-
No Headline
నియోజకవర్గం 18–19 20–29 30–39 40–49 50–59 60–69 70–79 80–89 90–99 100–120 వికారాబాద్ 7,081 50,173 69,561 44,148 31,551 18,491 8,390 1,937 301 05 పరిగి 10,368 62,369 77,230 50,845 33,269 20,423 9,483 2,249 321 00 తాండూరు 8,716 57,625 71,011 47,974 32,034 17,191 7,556 1,754 228 03 మహేశ్వరం 50,963 1,04,113 1,64,775 1,21,057 77,682 45,610 22,465 6,400 1,236 95 రాజేంద్రనగర్ 55,568 1,13,241 1,92,334 1,41,689 80,468 45,070 20,191 4,522 791 65 శేరిలింగంపల్లి 54,138 1,12,281 2,39,949 1,93,788 99,951 59,885 30,233 7,779 1,304 08 చేవెళ్ల 28,822 57,685 70,239 55,732 39,153 23,535 11,353 3,339 578 93 -
కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లా రద్దు
మోమిన్పేట: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే వికారాబాదు జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే డాక్టరు మెతుకు ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని దుర్గంచెరువు, కేసారం గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పాలన చేరువ చేసేందుకు జిల్లాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ మాత్రం జిల్లాలను కుదించేందుకు కుట్ర చేస్తుందన్నారు. వికారాబాదు జిల్లాను రద్దు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు రూ.4వేల పించన్, ప్రతి మహిళకు రూ.2,500లు, నిరుద్యోగులకు రూ.3వేల భృతి, కల్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, రైతు భరోసా కింద రూ.15వేలు ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. ఆడ లేక మద్దెల అన్నట్లు చేతకాని హామీలు ఇచ్చి ఇప్పుడు దేవుని మీద ఒట్లు ఎందుకు వేయాల్సి వస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులకు రైతు బంధు మొదలు కొని పండించిన పంట కొనుగోలు వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండేదన్నారు. కరెంటు ఉండదు, పారుకం పారదు రైతు ఎలా వ్యవసాయం చేయాలని ఆయన ప్రశ్నించారు. కాబట్టి కాంగ్రెస్కు ఓటు వేయొద్దని కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకట్, యువ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచులు హరిశంకర్, కాశీరాం, అనంతయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, అనిల్కుమార్, శంకరయ్య, అభిషేక్, సల్మాన్, రియాజ్, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ -
పోలింగ్కు అదనపు సమయం
కందుకూరు: ఓటర్ స్లిప్పుల పంపిణీ 96 శాతం పూర్తయిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సూరజ్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక గంట అదనంగా పెంచామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటివరకు 4,624 మంది ఓటు హక్కు వినియోగించుక్నునారని చెప్పారు. బుధవారం వరకు సమయం ఉందన్నారు. వయోవృద్ధులు, వికలాంగులు, 234 మంది ఉన్నారని, వారిలో 98 శాతం ఓటు హక్కును ఉపయోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బంది కోసం 128 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. 751 ఈవీఎం ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 56 పోలింగ్ బూత్లను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని, పోలీస్ నిఘా నిరంతరం కొనసాగించనున్నామన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన కారణంగా సరూర్నగర్ స్టేడియాన్ని ఏ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి అనుమతిలేదన్నారు. సమావేశంలో ఆయనతో నాయబ్ తహసీల్దార్ శేఖర్ పాల్గొన్నారు. ఎండల దృష్ట్యా గంట పెంపు ఆర్డీఓ సూరజ్కుమార్ -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
కుల్కచర్ల: మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..మంగళవారం కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామ అటవీ ప్రాంతంలో కొందరు మేకలకాపరులకు కుళ్లిన శవం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె చాలరోజులక్రితం మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. సుమారు మృతురాలి వయస్సు (60) ఉంటుందని, అట్టి మహిళను కొద్దిరోజుల క్రితం గాధిర్యాల్ ప్రాంతంలో తిరిగినట్లుగా కొందరు చెప్పారు. ఎవరికై నా ఆమె ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుల్కచర్ల ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. చికిత్సపొందుతూ మహిళ మృతి దోమ: చికిత్స పొందుతూ మహిళ మృతిచెందిన సంఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోమ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన ముద్దం లక్ష్మి(32) కుటుంబ కలహాలతో క్రిమీసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పరిగి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గాంధి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపారు. పాముకాటుకు వృద్ధుడి బలి మొయినాబాద్: పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన కడుమూరి కృష్ణారెడ్డి(62) ఈ నెల 3న సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. వరిచేను గట్లపై ఆయన తిరుగుతుండగా ఓ పాము కాటు వేసింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మల్లారెడ్డికి చెప్పడంతో వెంటనే స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున కృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
దయాకర్ వ్యాఖ్యలు బాధాకరం
కుల్కచర్ల: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని విశ్వహిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత ఘణపురం వెంకటయ్య పేర్కొన్నారు. వెంటనే అతినిపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాస్టర్ల మాటలకు ప్రభావితమై శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, వెకిలిగా మాట్లాడటం సబబుకాదన్నారు. ఇలాంటి ఇబ్బందికర వాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. హిందూ మతంపై వాఖ్యలు చేయడం పట్ల 100కోట్ల మందిని అవమానపరచడమేనన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థా ప్రముఖ్ రాజేశ్వర్, చీరుపు శ్రీనివాస్, వార్ల ఆంజనేయులు, రాములు, ఆంజనేయులు, లక్ష్మయ్య, హన్మంతు, వార్ల భీమయ్య, మహేశ్ కుమార్, వెంకటేశ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement