Greenland
-
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్లాండ్పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్లాండ్కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెన్మార్క్ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
గ్రీన్లాండ్: ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్లాండ్పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్లాండ్ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్తో కలిసి గ్రీన్లాండ్లో పర్యటించారు. డెన్మార్క్తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్ లేదని అన్నారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్లాండ్ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్లాండ్లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. -
గ్రీన్ల్యాండ్కు జేడీ వాన్స్ పర్యటన.. పొలిటికల్ టెన్షన్
వాషింగ్టన్: డెన్మార్క్లో స్వయంప్రతిపత్తి గల ‘గ్రీన్ల్యాండ్’ను కొనేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ డెన్మార్క్ ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించేలా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రవర్తించారు. అనధికార పర్యటనలో భాగంగా గ్రీన్ల్యాండ్కు వాన్స్ భార్య ఉషా గురువారం వెళ్లి శనివారం తిరిగిరానున్నారు. అయితే భార్యతో వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని వాన్స్ మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్ల్యాండ్ అంశాన్ని ప్రస్తావించారు.ఈ క్రమంలో వాన్స్ మాట్లాడుతూ..‘భార్య ఒక్కతే ఆనందంగా ఉంటే సరిపోతుందా. నేను కూడా ఆమెతోపాటు గ్రీన్ల్యాండ్కు వెళ్తా. గ్రీన్ల్యాండ్ పర్యటనలో భాగంగా అక్కడి వాయవ్య పిటిఫిక్ భూభాగంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని సందర్శిస్తా. అధ్యక్షుడు ట్రంప్ తరఫున మాట్లాడుతున్నా. గ్రీన్ల్యాండ్ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రీన్ల్యాండ్ భద్రత అనేది పరోక్షంగా యావత్ ప్రపంచ భద్రతకు సంబంధించింది’ అని అన్నారు.దీంతో డెన్మార్క్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ప్రైవేట్గా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరినీ మా దేశంలోకి అనుమతిస్తూ ఆహ్వానాలు పంపలేదు’ అని గ్రీన్ల్యాండ్ సర్కార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్పెట్టింది. ‘పిలవకుండా వచ్చి మమ్మల్ని అనవసర ఒత్తిడికి గురిచేయాలని అనుకుంటున్నారు’ అని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిసిమియట్ పట్టణంలోని అవన్నాటా క్విమిసెర్సూ శునకాల స్లెడ్జ్ బండ్ల పరుగుపోటీని, గ్రీన్ల్యాండ్ సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించేందుకు అక్కడ పర్యటిస్తానని ఉషా గతంలో చెప్పడం తెలిసిందే. గ్రీన్ల్యాండ్లో లిథియం వంటి ఖనిజ నిల్వలు అపారం. వీటిని దక్కించుకునేందుకు ట్రంప్ కుయుక్తులు పన్నారని డెన్మార్క్ ప్రభుత్వం గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంలో డెన్మార్క్కు నాటో సభ్య దేశాలు సైతం మద్దతు పలికాయి. JD Vance announces he’s going to Greenland with his wife Usha.Nobody wants her or you there, bro.pic.twitter.com/IowQstwafx— Art Candee 🍿🥤 (@ArtCandee) March 25, 2025 -
‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్లాండ్ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్లాండ్ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది. -
అమెరికా ‘గ్రీన్ల్యాండ్’ కలలకు చెక్ పెట్టిన డెన్మార్క్!
