Harrashment
-
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 14567 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్కు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం, ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు.కాగా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ను బుధవారం రికార్డు చేశారు. కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక, మరికొన్ని ఆధారాల సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే ఈ కేసు వివరాలను సఖీ బృందం సేకరించిన విషయం తెలిసిందే. మైనర్గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురిచేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేసింది.మరోవైపు.. జానీ మాస్టర్కు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచింది. టాలీవుడ్లో లైంగిక వేధింపుల అంశంపై ప్యానల్ విచారణ జరుపుతోంది. ఇక, ప్యానల్ సైతం వేధింపులపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నామని ప్యానల్ తెలిపింది. ఇదిలా ఉండగా.. బాధితురాలికి ఉన్న వర్క్ టాలెంట్తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అగ్ర హీరో బాధితురాలికి మద్దతు పలికినట్టు సమాచారం.కేసు వివరాలు ఇలా..జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి.. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్ వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పనిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్రమలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసులో మరిన్ని కీలక అంశాలు -
వేధించినందుకే.. కిరాతకంగా హతమార్చారు!
కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు హతమార్చారని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన సాయికిరణ్ తన భార్య అనూషతో కలిసి గతంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్లోని ఓ కోళ్ల ఫారంలో పని చేసేవాడు.అక్కడే పని చేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్టూర్ మండలం బరెగూడకు చెందిన బట్టి శ్రీనివాస్, అతని భార్య సునీతతో సాయికిరణ్కు పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకొని అతను సునీతతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయమై శ్రీనివాస్, సాయికిరణ్ మధ్య గొడవలు జరిగాయి. తర్వాత సాయికిరణ్ తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చి, కట్టె కోత మెషిన్ పనిలో చేరాడు. తన భర్త గత ఏప్రిల్ 18న పనిమీద వెళ్తున్నానని వెళ్లి, తిరిగి రాలేదని అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సాయికిరణ్ గతంలో పని చేసిన కోళ్ల ఫారంకే వెళ్లాడని, అక్కడ శ్రీనివాస్, సునీతతో గొడవ పడ్డాడని, అతనికి గాయమైందని ఫారం యజమాని ఫోన్ ద్వారా అనూషకు సమాచారం ఇచ్చాడు. ఈ గొడవతో శ్రీనివాస్ దంపతులు కోళ్ల ఫారం నుంచి తమ స్వగ్రామం వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.అయినా, సాయికిరణ్ సునీతకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. దీంతో వారు విసిగిపోయి, అతన్ని చంపేయాలని పథకం వేశారు. శ్రీనివాస్ తన భార్య సునీతతో సాయికిరణ్కు ఫోన్ చేయించి, ఏప్రిల్ 19న దహెగాంకు పిలిపించాడు. మరో ఇద్దరితో కలిసి, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, హతమార్చారు. అనంతరం సాయికిరణ్ మృతదేహాన్ని అక్కడే వ్యవసాయ బావిలో పడేసి, మహారాష్ట్ర పారిపోయారు.పోలీసులు దాదాపు 2 నెలలు శ్రమించి, ఈ కేసులో ఎ–1 బట్టి శ్రీనివాస్, ఎ–2 సునీత, ఎ–3 తమ్మిడి గంగారాం, ఎ–4 భీమంకర్ శ్యామ్రావులను శనివారం అరెస్టు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 15 రోజుల కస్టడి విధించడంతో జైలుకు పంపినట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న మానకొండూర్ సీఐ రాజ్కుమార్ను, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
కన్న కూతురిపై.. తండ్రి లైంగిక దాడి! ఆపై..
హైదరాబాద్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, స్పెషల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. బాధితురాలి విద్యాభ్యాసం కోసం డీఎల్ఎస్ఎ ద్వారా రూ.5 లక్షలు పరిహారాన్ని అందజేశారు. హబీబ్నగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మహ్మద్ అబ్దుల్ హఫీజ్ మద్యానికి బానిసై ఇంటి వద్దనే ఉండేవాడు. అతడి భార్య భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించేది. వారికి ఆరుగురు సంతానం. 2021 నవంబర్ 30న ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భిక్షాటనకు వెళ్లింది. ఇదే అదనుగా హఫీజ్ తన కుమార్తె(10) పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాధితురాలి పిన్ని ఈ విషయాన్ని గుర్తించి ఇరుగు పొరుగుతో కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. గురువారం స్పెషల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి టి.అనిత కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితు మహ్మద్ అబ్దుల్ హఫీజ్కు 20 ఏళ్ల కఠినకాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
బాలుడిపై లైంగికదాడి! ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో..
హైదరాబాద్: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... బోరబండ డివిజన్ బ్రాహ్మణవాడి బస్తీలో నివసించే సయ్యద్ రవూఫ్ (65) అదే ప్రాంతంలో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. సరుకుల కొనుగోలు నిమిత్తం ఇతని దుకాణానికి గురువారం 3వ తరగతి చదువుతున్న ఓ బాలుడు (7) వచ్చాడు. రవూఫ్ ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కొంతకాలంగా చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బస్తీ వాసులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు కొట్టాడని.. ఇంటి నుంచి వెళ్లిన తల్లి.. చివరికి శవమై ఇలా..!
మహబూబ్నగర్: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిని కొట్టడంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఆదివారం కోయిల్సాగర్ కుడి కాల్వలో శవమై కనిపించిన ఘటన పూసల్పహాడ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసల్పహాడ్కు చెందిన రాధమ్మ(45) కుమారుడు శివకుమార్రెడ్డి ఈ నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇలా రోజూ మద్యం తాగి ఇంటికి వస్తే కుటుంబం ఎలా గడుస్తుందని తల్లి కుమారుడిని నిలదీసింది. ఆగ్రహానికి గురైన కుమారుడు తల్లిని కొట్టాడు. ఆమె మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా లాభం లేకపోయింది. భర్త రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చివరకు అనుమానం వచ్చిన గ్రామస్తులు కోయిల్సాగర్ కుడి కాల్వకు వస్తున్న నీటిని నిలిపివేయించారు. మూడు రోజుల తర్వాత వెంకటాపూర్ గ్రామ శివారులో కుడి కాల్వ ముళ్లపొదలో చిక్కుకున్న రాధమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. నారాయణపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలియజేశారు. -
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోళిలో ఓ ఎస్సై అరాచకం
-
‘అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2016 లో మైనర్పై అత్యాచారానికి పాల్పడిని కేసులో దోషిగా తేలి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న క్యాథిలిక్ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కుం చెర్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ బాధితురాలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తన సొంత నిర్ణయమని, కేరళలోని కొట్టియూర్కు చెందిన బాధితురాలు పేర్కొంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ అప్పీల్నుసుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ కేరళ హైకోర్టులో రాబిన్ దాఖలు పిటిషన్ను తిరస్కరించిన అయిదు నెలల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 2016 లో రాబిన్ మైనర్ బాలిక (16)ను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో రాబిన్ వడక్కుం చెర్రిన కొచ్చిలో అరెస్టు చేశారు. తనకు సంబంధం లేదని, తాను అమాయకుడిననీ రాబిన్ మొదట్లో బుకాయించాడు. కానీ డీఎన్ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత అతడిని దోషిగా నిర్ధారించింది. 2019లో రాబిన్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్ తన వల్ల బాధితురాలికి జన్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలను జైలు శిక్ష కారణంగా చూసుకోలేకపోతున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టుకు లేఖ రాశాడు. ఇందుకు తనకు రెండు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే రాబిన్ ప్రతిపాదనను కేరళ హైకోర్టు తిరస్కరించింది. శిక్షనుంచి తప్పించుకునేందుకు అతను ఈ ఎత్తుగడ వేశాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనికి అంగీకరిస్తే ఇకపై ప్రతి అత్యాచార దోషి, శిక్షలు తప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయన్ని తాము ప్రోత్సహించమని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బాలుడిపై ట్యూటర్ లైంగిక వేధింపులు
అగర్తల: విద్యార్థులకు విద్యాభోదన చేయాల్సిన టీచర్లే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ ప్రైవేట్ ట్యూటర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన త్రిపురలోని అగర్తలలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన దాదాపు పదిరోజుల తర్వాత ప్రైవేట్ ట్యూటర్ను ఇంద్రఘోష్(23)ను గుర్తించామని పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నవంబర్ 30న కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని రామ్ నగర్ అవుట్పోస్ట్ ఇన్చార్జి బిస్వాజిత్ దాస్ వెల్లడించారు. నవంబర్ 28న ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత చైల్డ్ లైన్ ప్రతినిధులు బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడు ఓ ప్రైవేటు ట్యూటర్ చేత లైంగిక వేధింపులకు గురయ్యాడని తెలుసుకున్నారు. ఈ విషయం గురించి ఎవరితోనై నా చెబితే తరువాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్యూటర్ బెదిరించడంతో, బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇది జరిగిన వారం రోజుల పాటు బాలుడు ట్యూషన్కు వెళ్లకపోవడంతో కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పినట్లు చైల్డ్ లైన్ సభ్యులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపులకు శిక్ష), పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎమ్)(పీ) కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
దుర్గగుడిలో మహిళలపై లైంగిక వేధింపులు
-
దేవాదాయ శాఖలో మరో అపచారం
-
భార్యపై టీడీపీ నేత దారుణంగా చిత్రహింసలు
-
గురుకులంలో దారుణం
సాక్షి, హైదరాబాద్ : గౌలిదొడ్డి గురుకుల పాఠశాల.. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని గురుకులం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన గురుకుల పాఠశాలల విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్, ఎంసెట్లకు శిక్షణ ఇస్తుంటారు. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ప్రముఖులు, విద్యావేత్తలు, ఉన్నతాధికారులందరూ విజిట్లో భాగంగా గురుకులాన్ని సందర్శిస్తుంటారు. అలాంటి గురుకులంలో ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ భర్త లైంగిక వేధింపులకు దిగాడు. గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్æ ప్రమోదని భర్త దామోదర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించడంతో వారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షీటీమ్స్కు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్లతో పాటు పోక్సో (పిల్లలపై లైంగిక వేధింపుల చట్టం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఐటీ ఫౌండేషన్ తరగతులంటూ.. దామోదర్ గతంలో నారాయణ విద్యాసంస్థల్లో లెక్చరర్గా పని చేశాడు. పాఠశాలలోని క్వార్టర్స్లో కొడుకు, భార్యతో ఉంటున్న దామోదర్.. 2012 నుంచి గురుకులంలో స్వచ్ఛందంగా ఐఐటీ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నాడు. తాజా ఘటనతో ప్రిన్సిపాల్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలిసింది. దామోదర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందని గచ్చిబౌలి సీఐ గంగాధర్ తెలిపారు. కాగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ప్రిన్సిపాల్ ప్రమోదను సస్పెండ్ చేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దామోదర్ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. నిందితుడు తమపై పలురకాలుగా ఒత్తిడి చేయిస్తున్నాడని.. రాజకీయ నాయకులు, కుల సంఘాలతో ఫోన్లు చేయిస్తూ కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. -
యువతిని వేధించాడని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు
-
హైదరాబాద్ గోల్నాకలో దారుణం
-
ఇది సర్కారు కుట్రే..
– భూమనను మళ్లీ రమ్మన్న సీఐడీ – ఉద్దేశపూర్వకంగానే గొంతునొక్కే ప్రయత్నం – తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రతిపక్షాన్ని అన్ని విధాలా అణచి వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. నోరెత్తి నిలదీసే నేతలను లక్ష్యం చేసుకుని నిర్బంధానికి గురి చేస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేసే ఉద్యమాలను అరెస్టులతో అణగదొక్కుతోంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నినదిస్తారో అటువంటి వారిని గుర్తించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డిని సీఐడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది. ఉద్యమాలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. రాజకీయంగా చైతన్యవంతమైన తిరుపతి కేంద్రంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అధికార పార్టీ హామీలను ప్రజలకు వివరించడమే కాకుండా ప్రభుత్వ మోసాలను ఎండగట్టడంలో భూమన కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలో జరిగే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ భూమన పార్టీ శ్రేణులకు సారధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గొంతు నొక్కడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రతిపక్షనేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తుని ఘటనకు సంబంధించి విచారణ పేరిట భూమనను వేధింపులకు గురిచేయడంతో పాటు ప్రతిపక్ష నేతల్లో భయాందోళనలు నెలకొల్పాలని చూస్తోందని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవల రాష్ట్ర బంద్ నిర్వహించిన విపక్షనేతలను నిర్ధాక్షిణంగా అరెస్టులు చేయించిన సర్కారు తీరును నిదర్శనంగా పేర్కొంటున్నారు. భూమనకు రెండోసారి పిలుపు... తూర్పుగోదావరి జిల్లా తునిలో జనవరి 31నకాపుగర్జన సందర్భంగా విధ్వంస కాండ చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కమ్మని సీఐడీ పోలీసులు ఈ నెల 2న తిరుపతిలో తొలి విడత నోటీసులను భూమనకు అందజేశారు. 6,7 తేదీల్లో గుంటూరు కేంద్రంగా భూమనను సీఐడీ 16 గంటల పాటు విచారించింది. మళ్లీ 19న విచారణకు రమ్మని శనివారం కబురు చేసింది. -
యువతులపై పోకీరీల వెకిలి చేష్టలు