Mekatoti Sucharita
-
తప్పుడు ప్రచారం చేశారు: మేకతోటి సుచరిత
సాక్షి, తాడేపల్లి: తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా -
పాదయాత్ర చేస్తూనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
రాజకీయ లబ్ధి కోసం భయానక వాతావరణం సృష్టించారు
-
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య తల్లిదండ్రులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ హోం మంత్రి సుచరిత రమ్య తల్లిదండ్రులను సీఎం వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో రమ్య సంఘటనను ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తమకు 10 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. రమ్య కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. (చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య) అనంతరం హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘‘గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ నేడు పరామర్శించారు. దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి.. 7 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశాం. రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాం. అంతేకాక రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని సీఎం జగన్ నేడు ఆదేశించారు. దానితో పాటు వారి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పంట భూమి అందించాలని తెలిపారు. మరో 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్తో వాళ్ళు తనతో టీ తాగాలని సీఎం జగన్ అన్నారు’ అని సుచరిత తెలిపారు. ‘‘అనేక మందికి దిశా యాప్ ద్వారా భద్రత కలుగుతోంది. ఇంకా ప్రతి ఒక్కరికి యాప్, చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. గ్రామంలో ఒకరిద్దరు దీన్ని వినియోగించుకున్నా సఫలం అయినట్లే’’ అన్నారు సుచరిత. చదవండి: హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్ -
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు. గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. చదవండి: Child Marriages: ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 30 మందికి ఈ వయస్సులోపే పెళ్లిళ్లు -
రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది: సుచరిత
-
తప్పు చెయ్యనివారికి ఈ ప్రభుత్వంలో శిక్ష పడదు : సుచరిత
-
దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, తాడేపల్లి: మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిలో వలంటీర్లు, మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. చదవండి: మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
నాడు అపహాస్యం.. నేడు జరుగుతుంది అదే..
సాక్షి, గుంటూరు: ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. కోవిడ్తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినప్పుడు అపహాస్యం చేశారని.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అపోహలను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి సుచరిత అన్నారు. చదవండి: ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు... ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్గా కుంభా రవిబాబు బాధ్యతలు -
రేపు ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ సోమవారం ప్రారంభం కానుంది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ఈ నెల 4 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు ఈ మీట్ జరగనుంది. 13 జిల్లాల పోలీసు సిబ్బంది ఈ మీట్కు హాజరుకానున్నారు. క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగంలో ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.. ఈ డ్యూటీ మీట్ సందర్భంగా అధునాతన టెక్నాలజీ కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఆరో తేదీన మహిళలకు రక్షణ కార్యక్రమాలను రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించనున్నారు. 35 కంపెనీలు.. పోలీస్ డ్యూటీ మీట్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నాం. పోలీస్ టెక్నాలజీ ఇండస్ట్రీస్కు చెందిన 35 కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. అవి రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలను ప్రదర్శనకు ఉంచుతాయి. దిశ, ఏపీ పోలీస్ సేవా యాప్ వంటి ఏపీ పోలీస్ శాఖకు చెందిన వాటి కోసం మరో 16 ప్రదర్శన (డెమో) స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. 51 స్టాల్స్ను ప్రజలు స్వయంగా వచ్చి పరిశీలించేందుకు అనుమతిస్తాం. ఆయా స్టాల్స్లో సందర్శకులకు అవగాహన కల్పించేలా పోలీస్ సిబ్బంది ఉంటారు. –డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆరేళ్ల తర్వాత.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ డ్యూటీ మీట్ను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పోలీస్ డ్యూటీ మీట్ ఏటా నిర్వహించాల్సి ఉన్నా.. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం విశేషం. 200 మంది పోలీస్ ప్రతినిధులు డ్యూటీ మీట్తో పాటు నిర్వహించే సింపోజియం తదితర కార్యక్రమాలకు రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల నుంచి ప్రతినిధులను ఎంపిక చేశారు. ఎస్సై నుంచి ఐపీఎస్ కేడర్ వరకు 200 మంది ఈ కార్యక్రమాలకు హాజరౌతారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సింపోజియంలు, ఒప్పందాలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్వాట్స్ బృందాలు ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. -
'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమం: మంత్రి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన 'చదవడం మాకిష్టం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించారు. విద్యార్థుల్లో చదివే అభిరుచిని అలవాటు చేయడం, చదవులోని ఆనందాన్ని పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి స్కూల్లో గ్రంధాలయాలు ఏర్పాటు ద్వారా వి లవ్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పుస్తక పఠనం ద్వారా మనోవికాసం పెంచడం, జ్ఞానాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. 'చదవడం మాకిష్టం' అద్భుత కార్యక్రమమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్ధుల భవిష్యత్తు బాగుంటుందని సీఎం ఆలోచించారని, 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం విద్యా నామ సంవత్సరమేనని కొనియాడారు. చదవండి: పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అణుగుణంగా పాలన నడుస్తుందన్నారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, దీనిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్శిటీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి అయిదో తరగతిలో ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు కేవలం క్లాసు పుస్తకాలనే కాకుండా అన్ని రకాల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అన్ని రకాల పుస్తకాలు చదివినప్పుడే విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వాటిని వారే పరిష్కరించుకో గలిగే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప వారు అవుతారని, విద్యకు పునాది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికల్లో విద్యా శాఖ ఒకటి అని తెలిపారు. చదవండి: అంబేద్కర్కి నివాళులర్పించిన సీఎం జగన్ -
మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్రాయ్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్రాయ్ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం పేర్కొంది. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’) కేంద్ర బృందంతో భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగిందని, మొత్తం రూ. 8084 కోట్ల నష్టం జరిగిందని సీఎం బృందానికి వివరించారు. అందులో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిందని, వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ. 3 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. భారీ నష్టం జరిగినందువల్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా సహకరించాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని, ‘ఎఫ్ఏక్యూ’ రిలాక్సేషన్ అందేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేసేలా, ఆ మేరకు ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ‘కనీస నాణ్యతా ప్రమాణాలు’ సడలించాలని, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని) ఇన్పుట్ సబ్సిడీ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని, అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని వివరించారు. కాగా ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శి ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది: బొత్స) -
మానవత్వం చాటుకున్న మంత్రులు..
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ఆటో ఢీకొని గాయాలపాలై రోడ్డుపక్కన పడి ఉన్న ఓ రైతును..అదే మార్గంలో వెళ్తున్న మంత్రులు పరామర్శించి ఆస్పత్రికి తరలించిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకెళితే.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కేబినెట్ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా, గుంటూరు జిల్లా ఉండవల్లి–అమరావతి కరకట్టపై ఇస్కాన్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన గాయాలపాలైన ఓ రైతు కనిపించాడు. అది గమనించిన మంత్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. తాను మోపెడ్పై తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటో అతను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడని బాధితుడు సమాధానమిచ్చాడు. దీంతో హోంమంత్రి సుచరిత తన కాన్వాయ్లోని ఓ వాహనాన్ని కేటాయించి ఆ రైతును తాడేపల్లి పట్టణ పరిధిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి వెంటనే అతనికి చికిత్స అందించాలని సూచించారు. -
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ప్రేమోన్మాదానికి బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ఈ హత్యలో నిందితునికి ఇతరులు సహకరించరన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రతి విద్యార్థి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తున్నాం. టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రవర్తనపైనే కాదు, అబ్బాయిల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే 10 లక్షల సహాయం అందించామ’ని హోంమంత్రి తెలిపారు. నిందితుడు అఖిల్కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు. (చదవండి: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్) -
దివ్యతేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల సహాయం
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు. చలించిపోయిన సీఎం దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు. -
సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
సాక్షి, విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాశ్లు దివ్య తల్లిదండ్రులైన జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్లను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.కాగా సీఎం జగన్ దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. తమ మాటలకు చలించిపోయిన సీఎం తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని.. తమ కూతురు లాంటి వారు ఎందరో ఆ పథకాలతో ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ఆ కిరాతకుడు మా కూతురుని పొట్టన పెట్టుకున్నాడని దివ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి : బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. సీఎం జగన్ చాలా బాగా స్పందించారు. దివ్య తేజస్విని విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి దివ్య కుటుంబసభ్యుల బాధను పూర్తిగా విన్నారని.. వెంటనే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కూడా చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు. దివ్య తేజస్విని కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం జగన్ పేర్కొన్నారని దేవినేని అవినాశ్ తెలిపారు. ఇలాంటి సంఘటనల్లో పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని.. తమ పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉంటుందని అవినాశ్ తెలిపారు.కాగా మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి : దివ్య కేసులో ఊహించని ట్విస్ట్లు: ఆడియోలు లీక్) -
వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. (చదవండి: అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్ వెంట ఉన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ప్రభుత్వం, వరద బాధితులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. -
‘బాధితులందరికీ త్వరలోనే సాయం’
సాక్షి, తాడేపల్లి: వరద బాధితులందరికీ త్వరలోనే సాయం అందుతుందని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, ఇప్పటికే ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సోమవారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపారు.‘‘సీఎం వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. నష్టపోయిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. భారీగా పంటలు నీటమునిగాయి. కొన్నిచోట్ల ఇళ్లు కూడా మునిగిపోయాయి. వరద నీరు తగ్గగానే ఆయా ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తాం’’అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లకు పైగానే నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అందరికీ పరిహారం: మంత్రి కన్నబాబు వరి, అపరాలు, పత్తి, చిరుధాన్యాలు, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పంట నష్టాలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టంపై పూర్తి అంచనా వేయడం వీలవుతుందన్నారు. ‘‘భారీ వరదలతో కాల్వలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాలు, కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు బాధితులకు ఆహారం, తాగునీటి సదుపాయం కల్పించాం. నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేస్తాం. వరదల ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాం’’అని కన్నబాబు తెలిపారు. -
గుంటూరులో సీఎం జగన్కు పాలభిషేకం
సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రంగనాథ రాజు పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్ క్యాబినెట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్కు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్ -
ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత
సాక్షి, అనంతపురం: మహిళల భద్రతకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ‘ఏపీ పోలీస్ సేవా యాప్’ ద్వారా ప్రజల చెంతకే పోలీసు సేవలు తీసుకువచ్చామని తెలిపారు. ‘దిశ’ యాప్ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ఈ-ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) పోలీసు శాఖలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసు కార్యదర్శులు నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 37 జాతీయ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అత్యంత పకడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలు, హోంగార్డులకు రూ.30 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సుచరిత మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయని.. ఆలయాలపై దాడులు కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలనూ ఉపేక్షించొద్దని సీఎం జగన్ ఆదేశించారని సుచరిత పేర్కొన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం: సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరులో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత.. డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) వైఎస్సార్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్.. మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ నిజం చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు. (చదవండి: ‘కుట్రలోనే భాగంగానే చంద్రబాబు లేఖ’) -
ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘‘ఏపీ పోలీస్ సేవా యాప్’’ను రూపకల్పన చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండానే సేవలు పొందే విధంగా యాప్ రూపకల్పన చేశామని చెప్పారు. దిశ వంటి చట్టాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీ పోలీస్ పలు ప్రశంసలు పొందిందని తెలిపారు. మరోమారు ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్ పనిచేయనుందన్నారు. మహిళా భద్రత విషయంలో ‘దిశ’ యాప్తో పాటు ఈ యాప్ కూడా పనిచేస్తుందని సుచరిత వెల్లడించారు. (చదవండి: పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్) అందుబాటులోకి 87 సేవలు:డీఐజీ పాల్ రాజ్ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో 87 సేవలను తీసుకువచ్చామని డీఐజీ పాల్ రాజ్ చెప్పారు. ఫిర్యాదు నుంచి కేసు ట్రయిల్ స్టేటస్ వరకూ యాప్ ద్వారా అప్డేట్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రసీదు కూడా ఈ యాప్లోనే ఉంటుందని పేర్కొన్నారు.మహిళ రక్షణ, చోరీలు, రోడ్డు భద్రత వంటి అనేక అంశాలు ఈ యాప్లో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్స్టేషన్కు వచ్చే అవసరం లేకుండా యాప్ ఉపయోగపడుతుందని పాల్ రాజ్ వెల్లడించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) -
‘కుట్రలోనే భాగంగానే చంద్రబాబు లేఖ’
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే వ్యక్తిత్వమని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. సోమవారం హోంమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుట్ర పూరితంగానే ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాయించారని, ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయడం కూడా కుట్రలో భాగమన్నారు. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలుంటే చూపించాలని మంత్రి సవాలు విసిరారు. (చదవండి: రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది: సుచరిత) రాజకీయ భవిష్యత్తు లేదనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నేరవేర్చారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలే తిప్పికొడతారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని సుచరిత పేర్కొన్నారు. -
‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’
సాక్షి, తాడేపల్లి: మహిళలకు సత్వర న్యాయం అందించడానికే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో, ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస చర్యలు లేవు. కానీ నేడు మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. దిశ చట్టాన్ని వక్రీకరించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.80కోట్లు కేటాయించారని.. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... సిబ్బంది నియమాకాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సుచరిత. (‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్ముఖ్) ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.80 లక్షల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని సుచరిత తెలిపారు. దిశ చట్టానికి 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేలకు పైగా మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశామన్నారు. దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుది రాక్షస గుణం.. ఆయన కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాబు అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా దళితుడిని నియమిస్తే అడ్డుకున్నారన్నారు సుచరిత. (ఏపీ.. ట్రెండ్ సెట్టర్!) విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తుంటే.. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. దళితులుగా ఏవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 82.5 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించామన్నారు. మొదటి బడ్జేట్లోనే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చామని తెలిపారు. భారత దేశంలోనే ఓ దళిత మహిళను హోంమంత్రి చేయాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ సీఎం జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను అమలు చేయలేదు.. కానీ సీఎం జగన్ ముందుగా డేట్ ప్రకటించి మరీ సంక్షమ పథకాలు అమలు చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నయన్నారు సుచరిత. -
విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత
సాక్షి, కాకినాడ: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్ర భవనాల అభివృద్ధికి రూ.28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. అగ్నిమాపక శాఖ భవనాలకు శాశ్వత నిర్మాణాలు చేపడతామని చెప్పారు. (చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్) కష్టకాలంలో కూడా నవరత్న పథకాలు అమలు.. నవరత్న పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని కరోనా కష్టకాలంలో కూడా నెరవేరుస్తున్నారని సుచరిత తెలిపారు. ఈ విపత్తు సమయంలో సున్నా వడ్డీ కింద మహిళా సంఘాలకు రూ.1400 కోట్లు ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే రైతు భరోసా సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని మంత్రి సుచరిత వివరించారు. (దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..) -
‘మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి’
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళలపై దాడులకు తెగబడే మృగాళ్ల గుండెల్లో వణుకుపుట్టించే చట్టమే దిశ చట్టం అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన దిశ పోలీస్స్టేషన్ను మంగళవారం హోంమంత్రి సుచరిత ప్రారభించారు. అనంతరం జిల్లా పోలీస్పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల పక్షపాతి అని అన్నారు. ఒక మహిళను రాష్ట్ర హోంమంత్రిని చేయటమే అందుకు నిదర్శనమన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. దిశ చట్టంపై మహిళలంతా పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన మరెక్కడ జరగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేసి, అలాంటి నేరాలకు పాల్పడే మానవ మృగాలకు 21 రోజుల్లో శిక్ష పడేలా దిశ చట్టాన్ని అమలు తీసుకువచ్చారన్నారు. మహిళలపై దాడులకు పాల్పడి అమాయక ఆడపిల్లలను హత్యలు చేసే మానవ మృగాలకు కఠినమైన శిక్ష పడేలా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఈ చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 పని దినాల్లో విచారణ ముగించి, 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి దిశ స్టేషన్లు ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. ప్రత్యేక వసతులతో ఈ స్టేషన్లు ఉంటాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్లు, ప్రత్యేక న్యాయస్థానాలు ఈ చట్టం అమలు కోసం ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. దిశ చట్టాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని, మహిళలంతా ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగివుండటంతో పాటు దిశ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యేడాదిని మహిళ భద్రత సంవత్సరంగా ప్రకటించటం జరిగిందన్నారు. దిశ చట్టం అమలుపై పక్క రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి యేటా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై దాదాపు 13,000లకుపైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీని బట్టి చూస్తే మహిళల పట్ల మగాళ్ళకు ఉన్న విలువ ఏంటో అర్ధం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితులకు స్వస్తి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభు త్వం మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణనిస్తే ప్రస్తుత ప్రభుత్వం మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలనే సంకల్పంతో సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తుందని అన్నారు. మహిళలకు రక్షణ కవచం : మంత్రి పేర్ని నాని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ మహిళలకు దిశ చట్టం రక్షణకవచంలా నిలుస్తుందన్నారు. మనిషి అనారోగ్యానికి గురైతే ఆ రోగాన్ని కనిపెట్టే యంత్రాలు వాడుకలోకి వచ్చాయిగానీ మనిషి ఎప్పుడు ఎలా మారతాడో కనిపెట్టే యంత్రం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టలేకపోయారన్నారు. మహిళల పట్ల తప్పు చేసే మానవ మృగాల్లో దిశ చట్టం భయం పుట్టిస్తుందన్నారు. అలాగే అన్యాయానికి గురైన బాధితులకు 21 రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు. చట్టం అమలుకు పటిష్ట చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ మహిళల రక్షణకు, దిశ చట్టం అమలుకు పోలీసుశాఖ పటిçష్ట చర్యలు చేపడుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది మంది మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించటం గొప్ప విషయమన్నారు. వీరితో పాటు బాలమిత్ర, సైబర్మిత్ర టీంలను కూడా మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. శక్తివంతమైనది దిశ చట్టం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా నేరాల సంఖ్య దాదాపు తగ్గిపోవటం ఖాయమన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలు ఈ చట్టం అమలుతో మగపిల్లలకు చెప్పే రోజులు వస్తాయన్నారు. అంతటి శక్తివంతమైన చట్టంగా దిశ అమలు అవుతుందన్నారు. ఈ చట్టం అమలుతో నేరస్తుల్లో ఖచ్ఛితమైన మార్పు రావాలన్నారు. దిశ చట్టం అమలుపై ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసినా మగాళ్ల మైండ్సెట్ మారే వరకు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మహిళలకు మరింత భద్రత : ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు మాట్లాడుతూ దిశ చట్టం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. దిశ పోలీస్స్టేషన్ ప్రారంభంతో జిల్లాలోని మహిళలకు మరింత భద్రత కల్పించటం జరుగుతుందన్నారు. దిశ స్టేషన్కు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), శాసనసభ్యులు సింహాద్రి రమేష్, కైలే అనిల్కుమార్, దూలం నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, రక్షణనిధి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, దిశ చట్టం ప్రత్యేక అధికారిణి దీపికా పటేల్, జిల్లా విద్యాశాఖా«ధికారిణి రాజ్యలక్ష్మి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్ముఖ్
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. సచివాలయం సీఎస్ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్స్టేషన్ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. (దిశ.. కొత్త దశ) దేశంలోనే మొదటిసారిగా.. దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు,మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు. (‘దిశ’ కాల్తో అర్ధరాత్రి బాలికకు రక్షణ ) చారిత్రాత్మకమైన బిల్లు.. బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వనిత తెలిపారు. కసరత్తు చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు. -
రాష్ట్రంలో ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమల్లో భాగంగా ఏపీలో ప్రత్యేక పోలీస్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) భర్తీ పరీక్షా ఫలితాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్కుమార్, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఏపీఎస్ఎల్పీఆర్) చైర్మన్ అమిత్ గార్గ్తో కలిసి హోంమంత్రి మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేశారు. పోలీస్ శిక్షణా సంస్థ ఏపీకి చాలా అవసరమనే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారని సుచరిత వెల్లడించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చే ప్రక్రియ ఆగలేదని పేర్కొన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగులను వెయిటింగ్లో(వీఆర్) పెడుతున్నారని, జీతాలు ఇవ్వడం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు, కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ విమర్శించారు. అందరికీ పోస్టింగ్లిస్తున్నామని గుర్తు చేశారు. 50 శాతానికి పైగా మహిళలే.. రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను హోం మంత్రి విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులకుగాను 49 మందిని ఎంపిక చేశారు. జోన్–4లో ఆర్థోపెడికల్లీ హ్యాండీకాప్డ్(మహిళ) కేటగిరీ కింద కేటాయించిన పోస్టుకు అర్హతలు గల అభ్యర్థి లేకపోవడంతో దానిని భర్తీ చేయలేదు. మొత్తం పోస్టుల్లో 50 శాతానికి మహిళలే ఎంపికవడం విశేషం. ఎం.లావణ్య 281.50 మార్కులు, సీహెచ్ చంద్రకిషోర్ 277.3 శాతం మార్కులు, తేజశేఖర్ 251 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
మోదీ అధికారం రాగానే మాట తప్పారు: హోంమంత్రి
సాక్షి, కృష్ణా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని అధికారం రాగానే మాట తప్పారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కాన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ: విభజన తర్వాత ఏర్పాటైన కొత్త రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎదిగెందుకు నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ పేరిట నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అన్యాయం చేయటం దారుణమన్నారు. రాజధానిలో పేదల పేరిట భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ఈడీతో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని తెలిపారు. వెనుకపడ్డ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు ఇస్తున్నామంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుకోవడం తగదన్నారు. కాగా రాష్ట్రంలో నేరాల రేటు 6 శాతం తగ్దిందని హోంమంత్రి వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు సమావేశం
-
వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చ జరుగనున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, పేర్ని నాని, శ్రీరంగనాథ రాజు, మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అదే విధంగా అన్న బత్తుల శివకుమార్, విడదల రజని, ముస్తఫా, పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, మేక ప్రతాప్ అప్పారావు, ఉండవల్లి శ్రీదేవి, ఆర్కే తదితర ఎమ్మెల్యేలు.. లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, మర్రి రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
దిశ చట్టం: సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: దిశ చట్టం పగడ్బందీ అమలుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ను కూడా వెంటనే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన దిశ చట్టం అమలుపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయపరంగా, పోలీసు పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడానికి, మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైజాగ్, తిరుపతిల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా దిశ చట్టం అమలులో భాగంగా ప్రతీ కోర్టుకు సుమారు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని అధికారులు పేర్కొనడంతో.. ఈ మేరకు వారం రోజుల్లోగా అవసరమైన డబ్బును డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. (ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్లోని ముఖ్యాంశాలివే..) నోటిఫికేషన్ జారీ చేయండి... ఫోరెన్సిక్ ల్యాబ్లలో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతం సవాంగ్ సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా... జనవరి 1న నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్ స్టేషన్లలో 1 డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలను, నలుగురు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ప్రతిపాదించగా... సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. అదే విధంగా ఈ పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు అంగీకరించారు. ఈ సందర్భంగా... 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. వన్స్టాప్ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితో పాటు ఒక మహిళా ఎస్ఐని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కాల్సెంటర్, యాప్, వెబ్సైట్లపై సీఎం సమీక్ష వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్సెంటర్, యాప్, వెబ్సైట్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సురక్ష స్పందన యాప్ తయారు చేశామని డీజీపీ ముఖ్యమంత్రికి తెలిపారు. దీని ద్వారా మొత్తం 86 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఈ యాప్ను ప్రారంభిస్తామని.. 100,112 నంబర్లను దీనితో ఇంటిగ్రేట్ చేయాలని నిర్ణయించారు. అయితే.. దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని సీఎం సూచించారు. ఇందుకు అసవరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా... దిశ చట్టం అమలు కోసం పోలీసు విభాగంలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించే ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా... 18 మహిళా పోలీసు స్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా ఆలోచన చేయాలన్నారు. దిశచట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని... వీలైనంత త్వరలో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు. దిశ చట్టం అమలు సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశ చర్యలు తీసుకున్నాం మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం పర్మిట్ రూమ్లను నిషేధించాం బెల్టుషాపులను ఏరివేశాం బార్ల సంఖ్యను తగ్గించాం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం దిశ చట్టం చేశాం.. కానీ అమలు కావడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు ఎవరూ కూడా మనల్ని వేలెత్తిచూపకూడదు ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలామంది పనిచేస్తున్నారు కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి పేదలకోసం మనం ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెడుతున్నాం -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని A1 కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి అవార్డులను అందచేశారు. ఈ వేడుకల్లో హొంమంత్రి సుచరిత, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, రక్షణ నిధి, మేరుగు నాగార్జున, కైలే అనిల్, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ... ‘మంచి పాలకుడు రావాలని మీరు చేసిన కన్నీటి ప్రార్థనలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో పెద్ద పీట వేశారు’ అని అన్నారు. -
‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘ పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్ అన్నారు. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్గా చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచామని సీఎం జగన్ తెలిపారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇందులో 64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం జగన్ను కలిసిన ఏఎస్పీలు: 2014 నుంచి పెండింగులో ఉన్న ప్రమోషన్లకు అంగీకారం తెలిపి.. పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఏఎస్పీలు మీడియాతో మాట్లాడుతూ.. పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరి అధికారులకు అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని ముఖ్యమంత్రిలతో వ్యాఖ్యానించామని తెలిపారు. గతంలో కొంత మందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని.. ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్న వారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని సీఎం తెలిపామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని కొత్తగా ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు. సీఎం జగన్కు ధన్యవాదములు: పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని.. పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ విలువ పెంచి మరింత భరోసా ఇచ్చినందుకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా..
సాక్షి, విజయవాడ: దిశకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల దశను మార్చాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, నగర సీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్తో పాటు వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ‘పురుషులతో పాటు సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలపై దాడులకు నివారణ చర్యలు తీసుకోవాలి. మీ కోసమే మేము ఉన్నామని అందరూ మహిళల కోసం నిలవాలి’అని సూచించారు. అదే విధంగా మహిళలు కూడా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుతో మహిళలకు ఉపశమనం చేకూరుతోందని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. అది ఉద్యమంలా విస్తరించింది: సీపీ కొత్త నేరాల పట్ల ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. మహిళల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత అంశాలలో ముందుగా మహిళ భద్రతే ఉంటుందన్నారు. ‘గౌతమ్ సవాంగ్ సీపీగా ఉన్న సమయంలో మహిళా మిత్ర ప్రారంభించారు. అది ఉద్యమంలా విస్తరించింది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ మిత్రకు శ్రీకారం చుట్టాము. 47 సైబర్ మిత్ర గ్రూపులు ఏర్పాటు చేశాం. ఇందులో 1520 మంది వాలంటీర్స్ను ఎంపిక చేశాం. 734 కాలేజీల నుంచి విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. వారంతా సైబర్ వారియర్స్గా పని చేస్తారు. బీ సేఫ్ ... అనే యాప్ను సైతం మహిళలు రక్షణ కోసం ఏర్పాటు చేశాం. దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
బలవన్మరణాలకు పాల్పడుతున్నారు: సుచరిత
సాక్షి, విజయవాడ: మహిళల రక్షణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం జగన్ సూచనలతో సైబర్ మిత్ర, బీ సేఫ్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. మంగళవారమిక్కడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత పాల్గొన్నారు. బీ సేఫ్ యాప్ను ప్రారంభించిన అనంతరం హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ... అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ అన్నారు.. అయితే నేటి సమాజంలో ఆ పరిస్థితులు కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ లాంటి ఘటనలు నూతన చట్టాలకు సవాలుగా మారాయన్నారు. 181, 100కు డయల్ చేస్తే సహాయం లభిస్తుందన్న అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నారు. అదే విధంగా అధునాతన టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సుచరిత సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యక్తిగత డేటా గోప్యంగా ఉంచుకోవాలి. భవిష్యత్ తీర్చిదిద్దే వరకు మాత్రమే టెక్నాలజీ వాడుకోవాలి. నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని మహిళలకు సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలిసి ఉండాలి: తానేటి వనిత సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమం చేపట్టడం శుభపరిణామని స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత అన్నారు. టెక్నాలజీకి అలవాటు పడ్డవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘సైబర్ నేరాలతో కళాశాల విద్యార్థులు, ఉద్యోగాలు చేసే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. టెక్నాలజీ ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. టీనేజర్స్ జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల కలలు.. విద్యతో నెరవేర్చాలి. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘వ్యక్తిగత అంశాలు, సమాచారం గోప్యంగా ఉంచుకుంటే నేరగాళ్ల బారిన పడకుండా ఉంటారు. చదువుతో పాటు ఆరోగ్యం పట్ల మహిళలు శ్రద్ధ చూపాలి. బాల్యవివాహాలు వ్యతిరేకించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఇక తెలంగాణ ‘జస్టిస్ ఫర్ దిశ’ గురించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని తానేటి వనిత విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం పొంచి ఉన్నపుడు మహిళలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని పేర్కొన్నారు. -
‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారని చెప్పారు ఆయన మానసిక స్థితి బాగోలేదనిపిస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు చెల్లించి మేలు చేయడం తో అగ్రిగోల్డ్ బాధితుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. ఉద్యోగులను బెదిరించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదనిపిస్తోందని.. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించాలని హోంమంత్రి సుచరిత సలహా ఇచ్చారు. -
'వైఎస్సార్ కిశోర పథకం' ప్రారంభం
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా రూపొందించిన 'వైఎస్సార్ కిశోర పథకం' లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గురువారమిక్కడ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనేదే సీఎం జగన్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇచ్చిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తరం మారుతోంది.. మనం కూడా మారి, తలరాతలు మార్చుకోవాలని హితవు పలికారు. స్మార్ట్ ఫోన్లు అనర్ధాలకు కారణం అవుతున్నాయనీ.. ఒత్తిడితో సహా అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. మహిళల కోసమే మద్యపాన నిషేధం వైపు సీఎం అడుగులు మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... మద్యంపై వచ్చే ఆదాయం తగ్గినా మహిళల కోసం సీఎం జగన్ మద్యనిషేధం వైపు నడుస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తి జీవితంలో 'కీలకమైన బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, అదేవిధంగా యవ్వనంలో తల్లిదండ్రులను మోసం చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి' అని చెప్పారు. యవ్వనంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా కీలకమని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటం వలన చాలా నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిస్థితులను బట్టి గుడ్ టచ్., బ్యాడ్ టచ్లను గుర్తించాలని, ఎవరైన ఇబ్బంది పెడితే.. వెంటనే పెద్దలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు. -
'ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి'
సాక్షి, విజయవాడ : 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్ను బుధవారం మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్సవాంగ్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐ.జి.పి ట్రైనీ ఐపిఎస్ సంజయ్ నేతృత్వంలో దీక్షాంత్ పెరేడ్ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏడాది పాటు అనంతపురం పీటీసీలో శిక్షణ పొందిన 25 మంది డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం విశేషం. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ .. 25 మందిలో డీఎస్పీలలో 11 మంది మహిళలు ఉండడం చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఆపద కలిగినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది పోలీసేనని ఆమె స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి రక్షణగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని వారికి పిలుపునిచ్చారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరబోతున్న 25 మంది డీఎస్సీలకు శుభాకాంక్షలు. టైనింగ్లో నేర్పిన నాలుగు ప్రధాన సూత్రాలను గుర్తుపెట్టుకొని న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. పోలీస్ విధి నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా,శారీరకంగా ధృడత్వాన్ని ఏర్పరచుకోవాలన్నారు. ప్రజా సంరక్షణ కోసం నిరంతరం పాటు పడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని డీజీపీ వెల్లడించారు. -
ఆనందం కొలువైంది
ఎటు చూసినా అభ్యర్థుల కోలాహలం.. అందరి మోముల్లో చెప్పలేని సంతోషం.. ఎన్నో ఏళ్ల కల సాకారమైందన్న సంబరం.. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తమ జీవితాల్లోకి ఆనంద క్షణాలు వచ్చాయని, కష్టాలు తొలగిపోయాయన్న ధైర్యం.. ప్రభుత్వ ఉద్యోగం కల సాకారమైందన్న ఆనందం ప్రతి ఒక్కరిలో కనిపించింది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల కోసం తరలి వచ్చిన అభ్యర్థులతో మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో పండుగ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే తమకు ఉద్యోగాలు వచ్చేలా చేసిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహించి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే తమ ధ్యేయమన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఆసాంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. సాక్షి, అమరావతి : ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అంటూ అందరి కష్టాలను తీరుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగి స్తున్న పాలన, ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమేనని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం సోమవారం మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న సీకే కన్వెన్షన్ హాలులో ఉత్సాహంగా సాగింది. శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధ్యక్షతన కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తెచ్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టి పూర్తిచేయడం ఒక అపూర్వ ఘట్టమని అన్నారు. టీడీపీ ఐదేళ్ల అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందించే జగనన్న సైన్యమే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు అని అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరలో భర్తీ చేసే శుభవార్తను త్వరలో అందిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నత వ్యవస్థ గ్రామ/వార్డు సచివాలయాలు రాష్ట్ర భవిష్యత్తును సూచించే ఉన్నతమైన వ్యవస్థగా హోం మంత్రి మేకతోటి సుచరిత అభివర్ణించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల్లోనే చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశారని వివరిం చారు. సచివాలయాల ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారిపై లబ్ధిదారులకు కొండంత నమ్మకం ఏర్పడుతుందన్నారు. రేషన్, పింఛన్ వంటి సమస్యలను 72 గంట ల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎక్కువ మంది మహిళలే ఎంపికయ్యారని, వారికి భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా విధులు నిర్వర్తించాలని శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలన్నా, వ్యవస్థలో లోపాలు సరిచేయాలన్నా ఈ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వ్యవస్థలో మార్పు తేవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని సచివాలయాల ఉద్యోగులకు శాసనమండలి చీఫ్విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలతో ఒక శకం మారబోతోందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ఉద్యోగులను కోరారు. గ్రామ స్వరాజ్యం చాలా ముఖ్యమైంది గ్రామ స్వరాజ్యం కోసమే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ గ్రామ వలంటీర్లపైన మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థలో మార్పు తెచ్చేం దుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని అన్నారు. గ్రామస్వరాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీకి విజయవాడలో పలు మార్లు ధర్నా చేసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 4 నెలల పాలనలోనే 1.26 లక్షల ఉద్యోగాలు కల్పిం చారని అభినందించారు. పరీక్షలను పకడ్బం దీగా నిర్వహించిన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో పారదర్శకతను ఆచరణలో తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నీతివంతమైన పాలనను సాకారం చేసేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన హామీలను విస్మరించగా, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారని స్పష్టంచేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని సచివాలయాల ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రంలో లంచాలు లేని పారదర్శక పాలనను తీసుకు రావడంలో భాగస్వాములు కావాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం ఒక ఊరిలోనే పది నుంచి 30 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో రాష్ట్రంలో దసరా, దీపావళి పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉందన్నారు. ఉద్యోగులు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కోరారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక కుటుంబం వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబమని అన్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజల బాధలు చూసి, వారి కష్టాలు తీర్చేదిశగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ గ్రామ, వార్డు వలంటీర్లందరూ పార్టీలకతీతంగా పనిచేయాలని కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్కుమార్, ఆర్డీఓ భాస్కర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నెహ్రూనగర్(గుంటూరు): సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డీఆర్డీఏ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు సూచించారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో డీఆర్డీఎ, స్కిల్ డెవలప్మెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆనందంలో అభ్యర్థులు విజయవాడలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని సీకే కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా తిలకించిన అభ్యర్థులు చప్పట్లు, కేరింతలతో సందడి చేశారు. ముఖ్యమంత్రి తీసుకొన్న సాహసోపేత నిర్ణయంతోనే తమకు ఉద్యోగాలు లభించాయనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. సీఎం జగన్ ప్రసంగం వింటున్నంతసేపు, అభ్యర్థులతోపాటు హాజరైన వారి తల్లిదండ్రుల మోములు చిరునవ్వుతో కళకళలాడాయి. -
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ నవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజీత్లు హాజరయ్యారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది. -
మానవత్వం చాటుకున్న హోంమంత్రి సుచరిత
గుంటూరు రూరల్: నడిరోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్తో కొట్టుకుంటున్న యువకుడిని చూసి పట్టించుకోకుండా వెళ్తుండగా, అదే సమయంలో సెక్రటేరియట్ నుంచి గుంటూరుకు కాన్వాయ్తో వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆ యువకుడిని గమనించి కాన్వాయ్ నిలిపి ఆతనికి తాగునీరు అందించి, సిబ్బందితో సమీపంలోని వైద్యులను పిలిపించి ప్రథమచికిత్స చేయించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో ఆతని వివరాలు తెలుసుకుని ఫోన్ ద్వారా నెల్లూరులోని యువకుడి అక్కకు సమాచారం అందించారు. యువకుడు స్పృహలోకి వచ్చిన తరువాత ఆతనిని పోలీసుల సహాయంతో నెల్లూరుకు బస్లో పంపించారు. -
హోంమంత్రి అదనపు కార్యదర్శిగా రమ్యశ్రీ
సాక్షి, నాదెండ్ల: రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితకు అదనపు కార్యదర్శిగా అద్దంకి రమ్యశ్రీ నియమించబడ్డారు. ఆమె నాదెండ్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో బుధవారం రిలీవ్ అయ్యారు. రమ్యశ్రీ ఇటీవలే నాదెండ్లకు బదిలీపై ఎంపీడీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అభినందించారు. -
జూడాలపై పోలీసుల దాడి సరికాదు: సుచరిత
సాక్షి, విశాఖపట్నం: జూనియర్ వైద్యులపై పోలీసుల దాడి సరికాదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై శాఖా పరమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. జూనియర్ డాక్టర్లు తమ హక్కుల కోసం ధర్నాలు చేసుకోవడంలో తప్పు లేదని.. కానీ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర్రంలో అన్ని పోలీసు స్టేషన్లను వుమెన్ ఫ్రెండ్లీగా మారుస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఏవోబీలో పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పరిస్థితి అదుపులో వుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మావోయిస్టులు ఉనికి కోసం పాకులాడుతున్నారని.. అందుకే హింసకు మార్గాలు వెతుకుతున్నారన్నారు. మావోయిస్టులకు జన ప్రాబల్యం తగ్గిందని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థునుల రక్షణ కోసం వర్చువల్ పోలీస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జూనియర్ డాక్టర్లపై పోలీసుల దాడి.. అనుకోకుండా జరిగిన సంఘటనగా పేర్కొన్నారు. సంఘటన దృశ్యాలు చూస్తుంటే పొరపాటు జరిగిందనే అనిపిస్తోందన్నారు. -
శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే ఉన్నాడు..
సాక్షి, విశాఖపట్నం : మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులకు చేరే విధంగా త్వరలోనే యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే సెల్ఫోన్ రూపంలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణకై ప్రభుత్వం... పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మిత్రలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితతో కలిసి విశాఖపట్నంలో మహిళా మిత్ర సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ..టెక్నాలజీ అభివృద్ధితో పాటు సమస్యలు ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ ద్వారా మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం మొత్తం నేరస్తులకు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా నేరస్తుల బెదిరింపులు... బ్లాక్మెయిల్కు దారితీసి, చివరకు మహిళల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే మహిళల భద్రత కోసం సైబర్ మిత్రను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు కేటాయించి ప్రాధాన్యమిచ్చారని సుచరిత గుర్తు చేశారు. వారి కోసమే సైబర్ మిత్ర, మహిళా మిత్ర అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్ధినులు సైబర్ స్పేస్లో సమస్యలు ఎదురుకొంటున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తమకు తెలియకుండానే నేరస్తుల నుంచి మెసేజ్లు, బెదిరింపులు ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను అమల్లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. -
ప్రజాసేవలో సైబర్ మిత్ర!
సాక్షి, గుంటూరు: తాడేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని అగంతకులు ఆధార్ వివరాలు చెప్పాలని మూడు రోజుల కిందట ఫోన్ చేశారు. ఆ సమాచారం మహిళ చెప్పిన వెంటనే మరలా ఫోన్ చేసి ఆర్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని.... కార్డు నంబరుకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరారు. వారి మాటలను నమ్మిన మహిళ ఆమె క్రెడిట్ కార్డు వివరాలతో పాటుగా తన సెల్కు వచ్చిన ఓటీపీ నంబరు కూడా చెప్పింది. ఇక అంతే ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.లక్ష నగదు డ్రా చేసుకున్నారు. ఆపై బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పిడుగురాళ్ళకు చెందిన ఓ యువతి క్విక్కర్ యాప్లో ఆన్లైన్లో ఇంటి నుంచి ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు చేసింది. మీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ఆమెతో పది రోజుల్లో రేయింబవళ్లు వారు ఇచ్చిన పనులను పూర్తి చేయించారు. అలా చేస్తేనే మీకు ఉద్యోగం కచ్చితంగా ఇస్తామని చెప్పారు. తీరా వారి పని పూర్తయిన అనంతరం ఆమెను వారి లింక్లో నుంచి తొలగించారు. మోసం చేశారని గుర్తించిన యువతి ఇటీవల రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రమవుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర సైబర్ క్రైం కార్యాలయాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇటీవల మహిళలు, మైనర్లు, నిరుద్యోగ యువత ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. ఇలాంటి సమస్యలు అధిగమించడంతో పాటు మోసగాళ్ల చర్యలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సైబర్ మిత్ర పేరుతో శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ఫేస్బుక్ అకౌంట్ను ప్రారంభించారు. సవాలుగా మారిన స్మార్ట్ ఫోన్లు..... ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, బాలికలు, విద్యార్థులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందుబాటులో ఉంటున్న స్మార్ట్ ఫోన్లును కొందరు యువత మంచికి ఉపయోగిస్తే మరి కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారని గతంలో పలు మార్లు విశ్లేషకులు తేల్చారు. సెల్ఫోన్ లేకుండా చేసేందుకు తల్లిదండ్రులు యత్నిస్తే చివరకు ఆత్మహత్యలకు సైతం వెనుకాడని సందర్భాలున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న ఫోన్లో యువతకు కొంత అవగాహన లేని కారణంగా నకిలీ వెబ్సైట్లను నమ్మి ఉద్యోగాల కోసం డబ్బు చెల్లిస్తూ మోసపోతున్నారు. మరి కొందరు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. విద్యార్థులు, గృహిణిలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. ఎలాగైనా సైబర్ నేరాలను తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ సైబర్ నేరగాళ్ల గురించి సమాచారం అందించాలన్నా, మోసపోయిన వారు సంప్రదించాలనుకున్నా త్వరగా సమాచారం తెలుసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా 9021211100 వాట్సాప్ నంబరు కేటాయించారు. ఈ నంబరుకు సైబర్ నేరాల గురించి సమాచారం తెలియచేయవచ్చు. అలా అందిన సమాచారాన్ని సైబర్ క్రైం స్టేషన్లోని పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైతే కేసు నమోదు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపుతారు. బాధితులకు అండగా నిలుస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సైబర్ నేరాలు నమోదు కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. -
ఫోన్ మన దగ్గర.. సమాచారం నేరగాళ్ల దగ్గర
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, మహిళల భద్రత విషయంలో అవగాహన కల్పించేందుకు శుక్రవారం సచివాలయంలో ‘సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మంచి, చెడు సెకన్ల వ్యవధిలో ఒకరి నుంచి ఒకరికి చేరిపోతున్నాయన్నారు. పెరిగిపోతున్న సైబర్ నేరగాళ్ల సంఖ్య ఆందోళన కలిగిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ మన వద్దనే ఉన్నా.. సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు సుచరిత. సెల్ఫోన్ రిపేర్ కేంద్రాల నిర్వాహకులు రిపేర్కు వచ్చిన ఫోన్లలో స్పై యాప్లు పెడుతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా మహిళల వ్యక్తిగత సమాచారం క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేయడం సహా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి స్నేహం చేసి మోసాలు చేస్తున్నారని హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సుచరిత కోరారు. సైబర్ నేరాల నుంచి మహిళల రక్షణకు ఇంకా ఏం చేయాలనే అంశంపై చర్చించడమే సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రానికి మహిళ హోం మంత్రిని నియమించి.. మహిళల రక్షణకు తాము ఇస్తోన్న ప్రాధాన్యత తెలియజేశారన్నారు. రానున్న రోజుల్లో సైబర్ నేరాల నుంచి మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత విషయంలో చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. పోలీసు స్టేషన్ల వరకు రాకుండానే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య్వస్థను తీసుకొస్తాం: హోంమంత్రి
-
తండ్రి ఎమ్మెల్యేని చేస్తే ...తనయుడు మంత్రిని..
సాక్షి, గుంటూరు: విశ్వసనీయతకు మరోసారి ఫలితం దక్కింది. వైఎస్ కుటుంబం నమ్మినవారిని వదిలిపెట్టదన్న విషయం మళ్లీ రుజువైంది. నాడు తమకోసం ఎమ్మెల్యే పదవులను త్యజించారనే కారణంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా నుంచి ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత, బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో చోటు కల్పించి తమను నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. నమ్మకానికి పెద్దపీట మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్ మరణా నంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే ...తనయుడు మంత్రిని చేశాడు జిల్లాలో ఎస్సీ మహిళ ఎమ్మెల్యేగా మూడో సారి గెలుపొందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి ఆమె చేసిన త్యాగం వృథా కాలేదనే విషయాన్ని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మేకతోటి సుచరిత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దినెలలకే ఆయన దుర్మరణం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్ని మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్జగన్ బయటకు వచ్చిన మరుక్షణం వైఎస్సార్పై ఉన్న అభిమానంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి సైతం తృణప్రాయంగా వదిలేసి ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం విజయఢంకా మోగించారు. మూడుసార్లు గెలిచిన సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి తమ కుటుంబాన్ని నమ్మిన వారికి అండగా నిలబడతారనే విషయాన్ని వైఎస్జగన్ చేతల్లో చేసి చూపారు. సుచరితను తండ్రి వైఎస్సార్ ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ ఏకంగా మంత్రిని చేసి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా తమను నమ్మితే వారికి పెద్ద పీట వేస్తామనే విషయాన్ని రుజువు చేసిచూపారు. సుచరితకు మంత్రి పదవి కట్టబెట్టడంపై ఎస్సీ సంఘాల నేతలు, జిల్లాప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి స్పీకర్.. తనయుడు డిప్యూటీ స్పీకర్ బాపట్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా, మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్గా పనిచేయగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
విడిపోతే సీమాంధ్ర ఎడారే !
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో తాగునీటికీ తంటాలు పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత తదితరులు మాట్లాడారు. విడిపోవడం వల్ల మూడు ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సభలో సమైక్య ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రాష్ట్రం విడిపోతే కొనసాగించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ నిర్వహించాలి: సుచరిత రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. విభజన సరికాదంటూ శ్రీకృష్ణ కమిటీ తుది అభిప్రాయంతో 461 పేజీల నివేదికను వెల్లడించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే. సభలో వెంటనే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలి. ‘రెండు కళ్ల’ పార్టీలవల్లే ఈ ముప్పు: రామకృష్ణారెడ్డి కొన్ని పార్టీల వైఖరి స్పష్టంగా లేనందునే విభజన బిల్లు ఇక్కడిదాకా వచ్చింది. వారు అసలు విషయాలు చెప్పకుండా మోసం చేస్తున్నారు. రెండు కళ్లు అంటూ కొన్ని పార్టీలకు స్పష్టమైన విధానం లేకపోవడంతో విభజన జరిగే ప్రమాదం నెలకొంది. నాగార్జునసాగర్ నుంచి ఇప్పటికే కుడిప్రాంతానికి నీరు సరిగ్గా రావట్లేదు. విభజన తర్వాత ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటే.. సీమాంధ్రుల భవిష్యత్తు ఏంకావాలి? అసమర్థుల పాలనతోనే ఉద్యమాలు: బాలరాజు రాజశేఖర్రెడ్డి వంటి దమ్మున్న నాయకుడు లేకపోవడం... అసమర్థ నాయకుల పాలనతో ఉద్యమాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణ బిల్లు సభకు రావడం విచారకరం.. బాధాకరం.. దురదృష్టకరం. వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చిఉండేదికాదు. ఆయన పాలన స్వర్ణయుగం. అన్ని ప్రాంతాల్నీ సమంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఆయన సమయంలో ఏ వాదం, ఉద్యమం లేదు. మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకం. సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి ప్రస్తుత బిల్లు వ్యతిరేకం. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి. విభజనతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజనులు ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్ రక్షణలో ఉంటారు. ఈ ప్రాంతాల్లోనుంచి దేనిని విడదీయాలన్నా.. గ్రామసభల ఆమోదం తప్పనిసరి. కానీ అలాంటివేవీ లేకుండానే విభజిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం లేదు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకిస్తూ మేమిచ్చే లేఖల్ని రాష్ట్రపతికి పంపించండి. ఓటింగ్ కోసం వైఎస్ఆర్సీపీ పట్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఈ మేరకు నినాదాలు చేశారు. రోజూ చర్చ కొనసాగుతూనే ఉందని, ఇప్పటికైనా వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలకు చెందిన సభ్యులు.. అబ్రహాం (అలంపూర్), సత్యవతి (ఆముదాలవలస), శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), రామకోటయ్య (నూజివీడు), పద్మజ్యోతి (తిరువూరు), ముత్యాలపాప (నర్సీపట్నం), లింగయ్య (నకిరేకల్), శ్రీధర్ (వర్ధన్నపేట), రాములు (అచ్చంపేట), కిషన్రెడ్డి (ఇబ్రహీంపట్నం), వెంకట్రామయ్య (గాజువాక) చర్చలో పాల్గొన్నారు. -
సమైక్యం అంటే సంకెళ్లా!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం శాసనసభలో సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట రోడ్డుపై వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తున్న విజయమ్మ, శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే పీఆర్కే తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. -
ఎన్నికల తరుణంలో మహిళలు గుర్తొచ్చారా?
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత సుచరిత ధ్వజం సాక్షి, హైదరాబాద్: తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం ఫైలుపై తొలి సంతకం చేస్తానంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉపనేత మేకతోటి సుచరిత మండిపడ్డారు. గతంలో సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని ఆమె నిలదీశారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబుకు ఇప్పుడు మహిళలు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎన్నో చేశానని చెప్పుకుంటున్న బాబు వాస్తవానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నపుడు వారిని ఎన్నో ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళా సాధికారతకు పాటు పడ్డారని ఆమె గుర్తు చేశారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుచరిత సవాల్ విసిరారు. మహిళలు పోరాడి సాధించుకున్న మద్య నిషేధాన్ని ఎత్తివేసింది మీరు కాదా? మీ హయాంలో మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి బెల్ట్ షాపులను ప్రవేశపెట్టిన మాట అబద్ధమా? పీవీ ప్రధానిగా ఉన్నపుడు ప్రారంభమైన డ్వాక్రా పథకాన్ని మీరే ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారు.. కాదని చెప్పగలరా? తొమ్మిదేళ్ల పాలనలో మహిళల రుణాలపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయని మాట నిజం కాదా? రాయితీలన్నా, సబ్సిడీలన్నా గిట్టక ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రూ. 2 కిలో బియ్యం ధరను రూ. 5.50కు పెంచి పేదల కడుపు కొట్టలేదా? ఈ అంశాల్లో ఏ ఒక్కదానినైనా కాదనగలరా అని ఆమె బాబును ప్రశ్నించారు.