గ్రీన్ల్యాండ్ స్వాదీనం కోసం డెన్మార్క్కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే! గ్రీన్ల్యాండ్పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశం డెన్మార్క్ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్ల్యాండ్ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్ల్యాండ్పై అధికారాలున్న డెన్మార్క్పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్ల్యాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే.. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు. బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్ డెన్మార్క్లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్ను అమెరికా దిగుమతి చేసుకుంది. డెన్మార్క్ కేంద్రంగా లెగో గ్రూప్... ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరికన్సన్కు ఫోన్లో వాగ్వాదానికి దిగారు. గ్రీన్ల్యాండ్ అంశం విషయంలోనే ఈ హాట్ హాట్ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రముఖంగా కథనం ప్రచురించింది. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్కి వాయువ్యంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది గ్రీన్ల్యాండ్(Greenland). స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అయినప్పటికీ.. డెన్మార్క్ సామ్రాజ్యపు నియంత్రణలో ఉంటోంది. దీంతో ఎలాంటి సంప్రదింపులకైనా డెన్మార్క్తో చర్చించాల్సిందే. గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయాలని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్తో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్రంప్, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్ను ఆర్థికంగా శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్కాల్లో హెచ్చరించారట. ఫోన్కాల్లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ అధికారులు వెల్లడించినట్లు సదరు కథనం పేర్కొంది. ఫోన్ కాల్లో సంభాషణ ఇలా.. గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దానికి ఫ్రెడెరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గ్రీన్ల్యాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో ఆమెతో దూకుడుగా మాట్లాడారట. ఒక దశలో బెదిరింపులకు దిగారని సదరు కథనం పేర్కొంది. వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సాగినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. కానీ, ట్రంప్ కంటే చాలాఏళ్ల ముందే అమెరికా నుంచి ఈ ప్రతిపాదన వెళ్లింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గ్రీన్ల్యాండ్ భౌతిక స్వరూపం, అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద వనరులే అందుకు కారణం. అయితే.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది.మళ్లీ ఇన్నాళ్లకు.. పనామా కాలువు, కెనడా, గ్రీన్ల్యాండ్ ప్రకటనలతో ట్రంప్ సంచలన చర్చకు దారి తీశారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే.. ఆర్థిక ఆంక్షలు విధిస్తానని, అవసరమైతే సైన్యపరమైన చర్యలకు తాను వెనకాడబోనంటూ ప్రకటించారాయన. అయితే ట్రంప్ బహిరంగ ప్రకటన ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి ఈయూ దేశాలను ఆందోళనకు గురి చేసింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని, అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే.గ్రీన్లాండ్లో ఏముందంటే..గ్రీన్ల్యాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త మెటీరియల్ లభ్యం అవుతుంది. రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టిపెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.94 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఓ అంచనా. చైనాకు కూడా గ్రీన్ ల్యాండ్పై కన్నుంది. -
ట్రంప్ ప్రకటన: గ్రీన్ల్యాండ్ రేటెంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్లోని గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే.. గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ & మాజీ ఆర్థికవేత్త 'డేవిడ్ బార్కర్' (David Barker) ఓ అంచనా వేశారు.గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ వెల్లడించారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. అంతే కాకుండా అక్కడి ప్రధాన మంత్రి 'మ్యూట్ బౌరప్ ఎగెడే' (Mute Bourup Egede).. ఈ ద్వీపం అమ్మకం కోసం కాదు.. ఎప్పటికీ అమ్మకానికి ఉండదని పేర్కొన్నారు.గ్రీన్ల్యాండ్గ్రీన్ల్యాండ్ అనేది అత్యంత సుందరమైన ఐలాండ్. ఇక్కడ అపారమైన ఖనిజ (రాగి, లిథియం) సంపద ఉంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలలో, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు రూ. 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతం కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే. -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్ల్యాండ్ కరుగుతోంది!
గ్రీన్ల్యాండ్లో మంచు అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు పెరిగిపోతూ భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల (4,70 లక్షల కోట్ల టన్నులు) హిమం కరిగిపోయిందంటే ఏ స్థాయిలో కరిగిందో అంచనావేయొచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. ఆ అధ్యయనం విశేషాలు తెలుసుకుందామా..! 2002 నుంచి గ్రీన్లాండ్లో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమెట్ ఎక్స్పరిమెంట్ (గ్రేస్) ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్స్ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే ఫలకల మధ్యప్రాంతంలో మంచు పరిమాణం ఒకింత పెరిగిందని, ఇది పెరగడానికి కారణం హిమపాతమని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఉపరితల జలాలు పెద్దమొత్తంలో వేడెక్కుతున్న పశ్చిమ గ్రీన్లాండ్ తీరంలో ఎక్కువ మంచు కరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెప్పింది. అంటార్కిటికాలో కరిగితే.. అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్లాండ్లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాపస్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్లాండ్ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్ పేర్కొన్నారు. 2300 నాటికి 4 అడుగులు... ♦2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు నడుచుకున్నా 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ♦సముద్రమట్టాల పెంపుతో షాంఘై నుంచి లండన్ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. ♦ఈ ముప్పు తప్పించాలంటే మనం కర్భన ఉద్గారాలను వీలైనంత త్వరగా నియంత్రించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ♦ఈ శతాబ్దం రెండో సగానికి వచ్చే నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకురావాలని పర్యావరణ ఒప్పందాలు ఇప్పటికే లక్ష్యం విధించాయి. ♦పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల మహాసముద్రాల మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. ♦పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 నాటికి సుమద్రమట్టాలు అదనంగా 20 సెం.మీ. మేర పెరుగుతాయి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
28 ట్రిలియన్ టన్నుల మంచు మాయం
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత మూడు దశాబ్ఞాలలో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరగే వేగం పెరిగిందని లండన్ కి చెందిన లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.1990లలో సంవత్సరానికి 0.8 ట్రిలియన్ టన్నుల మేర మంచు కరిగేదని, 2017నాటికి ఏటా కరిగే మంచు 1.3 ట్రిలియన్ టన్నులకు చేరిందని ఈ అధ్యయనం తెలిపింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) గత 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పేరిగిందని తేలింది. అంటార్కిటికా, గ్రీన్లాండ్లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే వేగం పెరిగినట్లు వివరించింది. ఈ సర్వేలో 2.15 లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచు వేగంగా కరగడం కారణంగా సముద్ర మట్టం పెరిగి తీరప్రాంతలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే వన్యప్రాణులకు నివాసంగా ఉండే సహజ ఆవాసాలను తుడిచిపెట్టే ప్రమాదం ఉంది అని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ పతనానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే వేగంగా దారుణ పరిణామాలన్నీ క్రమంగా ప్రత్యక్షమవుతున్నాయి. అధ్యయనంలో వాతావరణంలో, మహాసముద్రాలలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుందని తెలుస్తుంది. -
క్లీన్లాండ్గా మారిన గ్రీన్లాండ్
-
గ్రీన్లాండ్ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్పై కన్నేశారు. ‘డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్లాండ్పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్లాండ్ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్లాండ్ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్లాండ్ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్లాండ్పై అధికారాలు డెన్మార్క్కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్లాండ్ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
గ్రీన్ల్యాండ్లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్ల్యాండ్లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్ల్యాండ్లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్ల్యాండ్లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్ల్యాండ్లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
ఇనార్సూట్ గ్రామ సమీపంలో భారీ మంచుకొండ
-
భారీ మంచుకొండ.. భయం గుప్పిట్లో గ్రామం..
ఇనార్సూట్, గ్రీన్లాండ్ : కేవలం 170 మంది జనాభా కలిగిన గ్రీన్లాండ్లోని ఇనార్సూట్ గ్రామం సునామీ భయంతో వణికిపోతోంది. ఇందుకు కారణం దాదాపు 100 మీటర్లు(330 అడుగులు) ఎత్తైన భారీ మంచుకొండ సదరు గ్రామాన్ని సమీపిస్తుండటం. దాని నుంచి మంచు చరియ గనుక విరిగితే భారీ ఎత్తున అలలు గ్రామంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అయితే, కొందరు స్థానికులు మాత్రం ఈ తరహా భారీ మంచు తునకలు గ్రామానికి సమీపంలో కనిపించడం కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలో దీని కంటే అతి పెద్ద మంచు చరియలు అటువైపుగా పయనించాయని వెల్లడించారు. మంచు చరియకు భారీ స్థాయిలో పగుళ్లు ఉండటమే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే స్టేషన్, ఇంధన వనరు ప్రదేశం తీరానికి అతి చేరువలో ఉన్నాయి. మంచు చరియ దాదాపు కోటి 10 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. నీటిపై భాగంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంచుకొండ ఉంది. అప్పుడప్పుడూ చిన్నచిన్న మంచు ముక్కలు విరిగి నీళ్లలో పడిన శబ్దాలు సైతం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
దిల్కుషా... మేయర్ క్యాంపు ఆఫీస్?
బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ చేపట్టారు. రాజ్భవన్ పక్కన ఉన్న దిల్ కుషా గెస్ట్హౌస్, గ్రీన్ల్యాండ్స్లో ఉన్న గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్ను శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. దిల్కుషా గెస్ట్హౌస్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్ను కలవడానికి వచ్చేవారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్నఅధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి... గెస్ట్హౌస్లను పరిశీలించారు. గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్ ముందు జరుగుతున్న మెట్రో పనుల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతో పాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం గెస్ట్హౌస్ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రాలేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుంది. -
‘సూ’ సంస్థపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను లెక్కలు చూపకుండా పన్ను ఎగ్గొడుతున్న ఎస్ఈడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సూ) సంస్థపై శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గ్రీన్ల్యాండ్స్లోని సంస్థ కార్యాలయంతో పాటు సంస్థ ఎండీ, డెరైక్టర్ నివాసాలపై తనిఖీలు చేసి కోట్లాది రూపాయలను గుర్తించారు. ముందుగా ఎస్ఈడబ్ల్యూ కంపెనీపై దాడి చేసిన అధికారులు రూ. 155 కోట్ల పైచిలుకు పన్ను ఎగవేత పత్రాలను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్కాలనీలోని సంస్థ ఎండీ వల్లూరిపల్లి రాజశేఖర్ నివాసంలో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను గుర్తించారు. అలాగే సంస్థ డెరైక్టర్లు వై.సూర్యపక్రాశ్రావు, వై.గంగాధర్ నివాసాల్లో కూడా దాడులు నిర్వహించారు. కావూరి హిల్స్లో నివసించే సూర్యప్రకాశ్రావు నివాసంలో, జూబ్లీహిల్స్ రోడ్ నం. 15లో నివసించే గంగాధర్ నివాసంలో కూడా దాడులు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి నివాసాల్లోనూ రూ. 5 కోట్ల పైచిలుకు నగదును, బంగారాన్ని గుర్తించారు. -
సీఎం క్యాంపు ఆఫీసుగా ఎస్ఐబీ భవనం
హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎట్టకేలకు ఖరారైంది. గ్రీన్ల్యాం డ్స్లోని తన అధికార నివాసానికి పక్కనే ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) పాత భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో వాస్తులోపాలున్నాయ న్న ఉద్దేశంతో సీఎం దాన్ని విని యోగించడం లేదు. అదే ప్రాంగణంలోని నివాస భవనానికే ఆయన పరిమితమయ్యారు. అయితే సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో నివాసభవనంలో స్థలాభావం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతిథులతో భేటీ, ప్రభుత్వ విభాగాలతో సమీక్షలకు కూడా అది అనుకూలంగా లేదు. కుందన్బాగ్లోని ఐఏఎస్ అధికారుల నివాస ప్రాంగణంలోని భవనాలను, ముషీరాబాద్, బంజారాహిల్స్లోని మరికొన్ని భవనాలను అధికారులు పరిశీలిం చారు. ఈ క్రమంలో ఆయన అధికారిక నివాసం సమీపంలో నిజాం కాలంలో నిర్మితమైన ఎస్ఐబీ భవనం చూడముచ్చటగా ఉండడంతోపాటు, ఇటు నివాసానికి, సచివాలయాని కి చేరువగా ఉండడంతో సీఎం దానికి ఓకే చెప్పేశారు. -
నేడు నగరానికి 14వ ఆర్థిక సంఘం
రాజ్భవన్లో సంఘం సభ్యులకు గవర్నర్ విందు రేపు సీఎం, మంత్రులు, అధికారులతో సభ్యుల సమావేశం హైదరాబాద్: వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్కు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై వారితో చర్చించిన తరువాత నివేదిక తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులకు గురువారం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో విందు ఇస్తున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రీన్ల్యాండ్స్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం వరకు సమావేశమై ప్రభుత్వ కోర్కెల చిట్టా వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి రాజకీయ పార్టీల నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కమిషన్ను కలువనున్నారు. శుక్రవారం రాత్రికి సీఎం కేసీఆర్ ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. చేపట్టనున్న కొత్త పథకాలకు విరివిగా నిధులిచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శనివారంనాడు కమిషన్ సభ్యులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. సీఎం సమీక్ష.. 14వ ఆర్థిక సంఘాన్ని కోరే అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాటర్గ్రిడ్, పోలీసు వ్యవస్థ బలోపేతం, రహదారుల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, సలహాదారులు పాపారావు, జీఆర్రెడ్డి, సీఎస్ రాజీవ్శర్మ, అధికారులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర సీఎం అధికార నివాసం గ్రీన్ల్యాండ్ కాదు.. లేక్వ్యూ
రెండు రాష్ట్రాల అతిధి గృహాలుగా పర్యాటక భవన్ విభజన సంబంధిత ఆదేశాలన్నీ ఎన్నికలయ్యాకే: సీఎస్ హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసంగా లేక్వ్యూ అతిధి గృహాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గ్రీన్ల్యాండ్ అతిధి గృహాన్ని సీమాంధ్ర సీఎం అధికార నివాసంగా కేటాయించాలని భావించారు. అయితే గ్రీన్ల్యాండ్ పూర్తిగా రోడ్డు మీదకు ఉండటం, ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే భావనతో లేక్వ్యూను కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బేగంపేటలోని పర్యాటక భవన్ ను ఇరు రాష్ట్రాల అతిధి గృహాలకు వీలుగా మార్పులు చేయాలని నిర్ణయించారు. విభజన సంబంధిత ఆదేశాలను ఎన్నికలు పూర్తయ్యేవరకు జారీ చేయకూడదని నిర్ణరుుంచారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విభజనకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత ఆదేశాలను మాత్రం ఎన్నికలు పూర్తయ్యూక జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సూచించారు. విభజనకు సంబంధించిన 21 కమిటీల ఉన్నతాధికారులతో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 15వ తేదీకల్లా కమిటీలన్నీ తుది సిఫారసులతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నందున వారితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రస్తుతం శాఖలకు ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అధికారులే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు ఫైళ్లతో పాటు ఆయా శాఖలకు చెందిన అంశాలను అప్పగించే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ప్రస్తుతానికి ఎక్కడున్న ఫర్నిచర్ను అక్కడే కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయరాదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు జూన్ 2వ తేదీన జరుగుతుందని అదే రోజు ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పుడున్న శాఖాధికారులు అప్పగింతలు చేయాలని సూచించారు.