Serial actress
-
మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నటి కస్తూరి (ఫోటోలు)
-
లంగావోణి, చీరలో జ్యోతిరాయ్ స్టన్నింగ్ లుక్స్..మతిపోగొట్టేస్తోన్న సీరియల్ యాక్టర్
-
వీధికెక్కిన సినీ జంట
యశవంతపుర: తన భార్య వేధిస్తోందంటూ కన్నడ నటి శశికళపై భర్త, సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2021లో ఓ సినిమా షూటింగ్లో శశికళ, హర్షవర్దన్కు పరిచయమైంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు. కొన్నిరోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, తమ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగరభావిలోని ఆఫీసుకు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసింది. 2022లో ఆమె ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. సినిమా రంగంలో లేకుండా చేస్తానని బెదిరించిందన్నారు. చివరకు 2022 మార్చిలో శశికళను వివాహం చేసుకున్నాను. కొద్ది రోజులకు కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మా ఇంటికి వచ్చేవారు. అదేమని ప్రశ్నించినందుకు నన్ను బయటకు పంపి, రెండు గంటల తరువాత మళ్లీ ఇంటిలోకి రానిచ్చేది. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు శశికళతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్! (ఫోటోలు)
-
ఒకప్పడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసిన ఈ బుల్లితెర నటి గురించి తెలుసా..? (ఫొటోలు)
-
పెళ్లై 20ఏళ్లు.. పిల్లలు ఎందుకు లేరంటే.. (ఫోటోలు)
-
టీవీ సీరియల్ నటికి వేధింపులు...
బంజారాహిల్స్ : నా మాట వినకున్నా..నాతో కలవకున్నా..నన్ను పెళ్లి చేసుకోకున్నా..ఈ సంక్రాంతికి నీ ఫొటోలన్నీ బ్యానర్లుగా చేసి ఊరంతా కడతానంటూ టీవీ సీనియర్ నటిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్ గోదావరి జిల్లా, కవటం గ్రామానికి చెందిన మహిళ (29) శ్రీకృష్ణానగర్లో ఉంటుంది. ఆమెకు 2012లో కృష్ణమోహన్ అనే వ్యక్తితో పెళ్లి కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో కలిసి కృష్ణానగర్లో ఉంటోంది. గత సెపె్టంబర్ నుంచి శ్రావణ సంధ్య అనే సీరియల్లో నటిస్తుంది. ఈ సందర్భంగా బత్తుళ్ల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పగా, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు, వీడియోలు పెట్టడమే కాకుండా టీవీ ఇండస్ట్రీలో తాను వివిధ వ్యక్తులతో దిగిన ఫొటోలను చెడుగా ప్రచారం చేస్తున్నాడు. తనతో ఉండడానికి ఒప్పుకోకపోతే ఈ ఫోటోలతో సంక్రాంతికి ఆమె స్వ గ్రామంలో బ్యానర్లు కడతానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫణితేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీరియల్ నటి సంగీత కళ్యాణ్కుమార్ (ఫొటోలు)
-
‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ‘అను’ పెళ్లి సందడి (ఫొటోలు)
-
బుల్లితెర నటి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?
-
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
సీరియల్స్లో చీరకట్టు.. ఇన్స్టాలో ఈ కన్నడ బ్యూటీని ఇలా చూస్తే ఏమైపోతారో..! (ఫోటోలు)
-
క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!
నిఖిల్ మళయక్కల్.. గోరింటాకు సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇదే ధారావాహికలో అతడికి జోడీగా నటించింది కావ్య శ్రీ. సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ, వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది. ఇంకేముంది.. ప్రతి ఫంక్షన్లోనూ, షోలోనూ, ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఇద్దరి మధ్య దూరంవీళ్ల యవ్వారం చూసిన జనాలు ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్కు ఎదురైతే.. కావ్య మంచి అమ్మాయి.. పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింటిచ్చాడు. తర్వాత ఏమైందే ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశారు. కొట్టినా, తిట్టినా పడతా..ఇక నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్స్టోరీ చెప్తూ ఎమోషనలయ్యాడు. ఆరేళ్ల ప్రేమ.. విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు. నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా.. అని ఏడుస్తూ చెప్పాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. మోసపోవద్దుమాస్కు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేవరకు ఎదురుచూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్- కావ్య మళ్లీ కలుస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోని ఓ రిసార్ట్లో వివాభ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
Mansi Joshi: 'దేవత' సీరియల్ నటి నిశ్చితార్థం (ఫోటోలు)
-
ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
-
బుల్లితెర నటి లహరి కుమారుడి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
చీరలో ఉంగరాల జుట్టుతో సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫొటోలు)
-
అప్పట్లో చిరంజీవితో చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడేమో సీరియల్ నటిగా.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్
గత కొన్నేళ్లలో తెలుగు సీరియల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నది ఏదైనా ఉందంటే అది 'కార్తీకదీపం'. కాస్త నలుపు ఛాయలో ఉన్న ఓ గృహిణి పడే ఇబ్బందులు అనే కథతో తీసిన ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ అనే నటికి అయితే తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఇది తప్పితే ఆమె గురించి పెద్దగా విషయాలేం తెలియవు.(ఇదీ చదవండి: ప్రేమలో పడిన తెలుగు బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా)ప్రస్తుతం సరికొత్త 'కార్తీకదీపం' సీరియల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్.. రీసెంట్గా ఓ కుర్రాడితో కలిసి ఇన్ స్టాలో రీల్ చేసింది. ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్కి పెళ్లయి పిల్లలున్నారని తెలుసు గానీ మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్. తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా.. అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు. దీంతో బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు. సంతూర్ మమ్మీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) View this post on Instagram A post shared by Manujith (@_.maaaaaaaanu) -
ఖరీదైన లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ బ్యూటీ.. రేటు ఎంతంటే?
సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ కూడా ఈ మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో నటి లహరి కూడా చేరింది.(ఇదీ చదవండి: 'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం)'మొగలిరేకులు', గృహలక్ష్మి తదితర సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లహరి.. ప్రస్తుతం ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ కారు ధర మార్కెట్లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.కోటికి పైనే ఉండొచ్చు. తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!) View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమెకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది మళ్లీ చాన్నాళ్ల తర్వాత కరుణ్ భూషణ్ ట్విన్స్కి తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-సాయిధరమ్ తేజ్ వివాదంపై స్పందించిన నిహారిక)'ఆహా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'శంకర్ దాదా ఎంబీబీఎస్', కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు తెలుగులో బోలెడన్ని సీరియల్స్ చేసింది.ముఖ్యంగా 'అభిషేకం' సీరియల్లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Bharath Bhushan Nethi (@bharathbhushan_nethi) -
సీరియల్ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)
-
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణిచింది. యాక్సిడెంట్లో ఆమెకు పెద్దగా గాయాలు కానప్పటికీ ఆ సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూసింది. నటి మృతిని ఆమె ప్రియుడు, నటుడు చందు జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో కన్నీరుమున్నీరుగా విలపించాడు.ముందుగానే హింట్త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నానంటూ తన చావును ముందుగానే హింటిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వీడియోలలోనూ ఇంకో రెండు రోజులు మాత్రమే.. అంటూ పవిత్రతో కలిసున్న పిక్స్ షేర్ చేశాడు. చివరికి అన్నంత పనీ చేశాడు. హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం (మే 17న) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై నటుడి తల్లీభార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఐదేళ్లుగా నటితోనే..చందు తల్లి మాట్లాడుతూ.. 'ఐదేళ్ల నుంచి చందు.. పవిత్రతోనే ఉంటున్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి తను భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా నా కొడుకు మాతో మాట్లాడలేదు. నా కోడలు, నేను చూడటానికి వెళ్తే దగ్గరకు కూడా రానివ్వలేదు. అతడు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. మారతాడనుకున్నాం..తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. మారతాడేమోనని అంతా ఎదురుచూశాం. కానీ మారలేదు. యాక్సిడెంట్ తర్వాత అతడి ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. పవిత్ర ఎల్ఐసీ డబ్బుల కోసం వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. మేమెవరం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇంతలోనే అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది' అంటూ గుండె పగిలేలా ఏడ్చింది చందు తల్లి. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist)చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప