Trip
-
ఈ ఏడాది ఫస్ట్ ట్రిప్కు చెక్కేసిన సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి (ఫోటోలు)
-
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
వావ్.. పదహారేళ్ల పడతిలా అబుదాబీ బీచ్లో స్టార్ సింగర్
-
బాయ్ ఫ్రెండ్తో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవులు ట్రిప్? (ఫొటోలు)
-
స్విట్జర్లాండ్ లో రాయ్ లక్ష్మీ సిజ్లింగ్ ఫోటోలు
-
ఇండోనేషియాలో బిగ్ బాస్ బ్యూటీ జిల్ జిల్ జిగా.. (ఫొటోలు)
-
కాంబోడియాలోని అతిపెద్ద దేవాలయంలో నటి హిమజ (ఫొటోలు)
-
'కల్కి' రిలీజ్కి రెడీ.. ఇంతలోనే ప్రభాస్ ఫారెన్ టూర్.. కారణమదేనా?
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్స్.. స్టోరీ ఏంటనేది ఆల్మోస్ట్ రివీల్ చేశాయి. ముంబయిలో ఈవెంట్ చేశారు గానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివేం లేవు. దీనిబట్టి చూస్తే ఇక ఈవెంట్స్ ఏం లేనట్లే. రిలీజ్కి మరో ఐదారు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ ఫారెన్ టూర్ వెళ్లబోతున్నాడట.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'ప్రభాస్.. తన ప్రతి సినిమా విడుదలకు ముందు విదేశాలకు వెళ్తుంటాడు. గతంలో 'సలార్' రిలీజ్కి ముందు ఇటలీ వెళ్లినట్లు గుర్తు. ఇప్పుడు 'కల్కి' థియేటర్లలో రావడానికి ముందు మాత్రం యూరప్ వెళ్లబోతున్నాడట. ఇండస్ట్రీలో దీని గురించి టాక్ వచ్చింది గానీ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.'బాహుబలి' తర్వాత గతేడాది రిలీజైన 'సాహో'తో మాత్రం ప్రభాస్ హిట్ కొట్టాడు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' మూవీస్.. ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో ఫెయిలయ్యాయి. దీంతో అందరికీ 'కల్కి'పై అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉంది. మరి ప్రభాస్ ఈసారి ఏం చేస్తాడో తెలియాలంటే శుక్రవారం వరకు ఎదురుచూడాల్సిందే?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?) -
US: అమెరికాలో తప్పక చూడాల్సిన ఐదు ప్రదేశాలివే!
ఇండియా నుండి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే వాళ్ళను విమానాశ్రయాల్లో గమనిస్తే మూడుకాళ్ళ ముసలివాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. ఇలాంటి వారికి వేలాది మైళ్ళ ప్రయాణం చేయగలిగే శక్తి ఉత్సాహలనిచ్చే అసలు అదృశ్యశక్తి దూర దేశాల్లోకి అంతర్జాలమే వాహనంగా దూరిపోయిన మన ఎన్ఆర్ఐ పిల్లలదేనన్నది నిస్సందేహం. హార్డ్వేర్ బతుకుల్లో సాఫ్ట్వేర్ పిల్లలు పండు ముదుసళ్లకు తప్పని ఫారిన్ ట్రిప్పులు ! ఎందుకు నాయనా ఈ వయసులో మాకు శ్రమ! అని ఆమ్మో నాన్నో తప్పించుకోజూస్తే.. ‘అలాకాదు మా చదువుల కోసం మీరు చేసిన అప్పులకు, పగలనకా రాత్రనకా కష్టపడి పనిచేసి మేము కూడబెట్టిన ఆస్తులకు, త్వరలోనే వారసులు రాబోతున్నారు కాబట్టి తప్పక రండి, మీరూ వాళ్ళ సేవ చేసుకొని తరించవచ్చు’ అంటారు. అలాంటిదే ఒక సేవా సందర్భం 2013లో నాకూ వచ్చింది. అప్పటి వరకు మాతో హైదరాబాద్ లోనున్న మూడేళ్ల మా మనవడిని అప్పుడు లాస్ ఎంజీల్స్లోనున్న మా అబ్బాయి దగ్గర దింపిరావడానికి ఆగష్టు 17న నేను అమెరికా బయలుదేరి వెళ్ళాను. గమ్యం చేరేవరకు ప్రతి ఎయిర్పోర్టులో అధికారులతో నేను పదే పదే ఎదుర్కున్న ప్రశ్న.. మా మనవడి గురించి.! మీ దగ్గర ‘పేరెంట్స్ పర్మిషన్, వాలిడ్ డాకుమెంట్స్ ఉన్నాయా లేవా ? ’ అని. మా జర్నీలో ఫ్లయిట్ మారినప్పుడల్లా కనబడ్డ ప్రతి టాయ్ కావాలని చేస్తున్న మా మనవడి డిమాండ్స్ అయిష్టంగానైనా ఒకటీ అరా తీరుస్తూ ఎలాగైతేనేం ఎట్టకేలకు లాస్ ఎంజీల్స్ చేరి అప్పగింతలు పూర్తిచేశా. నాలాంటి వాడిని అమెరికా వెళ్లి ఏం చేశారని ఎవ్వరూ అడగరు, ఏం చూశారన్నదే ముఖ్యమైన ప్రశ్న. నా లెక్కకు అందరూ అడిగే ఈ ఐదు చూసేస్తే అమెరికా యాత్ర పూర్తయినట్లే. 1 ) ఆ దేశ స్వాతంత్య్రానికి ప్రతీకయైన న్యూయార్క్లోని స్టాచ్యు అఫ్ లిబర్టీ 2 ) వాషింగ్టన్ డి సి లోని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధం అదే వైట్ హౌస్ 3 ) కాలిఫోర్నియాలోని హాలీవుడ్ సినీ ప్రపంచం 4 ) పిల్లల ప్రపంచం డిస్నిల్యాండ్ 5) నిద్రపోని నగరం క్యాసినోల ప్రపంచం లాస్ వేగాస్ను మరిచిపోయానంటారేమో, నా లాంటివాడు అటు వెళ్తే ఉన్న ఆరోగ్యమే కాదు పొదుపు చేసి పెట్టుకున్న పెన్షన్ డబ్బులు కూడా పోతాయేమోనని భయం. లాస్ ఏంజెల్స్ ఒకప్పుడు మెక్సికోలో భాగం, దీన్ని ఓ ఒప్పందం పేరిట 1848లో అమెరికా తీసేసుకున్నదట. లాస్ ఎంజీల్స్లో ఉన్నాను కాబట్టి అక్కడి హాలీవుడ్ సినీ ప్రపంచాన్ని చుట్టేసాను, యూనివర్సల్ స్టూడియోలో ఒక రోజంతా గడిపాను. అటునుండే వెళ్లి పిల్లలతో డిస్నీల్యాండ్ లో ఆడుకొని వచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడే అప్పటివరకు స్కెచర్స్ లో పనిచేస్తున్న మా అబ్బాయికి ఒరాకిల్ పోర్టులాండ్లో అవకాశం రావడంతో ముల్లెమూటా సర్దుకొని అక్కడి నుండి మారాల్సి వచ్చింది. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ నుండి పోర్టులాండ్ ( ఒరెగాన్ ) దూరం దాదాపు 900 మైళ్లు. అందరమూ కారులో వెళదామన్నాడు మా అబ్బాయి. నేషనల్ హైవె మీద దాదాపు 350 మైళ్లు, 7 గంటల డ్రైవ్ తర్వాత మేము శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేసాము. ఇదే విమానంలో వచ్చుంటే ఫ్లయిట్ జర్నీ గంటకు మించదు. 1906లో వచ్చిన తీవ్రమైన భూకంపంలో శాన్ ఫ్రాన్సిస్కో దాదాపు మూడు వంతులు దెబ్బతిందట. మళ్ళీ పునర్ నిర్మించుకున్న ఈ నగరం ఒకప్పుడు హిప్పీ సంస్కృతికి తర్వాతి కాలంలో స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమానికి పేరు గాంచింది. ఇంకా దాదాపు 550 మైళ్లు వెళితే గానీ మేము గమ్యం చేరలేము. పిల్లలు అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల, వాళ్ళను మరునాడు ఫ్లయిట్ ఎక్కించి మా అబ్బాయి నేను మాత్రం ఇక్కడి ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తూ పోర్ట్ ల్యాండ్ బాట పట్టాము. ఈ నేషనల్ హైవే 101 అంతా ఘాట్ రోడ్డు, ప్రయాణంలో ఎన్నో పదనిసలు. కుటుంబం నుంచి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల వరకు అన్నీ మాట్లాడుతూ, ప్రతి 50-60 మైళ్లకు ఒకచోట హైవేల పక్కనున్న రెస్ట్ ఏరియాల్లో కాస్సేపు విశ్రమిస్తూ చేసిన దాదాపు పది గంటల ప్రయాణం తర్వాత మేము పోర్ట్ ల్యాండ్ చేరుకున్నాము. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు బాగా నచ్చినవి ప్రయాణికులు సేద దీరడానికి రెస్ట్ రూంలు. వీటిలో రెస్టారెంట్ల నుంచి ప్లే ఏరియా వరకు అన్ని సౌకర్యాలున్న ‘ రెస్ట్ ఏరియాలు ’ అవే విశ్రాంత ప్రాంతాలు ఎలాంటి బడలికనైనా అట్టే మాయం చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్ల (మైళ్ల) దూరాన్ని సునాయసంగా లాగించేస్తుంటారు అమెరికన్లు. హోటళ్ల తరహాలోనే అన్ని సౌకర్యాలుంటాయి, పైగా ఇవి మోటారిస్టుల కోసం కాబట్టి వీటిని మోటళ్లు అంటారు. తక్కువ ఖర్చులో అవసరమైనవన్నీ ఇక్కడ లభిస్తాయి. అందుకే సగటు అమెరికన్లు ఏడాదిలో కనీసం 30 రోజులు ప్రయాణాల్లో ఉంటారట.! --వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో తప్పకుండా చూడాల్సిన అయిదు ఏంటంటే?) -
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్ జగన్ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి -
Anupama Parameswaran : ఫ్రెండ్స్తో ట్రిప్కు చెక్కేసిన కేరళ కుట్టి (ఫోటోలు)
-
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
Janhvi Kapoor Paris Holiday: పారిస్లో చిల్ అవుతోన్న దేవర భామ జాన్వీ కపూర్! (ఫొటోలు)
-
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్లోని అరుణాచల్ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
భద్రకాళి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు..
తిరువనంతపురం: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. గత బుధవారమే విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరింది. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్.. కేరళ, తిరువనంతపురంలోని పౌర్ణమికవు-భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని అమ్మవారికి ప్రార్థనలు చేశారు. #WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb — ANI (@ANI) August 27, 2023 'చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని మనకు ఉంది. అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి.. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం' అని సోమనాథ్ అన్నారు. బుదవారం భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో లిఖించతగ్గ రోజుగా మారింది. చంద్రునిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించాం. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్గా కూడా పేరుపెట్టారు ప్రధాని మోదీ. చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదీ చదవండి: మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
OceanGate: మళ్లీ ఛలో టైటానికా? సిగ్గుండాలి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్వాటర్ టూరిజం కంపెనీ ఓషన్గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్తో మళ్లీ ఊదరగొడుతోంది. అట్లాంటిక్లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్గేట్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్లోనా? మరేయిత సబ్మెర్సిబుల్లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్ను తొలగించింది ఓషన్గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్ల తరహా రిమోట్కంట్రోల్తో టైటాన్ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు! -
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్
అనంతపురం డెస్క్ : మనం బైక్పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్ బాలు. ఆసక్తే ముందుకు నడిపించింది.. బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్ సర్వీస్ సెంటర్తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు. సెకండ్ హ్యాండ్ బైక్పై యాత్ర బాలు లడఖ్ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్ హ్యాండ్ బైక్ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్, నాగపూర్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్, అమృత్సర్, జమ్మూ, చీనాబ్ బ్రిడ్జ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లడఖ్ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్ప్రదేశ్ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్నాథ్కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్ చానెల్ (బాలు సన్రైజ్ ట్రావెలర్)లో అప్లోడ్ చేశాడు. ఆదుకున్న జవాన్లు ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్ వద్ద (కార్గిల్కు సమీపంలో) మైనస్ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్లైన్లో డబ్బు పంపి ఆదుకున్నారు. ఎవరెస్ట్కు వెళ్లాలనుంది నాకు బైక్ రైడింగ్తో పాటు ట్రెక్కింగ్ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్ వెళ్లేవాడిని. ఎవరెస్ట్ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్ఘర్, కార్గిల్ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్ బార్డర్ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల -
క్రికెట్ దిగ్గజాలతో రోడ్ ట్రిప్
సాక్షి, చెన్నై: క్రికెట్ దిగ్గజాలు సచిన్, అనిల్ కుంబ్లే, యువరాజ్తో గో ఫర్ రోడ్ ట్రిప్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని స్పిన్నీ వ్యవస్థాపకుడు నీరజ్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఈ కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఐపీఎల్– 2023 సీజన్లో భాగంగా మే 28వ తేదీ వరకు జరిగే మ్యాచ్లలో అభిమానులు తమ జట్లను ప్రోత్సహించే విధంగా చేసే వినూత్న అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. గో ఫార్ ఫర్ యువర్ స్క్వాడ్ అన్నది స్పిన్నీ ఎస్యూవీ ద్వారా రోడ్ ట్రిప్లో క్రికెట్ అభిమానులను భాగస్వామ్యం చేస్తామన్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా అభిమానులు భాగస్వాములు కావచ్చునని పిలుపు నిచ్చారు. -
విజయ్ దేవరకొండ తల్లిని ఏడిపించేసిన రౌడీ ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్స్టేటస్ అందుకున్న విజయ్ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసిన విజయ్ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఓ స్పెషల్ వీడియోను షేర్చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి హంపి ట్రిప్కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్ హాలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ చేయడం విశేషం. -
ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ
సాధారణంగా ఇండియాలో వేసవికాలంలో విహారయాత్రలకు వెళ్తారు. కానీ హీరోయిన్లు మాత్రం వర్షాకాలంలో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నవ దంపతులు విఘ్నేష్ శివన్, నయనతార ఇప్పటికే స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తుండగా సాక్షి అగర్వాల్ వంటి కొందరు హీరోయిన్లు కూడా విదేశాల్లో గడిపేస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రియా భవాని శంకర్ చేరింది. ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. కోలీవుడ్లో బిజీగా ఉన్న బ్యూటీ ఈమె. యువ హీరోలు, నవ హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జతకట్టేస్తోంది. పాత్రల పరిధి కూడా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని రెండు చేతులా సంపాదించుకునే పనిలో పడింది. అలా ఇటీవల ధనుష్ సరసన నటించిన చిత్రం తిరుచిట్రంపలం. ఇందులో ఒక పాట రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఈ అమ్మడు కనిపిస్తుంది. అయినా చిత్ర విజయం సాధించడంతో అందులో తానున్నాననే క్రెడిట్ కొట్టేస్తోంది. బిజీ షెడ్యూల్లోనూ రిలీఫ్ కోసం తన ప్రియుడు రాజవేల్తో కలిసి వారం క్రితం విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసింది. ట్రైనర్ సహాయంతో హెలీకాప్టర్ నుంచి పారాచ్యూట్ ద్వారా కిందికి దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జయం రవికి జంటగా అఖిలన్, ఎస్జే సూర్య సరసన బొమ్మై, శింబుతో పత్తు తల, రుద్రన్ అనే మరో చిత్రంలో నటిస్తున్న ప్రియా భవాని శంకర్ త్వరలో ఇండియన్–2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. చదవండి: (మాజీ బాయ్ప్రెండ్తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్) -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
క్యాబ్స్లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్ !
ప్రముఖ మొబిలిటీ ప్లాట్ఫాం ఉబర్ తాజాగా క్యాబ్ సర్వీసుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ప్రకటించింది. సీఎన్జీ ధరల పెంపు..! దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ క్యాబ్ సర్వీసులు అధిక సంఖ్యలో నడుస్తాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రయాణ ఛార్జీలను 12 శాతం మేర పెంచుతున్నట్లు ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది.కొద్ది రోజల క్రితమే ముంబై, హైదరాబాద్లో క్యాబ్ సర్వీసుల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్యాబ్ డ్రైవర్లు ధరలను పెంచాలని నిరసనలు కూడా చేపట్టారు. ఇక రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఆయా క్యాబ్ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇలాగే ఇంధన ధరలు పెరిగితే క్యాబ్ సర్వీసుల ధరలు పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఏసీ ఆన్ చేస్తే వాతే..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. చదవండి: క్యాబ్స్లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
మాల్దీవుల్లో ప్రియుడితో రచ్చచేస్తున్న మలైకా అరోరా
సెలబ్రిటీలు, ప్రేమికులు ఎక్కువగా మాల్దీవులు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. వారికి ఏమాత్రం సమయం దొరికినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ ప్రేమజంట.. మలైకా అరోరా, అర్జున్ కపూర్లు కూడా మాల్దీవులకు వెళ్లారు. వారు సరదాగా గడిపిన క్షణాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా తీశారు. మలైకా అరోరా తన ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగడమే కాక అక్కడ సైక్లింగ్ కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ఈ జంట 2018 నుంచి డేటింగ్లో ఉంది. మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో టెరెన్స్ లూయిస్, గీతాకపూర్తో కలిసి జడ్జిగా వ్యవహరించారు. అంతేకాకుండా చయ్యా.. చయ్యా పాట.., మున్నీ బద్నాం హుయ్ డార్లింగ్ తేరే లియే, అనార్కలీ డిస్కో చాలీ పాటల్లో హుషారైన స్టెప్పులతో ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. మిలింద్ సోమన్, అనూశా దండేకర్లతో కలిసి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు. అర్జున్ కపూర్.. సైఫ్ అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్లతో కలిసి హరర్ కామెడీ మూవీ భూత్ పోలీస్, సందీప్ ఔర్ పింకీ ఫరార్ లో నటించారు. గతేడాది కృతి సనన్, సంజయ్ దత్లతో కలిసి పీరియాడిక్ డ్రామా పానిపట్లోనూ నటించారు. -
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సమంత
-
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్
Samantha Char Dham Yatra: సమంత చార్ధామ్ యాత్ర ముగిసింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఇక యమునోత్రి నుంచి మొదలైన చార్ధామ్ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అక్కడి ఎన్నో విశేషాలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అక్కడ స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చార్ ధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని సామ్ పేర్కొంది. చదవండి: కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్పై ట్రోలింగ్ -
నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత
Samantha Char Dham Yatra: స్నేహితురాలితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన సమంత ట్రిప్ ముగిసింది. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. 1968నాటి మహేశ్ యోగి ఆశ్రమానికి సైతం వెళ్లిన సమంత అక్కడి విశేషాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బెస్ట్ఫ్రెండ్తో కలిసి సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్ ఇక చార్ధామ్ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్ చేస్తూ.. 'మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను ఏది అయితే ఆశించానో అది జరిగింది. నా హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది' అని తెలిపింది. సామ్ పోస్టుకు వెంకటేశ్ కూతురు ఆశ్రిత సైతం స్పందించింది. బాలీవుడ్ నటి కంగనా కూడా వావ్ అంటూ కామెంట్ చేసింది. కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం తీవ్ర మనోవేదనలో ఉన్న సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలను సందర్శిస్తున్నట్లు సమాచారం. గతాన్ని మర్చిపోయి త్వరలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. సమా్ నటించిన శాకుంతలం, కాతువాకుల రెండు కాధల్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. చదవండి: యూట్యూబ్ ఛానల్స్పై సమంత కేసు.. తీర్పు వాయిదా 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బెస్ట్ఫ్రెండ్తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత
Samantha Spiritual Trip With friend Shilpa Reddy: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన బెస్ట్ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డితో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేసుకుంది. చార్ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటూ సామ్తో దిగిన ఫోటోలను పంచుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సామ్ మానసికంగా కుంగిపోయినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఆ బాధలోంచి బయట పడేందుకు సమంత ఎక్కువగా తన బెస్ట్ ఫ్రెండ్స్తో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) -
తాప్సీకి మాల్దీవులు స్పెషల్ ట్రిప్!
ఆరునెలలుగా దాదాపు ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలందరూ ఇప్పుడిప్పుడే కాలు బయటపెడుతున్నారు. కొంతమంది షూటింగ్స్లో పాల్గొంటుండగా మరికొందరు విహార యాత్రలకు వెళుతున్నారు. హీరోయిన్ తాప్సీ మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. తన చెల్లెలు షగున్, వేరే స్నేహితులతో కలసి వెళ్లారామె. అయితే ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా వెళ్లారని తాప్సీ షేర్ చేసిన ఫొటోలు స్పష్టం చేశాయి. ఆ వ్యక్తి మతియాస్ బో. డెన్మార్క్కి చెందిన ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో తాప్సీ ప్రేమలో ఉన్నారనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. సో.. ఇది తాప్సీకి స్పెషల్ ట్రిప్ అని చెప్పొచ్చు. అయితే మతియాస్తో తన రిలేషన్ గురించి తాప్సీ పెదవి విప్పడంలేదు. -
మేక్ మై ట్రిప్ ‘షార్ట్ స్టేస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ ‘షార్ట్ స్టేస్’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయ బోతోంది. సాధారణంగా ఏ హోటల్కు వెళ్లినా గది అద్దె 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్ స్టేస్ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్ మై ట్రిప్ ఇండియా హోటల్స్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరిక్షిత్ చౌదరి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. పైలట్ విజయ వంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందు బాటులోకి తెస్తామని వెల్లడించారు. చార్జీ ఒక రోజుతో పోలిస్తే నాలుగు గంటలకు 20–30 శాతం ఉంటుందని చెప్పారు. కస్టమర్తోపాటు హోటల్ యజమానికి కూడా ఈ విధానం కలిసి వస్తుందని వివరించారు. -
పరీక్ష రాసే అభ్యర్థులకు బస్సులో ఉచితం
మెదక్ జోన్: పదవ తరగతి పరీక్షలు ఈ నెల 15(నేటి) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తునట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రీ బస్పాస్ కానీ లేదా సబ్సిడీతో కూడిన బస్పాస్ కానీ కచ్చితంగా ఉండాలని చెప్పారు. అలాంటి విద్యార్థు«లను మాత్రమే ఉచితంగా బస్సుల్లో తీసుకెళతారన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వద్దకు, మధ్యాహ్నం పరీక్షలు ముగిశాక మళ్లీ ఇంటివరకు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. జిల్లాలో 11,258 మంది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్ టికెట్తో పాటు బస్ పాస్ను సైతం వెంటతీసుకుని రావాలని ఆయన చెప్పారు. పరీక్షలు అయ్యేంత వరకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో సైతం ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. -
గెలిస్తే ఉచితంగా జెరూసలేం యాత్ర
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపిస్తామంటూ నాగాలాండ్లో బీజేపీ ఎన్నికల హామీని ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే కావడంతో బీజేపీ ఈ హామీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే మేఘాలయలోనూ 75% జనాభా క్రైస్తవులే. దీంతో ఈ హామీని బీజేపీ నాగాలాండ్కు మాత్రమే పరిమితం చేస్తుందా లేక అన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా లేక దేశంలోని క్రిస్టియన్లకందరికీ అవకాశమిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ముస్లింలకు హజ్ యాత్ర రాయితీని కేంద్ర ప్రభు త్వం గత నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు క్రైస్తవులను మాత్రం ఉచితంగానే జెరూసలేంకు పంపిస్తామని బీజేపీ హామీనివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
ట్రంప్ కార్డ్
-
ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా..?
వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి గార్లదిన్నె : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి పేర్కొన్నారు. వైఎస్సార్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాపరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం మండల వ్యాప్తం గా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో సమావేశాలు నిర్వహిం చారు. కొప్పలకొండలో డీఇఓ అంజయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణయాత్రకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూఉపాధ్యాయ సాహర్థ్య పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్టీఎఫ్ పని చేస్తుందని తె లిపారు. వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి , వైఎస్సార్టీఎఫ్ జిల్లా నాయకులు అజీమొద్దీన్, పవన్కుమార్, శివప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ ఐదో యూనిట్లో అంతరాయం
ఆరవ యూనిట్లో వార్షిక మరమ్మతులు జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆరో యూనిట్లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో 2600 మెగావాట్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. -
లోకం చుట్టిన వీరులు...118 కోట్లు
పర్యాటకం ఎందరికో ఓ అనుభూతి. అవకాశం చిక్కాలే గానీ ఓ ట్రిప్ వేసేద్దాం గురూ..అంటూ కొందరు పిల్లా,జల్లను వెంటేసుకు దేశాలు తిరిగితే..ఇంకొందరు అధ్యయనమే మహాభాగ్యమంటూ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతుంటారు. విశేషాలను ప్రోదిచేసుకొని ట్రావలోకంలో విహరిస్తారు. కొత్తకొత్త విశేషాలను తెలుసుకొని ఆహో ప్రపంచమెంత అద్భుతం అంటూ మురిసి పోతుంటారు. ఈ సరదా అన్ని దేశాల్లోనూ సహజమే అయినా అమెరికన్లకు, యూరప్ ,తదితర దేశాల వారికి టూరిజం అంటే భలే మోజట. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టురాయుళ్ల లెక్కలను యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నిగ్గుతేల్చింది. దేశాల్ని చుట్టే పర్యాటకుల సంఖ్య 2014తో పోలిస్తే 2015లో 4.4శాతం పెరిగిందట. ఇలా గతేడాది అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 118 కోట్లుగా నమోదైందట. -
ఎన్టీపీసీ ఐదవ యూనిట్ ట్రిప్
కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ఐదవ యూనిట్ మంగళవారం ఉదయం ట్రిప్ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యే కారణమని అధికారులు తెలిపారు. మరోవైపు 500 మెగావాట్ల నాల్గవ యూనిట్లో వార్షిక మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇక్కడి ఎన్టీపీసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 1600 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. -
కోటను చూడ్డానికివచ్చి...
ఫ్రాన్స్: ఫ్రాన్స్లోని చారిత్రాత్మక కోట ను చూడ్డానికి వచ్చిన ఓ జంట దుర్మరణం చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ లో ప్రసిద్ధి చెందిన వాబెన్ కోటను చూడటానికి ఓ జంట అక్కడికి వచ్చింది. కోటను చూసే క్రమంలో వారు నాలుగో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ మరునాడు ఉదయం ఇద్దరి శవాలునీటిలో తేలాయి. సుమారు నలభై అడుగుల ఎత్తుమీదినుంచి పక్కనే ఉన్న కొలనులో పడి ఉండటంతోనే వారు మరణించి ఉండవచ్చనే అనుమానిస్తున్నారు. దీనితో ఆ జంటకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ ముప్పయి సంవత్సరాల లోపు వయసుంటుదని భావిస్తున్నారు.ఆంగ్లేయుల దాడినుంచి రక్షించుకునేందుకు వీలుగా 1866లో నెపోలియన్ -3 ఈ కోటను నిర్మించారు. -
నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్
మహబూబ్నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేడు జిల్లాకు రానున్నారు. మురికివాడల్లో స్థితిగతులు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడి ప్రజలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇదివరకు రెండుమార్లు వచ్చినప్పటికీ.. ఈ సారి మాత్రం మురికివాడల్లో విస్తృతంగా పర్యటన చేపట్టనున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ టీకె శ్రీదేవి మహబూబ్నగర్ పట్టణంలోని పలు మురికివాడల్లో ఉదయం 5గంటల నుంచే పర్యవేక్షించి సమస్యలు గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు ఏం వరాలు ఇస్తారోనని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్పై గోప్యత... ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. కార్యక్రమంపై సీఎం కార్యాలయం నుంచే స్పష్టత లేదని పేర్కొంటున్నారు. అయితే సీఎం మాత్రం మహబూబ్నగర్ పట్టణంలోని నాలుగు మురికి వాడలను సందర్శించే అవకాశం ఉంది. సీఎం పర్యటన ఇలా..? సీఎం పర్యటన వివరాలు అధికారులు ప్రకటించనప్పటికీ ఆయన పర్యటన ఇలా ఉండే అవకాశం ఉంది. మొదటగా సీఎం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మహబూబ్నగర్కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల వరకు ఆర్అండ్బీ అథితిగృహానికి చేరుకుంటారు. అక్కడ మంత్రులు, జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా మురికివాడల్లో పర్యటించనున్నారు. మున్సిపాలిటీల్లోని నాలుగు మురికి వాడల్లో పర్యటనకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత పాలమూరు, వీరన్నపేట, పాతతోట(కూరగాయల మార్కెట్), టీడీగుట్ట ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. మొదటగా మధ్యాహ్న సమయంలోపు రెండువాడల్లో పర్యటించేలా అధికారులు ప్రణాళిక రచించారు. లంచ్ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. సీఎం పర్యటించే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం తేనీటి విందు తర్వాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం అక్కడే మళ్లీ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించనున్నారు. అధికారుల అప్రమత్తత..! సీఎం కేసీఆర్ జిల్లాలో నేరుగా సమస్యల పై దృష్టి సారించనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో తలెత్తిన ఇబ్బందులు పునారావృతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుల చిట్టాను పక్కాగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్కార్డులు, పింఛన్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా సరిచూసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులు సమీక్షలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు. తాగునీరు, ఇళ్లు, రహదారులు, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యలపై ప్రణాళికలు రచించారు. వీటితో పాటు విలీన పంచాయతీల్లో సమస్యలపై ప్రత్యేక నోట్ తయారు చేశారు. పనులను అడ్డుకున్న స్థానికులు.. సముదాయించిన కలెక్టర్ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పనులు చేసేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రధానంగా పాత పాలమూరులో పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఇన్నాళ్లు తమను పట్టించుకోని వారు ఇప్పుడు సీఎం వస్తున్నారని ఇవన్నీ చేస్తున్నారా... మా సమస్యలు సీఎంకు చూపిద్దామనుకుంటే.. ఇప్పుడు పనులు చేసి అంతా బాగున్నట్టు చెప్పుదామని చూస్తున్నారా’ అంటూ ఘర్షణకు దిగారు. దీంతో కలెక్టర్ శ్రీదేవి వారిని సముదాయించారు. కౌన్సిల్ జాబితా సిద్ధం... సీఎం ప్రత్యేకంగా మున్సిపల్ సమస్యలపైనే వస్తుండడంతో మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ చిట్టాపద్దును తయారు చేసుకుంది. పట్టణ ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ అధ్యక్షతన కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమై జాబితా సిద్ధం చేశారు. ప్రధానంగా మహబూబ్నగర్ చుట్టూ ఔ టర్ రింగ్రోడ్డు, అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణంతో పాటు విలీన గ్రామ పంచాయతీల్లో తాగునీటి సౌకర్యం, ఇదివరకు పట్టణానికి తాగునీ రు సరఫరా చేస్తున్న రామన్పాడు, కోయిల్సాగర్ల నుంచి అదనంగా మరో పైపులైన్, పట్టణంలోని పలు ప్రాంతాల గుం డా రైల్వేలైన్లు ఉన్నందున ఆయా ప్రాం తాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పార్కుల ఏ ర్పాటు తదితర వాటితో మొత్తం రూ.500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. -
4వ రోజూ కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. -
మంచుకొండలలో...భక్తిధామాలు
మంచు దుప్పటి కప్పుకున్న హిమగిరులు భానుని కిరణాల స్పర్శతో మేలుకునే వేళ... వడివడిగా ఉరకలెత్తే నదీ నదాలు కొండల మీదుగా దుమికే వేళ... ఆ లోయలలోని సౌందర్యాలను కనుల నిండుగా నింపుకోవాల్సిందే! భక్తికి, ముక్తికి సోపానమయ్యే హరిహరాదుల ఆలయ సందర్శన వేళ... అడుగడుగునా ఆధ్యాత్మికత సౌరభాలు ప్రతి మదినీ తాకుతున్న వేళ... ఆ ఆనందాన్ని మది నిండుగా నింపుకోవాల్సిందే! చార్ధామ్... జీవిత కాలంలో ఒక్కసారైనా చేసితీరాలని ప్రతి హిందువూ కోరుకునే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్లను దర్శించుకొని, తరించాలని తపించే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. మే నెల నుంచి నవంబర్ వరకు అనుమతించే ఈ యాత్రకు కిందటి నెలలోనే సింహద్వారాలను తెరిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వైశాఖమాసం శుక్లపక్షం అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మరో రెండు ప్రసిద్ధ దేవస్థానాలైన కేదార్నాథ్, బదరీనాథ్లను కూడా కిందటి నెల 4, 5 తేదీల్లో తెరిచి, పూజలు నిర్వహించారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిరుడు ప్రకృతి విపత్తు మూలంగా చార్ధామ్ యాత్ర పర్యాటకులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ విషాదం నుంచి తేరుకొని, తిరిగి యథావిధిగా యాత్రకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థలు సైతం యాత్రికులకు సౌకర్యాల కోసం కృషి చేస్తున్నాయి. గత ఏడాది విపత్తు ఎలా జరిగింది? ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టింది? అనే ఉత్సుకతతోనూ, ప్రకృతి రామణీయకతను ఎద నిండా నింపుకోవడానికి వేల సంఖ్యలో ఈ యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ నాలుగు ధామాల గురించిన సమాచారం తప్పక తెలుసుకోవాలి. ఉత్తరకాశీ నుంచి ఈ యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా వెళ్లి బదరీనాథ్తో పూర్తవుతుంది. చాలామంది హరిద్వార్తో ఈ యాత్రను ప్రారంభిస్తారు. మన రాష్ట్రం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఢిల్లీ నుంచి లేదా రిషీకేశ్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకు పర్యాటకరంగం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ప్రైవేటు టూరిస్టులు కూడా తమ సర్వీసులను నడుపుతున్నారు. ముందుగా యమునోత్రి.. ఉత్తరాఖండ్ గర్హ్వాల్లో ఉన్న యమునోత్రికి డెహ్రాడూన్ మీదుగా వెళ్లాలి. యమునోత్రి సముద్రమట్టానికి 3164 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరకాశికి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం మరో 7 కి.మీ దూరంలో ఉందనగా జానకీ చట్టి అనే ప్రాంతం దగ్గర వాహనాలు నిలుపుతారు. ఇక్కడ నుంచి కాలినడకన లేదా గుర్రం మీద లేదా డోలీలో గానీ వెళ్లాల్సి ఉంటుంది. ఉష్ణం, చలితో కూడిన మధ్యస్థమైన వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. యమునోత్రి నుంచి 130 కి.మీ ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు. తదుపరి గంగోత్రి... గంగోత్రి సముద్రమట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడ గంగను హిమనీనదంగా పిలుస్తారు. ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని17 కి.మీ దూరం కాలినడకన వెళ్తే గోముఖం ఉంటుంది. ఇక్కడే గంగామాతను భగీరథిగా పేర్కొంటారు. ఇక్కడ నుంచి అలకనందా నదితో కలిసిన చోటు నుంచి గంగానదిగా పిలుస్తారు. జ్యోతిర్లంగం... కేదార్నాథ్ ఉత్తరకాశీ నుంచి తెహ్రీ డ్యామ్ మీదుగా గౌరీకుండ్కు చేరుకొని, అక్కడి నుంచి 14 కి.మీ దూరం కాలినడకన, గుర్రం లేదా డోలీలో కేదార్నాథ్ చేరుకోవచ్చు. శివుడి పన్నెండో జ్యోతిర్లంగం ఉన్న మందిరమే కేదార్నాథ్. హిమాలయ పర్వత శ్రేణులలో సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో మూడు కొండల మధ్య వెలసింది ఈ ఆలయం. మూడు కొండల నుంచి మూడు నదులు కిందికి వచ్చి కలిసిపోయి ఒకే నదిగా మారిపోయే దృశ్యం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. మందాకినీ నది ఒడ్డున వెలసిన కేదార్నాథ్ ఆలయం అత్యంత చీకటిగా ఉంటుంది. దీపం వెలుగులోనే శివుడి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో పాండవులతో పాటు ద్రౌపది విగ్రహం కూడా ఉంది. కేదార్నాథ్ దగ్గర దాదాపు వెయ్యి మంది యాత్రికులు ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. లించోలిలో హెలిప్యాడ్తో పాటు బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కేదార్నాథ్ నుంచి 75 కి.మీ కిందకు దిగి, అక్కడ నుంచి బద్రీనాథ్ ఆలయం చేరుకోవడానికి హిమాలయాల పైకి వెళ్లాలి. రేగుపండు... బదరీనాథ్... కేదార్నాథ్ నుంచి బదరీనాథ్ ఆలయానికి 203 కి.మీ దూరం ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ఇది. సముద్రమట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బదరీ అంటే రేగుపండు. నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలసిన దేవునికి బదరీనాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాల సమస్త దేవతలు నివసిస్తారని హిందువుల నమ్మకం. చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో అలకనందా నది ఒడ్డున, గఢ్వాల్ కొండలలో కేదార్నాథ్కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది బదరీనాథ్ ఆలయం. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లలో ఇది మొదటిది. బదరీనాథ్ మార్గంలో హిమాలయాల మధ్య ఓ అందమైన పూలవనం ఉంది. దీన్నే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. జోషీ మఠ్, అలకనందా నదిపై జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు. పటిష్ఠమైన భద్రత మధ్య ప్రయాణం పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత హిమాలయపర్వత శ్రేణులలో నమోదవుతుంది. యాత్ర మధ్యలో ఒక్కోసారి కొన్ని గంటల పాటు ప్రయాణానికి వీలుపడదు. అకస్మాత్తుగా అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పటిష్టమైన చర్యలను చేపట్టింది. ప్రయాణికుల అనారోగ్య సమస్యలను తీర్చడానికి మార్గమధ్యంలో ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా భక్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. వాతావరణ హెచ్చరికలు వారికి ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఇటీవల యాత్ర మొదలైన రెండు రోజులకే మంచు చరియలు విరిగిపడి కొన్ని రోజులు యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే మరిన్ని రక్షణ చర్యలను తీసుకొని యాత్రను పునరుద్ధరించారు. చార్ధామ్ యాత్రను సఫలం చేయడానికి గౌరీకుండ్, కాశీపూర్, రుద్రపూర్, భవాలీ, నైనిటాల్, హల్ద్వానీ డివిజన్లలో వందలాది మంది గాంగ్మెన్లు, కూలీలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. శ్రామికులతో పాటు రోలర్, టిప్పర్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లేదారిలో స్వచ్చంద సంస్థలు వెయ్యిమంది యాత్రికులకు సరిపడా భోజనవసతి కల్పించడానికి ముందుకు వచ్చాయి. హిమాలయ ప్రాంతాల్లో వర్షం, మంచు కురియడం వల్ల ఎప్పుడైనా రోడ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వెంట ఇవి తప్పనిసరి యాత్రికులు తమ వెంట అవసరమైన మందులు, బ్లాంకెట్స్, స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, శాలువా, రెయిన్కోట్, స్పోర్ట్ షూస్, టార్చ్లైట్.. తీసుకెళ్లాలి. - సాక్షి విహారి టూరు ప్యాకేజీ వివరాలు... స్వర్గధామంగా పేర్కొనే చార్ధామ్ యాత్రకు మన రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులు ఢిల్లీ, రిషీకేష్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకోసం పర్యాటకరంగం టూర్ప్యాకేజీలను అందిస్తోంది. రిషీకేష్ నుంచి యమునోత్రి -గంగోత్రి- కేదార్నాథ్ - బద్రీనాథ్ వెళ్లి... తిరిగి రిషీకేష్ చేరుకోవడానికి 10 రోజుల యాత్రకు... మే-జూన్ వరకు గాను ఒక్కొక్కరికి పెద్దలకు రూ.16280/-, పిల్లలకు రూ.15600/-, వృద్ధులకు రూ.15260/- చెల్లించాల్సి ఉంటుంది. జూలై - నవంబర్ యాత్రకు పెద్దలకు రూ.14670/-, పిల్లలకు రూ.14050/-, వృద్ధులకు రూ.13750/- చెల్లించాలి. మరిన్ని వివరాలకు: బాలయోగి పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్, ఫోన్ నెంబర్: 040-23409945, 23400254, మొబైల్ నెం: 09493982645, email: gmvnhyderabad@gmail.com లలో సంప్రదించవచ్చు. ప్రకృతి రామణీయకత... వేసవిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది కనుక వేడికి హిమపాతం తగ్గుముఖం పడుతుంది. దీంతో కొండలు, లోయలు, చెట్లు, నదులు, ప్రవాహాలు.. అడుగడుగునా మనల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. ప్రకృతి ప్రేమికులు ఈ యాత్రను ఎంతగానో ఆనందించవచ్చు. ఇందుకోసమే ఎందరో విదేశీయాత్రికులు ప్రతియేటా చార్ధామ్ యాత్రకు వస్తుంటారు. -
మంచుకొండల్లో...పట్టపగలే పండు వెన్నెల
యాత్ర హిమాలయ పర్వతశ్రేణులలో విహారం... గడ్డకట్టిన సరస్సులో నడక.. పువ్వుల తివాచీ కప్పుకున్న కొండ ప్రాంతాలు... కార్గిల్ విజయ్ఘాట్లో వందనం.. ఇన్ని అద్భుతాలను చూసే అదృష్టం కలిసి వస్తే..! ఆ పర్యటన జీవితాంతం మరపురాని మధురానుభూతి. కార్గిల్, లడఖ్ ప్రాంతాల సందర్శన జీవితకాలపు జ్ఞాపకం అని వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులు ముసునూరు రాజేశ్వరి... ‘ముంబయ్లో ఉంటున్న స్నేహితురాలి నుంచి కార్గిల్, లడఖ్ ప్రయాణ కబురు అందగానే నేనూ ‘గురుద్వారా గ్రూప్’లో మెంబర్గా చేరిపోయాను. అందులో భాగంగానే కిందటేడాది జూలై నెలలో హైదరాబాద్ నుంచి ముంబయ్ వెళ్లాను. అక్కడ నుంచి ‘గురుద్వారా గ్రూప్’ వంద మందితో కలిసి జమ్ము తావి ఎక్స్ప్రెస్లో 26 గంటలు ప్రయాణించి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న చక్కీబాంక్ రైల్వేస్టేషన్లో దిగాను. జమ్మూ కన్నా ముందు రైల్వే స్టేషన్ అది. అక్కడ ముందే ట్రావెల్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన పది మినీ బస్సులలో మా గ్రూపు సభ్యులు సర్దుకున్నారు. అటు నుంచి గంట ప్రయాణించాక మధ్యలో భోజన ఏర్పాట్లు. ఆ ప్రదేశంలో... చుట్టూ మంచు కొండలు... వాటి మధ్య నుంచి నీటి పాయలు... చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అక్కడ నుంచి బయల్దేరి జమ్మూకు 112 కిమీ దూరంలో ఉన్న పట్నీటాప్ చేరుకున్నాం. హోటల్లో బస. మర్నాడు ఉదయం లేచి చూస్తే... హిమాలయాల పర్వత శ్రేణి పొగమంచు తెరలు తెరలుగా కదిలిపోతోంది. పచ్చని చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆనందిస్తూనే బస్సులలో బయల్దేరాం. మధ్యలో అమరనాథ్ యాత్రికుల కోసం భోజనాలు పెట్టే గుడారాలు లెక్కలేనన్ని కనిపించాయి. అనంత్నాగ్ దాటి ఆ సాయంత్రానికి శ్రీనగర్ చేరాం. రాత్రి అక్కడే బస చేసి మరునాటి ఉదయం కార్గిల్కు బయల్దేరాం. మధ్యలో సోనామార్గ్ వద్ద ఆగాం. మంచు కొండలలో... సోనామార్గ్! ‘బంగారు మైదానం’గా సోనామార్గ్కు పేరుంది. దూరం నుంచి మంచు కొండలు వెండికొండల్లా మెరిసిపోతుండగా, కింద ప్రవహిస్తున్న సింధు నదిలో పడవలు పరుగులు పెడుతున్నాయి. సోనామార్గ్లో హిమాలయ సరస్సులు నాలుగుకు పైగా ఉన్నాయి. సరస్సులోని చల్లటి నీటిలోకి వెళ్లి కాసేపు, ఆ రాళ్లపై కాసేపు విహరిస్తూ ఫొటోలు తీసుకున్నాం. భోజనాల అనంతరం కార్గిల్కు మా ప్రయాణం సాగింది. బరువెక్కిన హృదయం... కార్గిల్ విజయ్ఘాట్! సాయంత్రం కార్గిల్కు వెళ్తుండగా, మధ్యలో విజయ్ఘాట్ వచ్చింది. ‘జూలై 26 - విజయ్ దివస్’ చేరువలో ఉండడంతో అక్కడ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అక్కడే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ఫలకాలు వందల సంఖ్యలో కనిపించాయి. వాటిని చూస్తూ, బరువెక్కిన హృదయాలతో మేం కదులుతుండగా ‘ఆవేదన చెందకండి, మీ ఆశీర్వాదం మాకివ్వండి చాలు’... అంటున్న ఆ జవాన్లకు నమస్కరించాం. రెయిన్ బో కలర్స్ - పెంగ్విన్ లేక్ మరునాడు మధ్యాహ్నం లేహ్ సిటీకి చేరుకున్నాం. అక్కడ కాసేపు వర్షం, చలి, ఆ వెంటనే మండే ఎండ. రోజంతా వాతావరణం ఇలాగే ఉంటుంది. లేహ్కు 140 కిమీ దూరంలో ఉన్న పాంగాంగ్కు మరునాడు బయల్దేరాం. దీన్నే ‘పెంగ్విన్ లేక్’ అని కూడా అంటారు. చైనా, భారతదేశ సరిహద్దుల్లో ఈ సరస్సు ఉన్నందున తప్పనిసరిగా మన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది. అయిదు గంటలు ప్రయాణించి పెంగ్విన్ లేక్ చేరుకున్నాం. అద్భుతం... సరస్సు ముందుభాగంలో ఐదు కిలోమీటర్ల వరకు మంచు గడ్డ కట్టుకుని ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మంచు నెమ్మదిగా కరుగుతుంది. మళ్లీ రాత్రి ఎనిమిది గంటల వరకు గడ్డకడుతుంది. కనుక, లేహ్ సిటీ నుంచి ఈ సరస్సుకు వెళ్లాలనుకునేవారు ఉదయం 4 - 5 గంటల మధ్యన బయలుదేరితే అటు మంచును, ఇటు రంగులు మారే నీటిని చూసి ఆనందించ వచ్చు. మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ సరస్సు సందర్శనకు అనువైన సమయం అని గైడ్ తెలిపారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత.. వలస పక్షులు. పెంగ్విన్ పక్షుల సందడి అబ్బురమనిపించింది. బహుశా వీటి వల్లే ఈ సరస్సుకు పెంగ్విన్లేక్ అని పేరు వచ్చి ఉంటుంది. లేహ్ - గురుద్వారా లే్హ సిటీకి పాతికమైళ్ల దూరంలో పత్తర్ సాహెబ్ గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా కూడా మిలటరీ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మూడోరోజు గురుద్వారాను దర్శించుకుని అక్కడ వారు పెట్టిన భోజనాన్ని స్వీకరించి, మళ్లీ కార్గిల్కు తిరుగు ప్రయాణమయ్యాం. కార్గిల్లో బ్రేక్ జర్నీ చేసి సోనామార్గ్ ద్వారా శ్రీనగర్కు వెళ్లాం. మరునాడు మళ్లీ శ్రీనగర్ నుంచి అమృతసర్కు ప్రయాణించి మూడో రోజు ముంబయ్ చేరుకున్నాం. అలా మొత్తం 20 రోజుల మా ప్రయాణానికి ముందుగా మేము చెల్లించిన రూ.18వేలు కాక, మరో ఆరు వేల రూపాయలు అదనంగా ఖర్చయ్యాయి. వెలకట్టలేని ప్రకృతి అందాలు, ప్రయాణానుభూతులు జీవితాంతం మిగిలిపోయే కానుకలయ్యాయి. పువ్వుల తివాచీ... గుల్మార్గ్! శ్రీనగర్ నుంచి 52 కిమీ దూరంలోని గుల్మార్గ్లోని కొండప్రాంతమంతా చామంతుల ను పోలి ఉండే తెల్లటి పువ్వులతో పట్టపగలే వెన్నెలను తలపించింది. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తై రెండో కేబుల్కార్లో కంగ్డూరీ పర్వతంపైకి వెళ్లాం. వెళ్తున్నంతసేపు మంచు నిండి ఉన్న కొండప్రాంతాల్లోని అందాలు కనువిందు చేశాయి. -
అనుభూతుల భరిణె!
ప్రముఖ సినీ రచయిత, నటుడు, ‘మిథునం’ చిత్ర దర్శకుడు తనికెళ్ల భరణి ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. ఆయన యాత్రానుభవాలు, అక్కడి విశేషాలు...‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం. దక్షిణాఫ్రికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి, ‘మేము ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం మీ ‘మిథునం’ అక్కడ ప్రదర్శించాలనుకుంటున్నాం. మీరూ, బాలూ గారు వస్తే బావుంటుంది’ అన్నారు. అమెరికా, యూరోపు వెళుతుంటాం కానీ దక్షిణాఫ్రికా వెళ్ళడం తక్కువే అవడంతో ఆ ప్రదేశం, అక్కడి తెలుగు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటో చూద్దామనిపించి, సరే అని ఒప్పుకున్నాను. అలా జనవరి 16న నాతోపాటు ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ ఇషా, మా అబ్బాయి కూడా బయలుదేరారు. వెల్కమ్ టు ఆఫ్రికా... హైదరాబాద్ - బాంబే - నైరోబీ మీదుగా జోహన్స్బర్గ్ చేరుకున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడి తెలుగు అసోసియేషన్ వారు స్వాగతం పలికారు. 17వ తేదీ సాయంత్రం నాతో ముఖాముఖి కార్యక్రమం, 18న అక్కడి లోకల్ థియేటర్లో ‘మిథునం’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాని తర్వాత అరికల్ అనే ఫేమస్ థియేటర్కు వెళ్తున్నామని, అక్కడే పెద్ద సభ ఏర్పాటు చేశామని చెప్పారు వాళ్లు. అరికల్ థియేటర్ ... అన్బిలీవబుల్! పాతకాలం నాటి బిల్డింగులాంటి కాంప్లెక్స్కు చేరుకున్నాం. అక్కడ లాస్వెగాస్లా పెద్ద జూద గృహం, పేకాడేవాళ్ళు, స్లాట్మిషన్ బారు, డాన్సులు కనపడ్డాయి. వాటన్నిటినీ దాటుకుంటూ, పైకి వెళ్తే థియేటర్ కనిపించింది. అది మన రవీంధ్రభారతికి కనీసం రెండింతలైనా ఉంటుంది. ఎప్పుడయినా మన వాళ్ళు అలాంటిది కడతారా, అక్కడ మనం ఓ నాటకం వేస్తే ఎంత బాగుండు అనిపించేలా అద్భుతంగా ఉంది అది! కార్యక్రమం మొదట సౌతాఫ్రికా సాంస్కృతిక మంత్రి రెండు దేశాల సంబంధాల గురించి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. దాని తర్వాత స్టేజీ బద్దలయిపోతుందా? అవి రబ్బర్తో చేసిన శరీరాలా? వాటికి ఎముకలుండవా? అనిపించేలా సౌతాఫ్రికా ‘రబ్బర్ బ్యాండ్’ గ్రూప్ వాళ్లు ఒళ్లు విరిచి చేసిన డ్యాన్సులు అబ్బురపరిచాయి! ఇక ఆ తర్వాత బాలు గారికి ‘జీవన సాఫల్య’ అవార్డు ఇవ్వడంతో ఆరోజు కార్యక్రమం ముగిసింది. ఇండియన్ కల్చరల్ సెంటర్... మర్నాటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ఇండియన్ కల్చరల్ సెంటర్కు వెళ్ళాం. అక్కడ మరాఠీ, కన్నడ తదితర ఆర్టిస్టులు, ముందురోజు ఫెస్టివల్కు వచ్చిన వాళ్లూ వచ్చారు. స్థానిక కళాకారులతో పాటు 50 మందితో ఇంటరాక్షన్ సెషన్తో మొదలై, మోహనకృష్ణ చిత్ర ప్రదర్శనతో ముగిసింది ఆరోజు కార్యక్రమం. కీకారణ్యాన్ని తలపించే రిసార్టులు... కీకారణ్యంలా ఉన్న ఓ రిసార్ట్కి వెళ్లాం. అది తమిళవాళ్లది. నేను పదేళ్ళ పాటు మద్రాసులో ఉండిన వాణ్ణి గనక వెంటనే నేను వారితో తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టాను. వాళ్ళు - ‘సారీ సర్... వియ్ నో ద వోన్లీ వర్డ్ వణక్కం’ అన్నారు. ఎప్పుడో తమ పూర్వీకులు వచ్చి స్థిరపడ్డారట! రిసార్ట్స్లో కొన్ని కార్యక్రమాల అనంతరం విశ్రాంతి తీసుకున్నాక, అక్కడి నుంచి ఆఫ్రికన్ సఫారీకి వెళ్లాం. వందల ఎకరాలలో సఫారీ... ఆ అడవి స్థలం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాలు. పెద్ద చెట్లుండవు. కానీ సింహం జూలులా గడ్డి గుబురుగా ఉంటుంది. సింహాలు అందులో కలిసిపోవడానికి వీలుగా కావచ్చు! ఒక్క సింహాలే కాదు, చిరుత పులులు, హైనాలు... అయ్య బాబోయ్! చెప్పడానికి వీల్లేదు! మనవూర్లో కుక్కల్ని చూసినట్లు దగ్గర్నించీ సింహాల్ని చూడ్డం అంటే తెలియని గగుర్పాటు కలిగింది! ప్రకృతి ప్రసాదం వండర్ కేవ్స్... అక్కడ పది కిలోమీటర్ల దూరంలో భూగృహంలో మన బొర్రాగుహలు లాంటిది ఒకటుంది. పేరు వండర్స్ కేవ్స్! అది యాభై లక్షల లేదా కోటి సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చు అని తెలుసుకోగానే ఆశ్చర్యపోయాను! పైనించీ పెద్ద కాల్షియం సున్నపు రాళ్ళ రకరకాల ఆకృతులు వేళ్లాడుతున్నాయి. ఆఫ్రికాలో వజ్రాలగనులు, బంగారు, వెండి..వీటి తవ్వకాల్లో బయట పడ్డ గుహలన్న మాట ఇవి! నిజంగా ఆ గుహ నాకు దివ్యమైన అనుభూతిని మిగిల్చింది. కేప్టౌన్... కేఫ్టౌన్ మౌంటెయిన్ పైభాగమంతా బల్లపరుపుగా ఉంటుంది. కోణాకారం పక్కనే శివలింగాకారంలో పెద్దకొండ! అది కేప్టౌన్లో ఉంది కాబట్టి దాన్ని ‘కేపేశ్వర స్వామి’ అన్నాను సరదాగా! అక్కడ నిప్పు కోడి ఆకృతులు, వాటిలో బల్బులు పెట్టి వెలిగించడం, ఎన్నో రకాల జంతువుల చర్మ ప్రదర్శన చూశాం. నిప్పుకోడి గుడ్డు పై మనం నిల్చున్నా అది పగలదు. అక్కడి నుంచి కేబుల్ కారులో ప్రయాణం! పైన రెండువేల జాతుల వృక్షాలున్నాయట. వృక్షశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు రోజుల తరబడి అక్కడ పరిశోధనలు చేస్తుంటారు. మొత్తం అక్కడినించి కేప్టౌన్ అంతా పరిశీలించాం. అపార్థైడ్ మ్యూజియం.... తరువాత రోజు‘అపార్డైడ్ మ్యూజియం’కి వెళ్ళాం. వర్ణవివక్ష మీద ఆఫ్రికన్లని ఆంగ్లేయులు వేరు చేశారు. ఇక్కడ ఇంగ్లీషు వాళ్ళకు వేరు హోటళ్లు, మిగతావారికి వేరు. వాళ్ళ స్థలాల్లోనికి వీళ్ళు వెళ్ళకూడదు. డర్బన్లోనే కదా గాంధీగారిని ట్రెయిన్ నించి దింపేసింది! ప్రపంచ దేశాలన్నీ సౌతాఫ్రికా శ్వేత దురహంకారాన్ని వెలివేశాయి. దాని తాలుకా అణచివేత, తిరుగుబాటు, పదమూడేళ్ళ కుర్రాడు చనిపోవడం, సౌతాఫ్రికా అగ్నిగుండం కావడం, దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు మండేలాను జైల్లో పెట్టడం... వాటి విశేషాలతో నిండిన మ్యూజియం అది! అక్కడ రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి తెల్లవాళ్ళకి, ఒకటి నల్లవాళ్ళకి. ఇప్పుడెందుకు ఇంకా అలా పెట్టారంటే వాళ్ళకి నాటి ఫీలింగ్ కలగడానికి అని చెప్పారు. ఆ మ్యూజియంలో మండేలా బట్టలు, కారు, ఫోటోలు, జన్మవిశేషాలు, వీడియో క్లిప్పింగ్స్ వేస్తుంటారు. ఒక క్లిప్పింగ్ చూసి మటుకు షాక్ తిన్నా! 150 మంది ఉద్యమనాయకుల్ని ఉరి తీస్తే, ఆ ఉరితాళ్లనీ ఒక గదిలో వేలాడుతున్నాయి. ఆ దృశ్యాన్ని భరించలేకపోయాను! బయటికొచ్చాక ఆఫ్రికన్ సంస్కృతికి గుర్తులుగా పూసలు, గాజులు కొన్నాం. అలా పదిరోజుల పాటు అక్కడి వారితో ఉండి, ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ పదకొండోరోజు ఉదయాన్నే తిరిగి ఇండియాకు బయల్దేరాం. కేప్టౌన్... ఓ అద్భుత దృశ్యకావ్యం! కేప్టౌన్ వెళ్లడానికి ఆన్లైన్లో బుక్ చేశాం. ఉదయం నాలుగుకల్లా నలుగురం సిద్ధమై, దగ్గర్లో ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కి ‘కేఫ్టౌన్’ వెళ్ళాం. అంటే కొలంబస్ వచ్చిననాటి ‘కేఫ్ ఆఫ్ గుడ్హోప్’ అన్నమాట! అట్లాంటిక్ సముద్రతీరం..... రెండు సముద్రాలు కలిసే స్థలం... అంతా నీలం... మాటలకందని అద్భుత దృశ్యకావ్యమది! అక్కడే మెక్డొనాల్డ్లో తినేసి, కాఫీ తాగి కార్లో ‘కేఫ్టౌన్’బీచ్లో సముద్రతీరం వెంబడే వెళుతోంటే మోహనకృష్ణ ఎంత ఎగ్జైటయిపోయాడంటే తను తరువాతి సినిమా పాటలు యిక్కడే కేఫ్టౌన్ బీచ్లో తియ్యడానికి నిర్ణయించుకున్నాడు!