..?’ అని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పి ఆటపట్టించారు. ఈ తంతును అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యేనే ప్రశ్నించడం అందరికీ విచిత్రంగా అనిపించింది. -
లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్పై నెట్టింట ఫన్నీ మీమ్స్
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి, ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ సరదా చర్చ నడుస్తుంటుంది. అయితే.. వాటిని తాను కూడా అంతే సరదాగా చూస్తానని ఆమె అంటుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్పైనా నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఆమె బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించడం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. NO INCOME TAX UPTO RS 12 LAKH! pic.twitter.com/FunZJjyGvB— Arjun* (@mxtaverse) February 1, 2025 అంతేకాదు.. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్తో సందడి చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీమ్స్ దగ్గరే ఆగిపోలేదు. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు.. మార్ఫింగ్ ఫొటోలతో మీమర్స్ చెలరేగిపోతున్నారు.How middle class is seeing @nsitharaman ji today. pic.twitter.com/PsrUDavoWj— Ankit Jain (@indiantweeter) February 1, 2025సబ్ కా వికాస్ లక్ష్యంగా.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ అన్నారు. కానీ, బడ్జెట్ లెక్కలు పొంతన లేకుండా పోయాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్కు భారీగా వరాలు కురిపించింది కేంద్రం. దీంతో సహజంగానే మిగతా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. ఆమె తన ప్రసంగంలో పదే పదే బీహార్ పేరును ప్రస్తావించడమూ ‘ఆచార్య పాదఘట్టం’ తరహాలో నెట్టింట ట్రోలింగ్కు దారి తీసింది.Bihar supremacy Budget mein 💪#NirmalaSitharaman#Budget2025 pic.twitter.com/JlC39kuWWS— Raja Babu (@GaurangBhardwa1) February 1, 2025 Most repeated words. #Budget2025 pic.twitter.com/4pjtahNdks— Sagar (@sagarcasm) February 1, 2025ఇదిలా ఉంటే.. ఇవాళ్టి బడ్జెట్తో ఎనిమిదిసార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు. గంటా 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. -
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
రిసార్టులకు పండగే! ఎగ్జిట్పోల్స్తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
కావేవీ మీమ్స్కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్లకు డిమాండ్ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది. #ExitPoll Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/NDKixJkBaL — वेल्ला इंसान (@vella_insan1) November 30, 2023 Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/KcEHtjVb5S — Pakchikpak Raja Babu (@HaramiParindey) November 30, 2023 Resort owners right now after Exit poll predicts hung assembly #ExitPolls pic.twitter.com/7dx0ysXQ9a — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) November 30, 2023 -
విందు కోసం హారన్ కొట్టు.. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం..
న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. ఇన్స్ట్రా గామ్లో హల్చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్. దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు. చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు -
చంద్రబాబుపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఫన్నీ కామెంట్స్..
-
చంద్రబాబు చర్యలు ఊహాతీతం!
‘‘లైట్ వేసి చూపించండి. అందరూ సంఘీభావంగా ఒక్క నిమిషం లైట్ వేయండి. సెల్ఫోన్లు అందరూ కూడా ఆన్ చేయాలి. ఏం తమ్ముళ్లూ.. ఆకాశంలోని నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్ లైట్లతో. అది టెక్నాలజీ స్టింట్. ఇది కూడా ఇంట్రెడ్యూస్ చేసింది నేనే’’ ‘అంటే..’.. యస్ సెల్ఫోన్లో టార్చ్లైట్ను కనిపెట్టంది బాబుగారే అన్నమాట. నలభై ఏళ్లకు పైగా రాజకీయానుభవం. నోరు తెరిస్తే.. హైదరాబాద్ను కట్టించింది నేనే.. కంప్యూటర్ను తెప్పించింది నేనే అంటూ టెక్నాలజీ పితామహుడిలా ఉపన్యాసాలు దంచే చంద్రబాబుగోరు.. తాను మీమ్ స్టఫ్గా మారతానని ఏనాడూ ఊహించి ఉండరేమో!. ఓవైపు కుళ్లు రాజకీయాలు ప్రదర్శించడమే కాదు.. తన సీరియస్ కామెడీతో విపరీతంగా నవ్వించగలనని నిరూపించుకుంటూ పోతున్నారాయన. Technoooooology..#chandrababunaidu #cbn #coffeeinachaicup #ccc #politics #tdp #naralokesh #narabrahmani #telugudesamparty #andhrapradesh #TrendingNow pic.twitter.com/snzZ3YxbqV — Coffee in a Chai Cup (@coffeeinachaic1) August 17, 2023 ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నారు. ఇదేం రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న పని కాదు.. వరుసగా తాను చేస్తున్న ప్రకటనలతో మీమర్స్కు చేతి నిండా పని దొరుకుతుండగా.. తెలుగుతమ్ముళ్లు సైతం ఆ కామెడీని యమాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ గోలనే ఆయన పొగడ్తలు అనుకుంటున్నారేమో.. రెచ్చిపోయి మరీ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. ఆయన ఎంటో ఆ రాఖీ నీ పూజించడం ఎంటో 🤧🤧😂#ChandraBabu #EndOfTDP #YuvaGalam #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/lE8eai5dP5 — Harsha💥 (@Harsha88889) August 18, 2023 బీకాంలో ఫిజిక్స్ స్టేట్మెంట్కు తానేమీ తీసిపోనని చెబుతూ.. బైపీసీలో ఇంజినీరింగ్ కామెంట్ చేశారు. ఆ వెంటనే 45 రోజుల రాఖీ పూజలతో బాబా అవతారం ఎత్తి.. ఫన్నీగా ట్రోల్ అయ్యాడు. మరోసారి గ్యాప్ ఇవ్వకుండానే.. సెల్ఫోన్.. దాని టార్చ్లైట్ను కనిపెట్టింది తానేనంటూ బాబుగోరు.. మరొకటి ఏసేశారు. నలభై ఏళ్ల పైన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ సుపరిచితుడైన బాబుగారు.. ఇప్పుడెలా అయ్యారసలు?. నవ్వుకోవాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదు. అధికారం కోల్పోవడం.. కొడుకు లోకేశం దమ్ము లేక ‘దద్దమ్మ’ ట్యాగ్ తగిలించుకోవడం, దత్తపుత్రుడి దగ్గర సరైన మ్యాటర్ లేకపోవడంతో.. చంద్రబాబుకు మతి భ్రమించి ఉండొచ్చు అనే పొలిటికల్ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. యస్.. చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ చేస్తున్న చేస్తున్న వ్యాఖ్యలు విన్న జనాలు నవ్వుకుంటున్నారు. తమ అధినేత ఇలా అయిపోయారేంటని టీడీపీ కార్యకర్తలు సైతం ఫీలవుతున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా ఏళ్లపాటు ప్రజల్ని మోసం చేసిన విజనరీ బ్లఫ్మాస్టర్ చంద్రబాబు. అధికార దాహంతో తల్లడిల్లితున్న ఆ పెద్దమనిషి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చేసే ప్రయత్నాలు(కుట్రలు) ఫలించడం లేదు. ఇలాంటి తరుణంలో బాబుగారి ఈ కొత్త విజన్ భరించడం మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటున్నారు జనం. -
ఏమి భాషరా బాబు..మరోసారి మాలోకం నవ్వులపాలు
-
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
ఇంకా ఎన్ని కనిపెడతావ్ బాబు ?
-
ఈ చీపురు తింటే.. ఫన్నీ పోస్టుకు కేకపుట్టించే కామెంట్లు!
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి. చీపురుపై ఉన్న ర్యాపర్పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు. ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు the broom has a calorie chart … in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k — JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023 -
‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. వీడియోలో ముందుగా బామ్మ ఫోన్ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో కంప్యూటర్ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్ వాయిస్ నిజమైనదేనని భావిస్తూ క్లాస్ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ChatBot भाई, संभलकर आइयो India में, अम्मा तुमको भी ना छोड़ने वाली हैं. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/YKjGC5ajoW — Rahul Prakash, IPS (@rahulprakashIPS) March 18, 2023 ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
ఏమి భాషరా బాబు.. ఒక్కసారి వినండి ఈ కామెడీ
-
‘తెలంగాణ’ ఏర్పాటులో టీడీపీది కీలకపాత్ర: కాసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరికొత్త చరిత్ర అని, అందులో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర కీలకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. టీటీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన కాసాని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లనే కొత్త రాష్ట్రం కల నెరవేరిందన్నారు. -
గతంలో 600 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన బాబు
-
తేజ్ కామెడీ పంచెస్ చూస్తే నాన్ స్టాప్ గ నవ్వుతూనే ఉంటారు
-
రన్ అవుట్ చేయకుండా గొడవ చూస్తున్నాడు వీడు ఎవడు రా బాబు ....
-
చిరంజీవి భోళా శంకర్ లో నా రోల్ ఇదే...
-
ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..!
పాదయాత్రలో లోకేష్ చేస్తోన్న వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారుతున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ట్రైనింగ్ ఇదేనా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనపై ఉన్న ముద్రను మార్చుకోవడానికి తరచుగా నేను మూర్ఖుడినంటూ చెప్పుకోవడం కూడా ద్వారా లోకేష్ ఏం ఆశిస్తున్నాడో కానీ.. జనం మాత్రం అది నిజమేమో అన్నట్టుగా ఉన్నారు. తరచుగా ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. లోకేష్ చెప్పిందేమిటి.. చెప్పాలనుకున్నదేమిటి?.. ప్రశాంతతను.. ప్రశాంతి అత్త అని, జీవో నెంబర్ 1ని.. జియో 1, పనిముట్లను పంది ముట్లు , అద్దెని అద్దు అంటూ పలకడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇవి కొన్ని మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. ఇక బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సైకిల్ పోవాలి అంటూ ఆయన చేసిన కామెంట్ సంచలనం సృష్టించింది. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసి లోకేష్ నవ్వులపాలయ్యారు. లోకేష్ తన పొలిటికల్ కెరీర్లో చేసిన చిత్ర, విచిత్ర ప్రకటనలు: ►కుల పిచ్చి, మత పిచ్చి, అవినీతి, బంధుప్రీతి కల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే. ►సైకిల్ కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే.. ►వర్ధంతి సందర్బంగా మీ అందరికీ శుభాకాంక్షలు ►NTR ఆశయాలు నాశనం చేయడానికే మీ ముందుకు వచ్చా ►మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా TDP అధికారంలోకి వస్తామనిపిస్తుంది. ►ఊ ఆ అంటే దెంగూ (డెంగ్యూ )వస్తుంది ►12 ఏళ్ల వచ్చేవరకు మా నాన్నను చూడలేదు ►కనీసం 12 కేసులుంటేనే నా దగ్గరకి రండి ►బందర్ పోర్టును కేసీఆర్ ఎత్తుకుపోతాడు ► 1 GB నెట్ వాడితే 1 శాతం జీడీపీ పెరుగుద్ది ►ఇసుక కొరత వలన స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇలాంటి తప్పులు, వ్యాఖ్యలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో పాదయాత్రకు ముందు లోకేష్కు భారీగా ట్రైనింగ్ ఇచ్చారని తెలుగుదేశం తమ్ముళ్లు చెప్పుకుంటారు. మదీనాగూడ ఫాంహౌస్లో తెలుగు భాషలో నిష్ణాతులైన ఐదుగురితో పాటు వివిధ అంశాల్లో దిట్ట అనిపించుకున్న వారితో లోకేష్కు శిక్షణ ఇచ్చారట. ఇంత చేసినా.. గ్రౌండ్లోకి లోకేష్ వచ్చి మాట్లాడినప్పుడు ఆ నైపుణ్యం ఏదీ రాకపోగా.. దానికి విరుద్ధమైన, నవ్వులపాలయ్యే ప్రకటనలు వస్తున్నాయి. చదవండి: లోకేష్పై కొడాలి నాని ఫైర్.. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడితో.. ఇక ఇటీవల పాదయాత్రలో మరో అడుగు ముందుకేసి 1994కు ముందు హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదన్నారు లోకేష్. దానిపై నెటిజన్లు మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర ఏ లక్ష్యం సాధిస్తుందో తెలియదు కానీ.. కోటలు దాటే ఆయన మాటలు మిస్ఫైర్ అయి సొంత పార్టీనే దెబ్బతీసేలా ఉన్నాయని పార్టీలో తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ఇప్పటికే పాతాళానికి చేరిన పార్టీ ప్రతిష్టను మరింత లోతుకు తీసుకువెళ్తారా అని ఆందోళన చెందుతున్నారు. -
ఇదేందయ్యా ఇది లోకేష్.. పాదయాత్ర ఇలా కూడా చేస్తారా?
సాక్షి, చిత్తూరు/ శాంతిపురం: యువగళం పేరులో టీడీపీ నేత నారా లోకేష్ బాబు.. పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా వి.కోట మండలం అన్నవరం గ్రామం నుంచి ప్రారంభమై సాయంత్రం దానమయ్యగారి పల్లె వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నేల పైన ఓ పసుపు రంగు వస్త్రం. దానిపైన ఓ నాలుగు ఆలుగడ్డలు, ఓ నాలుగు టమోటాలు, కొన్ని ముల్లంగి, ఓ చిన్న బుట్టలో నిమ్మకాయలు. ఇది కూరగాయల దుకాణమట! ఈ కూరగాయలు అమ్మడానికి ఇద్దరు మహిళలు! వారితో లోకేశ్ మాటామంతీ! ఇంతా చేస్తే.. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరు ఆ తర్వాత లోకేశ్ పాదయాత్రలోనూ కనిపించారు. ఆమె చేతిలో తమిళనాడుకు చెందిన ఓ సంచీ.. ఆదివారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బడుగుమాకులపల్లి సంతలో జరిగిన ఈ ‘షో’ను సోషల్ మీడియా పసిగట్టేసింది. లోకేశ్ పాదయాత్రకు తమిళనాడు నుంచి ఆర్టిస్టులను తెచ్చి, ఇక్కడ ‘షో’ చేస్తున్నారని సోషల్ మీడియా ఉతికి ఆరేస్తోంది. -
నాకు పెళ్లి చేసేయ్ నాన్న..!
-
మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!
సాక్షి, ముంబై: ఫన్నీ విడియోలు, విభిన్న ఫోటోలు, పోస్ట్లతో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు బాగా అలవాటు. అంతేకాదు యూజర్ల ప్రశ్నలకు అంతే చమత్కారంగా బదులివ్వడం కూడా వ్యాపార దిగ్గజానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని వాయిస్ తనదేనా కాదా అని తెలుసుకోవాలనుకునే ట్విట్టర్ వినియోగదారుడికి ఆయనిచ్చిన సమాధానం నెటిజనులను ఆకట్టుకుంటోంది. విషయం ఏమిటంటే..ది మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ గురించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో టైటిల్స్లో వాయిస్ ఆనంద్ మహీంద్రఅని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయన నేరేషన్లో ఈ వీడియో కథనం సాగుతుంది. అయితే “సార్, ఇది మీ వాయిస్?” అని ఒకరు సంభ్రమాశ్చర్యాలతో అడిగారు. దానికి సమాధానంగా మీకు నచ్చితే నా వాయిస్సే.. నచ్చకపోతే నాది కాదు..(ఊరికే సరదాగా అంటున్నా..అది నా వాయిస్సే) అంటూ రిప్లై ఇచ్చారు మహీంద్ర. దీంతో కమెంట్లు వెల్లు వెత్తాయి. “చివరికి మనం రోజూ చూసే ముఖానికి వాయిస్ని లింక్ చేయడం అద్భుతం. మీ డిక్షన్ వాయిస్ క్లారిటీ భలే ఉంది సార్ శుభాకాంక్షలు” ఒకరు "వావ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కావచ్చు సార్" అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా అట్లాంటాలోని వరల్డ్ ఆఫ్ కోకా కోలా , స్టుట్గార్ట్లోని మెర్సిడెస్-బెంజ్ మ్యూజియం వంటి కార్పొరేట్ మ్యూజియంలు 1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. అలాగే గత దశాబ్దంలో అనేక భారతీయ వారసత్వ సంస్థలు, టాటా, అరవింద్ లిమిటెడ్ ఇలాంటి మ్యూజియంలను ప్రారంభించాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ పేరుతో మహీంద్ర కూడా చేరింది. జీవితం స్థిరంగా లేనట్లే, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో మహీంద్రా గ్రూప్కు సంబంధించి ఒక సజీవమైన, శ్వాసించే సంస్థ మ్యూజియం ఆఫ్ లివింగ్ హిస్టరీ " అని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ముంబైలోని మహీంద్ర ప్రధాన కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ముందస్తు అనుమతితో దీన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. If you’re happy with it, it is my voice and if you don’t like it, it isn’t! ( Just kidding; yes it’s my voice) https://t.co/TG1yczLSrk — anand mahindra (@anandmahindra) July 11, 2022 Presenting The Museum of Living History, where #PurposeMeetsDesign. It celebrates the philosophy, DNA, core values, and culture of the @MahindraRise Group and is a collection of stories that define us. Located at our HQ in Mumbai, it’ll soon be open for viewing by appointment pic.twitter.com/c5ew7YaEsZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 -
వీళ్లిద్దరూ కలిస్తే ఫన్ కి నో ఎండ్
-
భార్య పక్కన ఉండగానే హీరోలా నీళ్లలోకి దూకాడు! కట్ చేస్తే..
మంచికి పోతే.. ఉన్న సంచీ ఊడిందని అంటుంటారు పెద్దలు. పాపం.. ఆ పెద్దాయన నీళ్లలో కొట్టుకుపోతున్న ఓ అమ్మాయిని మంచి ఉద్దేశంతోనే కాపాడాలనుకున్నాడు. ఉరుకుల మీద వెళ్లి నీళ్లలోకి దూకాడు. ఆ క్షణం.. ఆయన జీవితంలో ఊహించిన షాక్ తగిలిందట!. పోర్ట్ల్యాండ్కు చెందిన క్రిస్ ఫోర్డ్(67) ఒక రిటైర్డ్ ఫొటోగ్రాఫర్. సముద్రానికి కొట్టుకువచ్చే శకలాలను, చెక్క ముక్కలను సేకరించడం ఆయన అలవాటు. ఈ మధ్య ఓ సాయంత్రంపూట తన భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్నాడు. ఇంతలో దూరంగా రెండు తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించాయి. నో డౌట్.. ఎవరో అమ్మాయే అది అనుకున్నాడు. భార్య పక్కన ఉందనే విషయం మరిచిపోయి(సరదాగానే..) పరిగెత్తుకుంటూ వెళ్లి దభేల్ మని నీళ్లలోకి దూకి ఆ ప్రాణం కాపాడాలనుకున్నాడు. తీరా చూస్తే.. ఈదుకుంటూ దగ్గరికి వెళ్లి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయట ఆ పెద్దాయనకు. అది ఒక బొమ్మ. అదీ అలాంటి ఇలాంటి బొమ్మ కాదు. తల లేని సె* టాయ్. అది చూడగానే ఆయన నోట మాట పడిపోయిందట. ఆ బొమ్మను లాక్కుంటూ బయటకు తీసుకొచ్చాడు. హీరోలా వెళ్లి.. అలాంటి బొమ్మతో ఒడ్డుకు వచ్చిన భర్తను చూసి ఆ భార్య కింద పడి దొర్లుకుంటూ నవ్వుకుందట. పరువు పోయిందనుకుంటూనే.. ఆ సరదా విషయాన్ని ఆయన తన బ్లాగ్లో పంచుకున్నాడు. పైగా తనలాంటి ఎవరో భార్యా బాధితుడే ఇలాంటి పని చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అది బోట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. బహుశా ఎవరైనా బోటులో వచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంగ్లండ్ డోర్సెట్ చెసిల్ తీరం వెంట జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. -
‘ఇంటికొస్తే చాయ్ పొయ్యాలె?’ నవ్వులు పూయిస్తున్న సీఎం కేసీఆర్ ప్రసంగం
-
మాటలు - మంటలు
-
బుల్లి కోతి కష్టాలు...!
-
కరోనాకు ఎలా గురైంది చమత్కారంగా చెప్పిన కేసీఆర్
-
అందుకే నాకు కరోనా వచ్చింది : కేసీఆర్
-
నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో..
మనలో చాలా మందికి నీటిలో ఆడుకోవడమంటే మహా సరదా. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నీళ్లలో గడపటానికి తెగ ఇష్టపడతారు. అందుకే, చాలా మంది స్నానమనే వంకతో గంటల కొద్ది బాత్రూంలలో గడిపేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, నీళ్లలో ఆడుకోవడం మనుషులకే కాదూ.. నోరులేని జీవాలకు కూడా ఇష్టమే. అందుకే అడవిలోని చాలా జంతువులు నీరు కనిపించగానే నీళ్లలో దిగి సేద తీరుతుంటాయి. ఈ క్రమంలో, ఇప్పటికే అనేక జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు..ఈ వీడియోలో ఒక శునకం పొలం గట్టున కట్టేసి ఉంది. దాని పక్కనే కాలువ ప్రవహిస్తుంది. అయితే, ఎండ వేడికి బాగా అలసిపోయిందో.. ఏమో కానీ.. ఆ శునకం ఏంచక్కా కూర్చుని.. అటూ ఇటూ చూస్తూ సేద తీరుతుంది. అంతటితో ఆగకుండా అది నీటిలో మూతిపెట్టి గాలిని వదిలింది. ఈ క్రమంలో కొన్ని గాలి బుడగలు వచ్చాయి. ఆ శునకం ఇదేం వింత అని చూసి.. మరోసారి నీటిలో అలాగే చేసింది. ఈసారి కూడా నీటిలో బుడగలు వచ్చాయి. అయితే, ఈ వీడియో ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఫ్రెడ్ స్కూజ్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ‘వావ్.. శునకం నీటిలో ఎంత బాగా సేదతీరుతుంది..’,‘ఈ వీడియోను చూసి వీలైతే నవ్వు ఆపుకోండి.. చూద్దాం..’, ‘నీటిలో బుడగలు.. మీరేనా.. నేను తెప్పిస్తాను.. అని చూయిస్తుందేమో..’, ‘శునకం.. ఎంత క్యూట్ గా ఉంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Chillin’ like a villain. 😑😎 pic.twitter.com/TPDQfIT0wT — Fred Schultz (@fred035schultz) June 15, 2021 చదవండి: ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. -
పే...ద్ద దోశ !
సంక్రాంతి పండుగకని ఇంటికి వెళ్ళాను. ఇంటి బయట ఆటో దిగగానే సీరియస్గా ఓ లుక్ ఇచ్చింది అమ్మ. చెన్నై నుంచి మళ్లీ ఇంటికి రావడానికి రెండు నెలలు పట్టింది. అందుకే అమ్మ చాలా కోపంగా ఉంది. అదేంటో, అమ్మ కోపంలో బోలెడంత ప్రేమ కూడా ఉంటుంది. అందుకే, నేను ఫ్రెష్ అయ్యే లోపు బ్రూ కాఫీ రెడీగా ఉంది. అమ్మ కోపంలాగే కాఫీ కూడా చాలా వేడిగా ఉంది. కాఫీ తాగేంత సేపు లేదు, అమ్మ కోపం. భుజం మీద గాట్టిగా ఒక్కటిచ్చి, ‘ఇంకో వారం చూసి, మేమే వచ్చేవాళ్ళం చెన్నైకి’ అని నవ్వేసింది. ఉదయాన్నే చల్లటి నీటితో మొహం కడుక్కొని, పొగలు కక్కుతున్న కాఫీ తాగడంలో ఉన్న సంతృప్తి ఇంకేదాంట్లో దొరకదేమో. అదీ అమ్మ చేతి కాఫీ! చిక్కటి కాఫీ గొంతులో వెళ్తుంటే...గుటక గుటకకి కళ్ళు మూసుకొని...వేడి పొగను ఆస్వాదిస్తూ...ఆ తియ్యదనం నోటిలో ఇంకిపోతుంటే...దీని కోసమే ప్రతి రోజూ పని వదిలేసి ఇంటికి వచ్చేయచ్చు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ని పోల్చడానికి ఏ గొప్ప విషయం సరిపోదు. వాటికవే సాటి. నాన్న బయట పేపర్ చదువుతూ ఉన్నాడు. అమ్మ టిఫిన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. నేను టీవీ చూడ్డం మొదలుపెట్టా. ఏవో సినిమా పాటలు వస్తున్నాయ్. చిన్నప్పుడు, ప్రతి ఆదివారం టీవీలో వచ్చే రామాయణం, పంచతంత్రం కోసం వారమంతా వేచివుండే వాళ్ళం. అలా వేచి ఉండటం అస్సలు బోర్ కొట్టేది కాదు. చూసిన తర్వాత రెండు రోజులు స్కూల్లో వాటి గురించే చర్చ. చర్చ అనడం కన్నా గోల అనడం కరెక్ట్ ఏమో. అందుకే మాస్టారు అప్పుడప్పుడు క్లాస్రూమ్ లోకి వచ్చి ‘ఆపండ్రా మీ గోల’ అనేవాడు. ‘ఏది ఏది..కుదురేది ఏది..యెదలో... ’ టీవీలో మంచి పాట వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో పడ్డాను. ‘నాన్నా... దోశలోకి చనక్కాయల చట్నీ చేయనా, పప్పుల చట్నీ చేయనా...’ అమ్మ వంటింట్లోంచి అడిగింది. ‘చనక్కాయలు మా...’ టీవీ చూస్తూనే చెప్పాను. ఎన్ని రోజులైంది దోశలోకి ఆ చట్నీ తిని.. అస్సలు మంచి దోశలు తిని ఎన్ని రోజులైందో. ఇలాంటి విషయాలు గుర్తొచ్చినప్పుడే...జాబ్ మానేసి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. అమ్మ వంటలో ఉన్న ఆప్యాయత, దానికున్న ఆకర్షణ అలాంటివి మరి! సరే ఈ రోజు ఆదివారం కదా... పేపర్తో వచ్చే సండే మ్యాగజైన్ తీసుకుని నాన్న పక్కనే కూర్చున్న. ఇప్పుడైతే నా తమ్ముడు ఇంటికి రాలేదు కానీ, వాడు వచ్చి ఉంటే మాత్రం, సండే బుక్ కోసం పెద్ద గొడవ జరిగిపోయేది. పేపర్ రాగానే బుక్ ఫస్ట్ చదవడం కోసం పోటీ పడేవాళ్ళం. ఈ పోటీ మన క్లాసు పుస్తకాలు చదవడంలో అస్సలు ఉండేది కాదు. క్లాసు పుస్తకాలకు, మాకు మధ్య బలమైన వికర్షణ శక్తి ఉండేది. అది భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే బలమైనది అనుకుంటా, అందుకే మా చుట్టుపక్కల పుస్తకాలు ఉండేవి కాదు. అప్పుడప్పుడు నాన్న పుస్తకాల బ్యాగ్ తెచ్చి పక్కన పెట్టేవాడు, ‘చదువుకోండ్రా...’ అని. అప్పుడు మేము వాటి చుట్టుపక్కల ఉండే వాళ్ళం కాదు. ఇలా ఆలోచిస్తూ...కార్టూన్లు, కవర్ స్టోరీ, సెంటర్ పేజీ, కథ.. చదివేశా.. ఇంక మిగిలింది, ఫజిల్. ఇది మాత్రం నేను, తమ్ముడు కలిసే చేసేవాళ్ళం. తమ్ముడు: ‘3 నిలువు, కరము... రెండు అక్షరాలు... ఏంట్రా... హస్తం కదా...’ నేను: ‘అవును రా... కరెక్టే’ తమ్ముడు: ‘మరి 11 అడ్డంతో సరిపోవట్లేదు.. చివరి అక్షరం ‘డం’ ఉండాలి. నేను: ‘అవునా.. ఆగు .. ఏం గుర్తురావట్లేదు.’ నాన్న: ‘తొండం’ సరిపోతుందేమో చూడు. తమ్ముడు: సరిపోయింది నాన్న. ఇలాంటివి ఎన్నో...మేము ఆగిపోయిన ప్రతిసారి నాన్న సహాయం చేసేవాడు. మొత్తానికి ఆరోజు అది పూర్తి చేసే దాక నిద్ర పట్టేది కాదు. ‘టిఫిన్ రెడీ అయ్యిందండి..’ అమ్మ పిలుపు. సరే అని నాన్న, నేను లోపలికి వెళ్ళాం. అమ్మ అన్నీ నేల మీద అమరుస్తోంది. ఇంట్లో ఇప్పటికీ నేల మీద కూర్చుని తింటాం. మా ఇద్దరి పళ్ళాల్లో చెరొక దోశ వేసి, ఇంకో దోశ పెనం మీద వేయడానికి వెళ్ళింది అమ్మ. దోశని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చట్నీలో అద్దుకొని తింటున్న.. సగం దోశకె పళ్లెంలో చట్నీ ఐపోయింది. చట్నీ అంత రుచిగా ఉంది మరి. ‘దోశ లోకి చట్నీ తినురా.. చట్నీ లోకి దోశ తినకు’ అన్నాడు నాన్న. అమ్మ నవ్వుతూనే ఇంకో దోశ తెచ్చింది. ‘మా.. ఇంకో దోశ చాలు నాకు’ చెప్పాను..చట్నీ తింటూనే. ‘మూడు దోశలు ఏం సరిపోతాయి నాన్నా... ఇంకో రెండు వేసుకొస్తా...సరేనా...’ ‘వద్దు మా...ఇపుడే కడుపు నిండి పోయింది.’ ‘కూర్చొని మెల్లగా తిను రా ... ఇంక రెండే గా...’ ‘ప్లీజ్ మా... మళ్లీ మధ్యాన్నం అన్నం తినను చెప్తున్నా...’ ‘సరే‘ అని నాకు వేద్దాం అని తెచ్చిన దోశ ని నాన్నకు వేసేసింది. నాకు అర్థం కాలేదు. నాన్న ప్లేట్లో ఇంకా దోశ అలానే ఉంది. నేను ఖాళీ పళ్లెంతో కూచున్నా కూడా, నాన్నకే వేసి, ‘అది చల్లారి పోయింది రా.. నీకు వేడిగా వేసుకొస్తా ఉండు’ అని చెప్పింది. ఇంకో రెండు నిమిషాల తర్వాత వేడి వేడి దోశ తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టింది. అప్పుడర్థమైంది నాకు. మమ్మీ మాస్టర్ ప్లాన్. తెచ్చింది ఒక దోశే అయినా రెండు దోశలకు అయ్యేంత పిండితో, పే...ద్ధ గా వేస్కొచ్చింది. ఇంకేం చేస్తాం...తెచ్చింది ఒక దోశే గా...తినక తప్పలేదు! – శ్రీకాంత్ గాంధీ -
వేషాలు వేస్తామమ్మా..వేషాలు వేస్తాం
సాక్షి ,ఖమ్మం: ఎన్నికల వేడి మొదలైంది...రాజకీయనాయకులు కొత్త కొత్త ..వింత వేషాలను వేస్తున్నారు. అందులో కొన్ని.. తిలకం దిద్ది..హారతి పట్టి ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వెంకటగిరి, గుర్రాలపాడులో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఆయనకు కోట నారాయణపురంలో మహిళలు తిలకందిద్ది, హారతిపట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..ఇంకా విన్నవించారు. చేపలు అమ్ముతా.. చక్కబెడతా మణుగూరురూరల్: ప్రజల్లో కలిసిపోయి వారిలో ఒకరిగా ఉంటానని, అండగా నిలుస్తానని చెబుతూ..మణుగూరు టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రచారంలో భాగంగా ఇదిగో ఇలా చేపలు విక్రయించారు. మత్సా్యలను చేతుల్లోకి తీసుకుని..తరాజుల్లో జోకుతూ అమ్మారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే..జనం పక్షాన నిలుస్తానని, ఈసారి తిరిగి ఆశీర్వదించి ఆదరించాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. గడ్డం గీస్తా..వృద్ధిచేస్తా వైరా: టీఆర్ఎస్ వైరా అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్ మంగళవారం వైరా పట్టణ వీధుల్లో ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ మంగలి దుకాణంలో ఒకరికి చక్కగా గడ్డం గీశారు. ఎమ్మెల్యే అంటే..అందనంత దూరంలో ఉండనని, మీతోనే, మీ వెన్నంటే ఉంటానంటూ ప్రజలకు భరోసానిస్తూ, ఒక్కసారి తిరిగి గెలిపించాలని కోరారు. మధ్యలో నిలిచిన అన్ని రకాల పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. వాహనం..అంతా కాషాయం సత్తుపల్లిటౌన్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారంలో భాగంగా సత్తుపల్లికి చెందిన భూక్య శ్యాంసుందర్నాయక్ తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఇలా పూర్తిగా కాషాయ భరితంగా మలుచుకున్నారు. బండిపై కూడా బీజేపీ అని రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈసారి బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని ఓట్లు అభ్యర్థించాడు. -
నవ్వు తెప్పించిన కారు ప్రమాదం
-
ఒబామా చాలా ఫన్నీ: ప్రియాంక
ముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బాలీవుడ్ నటి.. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా చెప్పింది. వైట్ హౌస్ లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యంలో డిన్నర్ పార్టీకి హాజరైన ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబయింది. ఒబామా, మిషెల్లీతో కలిసి డిన్నర్ చేయడం ఆనందాన్నిచ్చిందని చెప్పింది. ఒబామా చాలా ఫన్నీ.. అని ఆయన చాలా మంచివారని పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేసింది. 2016 వైట్ హౌస్ కరెస్పాండెట్స్ నిర్వహించిన విందుకు ప్రియాంకను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్ర షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. -
భీమవరం నుంచి పోటీ చేస్తా!!
-
అక్రమార్కుని మార్కు సింహసనం కథ
-
తమాషా పదాలు... తీరైన సంభాషణలు
తమాషా పేర్లు, కోర్ట్ సీన్స్తో మొదలైన ఇది మల్లాది సీరియల్ అనే నమ్మకం మొదట్లో కుదరలేదు. మెక్డోనాల్డ్స్లో కోక్ ఎన్నిసార్ల్లైనా నింపుకోవడం లాంటివి మనలో చాలామంది గమనించి ఉండరు. సినిమాటిక్గా ఒక్కో హీరో ఒక్కో కథతో ఎంట్రీ, వీరందర్నీ పాత స్నేహితులుగా అతికించినట్లు కనిపించింది. కాలేజ్ ఫంక్షన్లోని జోక్స్ ఫేస్బుక్తో పరిచయం లేని పాఠకులకి ఉపయోగం. గోలచందర్ కథ, దుర్యోధన్ని త్రీమంకీస్ బెదిరించడం, వాటర్ క్యూబ్స్ని వాటర్ విత్ కార్నర్స్గా చెప్పడం లాంటి తమాషా పదాలు సీజనాత్మకం. పట్టయ్య అంత్యాక్షరి ద్వారా చెప్పిన పాత సినిమా పాటలు నాకు హాయిగా అనిపించాయి. పోలీసులకి, దొంగలకి మధ్య వానర్ మధ్యవర్తిత్వం హాస్యంగా సాగింది. వాళ్ళు అన్ని కోట్లు సులువుగా కొట్టేసినా ‘ఈజీ మనీ నాట్ క్రేజీ’ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ముందుగానే ‘డబ్బు తాబేలులా వస్తుంది. కుందేలులా పోతుంది’ అని చెప్పారు కదా! బియాండ్ లిమిట్స్కి వెళ్ళకుండా, పరుగులు పెట్టకుండా కథని నడపడం మల్లాది ప్రత్యేకత. ఒకే ఒక్క ఫోన్కాల్తో సీరియల్ని ముగింపుకి తెచ్చేశారు. దీన్లోని పాత్రలన్నీ ఒక ఎత్తు. వేమన పాత్ర ఒక ఎత్తు. ఇలాంటి సీరియల్లో అలాంటి పాత్ర ద్వారా వేదాంత సారాన్ని చేర్చడం అభినందనీయం. ‘నీకో సమస్య ఉందని దేవుడికి చెప్పకు. సమస్యకి నీకో దేవుడున్నాడని చెప్పు’ లాంటి ఎక్స్లెంట్ డైలాగ్స్ చాలా రాశారు. - వి శశికళ, నాయుడుపేట (నెల్లూరు జిల్లా) త్రీమంకీస్ సీరియల్పై పాఠకుల అభిప్రాయాలు మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో ఉత్తమమైనవిగా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిని రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నాం. నిన్న మొదటి అభిప్రాయం ప్రచురించాం. ఇవాళ్టిది రెండోది. ఇలా ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు ఒక్కొక్కరికి రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో వచ్చే నవలలో కూడా ప్రచురిస్తారు. -
కలల వేదిక.. కాకూడదు కల్లోలాలకు వేదిక!
-
కవ్వింత: ఏం చెప్పాడు!
పనివాడు: సార్... మన థియేట ర్లో ఆడుతోన్న సినిమా చూడ్డానికి ఎవరూ రావడం లేదు. ఒక్క టిక్కెట్టు కూడా అమ్ముడవ్వలేదు. యజమాని: దానికంత కంగారెందుకు? టిక్కెట్లు ఫ్రీగా పంచిపెట్టు. అందరూ వచ్చాక తలుపులు తాళం వేసెయ్. బయటకు వెళ్లాలంటే రెండొందలు కట్టాలని చెప్పు. పనివాడు: ఆ...! అంతే తెలుసు! తల్లి: స్వీటీ... ఇంగ్లిష్ ఎగ్జామ్ ఎలా రాశావ్? స్వీటీ: బాగా రాశాను మమ్మీ. మీ డాడీ ఏం చేస్తారు అని అడిగితే స్వీపర్ అని రాశాను. తల్లి: అదేంటి... మీ డాడీ అసిస్టెంట్ కమిషనర్ కదా? స్వీటీ: అవుననుకో. కానీ నాకు అసిస్టెంట్ కమిషనర్ స్పెల్లింగ్ రాదు. అందుకని...! అలా జరిగిందా? సుబ్బు: కడుపునొప్పని డాక్టర్ దగ్గరికెళ్లావ్గా, ఏమయ్యింది? పండు: ఆ డాక్టర్ ఇంతకుముందు హోటల్ నడిపాడేమోనని అనుమానంగా ఉందిరా? సుబ్బు: అదేంటి? పండు: ఇంజెక్షన్ చేసి డబ్బులడిగాడు. లేవు అంటే... హాస్పిటల్లో ఉన్న టవళ్లు, దుప్పట్లు ఉతికించాడు. అదెలా సాధ్యం?! భర్త: రాత్రి కలలో దేవుడు కనిపించాడు. భార్య: అవునా... ఏం కోరుకున్నారు? భర్త: నీ బుద్ధిని పదిరెట్లు చేయమని అడిగాను. భార్య: పెంచాడా? భర్త: సున్నాలకి మల్టిప్లికేషన్ ఉండదు అని మాయమైపోయాడు. -
నవ్వింత: అసలు ఇండియన్!
అమెరికా వాడు: ఇంట్లో కరెంటు పోతే పవర్ ఆఫీసుకు ఫోన్ చేస్తాడు. జపాన్ వాడు: ఇంట్లో కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేసుకుంటాడు. ఇండియన్: పక్కింటికెళ్లి కరెంటుందా లేదా అని చూస్తాడు. మరుపులో మరుపు రోగి: డాక్టరు గారు... నేను చెప్పింది వెంటనే మరిచిపోతాను. డాక్టరు: ఈ సమస్యను మీరు ఎప్పుడు గుర్తించారు? రోగి: ఏ సమస్య ??!!! కవలలైతేనో? విడాకుల కోసం వచ్చిన ఓ జంట కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. జడ్జి: విడాకులు ఇవ్వమంటున్నారు సరే. ఆస్తికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నాయా? భార్య: ఇద్దరం చెరిసగం పంచుకుందామనుకున్నాం సార్. జడ్జి: మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా. వారిని ఎలా పంచుకుంటారు? అమాయకుడైన భర్త: అయితే, మేము వచ్చే ఏడాది విడాకులకు అప్లై చేస్తాం!!