Personal Protective Equipment
-
మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..?
సాక్షి, న్యూఢ్లిలీ: ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ప్రశ్నించారు. బీజేపీ నేతల అవినీతిని బయట పెడతానంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు చెందిన కంపెనీలకు అక్రమంగా పీపీఈ కిట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. ‘‘పైగా ఒక్కో కిట్ను అసోం ప్రభుత్వం రూ.600కి కొంటుంటే భార్య కంపెనీకి రూ.990 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత దాన్ని రద్దు చేసి, కుమారుడు భాగస్వామిగా ఉన్న మరో కంపెనీకి ఒక్కో కిట్కు రూ.1,680 చెల్లించేలా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇది అవినీతి కాదా?’’ అని ప్రశ్నించారు. వీటిపై హిమంత స్పందించారు. సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడో ఏడేండ్ల కిందటి కేసును తిరగదోడి ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ను ఆగమేఘాలపై ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఇక ‘పీపీఈ కిట్ల’ స్కామ్లో బిశ్వశర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. పీపీఈ కిట్ల స్కామ్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక, 2020లో జరిగిన ఈ స్కామ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగుచూసింది. అప్పుడు బిశ్వశర్మ ఆరోగ్యమంత్రిగా కొనసాగారు. ఇది కూడా చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.. జై షా చక్రం తిప్పాడు..: బీజేపీ నేత కామెంట్స్ -
పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి
కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
13 కోట్ల విలువైన చోరి.. కాపాడని పీపీఈ కిట్
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వినియోగం బాగా పెరిగింది. సాధారణంగా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు ధరించే ఈ కిట్ని.. ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి వాడి.. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరి చేశాడు. ట్విస్ట్ ఏంటంటే పీపీఈ కిట్ ధరించినప్పటికి పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక అతడు దొంగతనం చేసే సమయంలో నగల షో రూం బయట ఐదుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక హుబ్లీకి చెందిన మహ్మద్ షేక్ నూర్ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీ కల్క్జీలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తున్నాడు. ఇక అతడు పని చేసే షాపుకు ఎదురుగా ఓ బంగారు నగల షో రూం ఉంది. దాంతో అతడి మనసులో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. (చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై) ఇక తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించి దొంగతనం చేయాలని భావించాడు. ఇక షోరూం బయట గట్టి కాపలా ఉండటంతో దాని ఎందురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి.. అక్కడి నుంచి షో రూంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నూర్ని గుర్తించి అరెస్ట్ చేశారు. -
కోవిడ్ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్
జైపూర్: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిల్లు ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా సామాన్యులు పెళ్లి ఆలోచన మానేస్తే.. సెలబ్రిటీలు మాత్రం పెళ్లి పీటలేక్కారు. ఇక మహమ్మారి విజృంభణ కాలంలో వివాహం చేసుకున్న వారు కోవిడ్ నియమాలను పాటిస్తూ.. పెళ్లి తంతు ముగించారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కోవిడ్ కేర్ సెంటర్లో.. పీపీఈ కిట్లు ధరించి.. చేసుకున్న ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటుంది. రాజస్తాన్ కెల్వారా కోవిడ్ కేర్ సెంటర్లో ఈ వివాహ వేడుకు చోటు చేసుకుంది. వివరాలు.. రాజస్తాన్కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్ పాజిటివ్గా తేలింది. దాంతో కరోనా కేర్ సెంటర్లో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక ముందుగా అనుకున్న ముహుర్తానికే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. (వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు) వధువు, వరుడు, పూజారితో పాటు మరోక వ్యక్తి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వధువుకు కరోనా సోకడంతో ఆమెతో పాటు, పెళ్లి కుమారుడి, పూజారి, మరో వ్యక్తి నలుగురు పీపీఈ కిట్లు ధరించారు. ఇక వరుడు ఫేస్ షీల్డ్ కూడా ధరించాడు. పూజారి చెప్పిన విధంగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతు ఆచరించారు. మూడ ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పీపీఈ కిట్లు ధరించి.. కోవిడ్ నియమాలు పాటిస్తూ.. జరిగిన ఈ వేడుక నెజినులను ఆకట్టుకుంది. కొత్త జంటను ఆశీర్వదించడమే కాక ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
పీపీఈ కిట్తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్ అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
విశాఖపట్నం: పీపీఈ కిట్తో హల్చల్..
-
పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే..
లక్నో: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎంత హానికరంగా ఉందో తెలిసివచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా సమయంలో అర్థమయ్యింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా.. మన దగ్గర మాత్రం 10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది. అయినప్పటికి వారు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్లైన్ వారియర్స్’గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అదనపు గంటలు పని చేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే.. మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం మరో ఎత్తు. (చదవండి: కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్) ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘కోవిడ్-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్బాయ్, నర్స్ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. (చదవండి: 26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి) My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu — Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020 అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ డాక్టర్గా విధులు నిర్వహించాల్సిందే’ అన్నారు. ఎంత అలసిపోయినా.. ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వాటన్నింటిని మర్చిపోతామన్నారు సయ్యద్. -
కరోనా అనుమానితుడు.. పీపీఈ కిట్ ధరించి
కోల్కతా: కరోనా వైరస్ మనిషిని చంపితే.. భయం మనలోని మానవత్వాన్ని చంపుతోంది. కళ్లెదుట మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు వెళ్లి సాయం చేయట్లేం. కారణం వారికి కరోనా ఉంటే మనకు సోకుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరికి వారే దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ టీఎంసీ నాయకుడు చూపిన సాహసం ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశసంలు పొందుతుంది. వివరాలు.. గోపిబల్లవపూర్కు చెందిన అమల్ బారిక్(43) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గత 5-6 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి వెళ్లడానికి కూడా ఓపిక లేదు. దాంతో బారిక్ భార్య ఇరుగుపొరుగును సాయం కోరింది. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్, ప్రైవేట్ వాహనం బుక్ చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు వారికి. దాంతో ఏం చేయాలో తెలీక బాధపడుతోంది. (కరోనా జీవితం పోరాటంగా మారింది) అయితే ఈ విషయం గురించి గోపిబల్లవపూర్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సత్యకం పట్నాయక్కు తెలిసింది. దాంతో ఇతర కార్యకర్తలతో మాట్లాడి ఓ బైక్ ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్ షాప్కు వెళ్లి పీపీఈ కిట్ తెచ్చుకున్నాడు. అనంతరం బారిక్ ఇంటికి వెళ్లి అతడిని బైక్ మీద కూర్చోపెట్టుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బారిక్ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చి.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని తెలిపారు. పట్నాయక్ తిరగి అతడిని ఇంటికి చేర్చాడు. పీపీఈ కిట్ ధరించి బైక్ మీద బారిక్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలయ్యింది. దీని గురించి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘బారిక్ పరిస్థితి తెలిసి.. కామ్గా ఉండలేకపోయాను. నా కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేను. దాంతో పీపీఈ కిట్ ధరించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాను’ అన్నాడు. (కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్) అంతేకాక ‘పాపం నేను అతడికి ఇంటికి వెళ్లేసరికి బారిక్ భార్య, ఇద్దరు కుమారులు అతడి పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని తెలిసి బారిక్ భార్య మాతో పాటు హస్పటల్కి వస్తానంది. కానీ ఆమెకు నచ్చచెప్పి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి తీసుకువచ్చాను. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే వారికి కూడా సాయం చేస్తాను. అందుకే మరో 4 పీపీఈ కిట్లు కూడా ఆర్డర్ చేశాను’ అని తెలిపాడు. పట్నాయక్ పీపీఈ కిట్ ధరించి బారిక్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్ను ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. -
తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్మెంట్–డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి) కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
వివాహ వేడుకలో పీపీఈ కిట్లతో..
-
పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..) ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. (‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’ ) -
కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే!
మంబై : కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు మిగులుస్తోంది. తమ వారిని కోల్పోయి వారికి తీరని వేదనను గురిచేస్తోంది. తాజాగా అలాంటి వాటికి అద్దంపట్టే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నగరంలోని బోరివాలకి చెందిన పల్లవి అనే మహిళకు(50) జూన్ 30న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతేగాక ఆమె భర్త సైతం కరోనా బారిన పడ్డారు. వీరికి 21 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృత్యువాత పడింది. తల్లి మరణ వార్తను కుమారుడికి చెప్పి వెంటనే ఆస్పత్రికి రావాలని కోరారు. (రెండుసార్లు కరోనా నెగిటివ్.. డాక్టర్ మృతి ) హుటాహుటిన అక్కడికి చేరిన యువకుడిని తన తల్లి శవాన్ని బ్యాగ్లో పెట్టేందుకు ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. ఇందుకు ఆ యువకుడు తనకు పీపీఈ కిట్ ఇవ్వమని కోరినా.. అందుకు వారు నిరాకరించారు. ఒకవైపు తల్లి మరణ వార్తను తట్టుకోలేక తల్లడిల్లుతున్న యువకుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే కోవిడ్-19 వార్డులోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తల్లి మృతదేహాన్ని బ్యాగ్లోకి పెట్టేందుకు సహాయం అందిచాడు. (బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్) ఈ సంఘటను కునాల్ గుర్తు చేసుకుంటూ.. ‘ఆస్పత్రి సిబ్బంది పీపీఈ ఇవ్వడానికి నిరాకరించడం నాకు షాక్కు గురి చేసింది. పీపీఈ లేకుండా నేను కరోనా మృతదేహాన్ని ఎలా తాకాలని వారిని ప్రశ్నించాను. ఇందుకు వారు శరీరం బరువుగా ఉందని సాయం చేయాలని కోరారు. అక్కడుంది నా తల్లి, నాకు వేరే దారి లేదు. నా భయాన్ని పక్కన పెట్టి పీపీఈ లేకుండానే నా తల్లిని పట్టుకున్నాను’. అంటూ ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. ఆసుపత్రికి చెందిన ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (ఉబర్ ముంబై ఆఫీసు శాశ్వతంగా మూత?) -
భారీగా తగ్గిన పీపీఈ కిట్ల ధరలు
సాక్షి,హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లతో పాటుగా ఆర్టీ – పీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్ కిట్ల) ధరలు భారీగా తగ్గాయి. లాక్డౌన్ ముందు వరకు దేశంలో అసలు ఈ కిట్ల ఉత్పత్తేలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వీటి ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. దీంతో పీపీఈ కిట్లతో పాటుగా కోవిడ్ టెస్టింగ్ కిట్ల ధరలు సుమారు 70%వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఒక్కొక్క 100 జీఎస్ఎం (గ్రాస్ స్క్వేర్ మీటర్) పీపీఈ కిట్ల ధర కొన్ని వారాల కింద రూ.600 ఉండగా ఇప్పుడు దాని ధర రూ.168కు పడిపోయింది. అదేవిధంగా ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్ల ధరలు గతంలోని రూ.1,700 నుంచి రూ.600 కు తగ్గిపోయింది. ప్రస్తుతం డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు వివిధ వినియోగ అవసరాలకు తగ్గట్టుగా పలురకాల ప్రమాణాలతో పీపీఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. వివిధ ప్రమాణాలకు సంబంధించిన కిట్లనే ఒక్కోదాన్ని రూ.300కు రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుండగా, దాదాపు రెండు నెలల క్రితం దీని ధర రూ.900 వరకు ఉండేది. ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలున్న పీపీఈ కిట్ ధర కూడా రూ.1,200 నుంచి రూ.800 తగ్గిపోయినట్టుగా వీటి తయారీ సంస్థలు తెలిపాయి. చైనా తర్వాత మనమే.. పీపీఈ కిట్ల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా దాని తర్వాతి స్థానంలో మనదేశం ఉంది. దేశంలో ప్రస్తుతం 600కు పైగా కంపెనీలు రోజుకు ఐదు లక్షల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయి. ఇక కోవిడ్ టెస్టింగ్ కిట్లను గతంలో రూ.1,700 వరకు వెచ్చించి ఒక్కో యూనిట్ను దిగుమతి చేసుకున్న పరిస్థితి నుంచి దేశంలో వీటిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాక రూ.600కే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. భారత టెస్ట్ కిట్లు రూ.400కు, ఎక్స్ట్రాక్టర్, వైరల్ మీడియం రూ.200కు దొరుకుతున్నట్టుగా వైద్యపరికరాల ఉత్పత్తి సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని చిన్న కంపెనీలు, లఘు ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసేశారు. ప్రస్తుతమున్న తక్కువ ధరలకు పీపీఈ కిట్లను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కొన్ని వారాల క్రితం రూ.600 ఉన్న నాన్–వోవెన్ వాక్స్ కోటెడ్ 90 జీఎస్ఎం కిట్ ఇప్పుడు రూ.168కు లభిస్తుండటంతో ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటున్నారు. ఎగుమతి చేయాలనుకుంటున్న సంస్థలు దేశంలో పీపీఈ, ఆర్టీ–పీసీఆర్ కిట్ల ఉత్పత్తి జరుగుతున్నందున ఇతర దేశాలకు ముఖ్యంగా చిన్న, మూడో ప్రపంచదేశాలకు వీటి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే బావుంటుందని కొన్ని పెద్ద కంపెనీలు కూడా భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అత్యున్నత నాణ్యతా ప్రమా ణాలున్న పీపీఈ కిట్లకు మంచి డిమాండ్ ఉన్నందున ఎగుమతి అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాయి. -
అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్
‘‘అటాక్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతోంది. ఆయనే మా డైరెక్టర్. మేమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. నాకెందుకో అంతరిక్షానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమిత తాను ఈరోజు షూటింగ్ కోసం విమానంలో ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. మిషన్ఢిల్లీ హ్యాష్ట్యాగ్తో పీపీఈ కిట్ ధరించి ఎయిర్పోర్టుకు వెళ్లిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అటాక్’ సినిమాలో జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాతో పాటు అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కతున్న ఫ్యామిలీ డ్రామాలో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఇక లాక్డౌన్లో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు మరింత చేరవయ్యారు. -
పీపీఈ కిట్లతో డ్యాన్స్ చేశారు
బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి బయటపడిన నాటి నుంచి పోలీసులు, వైద్యులు ఇళ్లకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమను తాము ఉత్సాహపర్చుకోవడం కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు ఓ నూతన మార్గాన్ని కనుగొన్నారు. పాత పాటలకు డ్యాన్స్ చేయడం, సహోద్యోగుల కోసం వంట చేయడం, మహిళలకు మెహందీ పోటీలు, పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తూ తమను తాము ఉత్సాహపర్చుకోవడమే కాక మిగతవారికి సంతోషాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు ముగ్గురు.. 1960 నాటి హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వైద్యులు ‘లిఖే జో ఖాత్ తుజే’ పాటకు డ్యాన్స్ చేశారు. వీరంతా గత వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్మా బాను మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ధైర్యం నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మెహందీ.. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. విజేతలకు బహుమతులు కూడా ఇస్తాము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, క్యారమ్ బోర్డులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక నేను డాక్టర్ బాలాజీ పైతో కలిసి మాకు కేటాయించిన గదిలో ఆహారాన్ని వండి ఇతర సిబ్బంది అందజేస్తున్నాం’ అని తెలిపారు -
బీజేపీకి బిందాల్ రాజీనామా ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది ధరించే ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్వీప్మెంట్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు)’ సేకరణలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హిమాచల్ప్రదేశ్ ‘డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ అజయ్ గుప్తాను మే 22వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అయిదు రోజుల అనంతరం ‘నాపై ఏ రకమైన ఒత్తిడి లేకపోయినప్పటికీ, కేసుపై ఎలాంటి ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఉన్నతాశయాలకు కట్టుబడి నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ రాజీనామా చేశారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. వైద్య రంగానికి చెందిన కొనుగోళ్లు చేయడానికి ఇతర రాష్ట్రాల్లోలాగా హిమాచల్కు ప్రత్యేక వైద్య కొనుగోళ్ల కార్పొరేషన్ అంటూ ఏదీ లేదు. అందుకని అజయ్ గుప్తా నాయకత్వంలో ఏర్పాటైన సాంకేతిక కమిటీయే కొనుగోళ్ల వ్యవహారాలు చూస్తోంది. కరోనా అత్యయిక పరిస్థితి కారణంగా ఎలాంటి బిడ్డింగ్లను పిలువకుండా చండీగఢ్లోని ‘బయోఏడ్ కార్పొరేషన్’ నుంచి 84 లక్షల రూపాయలకు ఆరువేల పీపీఈలు, కురుక్షేత్రంలోని ‘బన్సాల్ కార్పొరేషన్స్’ నుంచి 73.5 లక్షల రూపాయలకు ఏడువేల పీపీఈలు కమిటీ ఆధ్వర్యంలో అజయ్ గుప్తా కొనుగోలు చేశారు. ఇంతలో పృధ్వీసింగ్ అనే వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలు లంచంగా తీసుకొని ఆయనకు పీపీఈల కొనుగోలు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తును చేపట్టిన ‘స్టేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ పోలీసులు మే 22వ తేదీన గుప్తాను అరెస్ట్ చేశారు. లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా నేరస్థులేనని, కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని దర్యాప్తు విభాగం పోలీసు సూపరిండెంటెంట్ షాలినీ అగ్ని హోత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు. ఈ కేసులో నేటికి కూడా పృధ్వీసింగ్ను అరెస్ట్ చేయక పోవడమే అసలైన వార్త. అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకు బీజేపీ పదవికీ రాజీనామా చేసిన రాజీవ్ బిందాల్కు సంబంధం ఏమైనా ఉందా?! (అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!) రాజీవ్ బిందాల్కు సబంధం ఏమిటీ? రాజీవ్ బిందాల్ కూతురు స్వాతీ బిందాల్ గాంధీ, అల్లుడు రాజ్కుమార్ గాంధీలు కలిసి సోలన్లో ‘అపెక్స్ డయాగ్నోస్టిక్ ల్యాబ్’ నిర్వహిస్తున్నారు. వారి బిజినెస్ కార్డులపై భార్యభర్తలైన ఇద్దరు గాంధీల పేర్లతోపాటు మార్కెటింగ్ మేనేజర్గా ‘పృధ్వీ సింగ్’ పేరుంది. ఆడియోలో గుప్తాతో మాట్లాడిన పృధ్వీ సింగ్ ఈయనేనని, పృధ్వీ సింగ్, ఆడియో టేపులోని స్వరం ఒకలాగే ఉన్నాయంటూ స్థానిక పత్రికలు ఆరోపించగా, తమకు సంబంధం లేదంటూ ముగ్గురు ఖండించారు. ప్రాథమిక ఆధారాలు పరిగణలోకి తీసుకొని పృధ్వీ సింగ్ను అరెస్ట్ చేసి, విచారించాల్సిన పోలీసులు, ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. 73 లక్షల రూపాయల పీపీఈ పరికరాలను సరఫరా చేసిన ‘బన్సాల్ కార్పొరేషన్’ అనే సంస్థనే కురుక్షేత్రలో లేదు. కాకపోతే ఆ పేరును పోలిన ‘బన్సాల్ సేల్స్ కార్పొరేషన్, బన్సాల్ పాలిమర్స్’ అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఆ రెండు కంపెనీలు కూడా పీపీఈలను హిమాచల్కు సరఫరా చేయలేదని స్పష్టం చేశాయి. పైగా ఆ రెండు కంపెనీలు పీపీఈలనే ఉత్పత్తి చేయడం లేదు. పృధ్వీ సింగ్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మీడియా ప్రశ్నలకు పోలీసు అధికారులు మౌనం పాటిస్తుండగా, బీజేపీ నేత రాజీవ్ బిందాల్ తనకేమి సంబంధం లేదని ముక్తిసరిగా చెబుతూ బిజీ బిజీ అంటూ మొహం చాటేస్తున్నారు. పృధ్వీ సింగ్కు, రాజీవ్ బిందాల్కు సంబంధం లేకుండా బీజీపీ అధ్యక్ష పదవికి బిందాల్ ఎందుకు రాజీనామా చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల్దీప్ రాథోడ్, హిమాచల్ సీపీఎం శాసన సభ్యుడు రాకేష్ సింగా ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాశయాలకు కట్టుబడి రాజీనామా చేశానని బిందాల్ స్పష్టం చేశారు. వైద్య పరికరాల సేకరణలో అవినీతి జరిగితే ఉన్నత ఆశయాల మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలిగానీ బిందాల్ రాజీనామా చేయడం ఎందుకు?! (భారత్లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!) -
44డిగ్రీల ఎండలో..25 నిమిషాల పాటు
భోపాల్: బయట ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలో కాస్తా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒళ్లంతా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు సేవలందించే వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. ఒంటి మీద పీపీఈ కిట్ వేడి.. బయట ఎండకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఓ ఆరోగ్య కార్యకర్త. దారుణం ఏంటంటే అతడు పని చేసే ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తికి చికిత్స అందించడానికి నిరాకరించింది. దాంతో దాదాపు 25 నిమిషాల పాటు 44 డిగ్రీల ఎండలో ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. తర్వాత అతని సహోద్యోగి ఒకరు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు. వివరాలు.. హిరలాల్ ప్రజాపతి అనే వ్యక్తి 108 అంబులెన్స్కు అనుబంధ ఉద్యోగిగా బుండేల్ఖండ్ మెడికల్ కాలేజీ(బీఎంసీ)లో పని చేస్తున్నాడు. టీబీ హాస్పిటల్ నుంచి బీఎంసీకి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లే విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్నంతసేపు ప్రజాపతి పీపీఈ కిట్ ధరించి ఉంటాడు. దాంతో అధిక వేడికి తట్టుకోలేక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎంసీ ప్రాంగణంలో కుప్పకూలాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రజాపతికి చికిత్స అందించడానికి నిరాకరించడంతో దాదాపు 25నిమిషాల పాటు అలా ఎండలోనే ఉండిపోయాడు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) అనంతరం ప్రజాపతి సహోద్యోగి ఒకరు పారామెడికల్ సిబ్బంది సాయంతో అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బీఎంసీ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల విమానాశ్రయాలు, విమానం లోపల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విమానాయన సిబ్బంది తొలి రోజు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ‘రెండు నెలల తర్వాత ప్రయాణం చేస్తున్నాము. పద్దతుల్లో ఎలాంటి మార్పు లేదు.. విమానాలు సమాయానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.. మేం కాక్పిట్లో ఉన్నాం కాబట్టి చాలా భద్రంగా ఉన్నాము’ అని పైలెట్, కో పైలెట్ తెలిపారు. (ముఖానికి మాస్కులు.. షీల్డులు) అయితే క్యాబిన్ క్రూ మాత్రం పీపీఈ కిట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘మా యూనిఫామ్లు చాలా సౌకర్యంగా ఉండేవి. అసలే వేసవి, అధిక ఉష్ణోగ్రత ఇలాంటి సమయంలో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉంది. గాలి సరిగా ఆడదు. కొన్ని సార్లు చెమట పట్టి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అత్యసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించడానికి కుదరదు. అయితే ప్రస్తుతం విమానం లోపల ఆహారం, కూల్డ్రింక్లు వంటివి అనుమతించకపోవడం వల్ల మా పని కాస్తా సులువు అయ్యింది’ అన్నారు. (కరోనా ప్రభావమే ఎక్కువ..) విమానాశ్రయం లోపల కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రయాణికుల వస్తువులను ఓ డిసిన్ఫెక్టెంట్ కన్వేయర్ బెల్టు గుండా వెళ్లాయి. ప్రయాణికులు రాగానే భద్రతా సిబ్బంది వారి గుర్తింపు కార్డులు చూపించమని కోరారు. సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు కూడా పూర్తి శరీర రక్షణ సూట్లు ధరించారు. ఓ వ్యక్తి మా తాతను కలవడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాను. రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.(విడతలుగా విమాన సర్వీసులు?) కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.(630 విమానాలు రద్దు) -
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం జగన్
-
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
సెలూన్ షాప్లో పీపీఈ కిట్లు..
అహ్మదాబాద్ : కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఓ సెలూన్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. కస్టమర్లకు హెయిర్ కట్ చేసే సమయంలో కరోనా సోకకుండా ఉండేందకు రక్షణగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్లను ధరిస్తున్నారు. గుజరాత్ నడియాద్లోని ఓ సెలూన్ షాప్ యజమాని.. తన షాప్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆ సెలూన్ షాప్లోకి సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి కస్టమర్లకు హెయిర్కట్ చేస్తున్నారు. హెయిర్ కట్ చేసే సిబ్బంది పూర్తి స్థాయి పీపీఈ కిట్లు ధరించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆ సెలూన్కు వస్తున్న కస్టమర్లు కూడా ముఖానికి మాస్క్లు ధరించడంతోపాటుగా, భౌతిక దూరం నిబంధనను విధిగా పాటిస్తున్నారు. దీనిపై ఆ సెలూన్ షాప్ యజమాని విశాల్ మాట్లాడుతూ.. తమ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా సోకకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తికి అడ్డకట్టవేయడంలో పీపీఈ కిట్లు కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే. కేవలం కరోనా చికిత్స కేంద్రాలలోనే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తే కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. (చదవండి : జూమ్ కాల్తో 3700మందికి ఉబెర్ ఉద్వాసన) -
'నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం'
ముంబై : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫేస్బుక్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ' కోవిడ్-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. వీరిలో ప్రాణాంతక వైరస్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీంతో పాటు క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుపత్రులు నిండిపోతాయి. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసమే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణక మొదలు పెట్టాను. నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు' అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26వేలకు చేరుకోగా, 800కు పైగా మృతి చెందారు. (మా ఇంటికాడ కరోనా పరీక్షలా?) -
కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్కు పటిష్టమైన ఆరోగ్య నిఘా వ్యవస్థ ఉంది. అది కరోనా వైరస్ను దేశ సరిహద్దు లోపలికి రానీయదు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ఫిబ్రవరి 22వ తేదీనా వ్యాఖ్యానించారు. జనవది 30వ తేదీనే దేశంలో తొలి కరోనా కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఆరోగ్య అత్యయిక పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయనే మార్చి 13వ తేదీన మరో ప్రకటన చేశారు. దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ యూపీఏ–1 ప్రభుత్వం ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లు’ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. (వావ్.. క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ చూశారా?) మరి ఇప్పుడేమైందీ? కరోనా వైరస్ యావత్ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేయడం లేదా ? హెల్త్ ఎమర్జెన్సీ కింద దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేయడం లేదా ? కేంద్ర ఆరోగ్య శాఖ అప్పుడే స్పందించి ఉంటే నేడు దేశంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)గా పేర్కొనే మాస్క్లు, గ్లౌజులు, సేఫ్టీ గ్లాసెస్, కవరాల్ సూట్ల కొరత వచ్చేది కాదు కదా! వీటి కొరత కారణఃగా వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ‘యునైటెడ్ రెసిడెంట్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా’ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. పీపీఈల తయారీకి టెండర్లను ఖరారు చేయడంలో కూడా ఎంతో ఆలస్యం జరిగిందని రెండు అతిపెద్ద పీపీఈ ఉత్పత్తి కంపెనీల సంఘాలు ఆరోపించడం కూడా ఇక్కడ గమనార్హం. (ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి? ) ‘అవును, పీపీఈలు చాలినన్ని లేవు. కొరత ఎక్కువగానే ఉంది’ అన్న విషయాన్ని మార్చి 18వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర జౌళీ శాఖ అంగీకరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పీపీఈలను ఉత్పత్తిచేసే అనేక కంపెనీలు ‘లాక్డౌన్’ కారణంగా మూతపడ్డాయి. దేశంలో వైద్యరంగానికి జీడీపీలో కొంత శాతాన్ని కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి నెలలోనే ప్రకటించారు. అది జరిగి ఉన్నా దేశంలోని వైద్య రంగం కొంత బలపడి ఉండేది. (కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోదీ ) -
చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
బీజింగ్: కోవిడ్–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్ఝౌ నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్ఎన్ఏ కిట్లను భారత్కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది. అయితే, చైనా తయారీ వైద్య పరికరాల నాణ్యతపై వస్తున్న అనుమానాలపై చైనా ప్రభుత్వం స్పందించింది. వీటిని ప్రముఖ సంస్థలు తయారు చేస్తున్నందున నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయా దేశాలకు హామీ ఇచ్చింది. -
మరణాలు @ 33 వేలు
వాషింగ్టన్/లండన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. అయితే, కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరా టాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగా న్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా జాబితాలో ముందుందని వ్యాఖ్యానించారు. యూరప్లో కరోనా ఉగ్రరూపం యూరప్లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్ పాకిందని డబ్ల్యూహెచ్వో యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. తోట చుట్టూ వంద సార్లు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ తరఫున పోరాడిన సైనిక వీరుడు కెప్టెన్ టామ్ మూరె ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కరోనాని ఎదుర్కోవడానికి తన పోరాటపటిమను ప్రదర్శించారు. తన ఇంట్లో గార్డెన్ చుట్టూ వందసార్లు తిరిగారు. దీంతో 1.2 కోట్ల పౌండ్లు యూకే హెల్త్కేర్ చారిటీకి సంపాదించారు. వాకర్ సాయంతో ఆయన తనకు ఇచ్చిన టాస్క్ని పూర్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో తనకు వచ్చిన మెడల్స్ అన్నీ డ్రెస్కి తగిలించుకొని ఆయన తోట చుట్టూ తిరగడం ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. విరాళాలు వెల్లువెత్తాయి. మహీంద్రా పీపీఈల తయారీ భారత ఆటోమొబైల్స్ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అమెరికాలోని డెట్రాయిట్ యూనిట్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్–పీపీఈ) తయారీకి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సర్జికల్ మాస్కులు, గౌన్లతో పాటుగా వెంటిలేటర్లను కూడా భారీ సంఖ్యలో తయారు చేయనుంది. ‘ప్రస్తుతం కోవిడ్పై పోరాటానికి అవసరమైనవి తయారు చేయడమే అందరి లక్ష్యం కావాలి. మా దగ్గర నిరంతరం పని చేసే సిబ్బంది ఉన్నారు’అని ఆ సంస్థ ఉత్తర అమెరికా సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. టీకాతోనే సాధారణ పరిస్థితులు కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు. -
చైనా పీపీఈ కిట్లు నాసిరకం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా కంపెనీలు వ్యక్తిగత రక్షణ ఉపకరణాల(పీపీఈ) కిట్లను ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే, వీటిలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన చైనా నుంచి 1,70,000 పీపీఈ కిట్లు భారత్కు చేరుకున్నాయి. ఇందులో 50 వేల కిట్లు నాణ్యతా పరీక్షలో విఫలమైనట్లు ఓ పత్రిక వెల్లడించింది. గ్వాలియర్లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)ప్రయోగశాలలో ఈ నాణ్యతా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ఈ 1,70,000 కిట్లు చైనా నుంచి విరాళంగా వచ్చినట్లు సమాచారం. తాము చైనా నుంచి సీఈ/ఎఫ్డీఏ సర్టిఫైడ్ పీపీఈ కిట్లను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. నాణ్యతపై సందేహాలు వద్దు చైనా సంస్థలు సరఫరా చేస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపై సందేహాలు అక్కర్లేదని భారత్లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి రోంగ్ చెప్పారు. నాణ్యమైన కిట్లను చైనా ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. -
కరోనా : షారుక్ సాయం.. అభినందించిన మంత్రి
ముంబై : బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్కు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్లో పేర్కొన్నాడు. (తల్లి నుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం) దీనిపై షారుక్ స్పందిస్తూ.. ' నేనిచ్చిన కిట్లను హెల్త్ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. అయినా దేశమంతా ఒకే కుటుంబంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ రీట్వీట్ చేశాడు. Thank you sir for all your help to source the kits. We are all together in this endeavour to protect ourselves and humanity. Glad to be of service. May your family & team be safe and healthy. https://t.co/DPAc7ROh7i — Shah Rukh Khan (@iamsrk) April 13, 2020 అంతకుముందు షారుక్ భార్య గౌరీఖాన్ తమ నాలుగంతస్తుల ఆఫీస్ బిల్డింగ్ను క్వారంటైన్ సెంటర్గా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు లేఖను అందజేశారు. క్వారంటైన్ సెంటర్లో మహిళలకు, చిన్నపిల్లలతో పాటు, మిగతావాళ్లకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై బృహత్ ముంబై కార్పొరేషన్ ట్విటర్లో స్పందిస్తూ.. ' మీ ఆఫీసుని క్వారంటైన్ సెంటర్గా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆపత్కాల సమయంలో మీరు చేస్తున్న పనికి మాకు సంతోషంగా ఉందంటూ' తెలిపారు. ఇక భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10వేల కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 300 దాటేసింది. (మే 3 వరకు లాక్డౌన్ : మోదీ) -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్లో ముగ్గురు, జమ్మూకశ్మీర్లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్ను మొబైల్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్డెస్క్ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
కరోనా: ‘పేషెంట్ నాపై వాంతి చేసుకున్నారు’
‘‘కుప్పకూలిపోతున్న ఓ రోగికి సహాయం చేసేందుకు నేను పరిగెత్తాను. తనను స్టెబిలైజ్ చేసే క్రమంలో సదరు నా పేషెంట్ నా దుస్తుల మీద వాంతి చేసుకున్నారు. పీపీఈ(పర్సనల్ ప్రొటెక్టివ్గేర్ ఎక్విప్మెంట్) లేదు. ఆ తర్వాత ఆ పేషెంట్కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇవీ వైద్యులు రోజూ ఎదుర్కొంటున్న రిస్కులు. రోగులను కాపాడతామని మేం ప్రమాణం చేశాం. కానీ మమ్మల్ని మేం కాపాడుకోలేకపోతున్నాం’’ అని రూపా ఫారూఖీ అనే వైద్యురాలు ప్రాణాంతక కరోనా వైరస్పై పోరులో వైద్యులకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి వివరించారు. రూపా వైద్యురాలు మాత్రమే కాదు.. ఆమె ఓ రచయిత్రి కూడా. ప్రసుతం ఆమె ఇంగ్లండ్లోని క్వీన్ ఎలిజబెత్ మదర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా రోజూ ఎంతో మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేకపోవడంతో వారు ఎదుర్కొంటున్న అనుభవాల గురించి ఈ విధంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. రూపా ట్వీట్కు స్పందించిన నెటిజన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లను కాపాడుతున్న డాక్టర్లకు సలాం అంటూనే.. వారి రక్షణకై సరైన చర్యలు తీసుకోని ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. అత్యధిక మంది వైద్య సిబ్బంది మహమ్మారి బారిన పడితే సేవలు అందించే వారు లేక ప్రపంచం సర్వనాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక కరోనా సోకి ఇప్పటికే పలువురు వైద్యులు మరణించిన విషయం తెలిసిందే.(మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య, కుమార్తె) కాగా భారత్లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మీడియాకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికి ధన్యవాదాలు తెలపడంతో పాటుగా.. పీపీఈలు కూడా అందించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. అంతేకాదు కొంతమంది డాక్టర్లు కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ... పీపీఈలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.(డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్) 14 లక్షలు దాటిన కరోనా కేసులు I ran to help a deteriorating patient who vomited over me while we stabilised them. No PPE. Patient then confirmed #Covid positive This is the daily reality of risk to all frontline doctors We keep our promise to protect patients But we are unable to protect ourselves#NHS #PPE — Roopa Farooki (@RoopaFarooki) April 7, 2020 -
రెండు పీపీఈ నమూనాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ఉత్తర రైల్వే వర్క్షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోజుకు 20 వరకు ఈ పరికరాలను తయారు చేస్తున్నామని, ఇకపై రోజుకు 100కు పైగా రూపొందిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న రైల్వే ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగిస్తామని పేర్కొన్నాయి. దేశంలో పీపీఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భయం భయంగా పనిచేయాల్సి వస్తోంది. సరిపడగా పీపీఈ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవో పాటు పలు సంస్థలు వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. (చైనా ఎన్ని మాస్క్లు అమ్మిందంటే..?) -
చికిత్స చేస్తేనే పీపీఈ కిట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మాత్రమే పూర్తిస్థాయిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ (పీపీఈ) అవసరమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ వార్డుల్లో, ఇతర చోట్ల పనిచేసే వారికి అవి అవసరం లేదని వెల్లడించింది. కరోనా చికిత్స నేపథ్యంలో తమకు కిట్లు అందుబాటులో లేవంటూ కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న వాదనలు కొట్టేస్తూ.. ఎవరికి ఏమేమి అవసరమన్న దానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. పీపీఈ కిట్లలో ఫేస్ షీల్డ్ గాగుల్స్, ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కులు, ఎన్–95 మాస్క్లు, గ్లౌవ్స్, గౌన్స్, షూ కవర్స్, హెడ్ కవర్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ అవసరం లేదని మార్గదర్శకాల్లో సర్కారు తెలిపింది. వారికి మాస్క్, గ్లౌవ్స్ చాలు.. ఓపీలో ఉండే వారికి, అనుమానితులు ఉండే ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే వారికి పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. ఎన్–95 మాస్కులు, గ్లౌవ్స్లు ఉంటే సరిపోతుందని పేర్కొంది. కరోనా మృతదేహాన్ని తరలించే సిబ్బందికి కూడా ఎన్ 95 మాస్క్లు, గ్లౌవ్స్ సరిపోతాయని తెలిపింది. కరోనా రోగుల వార్డుల్లో శానిటేషన్ చేసే వారికి, రోగుల బట్టలు ఉతికే వారికి కూడా గ్లౌవ్స్, ఎన్–95 మాస్కులు సరిపోతాయని తెలిపింది. క్షేత్రస్థాయిలో సర్వైలెన్స్ చేసే ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు మూడు లేయర్ల మాస్క్లు ధరిస్తే చాలని తెలిపింది. క్షేత్రస్థాయిలో క్లినికల్ ఇన్వెస్టిగేషన్ చేసే వైద్య సిబ్బందికి ఎన్–95 మాస్క్లు, గ్లౌవ్స్ చాలని , క్వారంటైన్లో ఉన్న కరోనా అనుమానితులను పరీక్షించే డాక్టర్లకు కూడా ఎన్–95 మాస్కులు, గ్లౌవ్స్ సరిపోతాయని తెలిపింది. వారి శరీర ఉష్ణోగ్రత చెక్చేసే వారికి, ఇతర సహాయకులకు గ్లౌవ్స్, మూడు లేయర్ల మాస్క్లు సరిపోతాయని పేర్కొంది. కరోనా మృతదేహాన్ని ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లే వారికి, కరోనా చికిత్స చేసే గదుల్లో తరచుగా క్లీనింగ్ చేసే వారికి ఎన్–95 మాస్క్లు, గ్లౌవ్స్ సరిపోతాయని స్పష్టం చేసింది. కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సియల్, ఇంజనీరింగ్, సెక్యురిటీ సిబ్బందికి ఎలాంటి రిస్క్ ఉండదని, వారికి ఎలాంటి మాస్క్లు, గ్లోవ్స్ అవసరం లేదని పేర్కొంది. ఔట్ పేషెంట్ విభాగంలో పనిచేసే వారికి మోడరేట్ రిస్క్ మాత్రమే ఉంటుందని, వారికి ఎన్–95 మాస్క్లు, గ్లౌవ్స్ సరిపోతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కేసులను చూసే వారికి ఎన్–95 మాస్క్లు, గ్లౌవ్స్ సరిపోతాయని స్పష్టంచేసింది. హైరిస్క్లో ఉన్నవారికే పూర్తి కిట్లు.. గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఛాతీ తదితర కరోనా చికిత్స చేసే ఆసుపత్రుల్లో ఉన్న వారందరికీ పీపీఈ కిట్లు పూర్తిస్థాయిలో అవసరం లేదని సర్కారు తెలిపింది. హైరిస్క్లో ఉన్నవారికే అన్ని రకాల ఎక్విప్మెంట్లు అవసరమని తేల్చి చెప్పింది. క్రిటికల్ కేర్ ఐసీయూలో పనిచేసే వారికి, మృతదేహాన్ని ప్యాక్ చేసేవారికి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారికి, అంబులెన్స్లో పేషెంట్ హెల్త్ కండీషన్ను పర్యవేక్షించే వైద్య సిబ్బందికి, వైద్య పరీక్షల కోసం పేషెంట్ వద్ద నమూనాలు సేకరించే వారికి, దాన్ని ల్యాబ్కు పంపేవారికి, ల్యాబ్లో శాంపిల్స్ను పరీక్షించే వారికి, పోస్ట్మార్టం చేసే సమయంలో డాక్టర్లకు మాత్రమే పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లు అవసరమని తేల్చి చెప్పింది. -
కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బందికి అవసరమైన చేతుల గ్లౌజులు, ముఖ మాస్కులు, మొత్తం శరీరాన్ని కవర్ చేసే బాడీ సూట్లు అందుబాటులో లేవు. సకాలంలో ప్రభుత్వాధికారులు స్పందించక పోవడం, వాటి ఉత్పత్తి ఉత్తర్వులలో అవకతవకలు చోటు చేసుకోవడంతో వైద్య సిబ్బంది వీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. వైద్య సిబ్బంది ధరించే వివిధ రకాల మాస్క్లను ‘పర్సనల్ ప్రొటెక్షన్ ఇక్వీప్మెంట్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) లేదా పీపీఈ అని వ్యవహరిస్తారు. (కరోనా: లాక్డౌన్ అంటే..) కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇవి ప్రతి దేశంలోని వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. భారత్లో జనవరి 1వ తేదీన మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి రోజే పీపీఈ ఉత్పత్తుల ఎగుమతిని నిషేధిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలన్నర రోజులు గడచిపోయినప్పటికీ తమ సభ్యులైన ఉత్పత్తిదారులకు వీటి ఉత్పత్తుల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని దేశవ్యాప్తంగా పీపీఈలను ఉత్పత్తి చేస్తోన్న దాదాపు 150 కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల్లో ఒక సంఘం అధ్యక్షులు ఆరోపించారు. (కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి) ఈ మాస్క్ల ఉత్పత్తిదారులతో కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మార్చి 18వ తేదీన ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి మార్చి 8వ తేదీన జారి చేసిన ఆదేశాల మేరకు జౌళి శాఖ ఏర్మాటు చేసిన ఆ సమావేశానికి వైద్యశాఖ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. సమావేశానికి పలువురు పీపీఈ ఉత్పత్తిదారులతోపాటు వారికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పీపీలను సమీకరించే బాధ్యతను ఆ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్కు అప్పగించారు. 7.25 లక్షల ఓవరాల్ బాడీ సూట్లు, 60 లక్షల ఎన్–95 మాస్క్లు, కోటీ మూడు లేయర్ల క్లినికల్ మాస్క్లు అవసరమని నాటి సమావేశంలో వైద్యశాఖ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే అత్యంత ఖరీదైనా ఫుల్ బాడీ సూట్లతోపాటు 10.5 లక్షల ఎన్ మాస్క్లు, పది లక్షల మూడు లేయర్ల మాస్క్ల ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ సమావేశంలో హెచ్ఎల్ఎల్ అధికారులు తెలిపారు. దానిపై పీపీఈ ఉత్పత్తి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ‘ప్రివెంటీవ్ వియర్ మానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ చైర్మన్ డాక్టర్ సంజీవ్ రెల్హాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సభ్యుల్లో ఒకరికి కూడా ఈ ఉత్పత్తి ఉత్తర్వులు అందలేదని ఆయన మీడియాతో చెప్పారు. ఉత్పత్తి ఆర్డర్లు ఎవరికి అందలేదంటూ మార్చి 21వ తేదీన ఓ ఆంగ్ల పత్రిక ఓ వార్తను ప్రచురించడంతో ఆ రోజు మధ్యాహ్నం అత్యవసరంగా 80 వేల పీస్లు కావాలంటూ తమ అసోసియేషన్ సభ్యులైన 14 కంపెనీలకు హెచ్ఎన్ఎల్ నుంచి ఈ మెయిల్స్ ద్వారా ఉత్తర్వులు అందాయని డాక్టర్ సంజీవ్ వివరించారు. (మీ పిల్లలను ఇలా చదివించండి) అదేరోజు సాయంత్రం మూడు టెండర్ డాక్యుమెంట్లు హెచ్ఎల్ఎల్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. మొదటి డాక్యుమెంట్లో మార్చి 5వ తేదీన టెండర్లు పిలిచినట్లు మార్చి 16న టెండర్లు ముగుస్తున్నట్లు, రెండో డాక్యుమెంట్లో 16వ తేదీన టెండర్ ముగింపును మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు, మూడవ డాక్యుమెంట్లో టెండర్ ముగింపును మార్చి 25కు పెంచుతున్నట్లు మార్చారు. అసలు ఈ టెండర్ల గురించే తమకు తెలియదని రోజుకు ఫుల్ బాడీ లేదా కవరాల్ మాస్క్లను ఉత్పత్తిచేసే సామర్థ్యం కలిగిన ‘మెడిక్లిన్’ పీపీఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ స్మితా షా ఆరోపించారు. ఇదే విషయమై హెచ్ఎల్ఎల్ డైరెక్టర్ టీ. రాజశేఖర్ను మీడియా సంప్రతించగా, కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణలో తాము 24 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా దేశంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పీపీఈలు ముఖ్యంగా ఫుల్ బాడీ సూట్లు అందుబాటులో లేవని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేం! (కరోనా ఎఫెక్ట్: బాధ్యత లేని మనుషులు) -
నిరుపయోగంగా పీపీఈలు
- వృథాగా అగ్నిమాపక శాఖ జవాన్ల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ - కొనుగోలు చేసినవి 2,320.. - ఉపయోగిస్తున్నవి 620 - శరీర ఆకృతికి తగ్గట్టు - లేకపోవడం వల్లే ధరించడం లేదన్న సిబ్బంది సాక్షి, ముంబై: అగ్నిమాపక శాఖ జవాన్ల రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్’ (పీపీఈ) లు కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయి. మంటలు ఆర్పివేసే ప్రయత్నంలో గాయపడకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన మొత్తం 2,320 పీపీఈలలో 620 మాత్రం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగతావన్నీ ఆయా అగ్నిమాపక కేంద్రాలలో పనికిరాకుండా పడున్నాయి. సదరు యూనిఫాంలు జవాన్ల శరీర ఆకృతికి తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించడం లేదని తెలుస్తోంది. అయితే బాధ్యులైన సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకుండా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు వారిని వెనకేసుకొస్తున్నారు. వృథాగా యూనిఫాంలు..రూ. 20.67 కోట్ల నష్టం అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పే ప్రయత్నంలో జవాన్లకు హాని జరగకుండా 2009లో బీఎంసీ పరిపాలనా విభాగం జాకెట్లు, ప్యాంట్లు, టీ షర్టులు, షూస్, హెల్మెట్లు, టార్చ్లైట్లు ఇలా ఒక్కో సెట్లో 15 వస్తువులు ఉండే 2,320 పీపీఈలు కొనుగోలు చేసింది. వీటిని మెసర్స్ టెక్నోట్రేడ్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం బీఎంసీ పరిపాలన విభాగం రూ.29.34 కోట్లు చెల్లించింది. కానీ జవాన్ల శరీర కొలతల ప్రకారం వాటిని తయారు చేయకపోవడంతో ఫిర్యాదు చేశారు. సరిపోయిన 620 పీపీఈలు వినియోగిస్తున్నారు. మిగతావన్నీ వృథాగా పడి ఉండడంతో బీఎంసీకి వాటి ద్వారా రూ.20.67 కోట్ల నష్టం వాటిల్లింది. నిరూపయోగంగా ఉన్న యూనిఫాంలను మార్చి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నిరాకరించారు. మరోవైపు ఇచ్చిన గడువుకంటే రెండు నెలలు ఆలస్యంగా సామాగ్రి డెలివరీ చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా రూ.1.12 కోట్లు జరిమాన వసూలు చే యాల్సి ఉంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం స్థాయి సమితిలో ఈ అంశాన్ని చర్చించారు. దీనిపై ఆడిట్ సిబ్బంది నిలదీశారు. కొలతల ప్రకారం యూనిఫాంలు తయారుచేసి ఇచ్చే బాధ్యత కాంట్రాక్టర్దేనని, అయినప్పటికి ఎందుకు నిర్లక్ష్యం చేశార ని ఆడిటర్లు అగ్నిమాపక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా 10 శాతం జరిమానా వసూలు చేయాలని సూచించారు.