MH370
-
పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం.. పైలట్ ఆత్మహత్య స్కెచ్!!
మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్కు వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు గానీ గుర్తించలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సిగ్నల్ కోల్పోయి అదృశ్యం అయింది. ఈ విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు. ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా.. తోటి ప్రయాణీకులను తన ఆత్మహత్య పథకంలో భాగంగా విమానం అదృశ్యం చేసినట్లు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం అయ్యేలా పైలట్ భావించినట్లు తన పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. విమానం అదృశ్యం విషయంలో ఎఫ్బీఐ పరిశోధనలో కూడా దాదాపు దగ్గరా ఉన్న ఇటువంటి ఒక ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. విమాన అదృష్యానికి సంబంధించిన దర్యాప్తు 2017లో ముగిసింది. అయితే గతంలో హార్డీకి తన పరిశోధనను రుజువు చేసుకోవడానికి సమయం లేదని తెలిపారు. గతంలో ఎంహెచ్370 విమానం సముద్రంలో భూకంపాలు గురయ్యే ప్రాంతంలో అదృశ్యం అయినట్లు నమ్మినట్లు తెలిపారు. అదృశ్యమైన విమానం సముద్రపు అడుగుభాగంలో కప్పబడి ఉండవచ్చని హార్డీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు సైమన్ హార్డీ వెల్లండించారు. -
ఎంహెచ్370 అన్వేషణ నిలిపివేత
చైనా, మలేసియా, ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన సిడ్నీ: మూడేళ్ల క్రితం హిందూ మహా సముద్రంలో కూలిపోయిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 కోసం జరుగుతున్న అన్వేషణను మంగళవారంతో నిలిపివేశారు. కూలిపోయినప్పుడు ఇందులో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. తప్పిపోయిన వారి కుటుంబాల అన్వేషణను నిలిపివేయడాన్ని బాధ్యతారాహిత్య చర్య అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఎంతోమంది నిపుణులు పనిచేస్తున్నప్పటికీ విమానాన్ని కనిపెట్టలేకపోయామని చైనా, మలేసియా, ఆస్ట్రేలియా అధికారులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఈ విమానం 2014, మార్చి 8న హిందూ మహాసముద్రంలో మాయమైంది. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి, లక్షల చదరపు మైళ్లలో జల్లెడ పట్టినా విమానం జాడ దొరకలేదు. గత జూలైలో 1.2 లక్షల చదరపు మైళ్లు వెతికినా విమానం జాడ దొరకలేదని, దీంతో తాము వెతుకులాటని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ విమానంలో 14 దేశాలకు చెందిన 227 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 153 మంది చైనీయులు కాగా, ఐదుగురు భారతీయులు, ఒక భారతీయ సంతతికి చెందిన కెనడా వ్యక్తి ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వాలు పొడిచిన వెన్నుపోటుగా బాధిత కుటుంబాల వారు అభివర్ణించారు. -
'ఆ శకలం... ఆ విమానానిదే'
-
'ఆ శకలం... ఆ విమానానిదే'
కౌలాలంపూర్ : బంగాళాఖాతంలోని మారిషస్ సముద్ర తీరంలో కనుగొన్న విమాన శకలం ఎమ్హెచ్ 370దే అని మలేషియా, ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మారిషస్ సముద్ర తీరంలో ఈ ఏడాది మేలో మారిషస్ సముద్ర తీరంలో ఓ విమాన శకలాన్ని గుర్తించారు. ఆ విమాన శకలాన్ని ఆస్ట్రేలియా రవాణ భద్రత సంస్థకు చెందిన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి... పరిశోధించారు. చిట్ట చివరకు ఆ విమాన శకలం 2014 మార్చి 4 వ తేదీన గల్లంతైన ఎమ్హెచ్ 370దే అని వారు నిర్ధారించారు. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం 2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే... ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోని దిగిన మలేషియా, చైనా దేశాలు సైతం ఆ విమాన జాడకు కనిపెట్ట లేకపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు సదరు విమానం కోసం జల్లెడ పట్టాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. విమానం గల్లంతు కావడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర కలత చెందారు. ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని మలేషియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం
సిడ్నీ : అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం మిస్టరీ ఛేదించేందుకు ఆస్ట్రేలియా నిరంతరాయంగా శోధన కొనసాగిస్తుంది. అందులోభాగంగా ఇటీవల నూతనంగా దొరికిన శిథిలాలను ఆస్ట్రేలియా శోధన బృందం పరిశీలిస్తుందని ఆ దేశ ట్రాన్స్ఫోర్ట్ సేఫ్టీ బ్యూరో అధికార ప్రతినిధి శుక్రవారం సిడ్నీలో వెల్లడించారు. మెడగాస్కర్లో లభించిన శిథిలాలను ఇప్పటికే పరిశీలించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ కోస్తా తీరంలో దొరికిన ఓ శిథిలం పూర్తిగా శిథిలమైందని పేర్కొన్నారు. ఆ మూడు శిథిలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఎనిమిది శిథిలాలు లభించాయని... అవన్నీ పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోనివే అని స్పష్టం చేశారు. వాటిలో ఐదు మాత్రం ఈ విమానానికి చెందినవి అయి ఉండవచ్చు అని అన్నారు. మరో మూడు శిథిలాలను మాత్రం పరీక్ష చేస్తున్నట్లు చెప్పారు. 2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయిన సంగతి తెలిసిందే.ఈ విమాన ఆచూకీ కోసం ఆస్ట్రేలియా శోధన బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. -
ఆ శిథిలాలు... ఆ విమానానివే !
కౌలాలంపూర్ : దక్షిణాఫ్రికా, మారిషస్లో దొరికిన శిథిలాలు రెండేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానానివే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మలేషియా రవాణా శాఖ మంత్రి లీవో టింగ్ లాయి గురువారం మాట్లాడుతూ.... సదరు విమాన శిథిలాలను అంతర్జాతీయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అవి గల్లంతైన ఎమ్హెచ్ 370 విమాన శిథిలాలేనని వారు పేర్కొన్నారని తెలిపారు. అలాగే ఈ శిథిలాలను దాదాపు 13 దర్యాప్తు బృందాలు పరిశీలించాయని కూడా తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మొజాంబిక్లో దొరికిన శిథిలాలను పరిశీలించగా అవి ఎమ్హెచ్ 370 విమానంకు చెందినవే గుర్తించినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో దొరికిన ఇంజన్లోని పరికరంపై రోల్స్ రాయిస్ సంస్థ గుర్తు ఉందని.... అలాగే రోడ్రిగస్ ద్వీపంలో విమాన క్యాబిన్లోని అంతర్గత ప్యానల్ ముక్క దొరికిందని మంత్రి లీవో గుర్తు చేశారు. ఆ రెండు శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఈ మేరకు మలేషియాన్ స్టార్ వెల్లడించింది. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... నాటి నుంచి ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన సంగతి తెలిసిందే. -
ఆ విమాన శిథిలాలు అక్కడే దొరకవచ్చు !
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ఆదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ గురువారం వాషింగ్టన్లో తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముంజాబిక్, మెడాగస్కర్ మధ్య లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సదరు ప్రాంతంలో ఆ విమానానికి సంబంధించిన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను యూఎస్, మలేషియా, ఆస్ట్రేలియాన్ నావికులు గుర్తించినట్లు తెలిపింది. ఇదే ప్రాంతంలో ఎంహెచ్ 370 కి చెందిన పోడవైన విభాగంకు చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ మాత్రం ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా సదరు ప్రాంతాంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీ ఎప్పటికీ వీడేనో. -
అసలు ఆ విమానం జాడ తెలిసేనా ?
అదేమిటోగాని చూడబోతే 'విధి చేయూ వింతలన్నీ మతిలేని చేష్టలు' లాగానే ఉన్నాయి. నిన్న గాక మొన్న ఇండోనేసియాలో 54 మందితో వెళ్తు కుప్పకూలిన విమానం ఆచూకీ 12 గంటల్లో ఆచూకీ కనుగొన్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విమానం, హెలికాప్టర్ కానీ ఆదృశ్యమైనా... ఇట్టే గాలింపు జరిపి అట్టే ఆచూకీ కనుగొంటున్నారు. కానీ గతేడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ మాత్రం ఇప్పటికీ అతీగతి లేదు. గత నెలలో ఫ్రెంచ్ ద్వీపం రీయూనియన్ వద్ద కనుగొన్న విమాన శకలాలు సదరు విమానానివే అంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దాంతో గల్లంతైన విమాన ప్రయాణికుల బంధువుల్లో ఆశలు చిగురించాయి. ఇంతలో విమాన శకలాల కోసం మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందితో రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించాయి. దాదాపు 10 రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిన్న ముక్క కూడా కనుక్కోలేకపోయారు. దాంతో విసుగొచ్చిందో ఏమో... ఆ విమానాన్ని వెతుకులాడేందుకు చేపట్టిన చర్యలను తగ్గించేస్తున్నట్లు ఫ్రాన్స్ సోమవారం ప్రకటించింది. ఈ వార్త విని ఎంహెచ్ 370 విమాన ప్రయాణికుల బంధువులు మళ్లీ తీవ్ర నిరాశలోకి కురుకుపోయారు. ప్రమాదం జరిగిన అన్నిలోహవిహంగాల సమాచారం దొరుకుతున్నాయే కానీ... గగనంలోకి ఎగిరిన ఈవిమానం జాడ మాత్రం అంతుచిక్కడం లేదు... ఇవాళ కాకుంటే రేపైనా...రేపు కాకుంటే ఎల్లుండైనా... విమాన ఆచూకి తెలుస్తుందని వారంతా చిగురంత ఆశతో బతుకుతున్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం గతేడాది మార్చి 8న మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే మలేసియా విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. అసలు ఆ విమానం ఏమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా ? లేక మరణించారా ? ఆ విమానం జాడ తెలుస్తోందా ? అనే ప్రశ్నలతో సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎంహెచ్ 370 విమానంలోని ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వ ప్రకటనను ప్రయాణికుల బంధువులు మాత్రం విశ్వసించడం లేదు. దీనిపై తమకు పూర్తి ఆధారాలు కావాలని వారు పట్టుబడుతున్న విషయం విదితమే. -
మరో శకలం లభ్యం: ఎంహెచ్ 370 విమానానిదిగా అనుమానం
కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమానానిదిగా భాబిస్తున్న మరో శకలం హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో ఆదివారం లభించింది. బుధవారం కూడా ఇలాంటిదే ఓ శకలం వెలుగులోకి రావడం, పరీక్షల నిమిత్తం దానిని ఫ్రాన్స్ కు పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం కనుగొన్న శకలం.. రీయూనియన్ ద్వీప రాజధాని సెయింట్ డెనిస్ నగరంలో దొరికింది. మొదట దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని, ఏడాదిన్నర కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం కూడా ఇదే రకానికి చెందినదని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు శకలాలూ ఎంహెచ్ 370వే అయివుంటాయనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు. -
ఆ శకలాలు ఆ విమానానివేనా?
అమెరికా : ఫ్రెంచ్లోని ల రియునియన్ ద్వీపం బంగాళాఖాతం తీర ప్రాంతంలో కనుగొన్న విమాన శకలాలు గుర్తించేందుకు ఓ బృందం ఇప్పటికే బయలుదేరి వెళ్లిందని మలేసియా రవాణా శాఖ మంత్రి ఎల్ టీ లై వెల్లడించారు. బుధవారం ఐక్యరాజ్యసమితిలోని భద్రత మండలిలో ఆయన మాట్లాడుతూ... ల రియూనియన్ ద్వీపంలోని తీర ప్రాంతానికి కొట్టుకువచ్చిన ఆ శిధిలాలు గతేడాది అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానానికి చెందినవా లేక కూలిన ఎమ్హెచ్ 17 విమానానికి చెందినవా అనేది తేల్చవలసిందన్నారు. సదరు బృందం ఈ అంశంపై దర్యాప్తు జరిపి ఆ శకలాలు ఏ విమానానివో గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ల రియునియన్ ద్వీపంలోని బీచ్లో శుభ్రపరిచే కార్యక్రమాన్ని స్థానికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు మీటర్లు వెడల్పు ఉన్న విమానం రెక్కను కనుగొన్నారు. అది ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించినదని స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలిపారు. దాంతో ఫ్రెంచ్ విమానయాన శాఖ ఉన్నతాధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని... ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం విదితమే. -
'ఆ విమానం' గాలింపు నిలిపివేస్తాం !
సిడ్నీ: 239 మంది ప్రయాణికులు... విమాన సిబ్బందితో మలేసియా నుంచి బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ ఛేదించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో విమాన ఆచూకీ ప్రయత్నాలు విరమించే యోచనలో ఉన్నట్లు ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్ (జేఏసీసీ) గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2016 ఏడాది మొదట్లో గాలింపు చర్యలు నిలిపివేస్తామని వెల్లడించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో కూడా జేఏసీసీ వివరించింది. గాలింపు చర్యలు కఠినతరంగా ఉందని అలాగే ఖర్చు మరింత పెరిగిందని పేర్కొంది. విమానం కోసం లక్షా ఇరవై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని... అందుకు సంబంధించిన చిన్న సమాచారం ఇప్పటి వరకు లభించలేదని విశదీకరించింది. అలాగే మలేసియా, చైనా, ఆస్ట్రేలియా పరిధిలో నేటి వరకు చేపట్టిన గాలింపు చర్యలను సంగతి ఈ సందర్భంగా జేఏసీసీ గుర్తు చేసింది. అయితే 2016 ఏడాది మొదట్లో ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ తెలుసుకుంటామని జేఏసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. విమాన ఆచూకీ కోసం ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 80 మిలియన్ డాలర్లు... మలేసియా 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని తెలిపింది. సముద్రంలో చలికాలంలో గాలింపు చర్యలకు ఎదురవుతున్న అవరోధాలను ఈ సందర్భంగా సోదాహరణగా వివరించింది. అలాగే విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతం చేస్తామని జేఏసీసీ స్పష్టం చేసింది. దాదాపు 50 వేల చదరపు కిలోమీటర్ల మేర సముద్రం అడుగుభాగంలో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేదని తెలిపింది. అయితే ఎమ్హెచ్ 370 విమానంలోని మొత్తం ప్రయాణికులు మరణించారని... వారి మృతదేహాలు... విమాన శిథిలాలు దొరికే అవకాశం లేదని మలేసియా ఉన్నతాధికారులు ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు ఐదుగురు భారతీయులు, నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
విమానం కోసం 'రెండింతల' గాలింపు!
కౌలాలంపూర్:ఎమ్ హెచ్ 370.. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. మార్చి 8, 2014న ఐదుగురు భారతీయులతో సహా 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఆ విమానం అదృశ్యమై సంవత్సరం పైగా కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆచూకీ అయితే లేదు. ఎమ్ హెచ్ 370 విమాన అదృశ్య ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ విమాన జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం మాత్రం తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తోంది. విమాన శకలాలను కనుగొనేందుకు ప్రపంచ దేశాల సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మిగలడంతోమరో అడుగు ముందుకేయాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమిటర్ల మేర విమాన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో.. అదనంగా మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమాన ఆచూకీ మే నెల లోపు దొరకపోతే మాత్రం ఈ మేరకు ప్రయాత్నాలు చేపట్టాలని మలేషియా యోచిస్తోంది. అందుకు మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనాలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. -
ఎంహెచ్ 370 విమానం:ఓ చిన్న క్లూ దొరికింది..
కాన్ బెర్రా: మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ 370 అదృశ్యమైన సంవత్సరం గడిచిన తర్వాత ఒక చిన్న క్లూ దొరికింది. మంగళవారం ఆస్ట్రేలియా బీచ్లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లాంటి ప్యాకెట్ ఇప్పుడు కోటి ఆశలు రేపుతోంది. కింగ్ స్లే, విక్కీ మిల్లర్ అనే దంపతులకు సెర్ వాంటెస్ బీచ్ తీరంలో ఈ ప్యాకెట్ దొరకింది. దీని మీద మలేషియా ఎయిర్లైన్స్ లోగో స్పష్టంగా కనపడటంతో వెంటనే దీన్ని పోలీసులకు అప్పగించామని వారు చెబుతున్నారు. ఇన్ని వేల మైళ్లు ప్రయాణం చేసి..ఇన్ని రోజుల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉన్న ఆ ప్యాకెట్ మలేషియా ఎయిర్ లైన్స్కి సంబంధించిందే అయి వుంటుందని నిపుణులు అంటున్నారు. కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది మార్చిలో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాలకే విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోవడం.... దాని ఆచూకీ నేటికీ లభించకపోవడం తెలిసిన విషయమే. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎంహెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. తాజాగా దొరికిన ఈ క్లూతో అదృశ్యమైన వారి బంధువులు మాత్రమే కాదు...ప్రపంచం యావత్తు ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికైనా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఆ విమానం కోసం 'గుప్పెడు మనస్సు' ఆరాటం
ఇంటి నుంచి గడప దాటి బయటకు వెళ్లిన వారు... గమ్యస్థానానికి చేరినట్లు వారి నుంచి 'ఐ యామ్ సేఫ్' అంటూ ఒక్క ఫోన్ కాల్ లేదా చిన్న ఎస్ఎంఎస్ లేక ఈ మెయిల్ వస్తే చాలు మనిషి గుప్పెడు మనసు హమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతుంది. ఎందుకు టెన్షన్ ... నాలుగైదు గంటలలో గమ్యస్థానం చేరుకుంటాం... క్షేమంగా వెళ్లి లాభంగా కాదు... క్షేమంగా వెళ్లి ఇంటి్కి క్షేమంగా తిరిగి వస్తాం... ఏ మాత్రం ఆందోళన వద్దంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి... వారిలో కొండంత ధైర్యం నింపి... బై బై అంటూ విమానం ఎక్కారు. ఎయిర్ పోర్ట్లో వారికి సెండాఫ్ ఇచ్చి... వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఇంటి ముఖం పట్టారు. వాళ్లు విమానం ఎక్కి నాలుగు గంటలు దాటిందంటూ గడియారం వంక చూశారు. ఓ వైపు గంటల ముల్లు చక్రంలా తిరుగుతుంది. దాని వెంటనే నిముషాల ముల్లు నీ వెంటే నేను అంటూ పోటీ పడి మరీ పరుగులు పడుతోంది. అయితే వెళ్లిన వారు నుంచి చిన్నపాటి సందేశం కూడా రాలేదు... బిజీగా ఉండి ఉంటారని వారికివారు తమ మనసుకు సమాధానం చెప్పుకున్నారు. సెల్ ఫోన్కు ఫోన్ చేస్తే .. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది.. మనసులో ఏదో మూల కీడు శంకిస్తుంది. టెన్షన్ తట్టుకోలే... టీవీ పెట్టారు. మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం అంటూ ప్లాష్ న్యూస్ టీవీ స్క్రీన్పై కనిపించడం బంధువులకు 'షాక్'. ఇంతకీ విమానం ఏమైంది... తమ వారి ఆచూకీ ఎక్కడ అంటూ కుటుంబీకులు మలేసియా ఎయిర్పోర్ట్కు పరుగులు పెట్టారు. ఆచూకీ తెలిసిందన్న వార్త కోసం ఒకటి రెండు కాదు దాదాపు నెల రోజులు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూశారు. అయినా ఫలితం రాలేదు. విమానం కూలిపోయింది. తీవ్రవాదులు హైజాక్ చేశారంటూ పూకార్లు షికార్లు చేశాయి. దీంతో వారి గుప్పెడంత గుండెలు అవిసిపోయేలా రోదించాయి. విమానం కోసం ప్రపంచదేశాలు ఏకమై గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం శూన్యం. రేపైనా ఆ విమానం ఆచూకీ తెలుస్తుందని ఓ చిన్న ఆశ పెట్టుకుని కళ్లలో వత్తులు వేసుకుని ఏడాదిగా ఎదురు చూస్తునే ఉన్నారు....చూస్తున్నారు కూడా. కాగా 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం సరిగ్గా గత ఏడాది 08-03-2014 మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. కుటుంబసభ్యులు, బంధువులతోనే కాదు ఈ ప్రపంచంతోనే ఆ విమానంలోని ప్రయాణికులు డిస్కనెక్ట్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతైన విమానంగా ఎమ్హెచ్ 370 ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమానం కూలిపోయిందని ఎలా చెబుతారు?
కౌలాలంపూర్: గమ్యస్థానం చేరగానే ఫోన్ చేస్తామని... విమానం ఎక్కారు. బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం అదృశ్యమైంది. ఆ వార్త వినగానే ప్రయాణికుల బంధువుల మనస్సుల్లో అలజడి మొదలైంది. అసలు విమానం ఏమైందో నేడు కాకుంటే రేపు అయినా తెలుస్తుందని చిగురంత ఆశతో ఉన్నారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 నెలలు అయింది. ఇంతవరకు విమానం కాని బంధువుల జాడ కాని తెలియలేదు. వారంతా ఏమయ్యారో అని సతమతమవుతున్న తరుణంలో విమానం కూలిపోయింది... అందులోని 239 మంది మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించడంతో సదరు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.... ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా కాదు మలేసియా ప్రభుత్వంతో తాడో పేడో తెల్చుకోవాలని భావించారు. అందులోభాగంగా విమాన ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన చైనాకు చెందిన 21 కుటుంబాలు ఆగమేఘాల మీద శుక్రవారం కౌలాలంపూర్ చేరుకున్నారు. విమానం కూలిపోయిందంటూ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు మలేసియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విమాన శకలాలు, మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ప్రమాదం జరిగిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విమాన ప్రమాద వార్తతో తమ కుటుంబాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభస్తున్న ఆవేదన మీకు అర్థం కావడం లేదంటూ మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమాన ఆచూకీ కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్
బీజింగ్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ... ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 239 మంది ప్రయాణికులు మరణించారని మలేసియా ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనపై చైనా ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. విమాన ఆచూకీ కనుగొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మలేసియా ప్రభుత్వానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ విజ్ఞప్తి చేశారు. విమాన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగాళాఖాతంలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్లు మేర ప్రపంచ దేశాల సహాయంతో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయిందని లీ కెకియాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఇంకా గాలింపు చర్యలు జరుపుతూనే ఉందని గుర్తు చేశారు. మలేసియా కూడా గాలింపు చర్యల చేపడితే విమాన జాడ కనుక్కోవచ్చని చైనా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఫ్రెంచ్ ప్రధాని ఎం వాల్స్ కూడా పాల్గొన్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట
మెల్బోర్న్: ఆరునెలల కిత్రం గల్లంతైన ఎమ్హెచ్ 370 మలేసియా విమానం కోసం మరోసారి వేట ప్రారంభకానుంది. అందుకోసం రెండు నౌకలు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆ రెండు నౌకలు వేర్వేరుగా బంగాళాఖాతంలో అణువణువు జల్లెడ పట్టనున్నాయి. ఫీనిక్స్ నౌక రేపు పశ్చిమ ఆస్ట్రేలియా తీరం నుంచి ప్రారంభంకానుంది. అలాగే మరో నౌక ఫుగ్రో డిస్కవరీ కూడా తన పని ప్రారంభించి అక్టోబర్ మాసం చివరినాటికి సముద్రం అడుగుభాగంలో పూర్తిగా తనిఖీ చేసి నివేదిక అందించనుంది. అయితే శాటిలైట్ నివేదిక ఆధారంగా విమానం దక్షిణ ప్రాంతంలోనే అదృశ్యమైన నేపథ్యంలో... ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే మలేసియా ప్రభుత్వం నౌకలతో ఒప్పందం కుదుర్చుకుంది. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. అందులో ఎమ్హెచ్ 370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే ఆ విమానం గల్లంతైందని పేర్కొన్నారు. విమానంపై సస్పెన్స్ కు తెరదించాలని స్థానిక ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. , దీంతో మలేసియా విమానం ఆచూకీ కోసం నౌకలు రంగంలోకి దిగాయి. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే. -
'గల్లంతైన విమానం' శాటిలైట్ సమాచారం విడుదల
బీజింగ్కు బయలుదేరిన కొద్ది గంటలకే అదృశ్యమైన ఎమ్హెచ్ 370 మలేషియా విమానం ఆచూకీ సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని మలేషియా ప్రభుత్వం మంగళవారం కౌలాలంపూర్లో విడుదలు చేసింది. విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేయాలని అదృశ్యమైన విమానంలోని ప్రయాణికుల బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో మలేషియా పౌరవిమానయా శాఖ, బ్రిటన్కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థలు సంయుక్తంగా మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితమేమీ కనిపించలేదు. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో రగలిపోతున్నారు. అదృశ్యమైన విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని విడుదల చేయాలని వారు మలేషియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థను మలేషియా ప్రభుత్వం సంప్రదించింది. దాంతో శాటిలైట్ సమాచారాన్ని మంగళవారం విడుదల చేశారు. -
వచ్చే ఏడాదిలోనే 'మలేషియా విమానం' ఆచూకీ
అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ తెలుసుకోవాలంటే మరింత సమయం పట్టనుందా అంటే అవుననే అంటున్నారు ఆ దేశ ఉన్నతాధికారులు. గల్లంతైన విమాన కోసం కనిష్టంగా 8 నుంచి గరిష్టంగా12 నెలలు సమయం పడుతుందని సదరు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన బృందానికి నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్ఘుస్ హ్యూస్టన్ వెల్లడించారు. శుక్రవారం కౌలాలంపూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానం కోసం గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే విమాన జాడ కనుక్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో హ్యుస్టన్ ప్రకటనతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహనికి అగ్నికి అజ్యం పోసినట్లు అయింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
త్వరలో మలేసియా విమానంపై నివేదిక
అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్ 370 ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రాధమిక నివేదిక వచ్చే వారం విడుదల చేస్తామని దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన గల్లంతుపై నివేదికను ఇప్పటికే ఇంటర్నేషనల్ సివిల్ ఎవియేషన్ అర్గనైజేషన్ (ఐసీఏఓ)కు పంపినట్లు చెప్పారు. ఐసీఏఓ నుంచి రాగానే ఆ నివేదికను విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అదృశ్యమైన విమానం ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలమైందని గల్లంతైన విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాధమిక నివేదికను వచ్చే వారం విడుదల చేస్తామని నజీబ్ రజాక్ వెల్లడించారు. 239 మందితో గత నెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే విమానం విమానాశ్రయంతో సంబంధాలు తెగిపోయాయి. నాటి నుంచి విమానం కోసం పలు దేశాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న తమ బంధులువు ఏమైయ్యారో తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేసి ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు సంధించారు. దాంతో విమానం గల్లంతుపై మలేసియా ప్రభుత్వం ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక అందజేయాని ఆదేశించింది. దీంతో మలేసియా విమానం గల్లంతుపై ప్రాధమిక నివేదిక ప్రజల చేతులలోకి రానుంది. -
గల్లంతైన విమానం కోసం ... 'టైటానిక్' విజ్ఞానం
ఎంహెచ్ 370 మలేసియా విమానం గల్లంతై 50 రోజుల దాటి పోయింది... అయినా ఇంతవరకు ఆ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఆ విమాన ఆచూకీ కోసం గతంలో సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఆచూకీ కోసం ఉపయోగించిన శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ జానస్టన్ బుధవారం వెల్లడించారు. ఆ అంశంపై ఇప్పటికే మలేసియా, చైనా, యూఎస్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. రెండు ప్రపంచ యుద్ద సమయంలో టైటానిక్ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో నౌకలోని 1500 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆ నౌక ఆచూకీ కోసం అన్వేషణలు తీవ్రంగా సాగిన చిట్ట చివరకు 1985 అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల అడుగున టైటానిక్ను కనుగొన్న విషయం విదితమే. 227 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో గతనెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి ఎంహెచ్ 370 విమానం బీజింగ్ బయలుదేరింది. అయితే ఆ విమానం బయలుదేరిన కొన్ని గంటలకు విమానాశ్రయంలోని ఏటీసీ కేంద్రంలో సంబంధాలు తెగిపోయాయి. ఆ విమానం ఆచూకీ కోసం ఇప్పటికే పలు దేశాలు విమానాలు, నౌకలు, శాటిలైట్ల ద్వారా సముద్రంలో జల్లెడ పట్టి గాలించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో టైటానిక్ కోసం వినియోగించిన విజ్ఞానం ద్వారా అయిన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ తెలుస్తుందని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఆ విమాన ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
అదృశ్యమైన విమానం జాడ ఒక్క సెకండ్లోనా.... ఎట్లా?
గత నెలలో అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన జాడ కోసం ఇతరదేశాల సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. తానే దేశ ప్రధాని అయి ఉంటే అదృశ్యమైన విమానం జాడ ఒక్క నిముషంలో కనుక్కోనే వాడినంటూ మలేసియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం వ్యాఖ్యలను నజీబ్ ఖండించారు. అన్వర్ వ్యాఖ్యలు మతిలేనివిగా ఆయన అభివర్ణించారు. విమానం ఆచూకీ కోసం ఇప్పటికి చేయని ప్రయత్నం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ నెల 5న మలేషియా ప్రతిపక్ష నేత చైనా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... తాను దేశ ప్రధాని అయి ఉంటే ఒక్క నిముషంలో అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టేవాడి నంటూ చెప్పారు. ఆ వ్యాఖ్యపై ప్రధాని నజీబ్ రజాక్పై విధంగా స్పందించారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
అత్యంత ఖరీదైన గాలింపు..!
-
నెల రోజులు దాటినా.. దొరకని విమానం
మలేషియా విమానం అదృశ్యమై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ దాని ఆచూకీ దొరకట్లేదు. ఎప్పుడో మార్చి 8వ తేదీన కనపడకుండా పోయిన ఈ విమానం కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 11 సైనిక విమానాలు, మూడు పౌర విమానాలు, 14 నౌకలతో మంగళవారం కూడా ఎంహెచ్370 విమానం కోసం గాలిస్తున్నట్లు అంతర్జాతీయ గాలింపు బృందాలతో ఏర్పాటైన జేఏసీసీ తెలిపింది. దాదాపు 77,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గాలింపు సాగుతోంది. ఆస్ట్రేలియన్ నౌక ఓషన్ షీల్డ్ సాయంతో ఉత్తరం వైపు జల గర్భంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, దక్షిణం వైపు చైనాకు చెందిన హైసున్ 01, బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ ఇకో గాలిస్తున్నాయి. విమానం బ్లాక్ బాక్స్ నుంచి వస్తున్న సిగ్నళ్లను గత వారాంతంలో హౌసున్ 01, ఓషన్ షీల్డ్ నౌకలు గుర్తించాయి. అయితే, ఇవి ఎంహెచ్ 370కి సంబంధించినవేనా, కావా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. -
సముద్రంలో 122 ‘విమాన శకలాలు’
ఫ్రాన్స్ శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు కౌలాలంపూర్/పెర్త్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత విశ్వసనీయ ఆధారాలు దొరికాయి. దీని శకలాలుగా భావిస్తున్న 122 వస్తువులు దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించాయి. ఫ్రాన్స్ ఉపగ్రహం వీటిని ఆదివారం గుర్తించి ఫొటోలు తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్కు 2,557 కి.మీ దూరంలో వీటి ని గుర్తించినట్లు మలేసియా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. ‘400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 122 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక మీటరు నుంచి 23 మీటర్ల సైజులో ఉంది. కొన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుడడంతో అవి దృఢపదార్థాలతో తయారై ఉండొచ్చని భావిస్తున్నాం. ఇవి ఇదివరకు చైనా, ఆస్ట్రేలియాలు.. శకలాలుగా భావిస్తున్న వస్తువులను గుర్తించిన చోటికి సమీపంలోనే ఉన్నాయి. ఇవి బోయింగ్వని భావించొచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం. నిర్ధారణ అయ్యాక తర్వాతి దశ గాలింపు మొదలుపెడతాం’ అని అన్నారు. మరోపక్క.. శకలాల కోసం గాలిస్తున్న విమానాలకు నీలిరంగు వస్తువు సహా మూడు వస్తువులు కనిపించాయి. మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఈ నెల 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం, అది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కాగా, మలేసియా ఎయిర్లైన్స్, బోయింగ్ కంపెనీలు కోట్లాది డాలర్ల పరిహారంతో ముడిపడిన దావాలో చిక్కుకున్నాయి. ఈ విమానం డిజైన్, కూలిపోయేందుకు దారి తీసిన లోపాల వివరాలివ్వాలని షికాగోలోని ఒక లా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. -
మలేషియా విమానం మిస్టరీగా మిగలనుందా?
కౌలాలంపూర్: తప్పిపోయిన మలేషియా విమానం జాడ ఇంకా తెలియరాలేదు. 15 రోజులు గడిచినా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో ఇది మిస్టరీగానే మిగలనుందా? కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. భారతదేశానికి చెందిన సిబ్బంది కూడా వెతుకుతున్నారు. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని, హిందూ మహాసముద్రంలో దాని శకలాలు కనిపించాయని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి. ఈ విమానంపై ప్రపంచవ్యాప్తంగా రోజుల తరబడి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ విమానం ఏమై ఉంటుందీ అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. గడిచిన వందేళ్లుగా కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? లేకపోతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని జాడను కనిపెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు. ఈ విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి. హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది. చైనా కనుగొన్న ప్రాంతంలోనే ఆస్ట్రేలియా కూడా శకలాలను గుర్తించింది. ఆస్ట్రేలియన్ వైమానిక దళం వారు ఒక చెక్క ప్యాలెట్, ఇతర శకలాలు కనుగొన్నారు. ఫ్రాన్స్ కూడా ఆ ప్రాంతంలోనే కొన్ని శకలాలను కనుగొన్నట్లు తెలియజేస్తూ ఉపగ్రహ చిత్రాలను ఈరోజు విడుదల చేసింది. ఆ శకలాలు తప్పిపోయిన విమానానివిగా భావిస్తున్నారు. దాంతో విమానం ప్రమాదానికి గురైనట్లుగానే స్పష్టమవుతోంది. ఏడు చైనా నౌకలు, రెండు మలేషియా షిప్లు ఆ శకలాల కోసం వెతుకుతున్నాయి. ఈ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు నాసా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
మలేషియా విమాన శకలాలను గుర్తించిన చైనా శాటిలైట్లు
కౌలాలంపూర్(ఐఏఎన్ఎస్): తప్పిపోయిన మలేషియా విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి. కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం తప్పిపోయినప్పటి నుంచి దాని కోసం దాదాపు 26 దేశాలు గాలిస్తూనే ఉన్నాయి. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో విమాన శకలాలను తమ శాటిలైట్లు గుర్తించాయని చైనా చెప్పినట్లుగా మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రెండు వారాలుగా కనిపించకుండాపోయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్హెచ్-370 విమానం భాగాలు చైనా దక్షిణ ప్రాంతంలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది. -
మలేషియాలో అనిరుధ్ షో వాయిదా
వై దిస్ కోలవెర్రి పాటకు సంగీతం అందించి సంగీత అభిమానులను మైమరిపించిన అనిరుధ్ మలేషియాలో నిర్వహించాల్సిన షో వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆ షో మరల ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామన్నారు. విమానం గల్లంతు పట్ల సంతాప సూచికంగా షోను వాయిదావేసినట్లు శనివారం అనిరుధ్ ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు. మలేషియా విమానం అదృశ్యమై రెండు వారాలు గడిచిన ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో దేశ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఆ విమానంలోని ప్రయాణిస్తున్న తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని వారి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో షో వాయిదా వేసినట్లు చెప్పారు. అసలు అయితే ఈ నెల 29న అనిరుధ్ సంగీత విభావరి నిర్వహించవలసి ఉంది. మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు అదృశ్యమైంది. ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయారు. దాంతో మలేషియాతోపాటు దాదాపు 26 దేశాలు విమానం ఆచూకీ కోసం గాలింపులు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితం కనిపించకపోవడంతో ఆ విమాన ప్రయాణికులు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేషియా అంతట విషాదఛాయలు అలముకున్నాయి. -
భారత రక్షణ వ్యవస్థలో డొల్లతనం
-
ఇంకా వీడని మలేషియా విమానం మిస్టరీ
-
విమానం ఏమైంది.... నిరాహరదీక్షకు దిగుతాం
మలేషియా విమానం ఏమైందో వెంటనే జవాబు చెప్పాలని, లేకుంటే నిరాహర దీక్షకు దిగుతామని బీజింగ్లోని విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. సంగతేంటో బీజింగ్లోని మలేషియా రాయబారి కార్యాలయానికి వెళ్లి తేల్చుకుంటామన్నారు. విమానం ఆచూకీ తెలియకుండా పోయి 10 రోజులు గడుస్తున్నా ఇంత వరకు సరైన సమాచారం లేదని మలేషియా అధికారులపై బీజింగ్ లో ప్రయాణికుల బంధువులు మండిపడ్డారు. విమానం గల్లంతుపై రోజుకోక వార్త వస్తుంది. ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియని సందిగ్ధతలో ఉన్నామని వారు పేర్కొన్నారు. విమానం జాడ ఇంత వరకు కనుక్కోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం గల్లంతుపై మలేషియా చెబుతున్న కథనాలపై చైనీయులు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన మలేషియా విమానం బయలుదేరిన 40 నిముషాలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి.ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో అత్యధికులు చైనీయులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విమానం ఆచూకీ కోసం దాదాపు 26 దేశాలకు చెందిన విమానాలు,నౌకులు రంగంలోకి దిగాయి. అయిన ఫలితం కనిపించలేదు.ఉపగ్రహాల ద్వారా చిత్రాలను తీసిన అందులో కూడా విమానం జాడ ఏమి కనిపించ లేదు. దాంతో విమానాన్ని హైజాక్ చేసి ఉండవచ్చని మలేషియా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ క్రమంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే విమానం ఆచూకీ తెలియకపోవడంతో ప్రయాణికులు బంధువులు ఆందోళన రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. విమానం తప్పక తిరిగి వస్తుందని ఇప్పటివరకు వారు కళ్లలో ఒత్తులు వేసుకుని ఏదురు చూశారు. మలేషియా ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహం మంగళవారం కట్టలు తెంచుకుంది.